Posts

Showing posts from February, 2024

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యి ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 91)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము తొంభయ్యి ఒకటవ సర్గ ఆ రాత్రికి భరద్వాజుడు భరతునికి అతని పరివారమునకు సేనలకు భోజన సదుపాయములను చెయ్యాలని అనుకున్నాడు. దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మీరు వసిష్ఠుల వారికి, నాకూ అర్ఘ్యము పాద్యము ఫలములు ఇచ్చి సత్కరించారు కదా! అది చాలు నాకు." అని అన్నాడు. "భరతా! నీవు ఏదీ కోరవు అని నాకు తెలుసు. కాని కాదనకుండా నా ఆతిధ్యము స్వీకరించు. నీవు నీ పరివారమును, సైన్యమును ఎందుకు దూరంగా ఉంచావు. మా ఆశ్రమమునకు తీసుకొని రావలసినది." అని అన్నాడు భరద్వాజుడు. దానికి భరతుడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! తమ ఆశ్రమ ప్రశాంతతకు భంగము కలిగించడం ఇష్టం లేక, తమరి మీద ఉన్న భయ భక్తులతో నేను నాపరివారమును సైన్యమును దూరంగా ఉంచి వచ్చాను. అదీ కాకుండా రాజులు తమ మందీ మార్బలములను, మునులకు దూరంగా ఉంచాలని రాజధర్మము కదా! నా వెంట చతురంగ బలములు వస్తూ ఉన్నాయి. అవి ఇక్కడకు వస్తే ఇక్కడి వృక్ష సంపద, జలసంపద కలుషితము అవుతాయి. అందుకని తీసుకొని రాలేదు.” అని అన్నాడు భరతుడు. దానికి భరద్వాజుడు నవ్వి “మాకు ఏమీ అసౌకర్యము లేదు. నీ సేనలను ఇక్కడకు రమ్మని చెప్పు" అని ఆదేశించాడు. ఆ ప్రకారము భరతుని సేనలు...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - తొంభయ్యవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 90)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము తొంభయ్యవ సర్గ భరద్వాజ మహర్షి ఆశ్రమము క్రోసెడు దూరము ఉండగానే భరతుడు తన సేనలను పరివారమును అక్కడే ఆగిపొమ్మన్నాడు. ఆయుధములను విడిచిపెట్టాడు. తాను పట్టుబట్టలు ధరించాడు. కులగురువు వసిష్ఠుడు ముందు నడుస్తూ ఉండగా, తన మంత్రులు వెనక రాగా, కాలి నడకన భరద్వాజ మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు. భరద్వాజుని ఆశ్రమము కనుచూపు దూరములో ఉండగానే మంత్రులను ఆగిపొమ్మన్నాడు. వసిష్ఠుడు వెంటరాగా ఆశ్రమమునకు వెళ్లాడు. వసిష్ఠుని చూడగానే భరద్వాజుడు సంభ్రమంతో ఎదురు వచ్చాడు. అర్ఘ్య పాద్యములు ఇచ్చిసత్కరించాడు. భరతుని ఆదరంతో ఆహ్వానించాడు. భరతునికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు. ఇరువురికీ ఫలములు ఇచ్చాడు. భరతుని యోగక్షేమములు కనుక్కున్నాడు భరద్వాజుడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మేమంతా కుశలమే. మీరు మీ ఆశ్రమ వాసులు ఏ బాధా లేకుండా తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా!" అని అడిగాడు భరతుడు. “మహారాజా! మాకు ఏ బాధా లేదు. ప్రశాంత జీవనము గడుపుతున్నాము. కానీ అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలసిన వాడివి, ఇలా అడవుల వెంట తిరగడానికి కారణమేమి? నీ అన్న రాముడు తండ్రి ఆదేశమును పాలించుటకు అరణ్యములకు వెళ్లాడు. అది నాకు...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 89)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ఎనభై తొమ్మిదవ సర్గ భరతుని మాటలకు అక్కడున్నవారికి దుఃఖము ఆగలేదు. ఏమనాలో తెలియక ఎవరి నివాసములకు వారు వెళ్లారు. ఆరాత్రి అలా గడిచిపోయింది. మరునాడు సూర్యోదయము అయింది. భరతుడు శత్రుఘ్నునితో ఇలా అన్నాడు. "శత్రుఘ్నా! సూర్యోదయము అయింది. నిద్రలే. తొందరగా గుహుని ఇక్కడకు తీసుకొని రా. అతడు మన సైన్యమును గంగానదిని దాటిస్తాడు. మనకు కూడా గంగానదిని దాటడానికి తగిన ఏర్పాట్లు చేస్తాడు." అని అన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో ఇలా అన్నాడు. “నేను నిద్రపోవడం లేదన్నయ్యా. అన్న రాముని గురించి ఆలోచిస్తూ కళ్లు మూసుకొనిపడుకున్నాను. నీ ఆదేశము ప్రకారము గుహుని తీసుకొని వస్తాను."అని పోబోయాడు. ఇంతలో గుహుడు అక్కడకు వచ్చాడు. ఇద్దరికీ నమస్కరించాడు. “రాజకుమారులారా! మీకు మీసైన్యమునకు ఎలాంటి అసౌకర్యము కలగలేదు కదా! గంగాతీరమున మీరుసుఖంగా నిద్రించారుకదా!" అని కుశల ప్రశ్నలు వేసాడు గుహుడు. "మిత్రమా! మాకు ఎలాంటి అసౌకర్యమూ కలగలేదు. మేము గంగానదిని దాటవలెను. మీ పరివారమునకు చెప్పి మా అందరినీ గంగానది దాటించు.”