Posts

Showing posts from July, 2024

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 52)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఏబది రెండవ సర్గ ఆ తాపసి అనుమతి పొందిన ఆ వానరులు అక్కడ ఉన్న మధురమైన ఫలములను, తినుబండారములను తృప్తిగా తిని, మధురమైన పానీయములను సేవించి భుక్తాయాసంతో పడుకున్నారు. తాపసి తమను అడిగిన విషయం మర్చిపోయారు. అది చూచి ఆ తాససి స్వయంప్రభ వారి దగ్గరకు వచ్చి “మీ ఆకలి తీరినదా! విశ్రాంతి తీసుకున్నారా! ఇప్పుడైనా మీ గురించి నాకు చెబుతారా!" అని అడిగింది. అప్పుడు హనుమంతుడు స్వయంప్రభతో తమ గురించి చెప్పసాగాడు. “ఓ మాతా! నా పేరు హనుమంతుడు. మాది కిష్కింధ. వీరంతా నా సహచరులు. మేము వానరులము. అయోధ్యను పరిపాలించు మహారాజు దశరథుని కుమారుడు రాముడు. ఆయన తన భార్య సీతతో వనవాసము చేస్తున్నాడు. దండకారణ్యములో, జనస్థానములో, రామలక్ష్మణులు ఆశ్రమములో లేని సమయమున, రావణుడు అనే రాక్షసుడు ఒంటరిగా ఉన్న సీతను అపహరించాడు. రాముడు మా వానర రాజు సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు. సీతను వెతికిపెట్టమని సుగ్రీవుని అడిగాడు. ఆ సుగ్రీవుని ఆజ్ఞమేరకు, వాలి కుమారుడు అంగదుని నాయకత్వంలో, అగస్త్యుడు సంచరించిన ఈ దక్షిణ దిక్కున మేము సీతకోసరం, రావణుని కోసరం వెదుకు తున్నాము. అలా వెదుకుతుంటే మాకు ఆకలి దప్పిక వేసాయి. ఈ గుహల...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబది ఒకటవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 51)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఏబది ఒకటవ సర్గ హనుమంతుడు ఆ తాపసితో ఇంకా ఇలా అన్నాడు. "మాతా! మేము ప్రస్తుతము ఆకలి దప్పులతో బాధ పడుతున్నాము. ఈ బిలములో చీకటిలో యోజన దూరం నడిచాము. అందరమూ బాగా అలసిపోయి ఉన్నాము. ఈ బిలములో జలము దొరుకుతుందని ఆశతో వచ్చాము. కాని ఇక్కడ ఇన్ని పదార్థములను చూడగానే మాకు ఆశ్చర్యం కలిగింది. ఈ బంగారు గృహములు. ఈ వృక్షములు ఎవరివి? ఎలా పుట్టాయి. మీరే సృష్టించారా! లేక మరి ఎవ్వరి తపోబలము వలన ఉద్భవించాయా! మాకు ఏమీ అర్థం కావడం లేదు. మాకు వివరంగా చెప్పండి" అని వినయంగా అడిగాడు హనుమంతుడు. హనుమంతుని మాటలు విన్న ఆ తాపసి హనుమంతునితో ఇలా చెప్పింది. “ఓ వానరములలో గొప్పవాడా! మయుడు అనే దానవుడు ఉన్నాడు. అతనికి అన్ని మాయలు తెలుసు. ఆ మయుడు పూర్వము దానవులకు శిల్పిగా ఉండేవాడు. ఈ భవనములను ఆయనే నిర్మించాడు. ఆ మయుడు ఈ గుహలో వేలకొలది సంవత్సరములు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి, ఆయన వలన వరములను పొందాడు. ఆ మయుడు ఇక్కడ ఈ భవనములను నిర్మించుకొని ఇక్కడే సుఖంగా కాలం గడిపాడు. ఆ మయుడు హేమ అనే దేవ కన్య ప్రేమలో పడ్డాడు. ఆ విషయం తెలిసిన ఇంద్రుడు తన వజ్రాయుధముతో ఆ మయుని చంపాడు. మయుడు మరణించిన తరువ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఏబదియవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 50)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఏబదియవ సర్గ హనుమంతుడు, తారుడు, అంగదుడు తమ తమ వానర సమూహములతో కలిసి వింధ్య పర్వత గుహలను వెదుకు తున్నారు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైన్దుడు, ద్వివిదుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, తారుడు, జట్టు జట్టుగా విడిపోయి ఆ పర్వత గుహలను వెదుకు తున్నారు. అలా వెదుకుతూ వారు ఒక దానవునిచేత రక్షింపబడుతున్న ఋక్షబిలము అనే గుహను చూచారు. అప్పటికే వారికి బాగా ఆకలిగా, దాహం వేస్తూ ఉంది. ఎక్కడా నీటి చుక్క దొరకలేదు. ఆహారము దరిదాపుల్లో దొరకడం లేదు. ఆ సమయంలో నీటిలో స్నానం చేసి ఒళ్లంతా తడి తడిగా నీళ్లు కారుతున్న చక్రవాక పక్షులు ఆ గుహలో నుండి బయటకు ఎగురుతూ రావడం వారికి కనిపించింది.. వారు ఆ బిలములోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. కాని వారికి ఎటునుండి వెళ్లాలో తెలియడం లేదు. ఆ బిలమునకు ద్వారము కనిపించలేదు. అప్పుడు హనుమంతుడు మిగిలిన వానరవీరులతో ఇలా అన్నాడు. “మనము అందరమూ సీత కోసం వెదికి వెదికి