Posts

Showing posts from October, 2023

శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 46)

శ్రీమద్రామాయణము బాలకాండ నలభై ఆరవ సర్గ “ఓ రామా! దేవాసుర యుద్ధంలో దితి కుమారులు అయిన దైత్యులు మరణించారు అని చెప్పాను కదా. తన కుమారులు మరణమునకు తల్లి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది. “నాధా! నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేసారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడుగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమ వంతుడిని నాకు పుత్రుడుగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతి ఇవ్వండి." అని అడిగింది. ఆ మాటలు విన్న కశ్యపుడు దితి తో ఇలా అన్నాడు. "ఓ దితీ! నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుని జయించ గల పుత్రుడు నీకు కలుగుతాడు." అని వరం ఇచ్చాడు. దితిని తన చేతితో ఒళ్లంతా తడిమాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్లిపోయాడు కశ్యపుడు. కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేసాడు. అగ్ని కార్యము చేయుటకు సమిధలు, దర్భలు, నీళ్లు, పళ్లు అన్నీ సకాలములో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్లు పట్టేవాడు...

శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 45)

శ్రీమద్రామాయణము బాలకాండ నలభై ఐదవ సర్గ విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణము కథను ఆశ్చర్యముతో విన్నారు రామ లక్ష్మణులు. ఆ రాత్రి అంతా గంగావతరణము కథనే మననం చేసుకుంటూ నిద్రపోయారు. మరునాడు పొద్దుటే లేచారు. సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకున్నారు. ఇద్దరూ విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన పక్కన నిలబడ్డారు. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. "ఓ మహర్షీ! మీరు చెప్పిన గంగావతరణము కథ మాకు ఎంతో సంతోషమును ఆశ్చర్యమును కలిగించింది. గడిచిన రాత్రి అంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మననం చేసుకున్నాము. మనము ఇప్పుడు ఆ పవిత్ర గంగానదిని దాటాలి కదా. అందుకు తగిన ఏర్పాట్లు ఈ ఆశ్రమములో ఉన్న మునికుమారులు చేసారు." అని వినయంగా చెప్పాడు రాముడు. తరువాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారితో వచ్చిన మునులు అందర గంగానదిని దాటారు. విశాల నగరము చేరుకున్నారు. ఆ విశాల నగరము చూచి రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ ఓ మహర్షీ! ఈ నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు? వారు ఏ రాజవంశమునకు చెందిన వారు? వారి చరిత్ర ఏమిటి? మాకు వివరించండి." అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 44)

శ్రీమద్రామాయణము బాలకాండ నలభై నాల్గవ సర్గ భగీరథుని మనోరథమునెరవేరినది. గంగా జలము సగర పుత్రుల భస్మరాసుల మీద ప్రవహించినది. వారిని పునీతులను చేసినది. వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది. అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు. " నీవు కోరినట్టు గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించినది. 60,000 మంది సగర కుమారులు స్వర్గమునకు వెళ్లినారు. సాగరములు ఉన్నంత వరకూ వారు స్వర్గములో ఉండగలరు. గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకొని వచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానము. అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరులో పిలువబడుతుంది. ఈ గంగ దేవ లోకము నుండి భూలోకమునకు అక్కడి నుండి పాతాళమునకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపధ అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ఓ భగీరథా! ఈ పవిత్ర గంగా జలముతో నీ పితరులకు తర్పణములు విడిచి నీ మాట నిలబెట్టుకో. ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనుమడు అంశుమంతుడు, దిలీపుడు, ఎవరూ ఈ పని చేయలేకపోయారు. దేవలోకములో ఉన్న గంగను భూలోకమునకు తీసుకొని వచ్చి మహోపకారము చేసావు. అఖండ మైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు. ఈ రోజు నుండి ప్రతిరోజూ ఈ పుణ్య గంగాజలములలో స్నానము చేసి పునీత...

శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 43)

శ్రీమద్రామాయణము బాలకాండ నలభై మూడవ సర్గ బ్రహ్మదేవుడు వెళ్లిపోయిన తరువాత భగీరథుడు ఒంటికాలి మీద నిలబడి ఒక సంవత్సరము పాటు మహాశివుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షం అయ్యాడు. “ఓ భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరినట్టు హిమవంతుని కుమార్తె అయిన గంగను నా శిరస్సున ధరిస్తాను."అని అన్నాడు. అప్పుడు దేవలోకములో ప్రవహించు గంగానది మహా వేగంతో భూమి మీదికి దూకింది. ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు. గంగకు కోపం వచ్చింది. ''ఏమీ ! నా ప్రవాహ వేగాన్ని శివుడు ఆపగలడా! నేను ఆ మహాశివునితో సహా పాతాళము ప్రవేశిస్తాను.” అని మనసులో అనుకొంది గంగ. గంగ ఆలోచనను గ్రహించాడు శివుడు. మహాశివుడు తన శిరస్సుమీద పడ్డ గంగను తన శిరస్సుమీద ఉన్న జటాజూటములలో బంధించాడు. గంగా దేవి ఎంత ప్రయత్నించిననూ ఆ జటాజూటములలో నుండి బయటకు రాలేకపోయింది. ఆకాశము నుండి బయలు దేరిన గంగ భూమి మీదికి దిగి రాలేదు. కారణం తెలియక భగీరథుడు వ్యాకుల పడ్డాడు. మరలా ఈశ్వరుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు సంతోషించిన మహాశివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదికి విడిచి పెట్టాడు. శివుని జట...

శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 42)

శ్రీమద్రామాయణము బాలకాండ నలభై రెండవ సర్గ సగర చక్రవర్తి మరణించిన తరువాత ఆయన మనుమడు అంశు మంతుడు చక్రవర్తి అయ్యాడు. అంశు మంతుని కుమారుడు దిలీపుడు. అంశు మంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోడానికి అరణ్యములకు వెళ్లాడు. దిలీపుడు తన పితామహులకు స్వర్గ లోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశ గంగను భూమి మీదికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. కాని తగిన ఉపాయము దొరకలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు. ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథునికి పుత్ర సంతానము లేదు. భగీరథునికి సంతానము కావలెనని తీవ్రమైన కోరిక కలిగింది. దానికి తోడు తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట. ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. " ఓ భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో" అని అడిగాడు బ్రహ్మ. “దేవా! నాకు పుత్ర సంతానము ప్రసాదించండి. తరువాత ఆకాశ గంగను భూమీ మీదకు పంపండి. ఆ ఆకాశ గంగతో నా ప్రపితా మహులకు జలతరణము వదులుతాను." అని కోరుకున్నాడు. “ ఓ భగీరథా! నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాని ఆకాశ గంగన...

శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 41)

శ్రీమద్రామాయణము బాలకాండ నలభై ఒకటవ సర్గ ఇక్కడ సగరుడు తన కుమారుల రాక కోసరం ఎదురు చూస్తున్నాడు. ఎన్నాళ్లకూ తన కుమారులు యజ్ఞాశ్వముతో తిరిగి రాలేదు. అందుకని సగరుడు తన మనుమడైన అంశుమంతుని పిలిచి అతనితో ఇలా అన్నాడు. “కుమారా! నీవు వీరుడవు. పరాక్రమవంతుడవు. నీ పినతండ్రులు యజ్ఞాశ్వము కొరకు వెళ్లి చాలా కాలం అయింది. వారు ఇంకా తిరిగి రాలేదు. నీవు పోయి వారి జాడ కనుక్కొని రా. యజ్ఞాశ్వముతో తిరిగి రా! జాగ్రత్త! నీవు మహాబలవంతులతో పోరాడవలసి ఉంటుంది. కాబట్టి కావలసిన అస్త్ర శస్త్ర ములను తీసుకొని వెళ్లు. నీకు నమస్కరించిన వారికి తిరిగి నమస్కరించు. నిన్ను ఎదిరించినవారిని నాశనం చెయ్యి. విజయుడవై తిరిగిరా!" అని పలికాడు. సగరుడి మనుమడు అయిన అంశుమంతుడు తాతగారికి నమస్కరించి తన పినతండ్రులను వెతుకుతూ బయలుదేరాడు. అంశు మంతుడు తన పిన తండ్రులు తవ్విన మార్గమును వెతుకు కుంటూ వెళ్లాడు. దారిలో అంశుమంతుడు దిగ్గజములను చూచాడు. వారిని తన పినతండ్రుల జాడను గురించి అడిగాడు. ఆ దిగ్గజములు చూపిన మార్గములో వెళ్లి అంశుమంతుడు తన పినతండుల భస్మరాసుల వద్దకు వెళ్లాడు. తన పిన తండ్రులు అలా భస్మరాసులుగా మారడం చూచి ఎంతో బాధపడ్డాడు. పక్కనే పచ్...

శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభయ్యవ సర్గ (Ramayanam - Balakanda - Part 40)

శ్రీమద్రామాయణము బాలకాండ నలభయ్యవ సర్గ భయంతో వణికి పోతున్న దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. "ఓ దేవతలారా! భయపడకండి. ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారములో ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు. ఆ సగర కుమారుల చావు కపిలుని చేతిలో ఉంది." అని అన్నాడు. ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. కాని వారికి యజ్ఞాశ్వము కనపడలేదు. కాని వారికి ఒక పెద్ద శబ్దము వినిపించింది. కాని వారు ఆ శబ్దమును లక్ష్యపెట్టలేదు. తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు. “తండ్రీ! మీరు చెప్పినట్టు మేము భూమి అంతా తవ్వాము. యక్ష, గంధర్వ, నాగ జాతులను చంపాము. కాని మాకు యజ్ఞాశ్వము కనపడలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి.” అని అడిగారు. కుమారుల మాటలు విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది. “మీరు ఇంకా భూమిని తవ్వండి. అశ్వమును పట్టండి. అశ్వము లేకుండా తిరిగిరాకండి." అని ఆజ్ఞాపించాడు సగరుడు. సగరకుమారులు మరలా భూమిని తవ్వడం మొదలెట్టారు. అందరూ పాతాళ లోకము చేరుకున్నారు. వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనపడింది. సగరక...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 39)

శ్రీమద్రామాయణము బాలకాండ ముప్పది తొమ్మిదవ సర్గ శ్రీ రాముడు విశ్వామితుని చూచి ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! సగరుడు తాను సంకల్పించిన యజ్ఞమును ఎలా నిర్వహించాడు. తెలియ జేయండి." అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పనారంభించాడు. " ఓ రామా! సగరుని యజ్ఞము హిమాచలము వింధ్యపర్వతము మధ్య జరిగింది. సగరుడు యజ్ఞాశ్వమును విడిచి పెట్టాడు. సగరుని మనుమడైన అంశు మంతుడు ఆ యజ్ఞాశ్వమునకు రక్షణగా వెంట బయలుదేరాడు. సగరుడు యజ్ఞము చేయడం ఇష్టం లేని ఇంద్రుడు రాక్షస రూపం ధరించి వచ్చి యజ్ఞాశ్వమును అపహరించాడు. అశ్వము కనపడలేదు. ఋత్తిక్కులందరూ సగరునితో ఇలా అన్నారు. " ఓ సగర చక్రవర్తీ! యజ్ఞాశ్వమును ఎవరో అపహరించారు. యజ్ఞాశ్వము లేనిదే యజ్ఞము జరగదు. కాబట్టి యజ్ఞాశ్వమును తీసుకొని రావలెను." అని అన్నారు. ఆ మాటలు విన్న సగరుడు తన 60,000 మంది కుమారులతో ఇలా అన్నాడు. " ఓ కుమారులారా! ఇది మంత్రములతో పవిత్రమైన స్థలము. ఇక్కడకు రాక్షసులు రాలేరు. ఇది రాక్షసుల పని కాదు. కాబట్టి మీరు భూమండలము అంతా వెదకండి. భూమి ఉపరి తలము మీద దొరకకపోతే మీ రందరూ ఒక్కొకరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని తవ్వండి. అశ్వము దొరికే వరకు తవ్వండి. యజ్ఞా...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 38)