అని అన్నాడు. వెంటనే గుహుడు తన నివాసమునకు వెళ్లాడు. తన పరివారమును అందరినీ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 88)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ఎనభై ఎనిమిదవ సర్గ గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు భరతుడు. అందరూ కలిసి ఆ రోజు రాముడు శయనించిన ఇంగుదీవృక్షము దగ్గరకు వెళ్లారు. రాముడు పడుకున్న గడ్డితో చేసిన శయ్యను చూచారు. భరతుడు తన తల్లులను చూచి "అమ్మా! రాకుమారుడు అయిన రాముడు పడుకున్న శయ్య ఇదేనమ్మా! చూడమ్మా రామునికి ఎంత దుర్గతి పట్టిందో. రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. రాచబిడ్డ. రాచ మర్యాదలు, రాజభోగములు అనుభవించాడు. కానీ, ఈ నాడు నేల మీద గడ్డి పరుచుకొని పడుకుంటున్నాడు. ప్రతిరోజూ హంసతూలికా తల్పముల మీద శయనించిన రాముడు కటిక నేల మీద ఎలా పడుకుంటున్నాడో కదా! రాజ ప్రాసాదములలో నివసించిన రాముడు కొండగుహలలో, పర్ణశాలలో ఎలా ఉంటాడో కదా! ప్రతిరోజూ మంగళవాద్య ఘోషలతో వంది మాగధుల కైవారములతో నిద్రలేచే రాముడు ఈ నాడు క్రూరమృగముల అరుపులతో నిద్రలేవడం ఎంతటి దౌర్భాగ్యం. ఎవరికైనా చెబితే నమ్మేట్టుగా లేదు. అందరూ ఇదినిజం కాదు అని అంటారు. నా మటుకు నాకు ఇదంతా ఒక కలలాగా అనిపిస్తూ ఉంది. కాని ఇది అంతా యదార్థము అని తెలిసిన నాడు మనస్సు తల్లడిల్లి పోతూ ఉంది. అంతా కాలమహిమ అని సరిపెట్టుకోక తప్పదు. ఎందుకంటే రాజాధిరాజులకంటే, వారి బలప...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 87)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ఎనుబది ఏడవ సర్గ గుహుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న భరతుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. రాముని వనవాసము తండ్రి మరణము లక్ష్మణుని వాక్కులు అతని మనసును కలచి వేసాయి. ఆ మానసిక క్షోభకు తట్టుకోలేక భరతుడు కిందపడిపోయాడు. స్పృహ తప్పాడు. పక్కన ఉన్న శతృఘ్నుడు పట్టుకున్నాడు. శయ్యమీద పడుకోబెట్టాడు. ఈ వార్త తెలిసి కౌసల్య, సుమిత్ర, కైక పరుగు పరుగున అక్కడకు వచ్చారు. కౌపల్య స్పృహ తప్పిన భరతుని చూచి బిగ్గరగా ఏడవడం మొదలెట్టింది. “నాయనా! భరతా! ఇక్ష్వాకు వంశమునకు నీవే దిక్కు. నీకేమయింది. ఏదైనా శారీరక వ్యాధి వచ్చిందా. రామ లక్ష్మణులు అడవులకు వెళ్లారు. ఎక్కడున్నారో ఏమి చేస్తున్నారో తెలియదు. మహారాజుగారు పరమపదించారు. నువ్వు ఒక్కడివే ఈ సామ్రాజ్యానికి వారసుడివి. మాకు రక్షకుడవు. నిన్ను చూచుకొని మేమందరమూ ప్రాణాలు నిలుపుకొని ఉన్నాము. నాయనా! భరతా! రామలక్ష్మణుల గురించి గానీ, సీత గురించి గానీ ఏమైనా దుర్వార్త తెలిసినదా! చెప్పు భరతా! ఏం జరిగింది. మామనసులు తల్లడిల్లిపోతున్నాయి." అని రోదిస్తూ ఉంది కౌసల్య. పరిచారికలు భరతునికి పరిచర్యలు చేసారు. ఇంతలో భరతుడు తేరుకున్నాడు. కౌసల్యను ఓదార్చాడు. గుహుని...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 86)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ఎనుబది ఆరవ సర్గ ఆ రాత్రి గుహుడు లక్ష్మణుని సద్గుణముల గురించి భరతునికి వివరించాడు. “ఓ మహారాజా! రాముడు అడవులలోనికి పోయే ముందు ఇక్కడ నిద్రించాడు. ఆ రాత్రి లక్ష్మణుడు నిద్ర లేకుండా రామునికి సీతకు రక్షణగా ఉన్నాడు. ఆ సమయంలో నేను లక్ష్మణునితో "లక్ష్మణా! నీకోసరము మా వాళ్లు సుఖకరమైన శయ్య ఏర్పాటు చేసారు. నీవు నిద్రించు. నేను రామునికి ఏ ఆపదా రాకుండా చూసుకుంటాను. ఎందుకంటే లక్ష్మణా! మేము కష్టములు పడటానికి అలవాటు పడ్డాము. రాత్రి నిద్రలేకుండా మేలుకొనడం మాకు అలవాటే. నీవు రాకుమారుడవు. నీవు నిద్రలేకుండా ఉండలేవు. అందుకని వెళ్లి నిద్రించు. మిత్రమా లక్ష్మణా! నాకు రాముని కంటే ప్రియమైన వాళ్లు ఈ లోకంలో ఎవరూ లేరు. రాముడు అడవులలో ఉన్నంతవరకూ రాముని రక్షణ బాధ్యత నాది. దానిని ఎవరికీ అప్పచెప్పను. నేను రాముని సేవలోనే ఆయన అనుగ్రహమును పొందుతాను. కాబట్టి నేను నా ధనుస్సు చేత బూని సీతారాములను రక్షిస్తాను. నేను సదా ఈ వనములో సంచరిస్తుంటాను కాబట్టి ఈ వనములలో నాకు తెలియనిది అంటూ లేదు. ఎంతటి సైన్యమునైనా ఎదిరించే శక్తి మాకు ఉంది. రామునికి వచ్చిన భయము లేదు. కాబట్టి రాముని రక్షణ బాధ్యత నాకు అప...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 85)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ఎనుబది ఐదవ సర్గ గుహుని మాటలను విన్న భరతుడు గుహునితో ఇలా అన్నాడు. “నీవు మా అన్నగారు రామునికి మిత్రుడు అని తెలిసినది. మేము అశేష సేనావాహినితో వచ్చాము. మా అందరికీ ఆతిథ్యము ఇవ్వవలెనని నీ కోరిక బహు ప్రశంసనీయము. ఈ ప్రాంతమంతయు చాలా దుర్గమంగా ఉంది. మేము భరద్వాజుని ఆశ్రమమునకు పోవలెను. దానికి మంచి మార్గము చూపగలవా!" అని అడిగాడు. ఆ మాటలు విన్న గుహుడు “మహారాజా! మీము నీకు దాసులము. నేను, మా వాళ్లు ధనుస్సులతో నీకు ముందు నడుస్తూ నీకు దారి చూపిస్తారు. కాని ఒక్క సందేహము. తమరు రాముని వద్దకు వెళ్లుచున్నట్టు కనపడుతూ ఉంది. మీరు రామునికి అపకారము చేయడానికి వెళుతున్నారా అని సందేహముగా ఉన్నది. నా సందేహమును తమరు తీరుస్తారు అని ఆశిస్తున్నాను.” అని వినయంగా అసలు విషయం బయట పెట్టాడు గుహుడు. “నీవు రామునికి మిత్రుడవు కాబట్టి నాకూ మిత్రుడవే. ఓ మిత్రమా! రాముడు నాకు అన్న. నా తండ్రితో సమానుడు. ఆయనకు అపకారము తలపెట్టే దుర్బుద్ధి నాకు కలలో కూడా కలగకుండు గాక! నేను నిజం చెబుతున్నాను. నేను రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకొని వచ్చి పట్టాభిషిక్తుని చేయవలెనని అనుకుంటున్నాను. అంతే కానీ రామునిక...