అలసిపోయినాము. కాని సీత జాడ తెలియలేదు. ఇక్కడ వృక్షములు పచ్చగా ఉన్నాయి. నీటిలో తడిసిన పక్షులు బయటకు వస్తున్నాయి. ఈ బిలము లోపల నీటి సరోవరము ఉండవచ్చును. మనము ఈ బిలము లోనికి ప్రవేశ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది తొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 49)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము నలుబది తొమ్మిదవ సర్గ ఎంత వెతికినా సీత కనపడలేదని వానరులందరూ దీనంగా ఆ చెట్టుకింద కూర్చున్నారు. అంగదుడు వారి వద్దకు పోయి వారికి ఉత్సాహకరమైన మాటలు చెప్పి వారిని మరలా సీతను వెదకడానికి సమాయత్తం చేసాడు. “వానర వీరులారా! మనము అందరమూ పర్వతములు, వనములు, కొండలు గుహలు అన్నీ వెదికాము. కానీ సీత జాడ కానీ, రావణుని నివాసము కానీ కనిపెట్టలేకపోయాము. మనము బయలు దేరి చాలా కాలము అయినది. సుగ్రీవుడు ఇచ్చిన సమయం అయిపోవచ్చింది. సీత జాడ తెలియలేదు. అసలే సుగ్రీవుడు చండశాసనుడు. చెప్పిన సమయానికి తిరిగా రాకపోతే మనకు మరణ దండన తప్పదు. కాని మనము సుగ్రీవునికన్నా రామునికే ఎక్కువ భయపడాలి. ఎందుకంటే రాముడు సీతావియోగంతో దు:ఖిస్తున్నాడు. కాబట్టి దిగులు చెందకుండా వెదకండి. మనకు తప్పకుండా సీత జాడ దొరుకుతుంది. కార్యసిద్ధి కలగాలంటే నేర్పు, ఓర్పు, ఉత్సాహము ముఖ్యమైన లక్షణములు. కాబట్టి మనము రెట్టించిన ఉత్సాహముతో వెదుకుదాము. తప్పకుండా మనకు సీత జాడ లభిస్తుంది. నాకు తోచినది నేను చెప్పాను. తరువాత మీ ఇష్టము.” అని అన్నాడు. అంగదుడు. అప్పటికే బాగా అలసిపోయి ఉన్న గంధమాదనుడు ఇలా అన్నాడు. “అంగదుడు బాగా చెప్పాడు. మనము...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది ఎనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 48)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము నలుబది ఎనిమిదవ సర్గ అందరూ అన్ని దిక్కులకు వెళితే అంగదుని నాయకత్వంలో హనుమంతుడు మొదలగు వానర వీరులు దక్షిణదిక్కుగా బయలు దేరారు. వారి వెదకడం వింధ్యపర్వతముల వద్దనుండి మొదలయింది. వానర వీరులందరూ వింధ్యపర్వతముల మీద ఉన్న శిఖరములను, గుహలను, అరణ్యములను, నదులను, సరోవరములను అన్నింటినీ వెతికారు. కాని సీత జాడ కనపడలేదు. కాని వారు తమ పట్టుదల వీడలేదు. అలా వెదుకుతూనే ఉన్నారు. ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు మారుతూ వెతుకుతున్నారు. ఆ ప్రకారంగా వెతుకుతుంటే ఒక చోట చెట్లకు పండ్లు కానీ కాయలు కానీ లేవు. అక్కడ ఏ విధమైన జంతువులు లేవు. నిర్మానుష్యంగా ఉంది. సందడి లేదు. జంతువుల అరుపులు వినిపించడం లేదు. పూల మొక్కలు లేవు. ఓషధీ లతలు లేవు. సరోవరములు లేవు. నీరు లేదు. కాని అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండే వాడు. ఆయన పేరు కండు మహర్షి. ఆయన నిత్యసత్యవ్రతుడు. ధర్మ తత్పరుడు. ఆయన కుమారుడు, పది సంవత్సరముల బాలుడు, ఆ అరణ్యములో మరణించాడు. కండు మహర్షికి కోపం వచ్చింది. ఆ అరణ్యము మనుషులకు కానీ, జంతువులకు కానీ, పక్షులకు కానీ, వృక్షములకు కానీ జీవించడానికి యోగ్యము కాకుండా శపించాడు. అటువంటి ప్రదేశము...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 47)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము నలుబది ఏడవ సర్గ సుగ్రీవునిచే ఆజ్ఞాపింప బడ్డ వానర వీరులు నలుదిక్కులకు వెళ్లారు. సుగ్రీవుడు చెప్పిన చోటులన్నీ వెదికారు. పర్వతములు, నదులు, సరస్సులు, అరణ్యములు, కొండ గుహలు గాలించారు. ఎక్కడా సీత గానీ, రావణుడు గానీ కనపడలేదు. సుగ్రీవుడు విధించిన మాసము రోజులు గడిచిపోయినవి. కాని సీత జాడ తెలియలేదు. అందరూ మరలా కిష్కింధకు చేరుకున్నారు. ప్రసవణ పర్వతము మీద ఉన్న సుగ్రీవుని వద్దకు వచ్చారు. తూర్పుదిక్కుకు పోయిన వినతుడు, పడమట దిక్కుకు పోయిన సుషేణుడు, ఉత్తర దిక్కుకు పోయిన శత బలుడు తమ తమ వానర సేనలతో తిరిగి వచ్చారు. రాముని తో కూర్చుని ఉన్న సుగ్రీవుని వద్దకు పోయి ఇలా విన్నవించుకున్నారు. “రాజా! మీరు ఆదేశించినట్టు మేము అందరమూ అన్ని దిక్కులకూ పోయి నదులు, పర్వతములు, అరణ్యములు, గుహలు, అన్నీ వెదికాము. వెదికిన చోటనే మరలా