శ్రీమద్రామాయణము బాలకాండ ముప్పది ఎనిమిదవ సర్గ ఓ రామా! ఇప్పుడు నీకు సగరుడి కధ చెబుతాను విను. పూర్వము అయోధ్యా నగరమును సగరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.ఆయనకు పుత్ర సంతానము లేదు. విదర్భ రాజ కుమారి కేశిని అతని మొదటి భార్య.. సుమతి ఆయన రెండవ భార్య.. పుత్ర సంతానము కొరకు సగరుడు ఇద్దరు భార్యలతో సహా హిమవత్పర్వతమునకు పోయి అక్కడ భృగుప్రస్రవణము అనే పర్వతము మీద నూరు సంవత్సరముల పాటు తపస్సు చేసారు. వారి తపస్సునకు మెచ్చిన భృగు మహర్షి వారికి పుత్ర సంతానము ప్రసాదించాడు. “ఓ సగర చక్రవర్తీ! నీకు ఒక భార్య యందు ఒక కుమారుడు, మరొక భార్య యందు అరవైవేల మంది కుమారులు జన్మిస్తారు." అని వరము ఇచ్చాడు. వారు ఎంతో సంతోషించారు. కాని వారికి ఒక సందేహము కలిగింది. " ఓ మహర్షీ! మాలో ఎవరికి ఒక పుత్రుడు కలుగుతాడు." అని అడిగారు. “ఆ విషయం మీలో మీరే తేల్చుకోండి." అని అన్నాడు. భృగుమహర్షి. అప్పుడు కేశిని " ఓ మహర్షి! నాకు వంశము నిలిపే ఒక కుమారుని ప్రసాదించండి." అని కోరుకుంది. రెండవ భార్య సుమతి “నాకు 60,000 వేల మంది కుమారులను ప్రసాదించండి." అని కోరుకుంది. భృగుమహర్షి వారిని ఆ ప్రకారము అనుగ్రహించాడు. భ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణము బాలకాండ ముప్పది ఏడవ సర్గ ఓ రామా! పూర్వము దేవతల సేనలకు ఒక సైన్యాధి పతి కావాల్సి వచ్చాడు. దేవతలు అందరూ బ్రహ్మ దేవుని వద్దకు పోయి అగ్ని దేవుని ముందు పెట్టుకొని తమ కోరిక ను బ్రహ్మదేవునికి ఈ విధంగా విన్నవించుకున్నారు. “ఓ బహ్మ దేవా! ఇప్పటి దాకా దేవతా సేనలకు మహేశ్వరుడు సైన్యాధి పతిగా ఉండేవాడు. కాని ప్రస్తుతము మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి మాకు వేరొక సైన్యాధి పతిని నీవే ఏర్పరుప వలెను." అని వేడుకున్నారు. ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. “ ఓ దేవతలారా! ఉమాదేవి శాపము వలన మీలో ఎవ్వరికీ సంతానయోగ్యత లేదు. కాబట్టి మీలో ఎవరూ సైన్యాధి పతిని పుట్టించలేరు. ఆకాశ గంగ ఉన్నది కదా. అగ్ని దేవుని యందు ఆ మహాదేవుని వీర్యము నిక్షిప్తమై ఉన్నది కదా. గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యమును స్వీకరించును. గంగాదేవికి అగ్నిదేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించును ఆయనే మీ దేవసేనకు అధిపతి కాగలడు. దీనికి ఉమాదేవి కూడా ఏమీ అభ్యంతరపెట్టదు." అని అన్నాడు. బహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్లిప...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 36)

శ్రీమద్రామాయణము బాలకాండ ముప్పది ఆరవ సర్గ అంత వరకువిన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. " ఓ మహర్షీ! హిమవంతుని పెద్ద కుమార్తె గంగ ఎందుకని మూడు మార్గములలో ప్రవహిస్తూ ఉంది. ఎందుకని గంగానదీ ముల్లోకములలో పవిత్రమైన నదిగా ప్రసిద్ధి చెందింది. వివరించండి.” అని అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. 'మహాశివుడు తన భార్య ఉమాదేవితో సురత సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. కానీ ఉమా దేవికి మహాశివునికి ఎంత కాలానికి పుత్ర సంతానము కలగ లేదు. దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివునికి, ఉమాదేవికి పుట్టబోయే పుత్రుని భరించే శక్తి ఈ లోకాలకు ఉందా అని. దేవతలందరు బ్రహ్మదేవుని తీసుకొని మహా శివుని వద్దకు వెళ్లారు. బ్రహ్మ దేవుడు మహాశివునితో ఇలా అన్నాడు. “ ఓ మహాదేవా! మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడయిన పుత్రుని ముల్లోకములు భరించలేవు. కాబట్టి మీరు ఉమాదేవి తపస్సు చేయండి. మీ తేజస్సును మీ యందే నిక్షిప్తం చేసుకోండి." అని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించాడు మహాదేవుడు. “దేవతలారా! మీరు చెప్పినట్టే చేసెదను. కాని నా వీర్యమును ఎవరు ధరిస్తారో తెలియజేయండి." అని అన్నాడు. దేవతలందరూ ముక్త కంఠంతో "మీ వ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 35)

శ్రీమద్రామాయణము బాలకాండ ముప్పది ఐదవ సర్గ మరునాడు విశ్వామిత్రుడు, రామ లక్ష్మణులు వారి వెంట వచ్చిన మునులు అందరూ ప్రాతః కాలముననే నిద్ర లేచి, సంధ్యావందనము, అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధము అయ్యారు. అందరూ తమ ప్రయాణమును కొనసాగించారు. మధ్యాహ్న సమయమునకు గంగానదీ తీరమునకు చేరుకున్నారు. గంగానదీ దర్శనము చేసుకున్న రామలక్ష్మణులు, మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదిలో స్నానములు చేసి పితృ తర్పణములు విడిచారు. మధ్యాహ్న భోజనములు అయిన తరువాత అందరూ విశ్వామితుని చుట్టు కూర్చున్నారు. విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు. “ ఓ మహర్షీ! ఇచ్చట గంగానది మూడు పాయలుగా ప్రవహించుచున్నది కదా. ఇది ఎలా ఏర్పడినది. ఈ గంగానది ఎక్కడ సముద్రములో కలుస్తుంది. వివరించండి." అని అడిగాడు. విశ్వామిత్రుడు గంగా నది గురించి దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు.  ఓ రామా! హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్పర్వతము నివాసము. హిమవత్పర్వతము సకల ధాతువులకు. ఓషధులకు నిలయము. హిమ వంతుని భార్మ పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగ, ఉమ. దేవతలందరూ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 34)