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది నాల్గవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 84)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ఎనుబది నాల్గవ సర్గ గంగానదీ తీరమున ఉన్న శృంగిబేరపురమునకు రాజు గుహుడు. రామునికి ఆప్తమిత్రుడు. గంగానది పొడుగునా విడిది చేసిన సైన్యములను చూచాడు గుహుడు. వెంటనే తన మంత్రులను, బంధువులను సమావేశపరిచాడు. "మీరంతా చూచి ఉంటారు. గంగానదీ తీరాన అశేష సైన్యము విడిది చేసి ఉన్నది. దీని లెక్క నాకు ఊహకు అందడం లేదు. ఈ సైన్యము అయోధ్యనుండి వచ్చినట్టు కనపడుతూ ఉంది. భరతుడు రాముని వెదుకుతూ వచ్చాడేమో తెలియదు. మనము రాముని మిత్రులమని మనలను బంధించడానికి వచ్చాడా! లేక మనలనందరినీ చంపుతాడా! రాముడు బతికి ఉంటే శాశ్వతముగా తనకు రాజ్యము లభించదని రాముని కూడా చంపడానికి వచ్చాడా! రాముడు మనకు రాజే కాదు. మనకు మిత్రుడు కూడా. అందుచేత రాముని రక్షించడం మన కర్తవ్యము. అందుకని మీరందరూ ఆయుధములను చేత బట్టి గంగానదీ తీరములో నిలబడండి. మనము కేవలము గంగాతీరమును రక్షిస్తున్నాము అనే మిషతో అక్కడ ఉండండి. మనసేనలను కూడా సమాయత్తము చేయండి. మనకు ఐదువందల పడవలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క పడవలో నూరుగురు సైనికులు ఉండండి. గంగా తీరమును రక్షిస్తూ ఉన్నట్టు పడవల మీద తిరగండి. భరతుడు ఏ బుద్ధితో వచ్చాడో తెలియదు. భరతుడు రాముని క్షేమం ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 83)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ఎనుబది మూడవ సర్గ మరునాడు ఉదయము భరతుడు నిద్ర లేచాడు. ప్రాత:కాల సంధ్యావందనాది కార్యకమ్రములు నిర్వర్తించాడు. తన రథము ఎక్కి బయలుదేరాడు. భరతుని వెంట పురోహితులు, మంత్రులు తమ తమ వాహనములలో బయలుదేరారు. భరతుని వెనక 9,000 ఏనుగులు, 60,000 రథములు, వాటిలో ధనుస్సులు ధరించిన సైనికులు, ఒక లక్ష మంది ఆశ్విక సైన్యము రక్షణగా బయలుదేరింది. కౌసల్య, కైకేయీ, సుమిత్ర తమ తమ రథములలో భరతుని వెంట రాముని వద్దకు బయలుదేరారు. రాజకుటుంబము వారికి సన్నిహితంగా ఉన్నవారు, వర్తకులుకూడా రాముని వద్దకు బయలుదేరారు. వీరు కాకుండా వివిధ చేతి వృత్తులవారు ఎప్పుడు ఎవరి అవసరము వస్తుందో అని భరతుని వెంట బయలుదేరారు. వారి వెనక వేదములు వల్లిస్తూ బ్రాహ్మణులు ఎడ్లబండ్ల మీద భరతుని అనుసరించారు. వారందరూ శృంగిభేర పురము దగ్గర ప్రవహించుచున్న గంగానదిని సమీపించారు. భరతుడుఅక్కడ ఆగాడు. అమాత్యులను పురోహితులను సైన్యాధ్యక్షులను చూచి ఇలా అన్నాడు. “ఈ రాత్రికి మనము ఈ గంగానదీ తీరములో విడిది చేద్దాము. రేపుఉదయము మన ప్రయాణము కొనసాగిస్తాము. నేను నా తండ్రికి గంగానదిలో జలతర్పణములు విడుస్తాను. మీరందరూ సేనలతో విశ్రాంతి తీసుకోండి" అని...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 82)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ఎనుబది రెండవ సర్గ రాజసభలో వసిష్ఠుడు ఆదేశము ప్రకారము మంత్రులు సామంతులు పురప్రముఖులు ఎవరికి నిర్దేశించిన ఆసనములలో వారు కూర్చున్నారు. భరతుడు ఉన్నతాసనము అలంకరించాడు. పక్కనే శత్రుఘ్నుడు కూడా కూర్చున్నాడు. అప్పుడు వసిష్ఠుడు లేచి సభను, భరతుని ఉద్దేశించి ఇలా పలికాడు. రాకుమారా! నీకు జయము కలుగు గాక! ఇప్పటి వరకు నీ తండ్రి దశరథుడు ఈ అయోధ్యను ధర్మమును ఆచరించుచూ ప్రజారంజకంగా పరిపాలించాడు. ఈ రాజ్యమును నీకు అప్పగించి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. నీ అన్న రాముడు తండ్రి మాట ప్రకారము రాజ్యమును నీకు వదిలి అరణ్యములకు వెళ్లాడు. కాబట్టి, ఓ భరతా! నీ తండ్రి, నీ అన్న, నీకు అప్పగించిన రాజ్యభారమును నీవు వహించవలెను. వెంటనే అయోధ్యకు పట్టాభిషిక్తుడవు కమ్ము. ఈ అయోధ్యకు, ఉత్తరదేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దక్షిణదేశపు రాజులు, సరిహద్దులలో ఉన్న రాజ్యాధీశులు, ఇంకా నీ అధీనములో ఉన్న ద్వీపములను పరిపాలించు రాజులు నీకు కప్పములు చెల్లించెదరు. ఈ సువిశాల సామ్రాజ్యమును నీవు పరిపాలించు." అని పలికాడు వసిష్ఠుడు. అప్పుడు భరతుడు ఇలా అన్నాడు. "కులగురువులు వసిష్టులు ఇలా మాట్లాడటం ఉచితము కాదని నా...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 81)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ఎనుబది ఒకటవ సర్గ దశరథుడు చనిపోయి 13 రోజులు గడిచిపోయాయి. కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. శోకదినములు గడిచిపోయాయి. 