మరలా వెదికాము. కానీ సీత జాడ తెలియలేదు. కాని మన అంగదుని నాయకత్వంలో హనుమంతుడు మొదలగు వారు ఇంకా తిరిగి రాలేదు. ఈ మూడు దిక్కులలో సీత కనపడలేదు. కాబట్టి తప్పకుండా దక్షిణ దిక్కున ఆమె జాడ తెలియ గలదు. బుద్ధిమంతుడైన హనుమంతుడు సీత జాడ కనుగొనగలడు." అని వినయంగా చెప్పారు. శ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 46)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము నలుబది ఆరవ సర్గ సుగ్రీవుడు వానర వీరులతో చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు రాముడు. రామునికి ఒక సందేహం కలిగింది. కిష్కింధలో ఉన్న సుగ్రీవునికి భూమండలం గురించిన ఇంతటి పరిజ్ఞానము ఎలా కలిగింది అని విస్మయం కలిగింది. సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు. “మిత్రమా! నీవు వానర నాయకులతో వారు ఎక్కడెక్కడ వెదకాలి అన్న విషయాన్ని ఎంతో విపులంగా చెప్పావు కదా! నీకు ఈ భూమండలం లోని వివిధ ప్రదేశాల గురించి ఎలా తెలుసు?" అని అడిగాడు. సుగ్రీవుడు ఇలా చెప్పసాగాడు. “రామా! ఇదివరకు నీకు వాలి, దుందుభి సంగతి చెప్పాను కదా. మహిష రూపములో వచ్చిన దుందుభి అనే దానవుని తరుముతూ నా అన్న వాలి వెళ్లాడు. దుందుభి మలయపర్వతము గుహలో ప్రవేశించాడు. వాలి కూడా దుందుభిని తరుముతూ ఆ గుహలో ప్రవేశించాడు. నేను గుహద్వారము వద్ద నా అన్న వాలి కోసరము వేచి ఉన్నాను. ఒక సంవత్సరము గడిచిపోయినది. వాలి బయటకు రాలేదు. కాని ఆ గుహ లో నుండి రక్తము ప్రవాహంలాగా ప్రవహిం చింది. ఆ దుందుభి నా అన్న వాలిని చంపేసాడు అని దుఃఖించాను. నాకు ఆ దుందుభి మీద కోపం వచ్చింది. నా అన్న వాలిని చంపిన వాడు బయటకు రాకూడదు. ఆ గుహలోనే చావాలి అనే ఉద్దేశంతో ఆ గుహ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది ఐదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 45)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము నలుబది ఐదవ సర్గ సీతను వెదకడానికి నాలుగు దిక్కులకు ప్రయాణమైన వానర సేనలు ఉత్సాహంతో బయలుదేరుతున్నాయి. ఎవరికి వారు తామే సీత జాడ కనుక్కోగలము అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. శతబలుడు తన సేనలతో ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. వినతుడు తూర్పు దిక్కుగా వెళ్లాడు. హనుమంతుడు, తారుడు, అంగదునితో కలిసి దక్షిణ దిక్కుగా వెళ్లాడు. సుషేణుడు పశ్చిమ దిక్కుగా వెళ్లాడు. అందరూ అన్ని దిక్కులకు ప్రయాణమయ్యారు. వానరులంతా తమ సహజసిద్ధమైన చపలత్వంతో అరుచుచూ, కేకలు పెట్టుచూ, ఎగురుతూ వెళుతున్నారు. వారంతా “ఆ దుర్మార్గుడు రావణుని చంపి సీతను తీసుకొని వస్తాము” అని శపధాలు చేస్తూ వెళుతున్నారు. మరికొందరైతే “ఆ రావణుని చంపడానికి ఇంత మంది కావాలా! నేను ఒక్కడినే రావణుని చంపుతాను. రాక్షసులందరినీ చంపుతాను, సీతను తీసుకొని వస్తాను" అని ప్రగల్భాలు పలుకుతున్నాడు. మరి కొందరు “మీరంతా ఇక్కడే ఉండండి. నేను ఒక్కడినే వెళ్లి సీత పాతాళంలో ఉన్నా సరే తీసుకొని వస్తాను.” అని జబ్బలు చరుస్తున్నాడు. మరి కొందరు “నేను పెద్ద పెద్ద చెట్లనే పెకలిస్తాను. కొమ్మలు విరుస్తాను. పర్వతాలను నుగ్గునుగ్గు చేస్తాను. సముద్రాలను ఇంకింపచేస్త...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది నాల్గవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 44)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము నలుబది నాలుగవ సర్గ సుగ్రీవుడు వానర ప్రముఖులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపడాన్ని నిశితంగా చూస్తున్నాడు రాముడు. ఇంతలో దక్షిణ దిక్కుగా వెళ్లడానికి నియమించిన వానర ప్రముఖులలో ఒకడుగా ఉన్న హనుమంతుని పిలిచి సుగ్రీవుడు ఇలా అన్నాడు. "ఓ హనుమా! నీవు బాగా ఎగురగలవు. భూమి మీద గానీ, ఆకాశంలో గానీ, నీ మార్గానికి అడ్డు లేదు. పైగా నీకు దేవ, గంధర్వ, నాగ, నరలోకముల గురించి బాగుగా తెలియును. నీవు గమన వేగంలో నీ తండ్రి వాయుదేవునితో సమానుడవు. ఆ లోకంలో ఉన్న ప్రాణులలో నీతో సమానమైన ప్రాణి లేదు. కాబట్టి సీతను అన్వేషించడంలో ఏది మంచి మార్గమో నీవే ఆలోచించు. ఎందుకంటే, వానరులలో కల్లా బాగుగా ఆలోచించగల సమర్థుడివి నీవే! నీకు అమితమైన దేహబలము, బుద్ధి బలము, దేశకాలములను బట్టి ప్రవర్తించు తెలివితేటలు నీకు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ కార్యము నిర్వహించుటకు నీవే సమర్థుడివి." అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మాటలు విని రామునికి కూడా హనుమంతుని మీద గొప్ప నమ్మకం కలిగింది. పైగా హనుమంతుడు దక్షిణ దిక్కుగా పోతున్నాడు. రావణుడు కూడా సీతను దక్షిణ దిక్కుగా తీసుకువెళ్లాడు అని జటాయువు వలన తెలిసి...