శ్రీమద్రామాయణము బాలకాండ ముప్పది నాల్గవ సర్గ ఆ ప్రకారంగా కుమార్తెల వివాహము వైభవంగా జరిపించాడు కుశనాభుడు. కుమార్తెలు అత్తవారి ఇంటికి వెళ్లారు. అప్పుడు తనకు పుత్రసంతానము కావాలని అనుకున్నాడు కుశనాభుడు. పుత్రసంతానము కోసరము పుత్రకామేష్టి యాగము చేసాడు. ఆయాగము జరుగుతున్న సమయములో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో ఇలా అన్నాడు. "కుమారా! నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మించగలడు." అనిపలికి తాను బ్రహ్మ లోకమునకు వెళ్లిపోయాడు. కొంత కాలము జరిగింది. కుశనాభునకు గాధి అనే కుమారుడు జన్మించాడు. ఓ రామా! ఆ గాధి నా తండ్రి. శుకుని వంశమున పుట్టడం చేత నేను కౌశికుడు అనే పేరుతో కూడా పిలువబడు తున్నాను. నాకు ఒక జ్యేష్ట సోదరి (అక్కగారు) ఉండేది. ఆమెను నా తండ్రి గాధి ఋచకుడు అను వానికి ఇచ్చి వివాహము చేసాడు. ఆమె తన భర్తతో పాటు సశరీరంగా స్వర్గమునకు వెళ్లింది. ఆమె ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో ఒక మహానదిగా ప్రహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్యోదకములతో కూడిన ఆ కౌశికీ నది సకల లోకములకు హితము కలిగించడం కోసరం హిమవత్పర్వతము మీద ప్రవహిస్తూ ఉంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో మహానదీ తీరమున ఆశ్రమము నిర్మించుకొన...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 33)

శ్రీమద్రామాయణము బాలకాండ ముప్పది మూడవ సర్గ తండ్రి మాటలు విన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు. “వాయుదేవుడు ధర్మము తప్పి మమ్ములను వివాహము చేసుకుంటాను అని అన్నాడు. మేము తిరస్కరించాము. మా తండ్రి గారు ఉన్నారు. మేము అస్వతంత్రులము. మా తండ్రి గారిని అడుగు.”అని అన్నాము. దానికి ఆయన కోపించి మమ్ములను దుర్బలులుగా చేసాడు. ఇదీ జరిగిన సంగతి." అని చెప్పారు. వారి మాటలు విన్న కుశ నాభుడు వారితో ఇలా అన్నాడు. "కుమార్తెలారా! మీరు మంచి పని చేసారు. మీ ఓర్పును మెచ్చుకుంటున్నాను. మీరు వాయుదేవుని క్షమించి విడిచి పెట్టారు. పురుషులకు, స్త్రీలకు ఓర్పు అలంకారము. ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి. ఓర్పు ధర్మము. ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కాని దేవతలకు ఓర్పు ఉండదు. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను." అని పలికాడు. తరువాత కుశధ్వజుడు మంత్రులతో తన కుమార్తెల వివాహముల గురించి మంతనాలు సాగించాడు. ఆ సమయమున చూళి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమద అనే గంధర్వ కాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆ గంధర్వ కన్య పరిచర్యలకు చూళి చాలా సంతోషించాడు. “ఓ కన్యా! నీకు ఏమి కావాలో కోరుకో!...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 32)

శ్రీమద్రామాయణము బాలకాండ ముప్పది రెండవ సర్గ " ఓ రామా! పూర్వము కుశుడు అనే మహా తపస్వి ఉండే వాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసిన వాడు. మంచి వాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య. వారికి నలుగురు కుమారులు. వారిపేర్లు కుశాంబుడు. కుశనాభుడు. అధూర్తజసుడు. వసువు. వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు. సుగుణవంతులు. ఆయనకు రాజ్యపాలన చేయవలెనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుశుడు తన పుత్రులతో ఇలా అన్నాడు. " ఓ పుత్రులారా! మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి." అని అన్నాడు. తండ్రి మాటను అనుసరించి ఆ నలుగురూ జనపదములను నిర్మించారు.  కుశాంబుని చేత నిర్మింప బడిన నగరము పేరు కౌశాంబి. కుశనాధుని చేత నిర్మింప బడిన నగరము పేరు మహోదయము. అధూర్త రజసుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము. వసువు నిర్మించిన నగరము పేరు గిరివ్రజపురము. మనము ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివ్రజపురము భూమి. దీని చుట్టూ ఐదు పర్వతములు ఉన్నాయి. మగధ దేశములో పుట్టిన శోణ నది ఈ ఐదు పర్వతముల మధ్య ప్రవహించుచున్నది. ఈ శోణ నది తూర్పునుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరీవాహక ప్రాంతము లన్నీ సస్యశ్యామలములైన పంట...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 31)

శ్రీమద్రామాయణము బాలకాండ ముప్పది ఒకటవ సర్గ యాగమును సంరక్షించాము అన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి  సుఖంగా నిద్రించారు. మరునాడు ప్రాతః కాలమునే లేచి సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు, తదితర ఋషుల వద్దకు వెళ్లారు. వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు. “ ఓ మహర్షీ! మేము నీ భటుల మాదిరి వచ్చినిలిచి ఉన్నాము. ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి." అని చేతులుకట్టుకొని వినయంగా నిలబడ్డారు. వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు.  “ ఓ రామా! మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయుచున్నాడు. మేము అందరమూ ఆ యజ్ఞమునకు పోవుచున్నాము. మీరు కూడా మా వెంట మిథిలకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహాధనుస్సును చూడవచ్చును. ఆ ధనుస్సు సామాన్యమైనది కాదు. చాలా బలము కలది. భయంకరమైనది. ఆ ధనుస్సును పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు,రాక్షసులు ఎవరు కూడా ఎత్తలేరు. ఎక్కుపెట్టలేరు. ఇంక మానవుల సంగతి చెప్ప పనిలేదు కదా! అంతటి బలమైనది ఆ ధనుస్సు. ఎందుకంటే ఎంతో మంది రాజులు ఆ ధనుస్సును ఎత్తబోయి విఫలమయ్యారు. ఎవరూ ఆ ధనుస్సును ఎక్కు...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పయ్యవ సర్గ (Ramayanam - Balakanda - Part 30)