14వ రోజున రాచరిక లాంఛనాలు ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామునే వందిమాగథులు భరతుని స్తోత్రం చేస్తున్నారు. దుందుభులు మ్రోగిస్తున్నారు. మంగళవాద్యములు మోగుతున్నాయి. వేశ్యలు నృత్యం చేస్తున్నారు. అంతా కాబోయే మహారాజు భరతుని మేలుకొలుపు తున్నారు. కాని ఈ రాజలాంఛనాలు అన్నీ భరతునికి చికాకు పుట్టించాయి. అతనికి ఇంకా దుఃఖము ఎక్కువ అయింది. "ఆపండి. నేను రాజును కాను." అని గట్టిగా అరిచాడు. అన్నీ ఆగిపోయాయి. భరతుడు శత్రుఘ్నుని చూచి ఇలా అన్నాడు. "శత్రుఘ్నా! చూచావా. కైక వలన ఎంతటి అనర్ధము వాటిల్లిందో. మహారాజు రాజ్యభారము నా మీద మోపి తాను హాయిగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు. ఈ కష్టములు అన్నీ నాకు వదిలి రాముడు హాయిగా వనవిహారము చేస్తున్నాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను.' అని రోదిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే వసిష్ఠుడు రాజసభను ఏర్పాటు చేసాడు. అయోధ్యలో ఉన్న అన్ని కులముల వారినీ, అమాత్యులనూ, పురప్రముఖులను, గణాధ్యక్షులను, సభకు ఆహ్వానించాడు. వారందరూ సభలో తమ తమ ఆసనము...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 80)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ఎనుబదవ సర్గ అమాత్యులు భరతుని ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేసారు.. ఆయాప్రదేశముల స్వభావములను తెలిసిన వారు, నేలను త్రవ్వేవారు, కొలతలు వేసేవారు, యంత్రకోవిదులు, శిల్పులు, తగిన యంత్రములను నడుపువారు, చెక్కపని వారు, బావులు తవ్వువారు, మార్గములు వేయువారు, వారిని పర్యవేక్షించేవారు ఎవరెవరు ఏ యే పనులకు నియమింపబడ్డారో ఆ పనులను సమర్ధవంతంగా చేస్తున్నారు. ముందుగా, భరతుడు, ఆయన సైన్యము, రథములు, శకటములు అడవులలో పోవుటకు, మార్గములు, రహదారులు వేస్తున్నారు. అడ్డంగా ఉన్న చెట్లను, పొదలను, తీగలను నరికి మార్గము చేస్తున్నారు. నేలంతా చదును చేస్తున్నారు. పల్లము ప్రదేశములలో మట్టిపోసి, ఎత్తైన ప్రదేశములను చదును చేసి, గుంతలను కప్పివేసి, మార్గములు ఏర్పరుస్తున్నారు. దారిలో సైన్యములకు, భరతుని అనుసరించు వారికీ, కావలసిన నీరు కాలవల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. నదులు కాలువలు లేని ప్రదేశములలో బావులు త్రవ్వి నీటిని పైకి తోడుతున్నారు. సేనలు నడచు మార్గమును సున్నముతో గట్టిచేసారు. దారిలో పూలచెట్లు నాటించారు. పతాకములతో అలంకరించారు. ఈ పనులన్నీ చేయుటకు జ్యోతిష్కులు మంచి ముహూర్తములు నిర్ణయించారు. ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 79)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము డెబ్బది తొమ్మిదవ సర్గ పదమూడవ రోజు అలాగడిచిపోయింది. పదునాలుగవ రోజున మంత్రులు పురోహితులు భరతుని వద్దకు వెళ్లారు. "కుమారా! భరతా! మన మహారాజు గారు మృతిచెందారు. పెద్దకుమారుడైన రాముడు తండ్రిమాట ప్రకారము అడవులకు వెళ్లాడు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేని రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. అయోధ్య ప్రజలు ధర్మపరులు అందుకని అటువంటి ఉపద్రవము చెలరేగలేదు. పట్టాభిషేకమునకు నీవు ఆలస్యము చేస్తే, దేశంలో అరాచకము చెలరేగే ప్రమాదము ఉంది. రాజప్రముఖులు, పురప్రముఖులూ పురోహితులూ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు సిద్ధం చేసుకొని నీ అనుమతి కోసరం ఎదురు చూస్తున్నారు. వంశపారపర్యముగా నీవే అయోధ్యకు మహారాజువు. కాబట్టి నీవు అయోధ్యకు రాజ్యాభిషిక్తుడవై మమ్ములను పాలించు."అని అన్నాడు. భరతుడు ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. "మీకందరికీ రాజధర్మము బాగా తెలుసు. రాచరిక వ్యవస్థలో రాచకుటుంబము లోని పెద్దవాడు రాజ్యమునకు అర్హుడు. మహారాజు కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రాముడే రాజ్యమునకు అర్హుడు. నేను కాదు. నన్ను పట్టాభిషేకము చేసుకోమనడం యుక్తము కాదు. కాబట్టి, రాముని రాజ్యాభిషిక్తుని ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 78)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము డెబ్బది ఎనిమిదవ సర్గ దశరథ మహారాజు కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. తదుపరి కార్యక్రమము గురించి ఆలోచిస్తున్నాడు భరతుడు. ఎందుకంటే ప్రస్తుతము అయోధ్యకు రాజులేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. అందుకని వెంటనే భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కాని ముందుగా రాముని కలుసుకొని రాముని అనుమతి పొందాలని భరతుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు. "భరతా! మనము ఇంట లేని సమయములో ఒక ఆడుది రాముని అడవులకు పంపి వేసినది. రాముడు తండ్రి మాటను పాటించాడు. లక్ష్మణునికి ఏమయింది. కనీసం లక్ష్మణుడు అయినా దశరథుని కట్టడి చేసి ఆ వనవాసమును ఆపవచ్చు కదా! స్త్రీలోలత్వముతో వరములు ఇచ్చిన మహారాజును ముందే కట్టడి చేసినచో వ్యవహారము ఇంతదూరము వచ్చిఉండెడిది కాదు. అలా లక్ష్మణుడు ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు.” అని అన్నాడు శత్రుఘ్నుడు. ఆ సమయంలో ఒంటి