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది మూడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 43)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము నలుబది మూడవ సర్గ పడమట దిక్కుకు సుషేణుని పంపిన తరువాత, శరబలుడు అనే వానర శ్రేష్ఠుని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు. “శరబలా! నీ మంత్రులతోనూ, ఒక లక్షమంది వానరులతోనూ మీరు ఉత్తర దిక్కుగా బయలుదేరండి. ఉత్తర దిక్కు పూర్తిగా సీత కోసం వెతకండి. మహాత్ముడైన రాముడు నాకు ఎంతో ఉపకారము చేసాడు. మనము సీతను వెతికి ఆయన వద్దకు చేరిస్తే మనము కూడా రామునికి ప్రత్యుపకారము చేసి ఋణము తీర్చుకున్నవారము అవుతాడు. రామ కార్యము నిర్వర్తించినందుకు మన జన్మలు కూడా సఫలమవుతాయి. మీరు అడవులలో, పర్వతములమీద, కొండ గుహలలోనూ వెతకండి. ఉత్తర దిక్కుగా ఉన్న మ్లేచ్ఛ, పుళింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, బాహ్లిక, ఋషిక, పౌరవ, టంకణ,(టిబెట్ కావచ్చు) చీన, పరమచీన,(నేటి చైనా కావచ్చు) నీహార, వరద మొదలగు దేశములలో వెదకండి. తరువాత మీరు సోమాశమమునకు, కాల పర్వతమునకు వెళ్లండి. ఆ పర్వతము అణువు అణువునా సీత కోసం వెదకండి. కాల పర్వతమును దాటి సుదర్శన పర్వతమునకు వెళ్లండి. దాని తరువాత దేవసఖ అనే పేరుగల పర్వతము ఉంది. ఆ పర్వతము మీద ఉన్న అరణ్యలలో సీతకొరకు వెదకండి. దేవసఖ పర్వతమునకు నూరు యోజనముల దూరంలో శూన్యప్రదేశమ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 42)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము నలుబది రెండవ సర్గ కొంతమంది వానరప్రముఖులను దక్షిణ దిక్కుకు పంపిన తరువాత తార తండ్రి, తనకు మామగారు అయిన సుషేణుని నాయకత్వములో కొంతమంది వానరులను పశ్చిమదిక్కుగా పంపాడు. తన కన్నా పెద్ద వాడు తనకు మామగారు అయిన సుషేణునికి నమస్కరించి సుగ్రీవుడు ఇలా అన్నాడు. “మీ నాయకత్వంలో రెండులక్షల వానరములను తీసుకొని మీరు పశ్చిమ దిక్కుగా వెళ్లండి. మీకు సాయంగా అర్చిష్మంతుడు, అర్చి, మాల్యుడు ఉంటారు. మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్రచిత్ర దేశములలో సీతకోసం వెదకండి. అక్కడి నుండి పశ్చిమ సముద్రము వైపుగా వెళ్లండి. పశ్చిమ సముద్ర తీరంలో ఉండే పర్వతములను గుహలను, అరణ్యములను సీత కోసరం, రావణుని కోసరం వెదకండి. సముద్రతీర పట్టణములైన మురచీ, జటాపురము, అవంతీనగరము, అంగలేపాపురము, మొదలగు నగరములను వెదకండి. అక్కడినుండి పడమరగా వెళ్లండి. అక్కడ సింధునది సముద్రంలో కలిసేచోట ఒక పెద్ద పర్వతము ఉంది. దాని పేరు సోమగిరి. దానిమీద సింహములు, ఏనుగులు నివసిస్తూ ఉంటాయి. మీరు ఆ పర్వతశిఖరమును ఆమూలాగం వెదకండి. తరువాత మీరు పశ్చిమ సముద్రములో ఉన్న పారియాత్ర పర్వతమునకు వెళ్లండి. ఆ పర్వతశిఖరము మీద ఇరువది నాలుగుకోట్లమంది గంధర్వులు ని...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబది ఒకటవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 41)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము నలుబది ఒకటవ సర్గ ఆ ప్రకారము సుగ్రీవుడు వానరులను తూర్పుదిక్కు కుపంపిన తరువాత, మరి కొంత మంది వానరులను దక్షిణదిక్కుగా పంపాడు. దక్షిణ దిక్కుకు పంపబడిన వానరులలో ప్రముఖులైన అగ్నికుమారుడు నీలుడు, వాయుపుత్రుడు హనుమంతుడు, బ్రహ్మదేవుని కుమారుడైన జాంబవంతుడు, సుహోతుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, సుషేణుడు, వృషభుడు, మైందుడు, ద్వివిదుడు, విజయుడు, గంధమాధనుడు, అగ్నిపుత్రులైన