శ్రీమద్రామాయణము బాలకాండ ముప్పయ్యవ సర్గ మరునాడు రామ లక్ష్మణులు విశ్వామిత్రునితో ఇలాఅన్నారు. “ఓ మహర్షీ! మీ యాగము భగ్నము చేయుటకు రాక్షసులు ఎప్పుడు వస్తారు. మేము ఎప్పుడు వారిని ఎదుర్కొనవలెను. ఎందుకంటే రాక్షసులు వచ్చిన తక్షణం మేము వారిని ఎదుర్కోవాలి కదా!" అని అడిగారు. ఆసమయములో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నాడు. అందుకని ఆయన పక్కనే ఉన్న ఋషులు రామలక్ష్మణులతో ఇలా అన్నారు. “మహర్షుల వారు మౌనదీక్షలో ఉన్నారు. నేటి నుండి ఆరు రాతులు మీరు యాగమును రక్షించవలెను." అని పలికారు. వారి ఆజ్ఞను శిరసావహించారు రామలక్ష్మణులు. నిరంతరమూ ధనస్సును చేత బూని రామ లక్ష్మణులు ఆరు పగళ్లు ఆరు రాత్రులు యాగమును రక్షించారు. వారు విశ్వామిత్రుని పక్కను ఉండి ఆయనకు ఎలాంటి ఆపదా రాకుండా రక్షించారు. ఆరవ దినము గడుచు చున్నది. రాముడు లక్ష్మణుని చూచి "లక్ష్మణా! ఇది ఆరవ రోజు. చాలా అపమత్తంగా ఉండు. రాక్షసులు ఏ క్షణమునైనా దాడి చేయవచ్చు." అని లక్ష్మణుని హెచ్చరించాడు. ఋషులు యజ్ఞము చేస్తున్నారు. అగ్నిహోత్రము మండుచున్నది. ఒక్కసారిగా అగ్నిహోత్రము లోనుండి మంటలు భగ్గున పైకి లేచాయి. ఏదో జరగబోతోంది అని అనుకున్నాడు రాముడు. ఇంతలో ఆ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 29)

శ్రీమద్రామాయణము బాలకాండ ఇరవై తొమ్మిదవ సర్గ రాముడు ఆ వనమును గురించి ప్రశ్నించగా, విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు. " ఓ రామా! ఈ ప్రదేశములోనే శ్రీ మహా విష్ణువు వంద యుగముల పాటు తపస్సు చేసాడు. వామనావతారమునకు ముందు శ్రీ మహా విష్ణువు ఇక్కడనే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన, దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. శ్రీ మహా విష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలి చక్రవర్తి దేవత లందరినీ జయించి ముల్లోకములనూ పరిపాలిస్తున్నాడు. ఆ బలి చక్రవర్తి ఒక సారి యాగము చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్న విష్ణు మూర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు. ఓ విష్ణూ! బలి చక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు. అది పూర్తి అయే లోపలనే మన కార్యము పూర్తి కావాలి. ఈ యాగ సమయములో బలి చక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదు లేదు అనకుండా ఇస్తున్నాడు. ఓ దేవా! నీవు దేవతల మేలు కోరి, వామనుడిగా బలి చక్రవర్తి యొద్దకు పోయి, మాకు మేలు చేయుము. " అని ప్రార్థించారు. అదే సమయంలో కశ్యపుడు తన భార్యా సమేతంగా వేయి సంవత్సరములు విష్ణువును గూర్చి తపస్సు చేసాడు. తరువాత విష్ణువును ఇలా ప్రార్థిస్తున్నాడు. ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 28)

శ్రీమద్రామాయణము బాలకాండ ఇరవై ఎనిమిదవ సర్గ ఆ ప్రకారంగా విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గ మధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! తమరు నాకు ఎన్నో అస్త్రములను ఉపదేశించారు. ఇప్పుడు నేను దేవతలకు, రాక్షసులకు అజేయుడనయ్యాను. కాని వాటికి ఉపసంహారము కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా!" అని అడిగాడు. (అస్త్రములను ఉపసంహరించడం అంటే ఒక సారి వేసిన అస్త్రమును, టార్గెట్ ను ఢీకొట్టక ముందే వెనుకకు తీసుకోడం) ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు. రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారము కూడా ఉపదేశించాడు. అంతే కాకుండా, పూర్వము భృశాశ్వుని చే సృష్టింపబడిన అస్త్రములు అన్నిటినీ రామునికి ఉపదేశించాడు. ఆ అస్త్రముల పేర్లు వాల్మీకి 7 శ్లోకములలో చెప్పాడు. ఆ అస్త్రముల పేర్లు ఏవంటే.... సత్యవంతము సత్యకీర్తి ధృష్టము రభసము ప్రతిహారతరము పరాఙ్ముఖము అవాఙ్ముఖము లక్షాక్షము విషమము ధృఢనాభము మహానాభము దుందునాభము సునాభము జ్యోతిషము కృశనము నైరాశ్యము విమలము యోగంధరము హరిద్రము దైత్యము ప్రశమనము సార్చిర్మాలి ధృతి మాలి వృత్తిమంతము రుచిరము పితృసౌమనసము విధూతము మకరము కరవీరకరము ధనము ధాన్యము కామరూపము కామరుచి మోహము ఆవరణమ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 27)