నిండా నగలు వేసుకొని కైక దాసి మంథర అటుగా వెళుతూ ఉంది. ఆమెను చూచాడు శత్రుఘ్నుడు. ఒంటినిండా నగలు అలంకరించు కున్న మంథర శత్రుఘ్నునికి తాళ్లతో కట్టిన ఆడకోతి లాగ కనపడింది. ఈ అనర్థములకు అన్నిటికీ మూలము మంథర అని అందరికీ ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 77)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము డెబ్బది ఏడవ సర్గ దశరథుడు మరణించిన పదవ రోజున శుద్ధిజరిగింది. పన్నెండవ రోజున మహారాజుకు శ్రాద్ధ కర్మలు భరతుడు నిర్వర్తించాడు. శ్రాద్ధ కర్మను పురస్కరించుకొని భరతుడు బ్రాహ్మణులకు, ఋత్విక్కులకు, బంగారము, వెండి, భూదానము, గోదానము, గృహదానము, వాహన దానము, వస్త్రదానములు విరివిగా చేసాడు. పదమూడవ రోజున భరతుడు అస్థిసంచయనము కొరకు శ్మశానమునకు వెళ్లాడు. తండ్రిచితిని చూచి భరతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు. "తండ్రీ! నన్ను నీవు రామునికి అప్పగించావు. నీవు వెళ్లిపోయావు. రాముడు నన్ను వదిలి అరణ్యములకు వెళ్లిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. రాముడు అరణ్యములకు పోగా, కౌసల్య నిన్ను చూచుకొని జీవించుచున్నది. ఇప్పుడు నువ్వుకూడా ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయావు."అని పరిపరి విధాల ఏడుస్తున్నాడు. ఆజానుబాహుడు అయిన దశరథుని కాష్టములో బూడిద చిన్న కుప్పగా పడి ఉండడం చూచి ఏడుపు ఆపుకోలేకపోయాడు. అస్థికలను ఏరుతూ కింద పడిపోయాడు. పక్కనే ఉన్న మంత్రులు భరతుని పట్టుకున్నారు. ఇదంతా చూచిన శత్రుఘ్నునికి దుఃఖము ఆగలేదు. పిచ్చివాడి వలె ఏడుస్తున్నాడు. "తండ్రీ! కైక కోరిన కోరికలు అనే సముద్రంలో పడి మున...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 76)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము డెబ్బది ఆరవ సర్గ మరునాడు తెల్లవారింది. భరతుడు వచ్చాడు అన్న వార్త విని కులగురువు వసిష్ఠుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు. “నాయనా భరతా! నీకు శభము అగుగాక! నీ తండ్రి మరణము గురించి దు:ఖించకుము. నీ తండ్రికి కర్మకాండలు జరిపించు." అని పలికాడు. కులగురువు వసిష్ఠుని ఆదేశము ప్రకారము భరతుడు తన తండ్రికి ఉత్తర క్రియలు అన్ని యధావిధిగా జరిపించాడు. దశరథ మహారాజు శరీరమును తైలద్రోణిలో నుండి బయటకు తీసి నేల మీద ఉంచారు. తైల ద్రోణిలో ఉంచడం వల్ల మహారాజు శరీరములో ఏ మార్పూ రాలేదు. నిద్రపోతున్నట్టు ఉన్నాడు దశరథుడు. తరువాత మహారాజును రత్నములు పొదిగిన శయ్యమీద పడుకోబెట్టారు. తన తండ్రి శవమును చూచి భరతుడు ఎంతో దుఃఖించాడు. “మహారాజా! నేను ఇంట్లో లేని సమయం చూచి రాముని అడవులకు ఎందుకు పంపావు? అటువంటి నిర్ణయము ఎందుకు తీసుకున్నావు? నీకేం హాయిగా స్వర్గానికి వెళ్లావు. రాముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళ్లాడు. నేను జీవచ్ఛవము లాగా ఇక్కడ ఉన్నాను. ఇంక ఈ అయోధ్య యోగక్షేమములు ఎవరు చూస్తారు? మహారాజా! నీవులేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కళావిహీనంగా ఉంది." అని విలపిస్తున్నాడ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 75)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము డెబ్బది ఐదవ సర్గ పుత్ర వ్యామోహం ఇంత చేటు తెస్తుందని కలలోనైనా తలపని కైక, తన కొడుకు కోసరం ఇదంతా చేసింది. అపకీర్తి పాలయింది కైక. కాని తన కొడుకు భరతుడు తననే నిందిస్తున్నాడు. శాపాలు పెడుతున్నాడు. తన తల్లివే కాదు పొమ్మన్నాడు. ఈ మాటలు విని కైక కుమిలిపోతోంది. నోట మాట రావడం లేదు. నేల మీద పడి ఉన్న కొడుకు భరతుని నిస్సహాయంగా చూస్తూ ఉంది. ఇంతలో భరతుడు లేచాడు. భరతుని రాకను విని అమాత్యులు అందరూ అక్కడకు చేరుకున్నారు. కాబోయే మహారాజు భరతుడు నేలమీద పడి ఉన్నాడు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో భరతుడు తల పైకి ఎత్తి అమాత్యులను చూచాడు. భరతునికి ఒక అనుమానం పట్టుకొంది. రాముడు అరణ్యములకు వెళితే, తన తండ్రి మరణిస్తే, తానే రాజు అవుతాడు. ఈ చర్యల వల్ల లబ్ధి పొందేది తను. అమాత్యులు తానే ఇదంతా తన తల్లి కైక తో చేయించానని అపోహ పడే అవకాశం ఉంది. తనకు ఏమీ తెలియదు అనీ, తాను అమాయకుడననీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉందని గుర్తించాడు భరతుడు. అందుకే అమాత్యులతో బిగ్గరగా ఇలా అన్నాడు. “అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది నాల్గవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 74)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము డెబ్బది నాల్గవ సర్గ తన కొడుకు భరతుడు ఎంత దూషించినా కైక మారు పలక లేదు. మౌనంగా ఉంది. భరతుడు తండ్రి మరణాన్ని తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణం తన తల్లి కైక అని గుర్తుకు తెచ్చుకున్నాడు భరతుడు. తల్లి వంక తీక్షణంగా చూచాడు. “అమ్మా! నీవు తండ్రి గారినే కాదు నన్ను