ఉల్కాముఖుడు, అనంగుడు, వాలి కుమారుడు అంగదుడు వెళ్లారు. ఆ వానర వీరులందరికీ వాలి కుమారుడు అంగదుని నాయకుడుగా చేసాడు సుగ్రీవుడు. అంగదుని నాయకత్వంలో వానరవీరులు దక్షిణ దిక్కుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. దక్షిణ దిక్కున ఉన్న ప్రదేశముల గురించి సుగ్రీవుడు ఈ విధంగా చెప్పసాగాడు. “ఓ వానవీరులారా! దక్షిణ దిక్కున వింధ్యపర్వతము, నర్మదానది, గోదావరీ నది, కృష్ణవేణి అనేమహానది, వరదానది, మేఖల దేశము, ఉత్కలదేశము, దశార్ణదేశము, ఆబ్రవంతి, అవంతి నగరములు ఉన్నాయి అక్కడ అంతా వెదకండి. ఇంకా విదర్భ, ఋష్టిక, మత్స్య, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ దేశములలో వెదకండి. ఇంకా దట్టమైన దండకారణ్యము, గోదావరీ తీరము పూ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - నలుబదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 40)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము నలుబదవ సర్గ వానర సేనానాయకులకు ఆ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చాడు సుగ్రీవుడు. తరువాత రాముని చూచి ఇలా అన్నాడు. "ఓ రామా! ఎంతో బలవంతులు, కామరూపులు, ఎక్కడికైనా క్షణంలో పోగలవారూ అయిన వానరులు కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వీరంతా దైత్యులను, దానవులను, రాక్షసులను సమర్ధవంతంగా ఎదిరించగల సామర్థ్యము కలవారు. ఓ రామా! ఈ వానరులు నేల మీద, నీటి మీద, ఆకాశంలోనూ సంచరించగల సమర్ధులు. పైగా వీరికి అలసట అనేది లేదు. పూర్వము ఎన్నోయుద్ధములలో పాల్గొన్న అనుభవము కలవారు. వీరంతా ఇప్పుడు నీ ఆజ్ఞల కోసరము ఎదురుచూస్తున్నారు. నీవు ఏ పని చెబితే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏమి చేయాలో చెప్పండి. మన సైనికులకు ఆజ్ఞలు ఇవ్వండి. ఏమి ఆజ్ఞలు ఇవ్వాలో నాకు తెలిసినా, అవి నీ నోటి నుండి వస్తే బాగుంటుంది.” అని అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “మిత్రమా! సుగ్రీవా! ప్రస్తుతము మనము సీత గురించి అన్వేషించాలి. ఆమె జీవించి ఉన్నదా లేక మరణించినదా! జీవించి ఉంటే ఎక్కడ ఉంది! ఆ రావణుడు సీతను ఎక్కడ దాచి ఉంచాడు? ఈ విషయములను మనము కనుక్కోవాలి. సీతను గురించి, రావణుని నివాసము గురించి, సీతను ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 39)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ముప్పది తొమ్మిదవ సర్గ రెండు చేతులూ జోడించి తనముందు నిలబడి పైవిధంగా పలికిన సుగ్రీవుని చూచి రాముడు సంతోషంతో అతనిని కౌగలించుకున్నాడు. “చంద్రుడు వెన్నెల కురిపించినట్టు నీ వంటి మిత్రుడు తన చర్యలతో నాకు ఆనందము కల్గిస్తున్నాడు అనడంలో ఆశ్చర్యం ఏముంటుంది? నీ గురించి నాకు బాగా తెలుసు. ఏదన్నా ఒక కార్యము తలపెడితే, దానిని నిర్విఘ్నముగా నెరవేరుస్తావు. నీ సాయం ఉంటే నేను యుద్ధములో శత్రువులను అందరినీ జయిస్తాను. ఆ రావణుడు తనకు వినాశ కాలము దాపురించి నా సీతను అపహరించాడు." అని అన్నాడు రాముడు. ఇంతలో భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్టు పెద్ద పెద్ద శబ్దములు వినిపించాయి. లక్షల కోట్ల సంఖ్యలో వానరములు అక్కడకు వస్తున్నాయి. ముందు వానర సేనానాయకులు నడుస్తూ ఉంటే వారి వెనక వానరాలు వస్తున్నాయి. లక్షకోట్లు వానరములతో వచ్చిన శతబలి అనే వానర వీరుడినిచూచాడు సుగ్రీవుడు. తరువాత వేల కోట్ల వానరములతో తార తండ్రి సుషేణుడు వచ్చాడు. రుమ తండ్రి కూడా వేయి కోట్ల వానరములతో వచ్చాడు. హనుమంతుని తండ్రి కేసరి వేల కోట్ల వానరములతో వచ్చాడు. గవాక్షుడు అనే వానర రాజు వేయి కోట్ల వానరములతో వచ్చాడు.  