శ్రీమద్రామాయణము బాలకాండ ఇరవై ఏడవ సర్గ మరునాడు అందరూ నిద్ర లేచారు. ప్రాతఃకాలము లో ఆచ రించ వలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు.  విశ్వామిత్రుడు రామునితో “రామా! నీకు దివ్యాస్త్రములు అన్ని ఇస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను యుద్ధములో జయింపగలవు. రామా! నీకు దివ్యమైన దండ చక్రమును, ధర్మ చక్రమును, కాల చక్రమును, విష్ణు చక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలముతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మశిరోనామకాస్త్రమును, అన్నిటి కంటే ఉత్తమము, శ్రేష్ఠము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించెదను. ఇవి కాకుండా నీకు మోదకి, శిఖరి అనే రెండు గదాయుధములను కూడా ఇస్తాను. రామా! నీకు ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రము ఇస్తాను. ఇవే కాకుండా నీకు రెండు పిడుపాటులను అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగాఉన్న పిడుగు ఇచ్చెదను. నీకు పినాక అస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. రామా! నీకు ఆగ్నేయాస్త్రమును, వాయవ్యాస్త్రమును ఇచ్చెదను.  ఓ రామా! నీకు హయశిరము, క్రౌంచ అస్త్రము అనే రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను. రాక్షసులు వాడేటటు వంటి అస్త్రములు, అనగా కంకాళము, ముసలము, కపా...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణము బాలకాండ ఇరవై ఆరవ సర్గ విశ్వామిత్ర మహర్షి మాటలను శ్రద్ధగా విన్న రాముడు వినయంతో ఇలా అన్నాడు. “ ఓ మహర్షి! మా తండ్రి దశరథుడు నన్ను తమరి వెంట పంపాడు. తమరు ఏమి చెబితే అలా చెయ్యమన్నాడు. నా తండ్రి గారి మాటను జవదాటలేను. అందుకే తమరి మాట నాకు శిరోధార్యము. తమరు ఏం చెబితే అలా చేస్తాను. గోవులు, బ్రాహ్మణుల యొక్క హితము కొరకు, లోక క్షేమము కొరకు తమరు చెప్పినట్టే చేస్తాను. ” అని పలికాడు రాముడు. వెంటనే తన ధనుస్సు చేతిలోకి తీసుకున్నాడు. వింటి నారిని గట్టిగా లాగి వదిలాడు. ఆ శబ్దానికి తాటకా వనములోని వారందరి గుండెలు అదిరిపోయాయి. భయంతో గడా గడా వణికిపోయారు. ఆ శబ్దము విన్న తాటక పరుగు పరుగున ఆ శబ్దము వచ్చిన వైపుకు వచ్చింది. వికారంగా ఉన్న తాటకిని చూచి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆ భయంకరాకారముతో ఉన్న యక్షిణిని చూడు. పిరికి వాళ్లు అయితే ఆమెను చూచి గుండె ఆగి చనిపోతారు కదా! ఆమె మాయావి. అందుకని ఈమె ముక్కు చెవులు కోసి వదిలేద్దాము. ఎందుకంటే ఈమె స్త్రీ, అదే ఈమెను రక్షిస్తూ ఉంది. కాబట్టి ఈమెను చంపకుండా ఈమె పరాక్రమును నశింప చేస్తాను." అని అన్నాడు రాముడు. రాముడు అలా లక్ష్మణుడితో చెబుతూ ఉ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 25)

శ్రీమద్రామాయణము బాలకాండ ఇరవై ఐదవ సర్గ విశ్వామిత్రుని మాటలు శ్రద్ధగా విన్న రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు, " ఓ మునిపుంగవా! సాధారణంగా యక్షులు తక్కువ బలం కలవారు అంటారు కదా. యక్షిణి అయిన తాటకకు అంత బలం, వీరత్వము ఎలా వచ్చింది.” అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. “ఓ రామా! పూర్వము సుకేతుడు అనే బలవంతుడు అయిన యక్షుడు ఉండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానము కొరకు అతడు బహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసాడు. సుకేతుడికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏమి వరము కావాలో కోరుకో అని అడిగాడు. ఆ యక్షుడు సంతానము కావాలి అని అడిగాడు. బ్రహ్మదేవుడు వేయి ఏనుగుల బలవంతురాలైన కుమార్తెను ప్రసాదించాడు కాని పుత్ర సంతానము మాత్రము ఇవ్వలేదు. ఆమె పేరు తాటక. తాటక పెరిగి పెద్దది అయింది. సుకేతుడు తన కుమార్తె తాటకను సుందుడు అనే వాడికి ఇచ్చి వివాహం చేసాడు. సుందుడికి, తాటకకు మహా బలవంతుడు అయిన మారీచుడు అనే కుమారుడు జన్మించాడు. అగస్త్యుని శాపము వలన సుందుడు మరణించాడు. అప్పుడు తాటక, మారీచుడు ఇద్దరూ కలిసి అగస్త్యుని చంపి తినడానికి అతని మీదికి వెళ్లారు.అప్పుడు అగస్త్యుడు మారీచుని “నీవు రాక్షసుడివి కా!” అని...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 24)

శ్రీమద్రామాయణము బాలకాండ ఇరవై నాల్గవ సర్గ మరునాడు ఉదయమే రామ లక్ష్మణులు, విశ్వామిత్రుడు ప్రాత: కాలము లో చేయవలసిన సంధ్యావందనాది కార్యక్రములు ముగించుకొని ప్రయాణము సాగించారు. గంగానదీ తీరమునకు వచ్చారు. అక్కడ ఉన్న మునులు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు నదిని దాటడానికి ఒక నావను తీసుకొని వచ్చారు. విశ్వామితుడు, రామలక్ష్మణులు ఆ నావను ఎక్కి గంగా నదిని దాటుతుండగా నది మధ్యలో నీరు బ్రద్దలగుతున్నట్టు పెద్దగా శబ్దం వచ్చింది. “మహర్షీ! ఆ శబ్దము ఏమిటి?" అని రామ లక్ష్మణులు విశ్వామిత్రుని అడిగారు. దాని గురించి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ' ఓ రామా! పూర్వము బ్రహ్మ దేవుడు తన సంకల్ప మాత్రం చేత హిమాచలము మీద ఒక సరస్సును నిర్మించాడు. దానికి మానస సరోవరము అని పేరు. ఆ సరస్సులో నుండి ఒక నది పుట్టింది. దాని పేరు సరయూ నది. ఆ సరయూ నది అయోధ్య మీదుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ సరయూ నది మానస సరోవరమునుండి పుట్టుటచే పవిత్రమైనది. ఆ సరయూ నది ఈ ప్రదేశములో గంగానదిలో కలియుచున్నది. ఆ రెండు నదుల సంగమము వలననే ఈ ధ్వని పుట్టింది." అని చెప్పాడు విశ్వామిత్రుడు. రామ లక్ష్మణులు ఆ నదులకు భక్తితో నమస్కరించారు. తరువాత వారు గంగానది ఆవల...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 23)