కూడా మరణించేట్టు చేసావు. అమ్మా నేను మరణించిన తరువాత నా శవాన్ని, ఈ రాజ్యాన్ని చూచుకుంటూ తీరిగ్గా ఏడుద్దువుగానీ. ఏమ్మా! నీ కొడుకు మరణిస్తే నీకు దుఃఖం వచ్చిందా! ఏ పాపమూ ఎరుగని రాముని అరణ్యాలకు పంపినపుడు ఈ దు:ఖము ఏమయింది? నీ వలన నా తండ్రి అకాల మరణము పొందినపుడు ఈ దుఃఖము ఏమయింది? నీకు ఏమి అపకారము చేసాడని నా రాముని అడవులకు వెళ్లమని చెప్పావు? నీవు చేసినపాపాలకు నీకు నరకమే సరి అయిన గతి. స్వర్గములో నీకు, భార్యగా నా తండ్రి పక్కన ఉండే అర్హత నీకు లేదు. అమ్మా! ఈతుచ్ఛమైన రాజ్యము కోసరం నీవు చేసిన పనులు చూస్తుంటే నాకే భయం వేస్తోంది. రేపు నన్నుకూడా ఏమైనా చేస్తావేమో అని భయపడుతున్నాను. నా రాముని అడవులకు పంపినది నీవే అయినా, నా తండ్రి మరణానికి కారణం నీవే అయినా, నేనే రాజ్యము  కోసరం ఇదంతా చేయించానని నా...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 73)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము డెబ్బది మూడవ సర్గ తన తల్లి కైక ఎంతో సంతోషంతో చెప్పిన మాటలు విన్న భరతుడు కోపంతో ఊగిపోయాడు. కాని ఎదురుగా ఉన్నది కన్నతల్లి. అందుకని తనకోపాన్ని బలవంతాన అణుచుకున్నాడు. కైకతో ఇలా అన్నాడు. “అమ్మా! నా తండ్రి అకాల మరణం చెందాడు. నా సోదరులు అడవుల పాలయ్యారు. ఇంకా నాకు ఎందుకమ్మా ఈ రాజ్యము. అమ్మా! నా అన్న రాముడు అరణ్యానికి పోవుటకు, రాముని మీద ప్రేమతో నా తండ్రి మరణించుటకు నీవా కారణము? మా వంశమునకు అగ్నిలాగా దాపురించి కాల్చివేసావు కదమ్మా! ఈ విషయం తెలియక నా తండ్రి నిన్ను ఎంతో ఆదరించాడు కదా అమ్మా! నీ పాపముతో కూడిన ఆలోచనలకు నా తండ్రిని బలితీసుకున్నావు. నీ వలన మా ఇక్ష్వాకు వంశమే అపవిత్రమయింది. మా అందరికీ సుఖసంతోషాలు దూరం చేసావు. నీవు చేసిన అనాలోచితపు పని వలన నా తండ్రి మరణించాడు. చెప్పమ్మా! ఇదంతా ఎందుకు చేసావు? రాముని ఎందుకు అడవులకు పంపావు? నా తండ్రిని ఎందుకు చంపావు? ఇంతా చేసిన దానివి కౌసల్యను సుమిత్రను బతుకనిస్తావా! వాళ్లకు కూడా నీ చేతిలో మరణం తథ్యం. అమ్మా! రాముడు నిన్ను తన కన్నతల్లి కౌసల్య కంటే ఎక్కువగా గౌరవించాడు కదమ్మా! మా పెద్దమ్మ కౌసల్య కూడా నిన్ను తన సహోదరి కంటే ఎక్కువగ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 72)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము డెబ్బది రెండవ సర్గ భరతుడు అలా ఆలోచిస్తూ తన తండ్రి దశరథుని మందిరములో ప్రవేశించాడు. అక్కడ దశరథుడు కనిపించలేదు. వెంటనే తన తల్లి కైక మందిరమునకు వెళ్లాడు. కొడుకును చూడగానే కైక మనస్సు సంతోషంతో నిండిపోయింది. కొడుకుకు ఎదురువెళ్లింది. భరతుడు తల్లి కైక పాదములకు నమస్కరించాడు. కైక భరతుని లేవదీసి నుదుటిన ముద్దు పెట్టుకొని తన పక్కన కూర్చుండబెట్టుకొంది. “నాయనా భరతా! నీ ప్రయాణము బాగా సాగిందా! తాతగారి ఇంట్లో ఎప్పుడు బయలుదేరావు. మార్గములో ఆయాసము కలగలేదు కదా! మీ తాతగారు, మేనమామ అంతా క్షేమంగా ఉన్నారా! ఇంకా కేకయ దేశపు విశేషములు ఏమిటి వివరంగా చెప్పు." అని ఆతురతగా అడిగింది కైక. భరతుడు తల్లి అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెప్పాడు.  “అమ్మా! నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఏడుదినములు అయింది. అక్కడ తాతగారూ, మామయ్య అంతా క్షేమంగా ఉన్నారు. వారు మీకు, తండ్రి గారికి, పంపిన కానుకలు వెనుక తీసుకొని వస్తున్నారు.  అమ్మా! అయోధ్యలో ప్రవేశించినప్పటి నుండి నా మనస్సులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు చెబుతావా అమ్మా!" అని అడిగాడు భరతుడు. కైక మాట్లాడలేదు. మౌనంగా ఉంది. ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 71)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము డెబ్బది ఒకటవ సర్గ భరత శత్రుఘ్నులు ఎక్కిన రథము అయోధ్య వైపు వేగంగా వెళుతూ ఉంది. శతద్రూనదిని దాటారు. శిలావహనదిని దాటారు. త్రివేణీ సంగమమును సమీపించారు. వీరమత్స్యదేశమును దాటి భారుండ వనమును ప్రవేశించారు. కులింగనదిని, యమునా నదిని దాటారు. అక్కడ కొంచెం సేపు విశ్రమించారు. ప్రాగ్వట పురమును దాటి గంగానదిని సమీపించారు. గంగానదిని దాటి ధర్మవర్ధనము అనే గ్రామమును సమీపించారు. జంబూప్రస్థమును దాటి వరూధమనే గ్రామము చేరుకున్నారు. తరువాత ఉజ్జహాసనగరమును, సర్వతీర్థమును, ఉత్తానికా నదిని, కుటికానదిని, కపీవతి నదిని, స్థాణుమతీ నదిని, గోమతీ నదిని దాటారు. కళింగ నగరములో కొంచెము సేపు విశ్రమించారు. తరువాత సాలవనమును దాటారు. ఆ ప్రకారము ఏడు రోజులు అవిశ్రాంతంగా ప్రయాణము చేసి అయోధ్యానగరము చేరుకున్నారు. ఎల్లప్పుడూ సందడిగా కళ కళ లాడుతూ ఉండే అయోధ్యానగరము కళాహీనంగా ఉంది. భరతునికి ఏం జరిగిందో అర్థం కాలేదు. భరతుడు తన సారధిని చూచి అయోధ్యా నగరము అలా ఎందుకు ఉంది అని అడిగాడు. “సారథీ! ఎల్లప్పుడూ స్త్రీపురుషుల సంచారముతో సందడిగా ఉండే అయోధ్యానగరము ఇప్పుడు నిశ్వబ్దముగా ఉందేమి? ఎక్కడా రధములు వాహనములు కనపడటం లేద...