ధూమ్రుడు అనే భల్లూక ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 38)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ముప్పది ఎనిమిదవ సర్గ హిమాచలము నుండి వానరులు తెచ్చిన కానుకలు తీసుకొని వారిని పంపివేసాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు చేస్తున్న ప్రయత్నములను చూచి లక్ష్మణుడు తృప్తి చెందాడు. “ఓ సుగ్రీవా! ఇంక మనము రాముని వద్దకు పోవుదము. రాముడు మన రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు." అని అన్నాడు. “అవశ్యము లక్ష్మణా! అలాగే వెళ్లెదము." అని అన్నాడు సుగ్రీవుడు. తారను మిగిలిన స్త్రీలను లోపలకు పంపివేసాడు. తన అనుచరులకు పల్లకినీ తీసుకు రమ్మని ఆదేశించాడు. వెంటనే వానరులు అందమైన పల్లకిని తీసుకొని వచ్చారు. ఆ పల్లకిలో సుగ్రీవుడు, లక్ష్మణుడు ఎక్కారు. వంది మాగధులు స్తుతిస్తూ ఉండగా, అనుచరులు తెల్లని ఛత్రము పట్టి, వింజామరలు వీచుచుండగా, లక్ష్మణుడు, సుగ్రీవుడు కలిసి పల్లకిలో ఎక్కి రాముని వద్దకు వెళ్లారు. సుగ్రీవుడు పల్లకి దిగి, రాముని ఎదురుగా రెండు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. సుగ్రీవుని వెంట వచ్చిన వానర వీరులు కూడా అదేమాదిరి చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డారు. వారిని అందరినీ రాముడు మిత్రభావంతో చూచాడు. సుగ్రీవుడు రాముని పాదాల మీద పడి నమస్కరించాడు. రాముడు సుగ్రీవుని బుజాలు పట్టుకొని లేవ నెత్తాడు...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 37)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ముప్పది ఏడవ సర్గ లక్ష్మణుని మాటలు విని సుగ్రీవుని మనస్సు సంతుష్టి చెందింది. వెంటనే పక్కనే ఉన్న హనుమంతుని చూచి ఇలా అన్నాడు. “హనుమా! మహేంద్రపర్వతము మీద, వింధ్యపర్వతము మీద, కైలాస పర్వతము మీద, మందరపర్వతము మీద, నివసించు చున్న వానరము లందరినీ కిష్కింధలో సమావేశము కావాలని వర్తమానము పంపించు. అలాగే సముద్ర ప్రాంతములలో నివసించు వానరములను, పశ్చిమ దిక్కున ఉన్న ఆదిత్య పర్వతము మీద ఉన్న వానరములను, పద్మాచలము మీద ఉన్న వానరములను, అంజనా పర్వతము మీదున్న వానరములను, మేరు పర్వత శిఖరములలో ఉన్న వానరములను, ధూమగిరి మీద నివసించే వానరములను, మహారుణ పర్వతము మీద నివసించే వానరములను, ఇంకా ఇతర ప్రాంతము లలో భూమి మీద, కొండల మీద, పర్వత శిఖరముల మీద నివసించే సమస్త జాతుల వానములను కిష్కింధలో సమావేశము కావాలని సుగ్రీవాజ్ఞగా తెలియచెయ్యండి. ఇంతకు పూర్వము మనము పంపిన వానర ప్రముఖులను తొందరగా పనిపూర్తిచేసుకొని రమ్మని వర్తమానము పంపు. ఇదంతా పది రోజులలో జరగాలి. నా ఆజ్ఞను ధిక్కరించిన వారికి మరణ దండన విధింపబడుతుంది అని తెలియచెయ్యి. నా అధికార పరిధిలో ఉన్న సమస్త జాతుల వానరములు ఇక్కడకు రావాలి. నా ఆజ్ఞను అందరికీ త...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 36)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ముప్పది ఆరవ సర్గ ఎంతో సున్నితంగా, ధర్మబద్ధంగా యుక్తియుక్తంగా పరిస్థితులను వివరించిన తార మాటలను లక్ష్మణుడు అంగీకరించాడు. లక్ష్మణుడు శాంత పడ్డాడు అని ధృవపరచుకున్న సుగ్రీవుడు తన భయాన్ని విడిచిపెట్టాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. "ఓ లక్ష్మణ కుమారా! నేను రాముని దయచేత ఈ కిష్కింధా రాజ్యాన్ని, నా ఐశ్వర్యాన్ని, నా కీర్తిని, నా భార్యను తిరిగి పొందాను. దానిని నేను ఎన్నటికీ మరచిపోలేను. నాకు ఇంత మహోపకారము చేసిన రామునికి నేను ఎంత ప్రత్యుపకారము చేసినా తక్కువే అవుతుంది. రామునికి కేవలము నేను సహాయకుడుగానే ఉంటాను. రాముడే రావణుని చంపి, సీతను పొందగలడు. ఒకే బాణము చేత ఏడు సాల వృక్షములనుకూల్చిన రామునికి నా సాయం ఎందుకు. రావణ సంహారము కొరకు ముందు రాముడు నడుస్తుంటే నేను ఆయన వెనక వెళతాను. ఈ లోకంలో తెలిసో తెలియకో అపరాధము చేయని వాడు ఎవడూ ఉండడు కదా! రాముని పట్ల నేను తెలిసో తెలియకో ఏదైనా అపరాధము చేస్తే నన్ను క్షమించు." అని రెండు చేతులూ జోడించి ప్రార్థించాడు సుగ్రీవుడు. సుగ్రీవుని మాటలకు లక్ష్మణుడు ఎంతో సంతోషించాడు. సుగ్రీవునితో ఇలా అన్నాడు. “ఓ వానర రాజా! నీ వినయమునకు విధేయత...