శ్రీమద్రామాయణము బాలకాండ ఇరవై మూడవ సర్గ మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన మృదుమధురమైన మాటలతో నిద్రలేపాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్య ప్రవర్తతే। ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్|| కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామా! ప్రాత: కాల సంధ్యకు సమయము ఆసన్నమైనది. ఓ రామా! నిద్ర లే! ప్రాతఃకాల కృత్యములు. సంధ్యావందనాది కార్యక్రములు నీవు చేయవలసి ఉన్నది. విశ్వామిత్రుని మాటలు విన్న రామ లక్ష్మణులు వెంటనే నిద్ర లేచారు. కాలకృత్యములు తీర్చుకొన్నారు. స్నానము, సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి అర్ఘ్యము ఇచ్చారు. గాయత్రీ మంత్రము పఠించారు. తరువాత ముగ్గురూ తమ ప్రయాణము కొనసాగించారు. వారు సరయూనదీ గంగానదిలో కలిసే సంగమస్థానము చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు. ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణులు “ఓ మహర్షీ! ఈ ఆశ్రమములు ఎవరివి?' ఈ ఆశ్రమములలో ఎవరుఉంటారు?" అని అడిగారు. దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానము చెప్పాడు. “ఓ రామా! ప్రస్తుతము మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడు కానీ, పూర్వము మన్మధుడు దేహము కలవ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 22)

శ్రీమద్రామాయణము బాలకాండ ఇరవై రెండవ సర్గ వసిష్ఠుని మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. వెంటనే స్వయంగా వెళ్లి రాముని, రాముని వెంట లక్ష్మణుని సభా భవనము నకు తీసుకొని వచ్చాడు. కౌసల్య, సుమిత్ర, దశరథుడు కలిసి రామునికి లక్ష్మణునికి మంగళాచరణము చేసారు. తమ పుత్రులను ప్రియమారా ముద్దులు పెట్టుకున్నారు. దశరథుడు రాముని, లక్ష్మణుని విశ్వామిత్రుని చేతిలో పెట్టాడు.  రాముడు, లక్ష్మణుడు వెంట నడువగా, విశ్వామిత్రుడు సభాభవనము నుండి బయలుదేరాడు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, ఆయన వెనుక కోదండము చేతబూని కోదండ రాముడు, రాముని వెనుక ధనుర్ధారియైన లక్ష్మణుడు నడుస్తున్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఒకటిన్నర యోజనములు నడిచాడు. వారందరూ సరయూ నదికి దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముని “రామా!” అంటూ ప్రేమగా పిలిచాడు.రాముడు విశ్వామిత్రుని దగ్గరగా వచ్చాడు. “రామా! నీవు ఆచమనము చేసి నా దగ్గరకు రా! నీకు బల, అతిబల అనే విద్యలను ఉపదేశిస్తాను. ఈ విద్యలను నీవు నేర్చుకుంటే నీకు ఆకలి, దప్పిక, శ్రమ, జ్వరము, ఉండవు,. నిన్ను ఎలాంటి రాక్షసులు కూడా ఏమీ చేయలేరు. రామా! నీవు ఈ విద్యలు నేర్చుకుంటే నీతో సమా...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 21)

శ్రీమద్రామాయణము బాలకాండ ఇరవై ఒకటవ సర్గ ఎప్పుడైతే దశరథుడు రాముని యాగ సంరక్షణార్ధము విశ్వామిత్రుని వెంట పంపను అని అన్నాడో, విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. ఆయన కోపం తారస్థాయి కి చేరుకుంది, “దశరథా! ఇక్ష్వాకుల వంశములో జన్మించిన నీవు ఆడిన మాట తప్పావు. ఇది రఘు వంశము వారికి ఉచితము కాదు. ఆడిన మాటను తప్పడం నీకు ఉచితము అని తోస్తే నేను వచ్చిన దారినే వెళ్లిపోతాను. ఇచ్చిన మాటను తప్పిన నీవు నీ భార్యాబిడ్డలతో సుఖంగాఉండు.” అనిఅన్నాడు విశ్వామిత్రుడు కోపంగా. విశ్వామిత్రునికి కోపం వచ్చింది అని తెలుసుకున్నాడు పురోహితుడు, కులగురువు వసిష్ఠుడు. వెంటనే లేచాడు. దశరథుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు, "ఓ దశరథ మహారాజా! నీవు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు. ధర్మ సంస్థాపనకు కంకణము కట్టుకున్నావు. మంచి ధైర్యవంతుడివి. అటువంటి నీవు ఈ మాదిరి పుత్ర వ్యామోహంతో ధర్మము తప్పి ఆడిన మాట తప్పడం తగునా! నీవు నీ ధర్మమును ఆచరించి అధర్మమును విడిచిపెట్టు. ఆడిన మాట తప్పడం అంటే నీవు ఇప్పటి దాకా సంపాదించుకున్న పుణ్యమును నశింపచేసుకోవడమే. కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారము రాముని విశ్వామిత్రుని వెంట పంపు. ఓ దశరథ మహారాజా! నా మాట విను. విశ్వా...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవయ్యవ సర్గ (Ramayanam - Balakanda - Part 20)

శ్రీమద్రామాయణము బాలకాండ ఇరవయ్యవ సర్గ దశరథుడు విశ్వామితునితో దు:ఖముతో కూడిన గద్గద స్వరంతో ఇలా అన్నాడు, “ఓ మునీశ్వరా! నా రాముడు పదహారు సంవత్సరములు కూడా నిండని బాలుడు. రామునికి రాక్షసులతో యుద్ధము చేయగల శక్తి పరాక్రమములు ఉన్నవి అని నేను అనుకోడం లేదు. నా వద్ద ఒక అక్షౌహిణి సైన్యము ఉంది. నేను దానికి అధిపతిని. నేను నా సైన్యముతో వెళ్లి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారినై నా శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకూ యాగ సంరక్షణ చేస్తాను. ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్రా! ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు. యుద్ధ తంత్రములు తెలియని వాడు. ఇంకా యుద్ధ విద్యలు పూర్తి గానేర్వని వాడు. అందులోనూ మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయడం రామునికి చేత కాదు. ఓ మునీంద్రా! రాముడు నాకు ప్రాణంతో సమానం. రాముడు లేనిది నేను జీవించలేను. రాముని నా నుండి వేరు చేయకండి. కావాలంటే నన్ను నా సైన్యమును తీసుకొని వెళ్లండి. రాముడు నా పెద్దకుమారుడు. చాలాకాలం తరువాత కలిగిన పుత్ర సంతానము. రాముని నేను పంపలేను. ఇంతకూ మునీంద్రా! ఆ రాక్షసులు ఎవరు? ఎక్కడి వారు? ఎవరి కుమారులు? వారి పరాక్రమమేమి? వారికి అండగా ఎవరు ఉన్నారు? వారి...