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 70)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము డెబ్బదవ సర్గ భరతుడు తనకు వచ్చిన కల గురించి తన స్నేహితునికి చెబుతున్న సమయంలో అయోధ్యనుండి వచ్చిన దూతలు భరతుని వద్దకు వచ్చారు. కేకయ రాజును కలుసుకున్నారు. కేకయ రాజు కుమారుడు యుధామన్యుని కలుసుకున్నారు. అయోధ్యనుండి తెచ్చిన కానుకలు వారికి సమర్పించారు. కేకయ రాజు అనుమతితో భరతునితో ఇలా అన్నారు. “రాజకుమారా! తమ కులగురువు వసిష్ఠుడు, తక్కిన గురువులు తమరి కుశలము అడగమని చెప్పారు. వసిష్ఠుల వారికి నీతో అత్యవసరంగా చర్చించవలసిన అవసరము ఉన్నదట. అందుకని తమరిని వెంటనే అయోధ్యకు బయలుదేరి రమ్మని చెప్పారు. దూతలు వసిష్ఠుడు చెప్పినట్టు చెప్పారు. భరతుడు ఆ దూతలకు కానుకలు ఇచ్చి సత్కరించాడు. “దూతలారా! నా తండ్రి దశరథుడు క్షేమంగా ఉన్నాడా. నా అన్న రాముడు, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారా! రాముని తల్లి కౌసల్య ఆరోగ్యంగా ఉన్నదా! లక్ష్మణ, శత్రుఘ్నుల తల్లి సుమిత్రాదేవి క్షేమంగా ఉన్నదా! స్వాతిశయము కలదీ, ఎల్లప్పుడూ తన సుఖము మాత్రమే చూచుకొనేదీ, కోపస్వభావము కలదీ, గర్విష్టి అయిన మా తల్లి కైక క్షేమంగా ఉన్నదా! మా అమ్మ నాతో చెప్పమని ఏమైనా సమాచారము పంపినదా! " అని ఆతురతగా అడిగాడు భరతుడు. ఆ మాటలకు దూతలు ఇలా...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 69)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము అరువది తొమ్మిదవ సర్గ అయోధ్యనుండి వచ్చిన దూతలు భరత శత్రుఘ్నులు ఉన్న నగరంలో ప్రవేశించిన రాత్రి, భరతునికి ఒక చెడ్డ కల వచ్చింది. అదీ తెల్లవారు జామున వచ్చింది. మరునాడు భరతుని మనస్సు అంతా వ్యాకులంగా ఉండింది. స్నేహితులతో వినోద సంభాషణలలో పాలుపంచుకోలేక పోయాడు. విదూషకుల హాస్యపు మాటలకు స్పందించడంలేదు. మనసంతా వికలమయింది. ఇది చూచి ఒక స్నేహితుడు భరతుడు అలా విషాదంగా ఉండటానికి కారణం అడిగాడు. అప్పుడు భరతుడు తన మనసులో మాట ఈ విధంగా చెప్పాడు.  "మిత్రమా! ఈ రోజు నాకు ఒక చెడ్డ కల వచ్చింది. నా తండ్రి దశరథుడు ఒళ్లంతా మట్టికొట్టుకొని, వెంట్రుకలు విరబోసుకొని, ఆవు పేడ ఉన్న గుంటలో పడిపోయినట్టు కలవచ్చింది. అలా పడ్డ నా తండ్రి నూనె తాగుతున్నాడు. తరువాత నువ్వులు కలిసిన అన్నం తింటున్నాడు. తరువాత తలవంచుకొని నూనెలో మునిగి పోయాడు.  మిత్రమా! ఇంకా నాకు సముద్రము ఎండిపోయినట్టు గానూ, చంద్రుడు నేలమీద పడిపోయినట్టుగానూ, పట్టపగలే చీకట్లు కమ్మినట్టుగానూ, అయోధ్యలో ఉన్న రాజులు ఊరేగే ఏనుగునకు దంతములు విరిగినట్టుగానూ, ప్రతి ఇంట్లోనూ వెలిగే అగ్నులు ఆరిపోయినట్టుగానూ, భూకంపము వచ్చినట్టుగానూ, నాకు కల...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 68)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము అరువది ఎనిమిదవ సర్గ ఋషులు మాట్లాడిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్నాడు వసిష్ఠుడు. మంత్రులతో ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. “మహా ఋషులారా! ప్రస్తుతము భరత శత్రుఘ్నులు వారి మేమమామగారి ఇంట ఉన్నారు. వారిని తీసుకొని వచ్చుటకు వెంటనే దూతలను పంపెదను. దశరథుడు, తాను చనిపోకముందే భరతునికి రాజ్యము ఇస్తానని కైకకు మాట ఇచ్చిఉన్నాడు. కాబట్టి రాజ్యము ఎవరిది అన్న సమస్య తలెత్తదు. భరతుడు రాగానే అతనికి పట్టాభిషేకము జరిపించెదము." అని చెప్పాడు. వసిష్ఠుని ఆదేశము ప్రకారము సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు, నందుడు అనే దూతలను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు. "దూతలారా! జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే భరతుని వద్దకు వెళ్లండి. అతనికి దశరథుని మరణ వార్త తెలియనీయకండి. మీ మొహంలో ఎక్కడా విషాద చ్ఛాయలు కనపడకూడదు. నా మాటగా భరతునికి ఇలా చెప్పండి. “పురోహితులు అందరూ నీ హితము కోరుతున్నారు. నీతో ఒక అవసరమైన పని ఉన్నది. నీవు వెంటనే అయోధ్యకు రావలెను." అని చెప్పండి. రాముడు వనవాసమునకు వెళ్లిన విషయము ఏమాత్రము భరతునికి తెలియనీయకండి. మీరు వెళ్లునపుడు కేకయ రాజుకు భరతునికి శత్రుఘ్నునికి అనేక కాన...