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 35)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ముప్పది ఐదవ సర్గ లక్ష్మణుడు చెప్పిన మాటలు విని సుగ్రీవుడికి నోట మాట రాలేదు. కాని చతురంగా మాట్లాడటంలో నేర్పరి అయిన తార లక్ష్మణునితో ఇలా అంది. “ఓ లక్ష్మణ కుమారా! నీ నోటి నుండి ఇటువంటి పరుష వాక్యములు రాకూడదు. అటువంటి మాటలు సుగ్రీవుడు వినకూడదు. నీవు అనుకుంటున్నట్టు ఈ సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కానీ, శఠుడు కానీ, దారుణమైన పనులు చేయువాడుకానీ, అసత్యములు ఆడువాడు కానీ, కుటిలమైన బుద్ధి కలవాడు కానీ కాడు. సుగ్రీవునికి రాముడు మహోపకారముచేసాడు. అది నిజము. రాముడు చేసిన ఉపకారమును సుగ్రీవుడు మరచిపోలేదు. ఇదీ నిజమే. రాముని అనుగ్రహము వలననే సుగ్రీవుడు ఈ రాజ్యమును, తన భార్య రుమను, నన్ను పొందగలిగాడు. కొన్ని సంవత్సరముల పాటు వాలి చేతిలో బాధలు పడి నిద్ర, ఆహారము లేకపోవడం వలన, ఒక్కసారి సుఖములు వచ్చి మీద పడేటప్పటికి, సుగ్రీవునికి కాలము తెలియలేదు. ఇదీ నిజమే. పూర్వము విశ్వామిత్రుని వంటి మహాఋషి మేనక మోహంలో పడి సంవత్సరములు రోజులుగా గడిపాడు. మహాత్ముడైన విశ్వామిత్రుడే కాలమును గుర్తించలేనపుడు, వానరుడు అయిన ఈ సుగ్రీవుడు ఎంత? దొరక్క దొరక్క దొరికిన దేహసుఖములను, కామసుఖములను అనుభవించడంలో అలసిపో...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది నాలుగవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 34)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ముప్పది నాలుగవ సర్గ లక్ష్మణుని చూడగానే సుగ్రీవుడు తన ఆసనమునుండి కిందికి దిగాడు. అతని తోపాటు అతని భార్యలు రుమ మొదలగు స్త్రీలు కూడా లేచి నిలబడ్డారు. సుగ్రీవుడు చేతులు జోడించి లక్ష్మణుని ఎదురుగా నిలబడ్డాడు. స్త్రీల మధ్య నిలబడ్డ సుగ్రీవుని చూచి లక్ష్మణుడు కోపంతో ఇలా అన్నాడు. “ఓ సుగ్రీవా! బలవంతుడు, ఉత్తములైన బంధువులు ఉన్నవాడు, జాలి, దయకలవాడు, ఎల్లప్పుడు సత్యమునే పలుకువాడు, అయిన రాజు లోకములో అందరిచేతా పూజింపబడతాడు. ధర్మము తప్పినవాడు, ఇచ్చిన మాటను మరచువాడు, అసత్యము పలుకువాడు అయిన రాజు కంటే క్రూరుడు మరొకడు ఉండడు. అశ్వమును దానము చేస్తాను అని చెప్పి దానం చేయకుండా ఉన్నవాడు నూరు అశ్వములను చంపిన పాపమును పొందుతాడు. అలాగే గోవును దానం చేస్తాను అని చెప్పి మాటతప్పితే వాడికి వేయి గోవులుచంపిన పాపం అంటుకుంటుంది. అలాగే మిత్రునికి ఇచ్చిన మాట తప్పినవాడికి బంధు మిత్రులను చంపి, తనను తాను చంపుకున్న పాపం అంటుకుంటుంది. తన పని పూర్తి అయిన తరువాత, తనకు సాయం చేసిన మిత్రులకు ప్రత్యుపకారముచేయని కృతఘ్నుని జనం అంతాకొట్టి చంపుతారు. చేసిన మేలు మరచి పోయే కృతఘ్నుని గురించి బ్రహ్మదేవుడు చెప్పి...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది మూడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 33)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ముప్పది మూడవ సర్గ సుగ్రీవుని ఆదేశము మేరకు అంగదుడు మొదలగు వారు వెంటనే వెళ్లి లక్ష్మణుని వినయంగా లోపలకు ఆహ్వానించారు. లక్ష్మణుడు కిష్కింధా నగరంలోకి ప్రవేశించాడు. లక్ష్మణుని చూచి వానరులందరూ భక్తితో నమస్కరించారు. లక్షణుని మొహంలో కోపాన్ని చూచి వానరులు భయం భయంగా దూర దూరంగా నిలబడ్డారు. విశాలమైన రాజమార్గముల గుండా లక్ష్మణుడు వెళు తున్నాడు. లోపల ఉన్న పలు అంతస్థుల భవనములను చూచాడు లక్ష్మణుడు. రాజ మార్గములో పోతూ, అంగదుడు, మైందుడు, ద్వివిదుడు, గవయుడు, గవాక్షుడు, గజుడు, శరభుడు, విద్యున్మాలి, సంపాతి, సూర్యాక్షుడు, హనుమంతుడు, వీరబాహుడు, సుబాహుడు, నలుడు, కుముదుడు, సుషేణుడు, తారుడు, జాంబవంతుడు, దధివక్త్రుడు, నీలుడు, సుపాటలుడు,సునేత్రుడు మొదలగు వానర వీరుల గృహములను చూచాడు లక్ష్మణుడు. దేవేంద్రుని భవనము వలె వెలిగిపోవుచున్న వానర రాజు సుగ్రీవుని ప్రాసాదమును చూచాడు లక్ష్మణుడు. ఆ ప్రాసాదము కైలాస శిఖరము మాదిరి తెల్లగా ప్రకాశిస్తూ ఉంది. ఆయుధములు ధరించిన వానరులు ఆ భవనమును నిరంతరమూ కాపలా కాస్తున్నారు. ముఖద్వారము గుండా లక్ష్మణుడు సుగ్రీవుని ప్రాసాదము లోనికి ప్రవేశించాడు. లక్ష్మణుడు ఏడ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది రెండవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 32)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ముప్పది రెండవ సర్గ లక్ష్మణుడు కోపంతో వచ్చి ద్వారము వద్ద నిలబడి ఉన్నాడు అని తెలుసుకున్న సుగ్రీవునికి మత్తు పూర్తిగా దిగింది. ఆసనము మీది నుండి లేచాడు. తన మంత్రులను చూచి ఇలా అన్నాడు. "అయ్యో! లక్ష్మణునికి ఎందుకు కోపం వచ్చింది. నేనేమీ ఆయనతో చెడుగా మాట్లాడలేదే! ఏమీ తప్పుగా ప్రవర్తించలేదే! మరి లక్ష్మణునికి కోపం ఎందుకు వచ్చినట్టు. నా శత్రువులు ఎవరో నామీద చెడుగా లక్ష్మణునికి చెప్పి ఉంటారు. మీరందరూ ఆలోచించి మనము లక్ష్మణునితో ఎలా మాట్లాడాలో నిర్ణయం చెయ్యండి.  