శ్రీమద్రామాయణం - బాలకాండ - పందొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 19)

శ్రీమద్రామాయణము బాలకాండ పందొమ్మిదవ సర్గ దశరథుని చూచి విశ్వామితుడు ఇలా అన్నాడు, “ ఓ దశరథ మహారాజా! ఇక్ష్వాకు వంశంలో పుట్టి, వసిష్ఠుని పురోహితుని గా గల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడటం సమంజసముగా ఉంది. నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు. నేను వచ్చిన కార్యము చెబుతాను. జాగ్రత్తగా విను. విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో.  నేను ఒక సిద్ధికొరకు ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కాని ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధము కలిగిస్తున్నారు. నేను పూనిన వ్రతము సమాప్తి అయ్యే కాలములో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను.  నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను. కానీ వ్రత సమయములో కోపము తెచ్చుకోకూడదు. శపించకూడదు. ఆ కారణం చేత నాకు ఒక వీరుడి అవసరం వచ్చింది. నీ కుమారుడు, మహావీరుడు అయిన రాముని నాకు ఇమ్ము. రాముడు ఆ రాక్షసులను సంహరించడానికి సమర్థుడు. రాముడు ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములలో కీర్తివంతుడౌతాడు. ఆ మారీచ సుబాహులను రాముడు తప్ప వేరెవ్వరూ చంప...

శ్రీమద్రామాయణం - బాలకాండ - పదునెనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 18)

శ్రీమద్రామాయణము బాలకాండ పదునెనిమిదవ సర్గ దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తి అయ్యాయి. తమ తమ హవిర్భాగములను తీసుకొని దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. పత్నీ సమేతంగా అయోధ్యా నగరంలో ప్రవేశించాడు. తరువాత ఋష్య శృంగుడు తన భార్య శాంతతోనూ, రోమపాదుని తోనూ అంగదేశము నకు వెళ్లిపోయాడు. అందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురు చూస్తున్నాడు. యజ్ఞము పూర్తి అయి ఒక సంవత్సరము గడిచింది. మరలా చైత్రమాసము వచ్చింది. వసంత ఋతువులో, చైత్రమాసములో, పునర్వసు నక్షత్రము నాడు, నవమి తిథి యందు, ఐదు గ్రహములు ఉచ్ఛ స్థానములో ఉండగా, కర్కాటక లగ్నమందు, కౌసల్యాదేవి గర్భవాసమున, సర్వలక్షణ సమన్వితుడు, సకల లోకములచే పూజింప తగినవాడు, విష్ణువు యొక్క ప్రథమ అంశ ఐన వాడు, మహాభాగుడు, ఇక్ష్వాకు వంశ వర్ధనుడు అయిన రాముడు జన్మించాడు. విష్ణువులో నాల్గవభాగము అయిన వాడు, సత్యవంతుడు, పరాక్రమ వంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయీ గర్భ వాసమున జన్మించాడు. సర్వ అస్త్ర కుశలురు, వీరులు, విష్ణువులో నాలుగవ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శతుఘ్నులు ఆశ్లేషా...

శ్రీమద్రామాయణం - బాలకాండ - పదిహేడవ సర్గ (Ramayanam - Balakanda - Part 17)

శ్రీమద్రామాయణము బాలకాండ పదిహేడవ సర్గ ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడుగా జన్మించాలి అని నిర్ణయించుకొన్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు. " శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్లాలి. మీ మీ అంశలతో కామరూపులు, అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు శూరులు గానూ, వాయువేగముతో ప్రయాణించగలవారు గానూ అయి ఉండాలి. విష్ణువుతో సరి తూగ గల పరాక్రమ వంతులు అయి ఉండాలి. అదే కాకుండా నీతి మంతులు అయి ఉండాలి. వారు ఎవరి చేత గానీ, ఏ ఆయుధము చేత గానీ చంపబడకూడదు. సర్వ అస్త్ర సంపన్నులు అయి ఉండాలి. అటువంటి వారిని మీరందరూ అప్సరసల యందు, గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారందరూ వానరులు అయి ఉండాలి. ఇంతకు ముందే జాంబవంతుడు అనే ఋక్ష శ్రేష్టుడు (ఎలుగుబంటి) నేను ఆవలించినపుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు." అని పలికాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు. దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు. సూర్యుని అంశతో సుగ్రీవుడు...

శ్రీమద్రామాయణం - బాలకాండ - పదహారవ సర్గ (Ramayanam - Balakanda - Part 16)

శ్రీమద్రామాయణము బాలకాండ పదహారవ సర్గ విష్ణు మూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు. "ఓ దేవతలారా! నేను మనుష్యునిగా అవతారము ఎత్తుతాను. కాని లోక కంటకుడైన రావణుని ఎలా సంహరించాలి. దానికి ఉ పాయము ఏమి?" అని అడిగాడు. దానికి దేవతలు ఇలా అన్నారు. "ఓ మహావిష్ణూ! నీవు మనుష్య శరీరమును ధరించి, రావణుని యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే........ రావణాసురుడు చాలాకాలము బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. 'మనుషులతో తప్ప అతనికి వేరే వారిచేత మరణభయము లేకుండు గాక!' అని వరం ప్రసాదించాడు.  మానవులు బలహీనులని, వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరము కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలము మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యము లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి." అని వివరంగా చెప్పారు దేవతలు.  దశరథునికి కుమారులుగా పుట్టడానిక...