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 67)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము అరువది ఏడవ సర్గ మరునాడు సూర్యోదయము అయింది. మంత్రులు, బ్రాహ్మణులు, పురప్రముఖులు సభకు వచ్చారు. ఆ సభకు మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు మహామునులు కూడా వచ్చారు. వారందరూ రాజ పురోహితుడైన వసిష్ఠుని చూచి వేర్వేరుగా ఇలా అన్నారు. “నిన్న రాత్రి మహారాజు దశరథుడు చనిపోయాడు. పెద్దకుమారుడు రాముడు ఇక్కడ లేడు. అరణ్యములకు వెళ్లాడు. లక్ష్మణుడు కూడా రాముని అనుసరించాడు. మిగలిన ఇద్దరు కుమారులు వారి మాతామహుని ఇంటిలో (తాతగారి ఇంటిలో) ఉన్నారు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. రాజులేని రాజ్యములో అన్ని రకములైన అనర్థములు జరుగుతాయి. యజ్ఞయాగములు జరగవు. పుణ్యకార్యములు జరగవు. అరాచకము ప్రబలుతుంది. రాజు లేని రాజ్యములో న్యాయము చెప్పేవారు ఉండరు. తప్పుచేసిన వారిని శిక్షించే వారు ఉండరు. ఆస్తి తగాదాలు పరిష్కారం కావు. రాజు లేని రాజ్యములో గోవులకు రక్షణ ఉండదు. వ్యవసాయము కుంటుపడుతుంది. రాజులేని రాజ్యములో విద్యాలయాలు, యుద్ధ విద్యను బోధించు శిక్షణాలయాలు మూతబడతాయి. సైన్యము నిర్యీర్యము అవుతంఉది. రాజు లేని రాజ్యములో ప్రజలకు...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 66)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము అరువది ఆరవ సర్గ కౌసల్య తన భర్త దశరథుని తలను ఒడిలో పెట్టుకొని దు:ఖిస్తూ ఉంది. తలపైకెత్తి కైకను చూచింది. ఆమె కోపం కట్టలు తెంచుకొంది. “ఏమ్మా! కైకా! నీ కోరిక తీరిందా! నీ మనస్సు శాంతించిందా! ఇంక నువ్వు, నీ కొడుకు, ఈ అయోధ్యను ఏలుకోండి. మీకు అడ్డు వస్తాడని నా కొడుకును అడవులకు పంపావు. ఇప్పుడు మొగుడిని చంపావు. ఇంక నీకు అడ్డేముంది. నా కొడుకు రాముడు నన్ను విడిచి అడవులకు వెళ్లిపోయాడు. నా భర్త నన్ను విడిచి స్వర్గానికి పోయాడు. ఇంక నాకు ఎవరు మిగిలారు. ఎవరి కోసం బతకాలి. నీ లాంటిది తప్ప మొగుడు లేకుండా ఏ స్త్రీ బతకలేదు. బతకడానికి ఇష్టపడదు కూడా. ఓ కైకా! నీవు ఏం చేస్తున్నావో నీకు తెలిసే చేసావా! లేక ఆ గూని దాని మాటలు విని ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! ఏది ఏమైనా మాకు మా భర్తను దూరం చేసావు. ఓ కైకా! నీవు మాకే కాదు. జనక మహారాజును కూడా దు:ఖములో ముంచావు. తన కూతురు అడవులలో ఎన్ని కష్టములు పడుతున్నదో అని జనకుడు ఎంతదు:ఖిస్తున్నాడో కదా! ఇంతకూ రామునికి తన జనకుని మరణ వార్త ఎలా తెలుస్తుంది. తన తల్లి అనాధ అయింది అని ఎవరు చెబుతారు. రాముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతారు! నా భర్త రాముని గూర్చి, సీతను ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 65)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము అరువది ఐదవ సర్గ మరునాడు తెల్లవారింది. రోజూ మాదిరి వంది మాగధులు దశరథ మహారాజును నిద్రలేపడానికి వచ్చారు. వారు దశరథుని గూర్చి మంగళకరములైన వాక్యములు పలుకుతూ స్తోత్రపాఠములు చదువుతున్నారు. గాయకులు దశరథుని వంశ చరిత్రను గానం చేస్తున్నారు. వారి స్తోతపాఠములతో కౌసల్యా మందిరము మారుమోగిపోయింది. పరిచారికలు దశరథుని నిద్రలేపడానికి ఆయన పడుకున్న శయ్య దగ్గరకు వచ్చారు. మరి కొంత మంది మంచి గంధము కలిపిన నీరుతో నిండిన కుండలు తీసుకొని వచ్చారు. వారు దశరథుని శయ్యకు కొంచెం దూరంలో నిలబడ్డారు. సాధారణంగా మహారాజు ఈపాటికి నిద్రలేచేవారు. కాని ఇన్ని స్తోత్రపాఠములు చదువుతున్నా ఆయన అటు ఇటు కూడా కదలడం లేదు. వారికి అనుమానం కలిగింది. కాని అలాగే నిలబడి పోయారు. ఇంతలో కొంతమంది వృద్ధ పరిచారికలు, దశరథుని వద్ద చనువు ఉన్న వాళ్లు, అక్కడకు వచ్చారు. విషయం తెలుసుకున్నారు. వారు దశరథుని శయ్య దగ్గరకువెళ్లారు. ఆయనను సున్నితంగా తట్టి లేపడానికి ప్రయత్నించారు. ఆయనలో చలనం లేదు. వారికి భయం వేసింది. వణుకుతూ అలాగే నిలబడిపోయారు. వారి మనస్సు కీడు శంకించింది. మహారాజు మరణవార్తను బయటకు చెప్పడానికి వారికి ధైర్యము చాలడం లేద...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది నాల్గవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 64)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము అరువది నాల్గవ సర్గ “కౌసల్యా! ఆ ప్రకారంగా నేను నా ప్రమేయం లేకుండానే ఆ ముని కుమారుని మరణానికి కారకుడిని అయ్యాను. అప్పుడు నాకు ఏంచెయ్యాలో తోచలేదు. కొంచెం సేపు ఆలోచించాను. అప్పుడు నాకు ఒక ఉపాయము తట్టింది. నేను కుండ నిండుగా స్వచ్ఛమైన జలమును తీసుకొని ఆ ముని కుమారుడు చెప్పిన మార్గములో నడుచుకుంటూ వారి ఆశ్రమమునకు చేరుకున్నాను. ఆ ఆశ్రమములో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. వారు అంధులు. లేవలేకుండా ఉన్నారు. ఎవరైనా లేచి నడిపిస్తే గానీ నడవలేకున్నారు. వారే ఆ మునికుమారుని తల్లి తండ్రులు అని అనుకున్నాను. వారు తమ కుమారుని రాక కోసరము ఎదురు చూస్తున్నారు.తమ కుమారుని మంచి తనము గురించి మాట్లాడు కుంటున్నారు. కాని వారి కుమారుడు ఇంక ఎప్పటికీ తిరిగి రాడు అని తెలిస్తే వారి గుండె ఎలా బద్దలవుతుందో తల్చుకుంటేనే నా హృదయం తల్లడిల్లిపోయింది. ఆ ముని కుమారుని చంపిన దు:ఖము కంటే ఆవృద్ధ దంపతులను చూచిన తరువాత కలిగిన దుఃఖము రెట్టింపు అయింది. నేను వారికి దగ్గరగా వెళ్లాను. నా అడుగుల చప్పుడు విన్ని ఆ వృద్ధులు నన్ను వారి కుమారుడు అని అనుకున్నారు. “కుమారా! ఏమి నాయనా. నీళ్లు తీసుకురావడానికి ఇంత ఆలస్యం అయింది....