నాకు రాముడు అన్నా లక్ష్మణుడు అన్నా భయం లేదు. కానీ, అకారణంగా లక్ష్మణుడు ఎందుకు కోపించాడా అని సంభ్రమంగా ఉంది. రాముడు లాంటి మిత్రుడు దొరకడమే చాలాకష్టము. అటువంటి మిత్రుని వదులుకుంటానా! రాముడు నాకు చేసిన సాయము ఈ జన్మలో మరువలేనిది. నేను ఎంత చేసినా, రాముడు చేసిన సాయమునకు సాటి రాదు. కాని చిన్న చిన్న విషయములకు కూడా స్నేహమునకు విఘాతము కలుగుతుంది. అందుకే నేను రామునికి భయపడుతున్నాను." అని అన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు నేర్పుగా అంటున్న మాటలు విన్న హనుమంతుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “సుగ్రీవా! నీకు రాముడు చేసిన...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 31)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ముప్పది ఒకటవ సర్గ రాముడు మాట్లాడుతున్నంత సేపూ లక్ష్మణుడు తన కోపాన్ని అణుచు కుంటున్నాడు. అన్నమాట తప్పి నందుకు లక్ష్మణునికి సుగ్రీవుని మీద కోపం ముంచుకొచ్చింది. “అన్నయ్యా! వానరుడైన ఈ సుగ్రీవుడు మంచి వాడిలా ప్రవర్తించడం లేదు. తాను చేసే పనుల వలన కలిగే ఫలితములను తెలుసుకోడం లేదు. మాట తప్పినందుకు సుగ్రీవునికి కాలం మూడింది. రామా! నీవు చేసిన ఉపకారము వలన వచ్చిన రాజ్యమును, భార్యను అనుభవిస్తున్నాడే కానీ, అనుకున్న ఒప్పందము ప్రకారము ప్రత్యుపకారము చేయవలెననే ఆలోచన వానికి ఉన్నట్టు లేదు. వీడిని తన అన్న వాలి వద్దకు పంపడమే ఉత్తమము. ఇటువంటి వాడు రాజ్యము చేయుటకు అనర్హుడు. సుగ్రీవుని తలచుకుంటేనే నాకు కోపం మిన్నుముట్టుతూ ఉంది. వాడిని చంపకుండా వదలను. అంగదునికి రాజ్యాభిషేకము చేద్దాము. అంగదుడే సీతను అన్వేషించడంలో మనకు సాయపడగలడు." అంటూ లక్ష్మణుడు ధనుస్సు తీసుకొని లేచాడు. రాముడు లక్ష్మణుని అనునయించి ఇలా అన్నాడు. "లక్ష్మణా! సుగ్రీవుడు పాపం చేసాడని మనం కూడా పాపం చేస్తామా! సుగ్రీవుని చంపి పాపం ఎందుకు మూటకట్టుకుంటావు? నీలోని వివేకంతో ఆలోచించు. కోపాన్ని వదిలిపెట్టు. మనకు సుగ్రీ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ముప్పదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 30)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ముప్పదవ సర్గ వర్షాకాలము గడిచి పోయినను సుగ్రీవుడు తన వద్దకు రాలేదని రాముడు చింతిస్తున్నాడు. సుగ్రీవుడు కామాసక్తుడై తనకు ఇచ్చిన మాటను మరచినాడని, తన భార్య సీతను తలచుకొని దుఃఖిస్తున్నాడు. ఈ శరత్కాలములో పండువెన్నెలలో సీతతో కూడా విహరించవలసిన తాను ఈ ప్రకారము భార్యావియోగము అనుభవించవలసి వచ్చినదే అని మనసులో ఆరాటపడుతున్నాడు రాముడు. ఒకవేళ బతికి ఉంటే సీత ఈ శరత్కాల రాత్రులను ఎలా గడుపుతూ ఉందో అని ఆలోచిస్తున్నాడు. సీత తన దగ్గర లేకపోవడంతో రాముడు శరత్కాల వైభవాలను ఆస్వాదించలేకపోతున్నాడు. మరలా తన అన్నగారు రాముడు సీత గురించి ఆలోచించడం చూచాడు లక్ష్మణుడు. మరలా రాముని ఉత్తేజపరచి కార్యోన్ముఖుడిని చేయదలిచాడు. రామునితో ఇలా అన్నాడు. “రామా! ఏమిటీ వెర్రి! ఈ ప్రకారము కామానికి వశుడు కావడం వలన ప్రయోజనము ఏముంది! దీని వలన మానసిక స్థైర్యము నశించడం తప్ప వేరే ఏమీ జరగదు. ఏ కార్యమూ సిద్ధించదు. కాబట్టి నీవు నీ మనసులో నుండి చింతను తొలగించి, మనసును నిర్మలం చేసుకొని, కాగల కార్యము నందు శ్రద్ధ చూపు. ధైర్యము చేత ఏ కార్యము నైననూ సిద్ధింప చేసుకొన వచ్చును కదా! మనం ధైర్యంగా ఉంటే దైవము కూడా మనకు తోడుపడుత...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 29)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఇరువది తొమ్మిదవ సర్గ వర్షాకాలము పూర్తి అయింది. శరదృతువు ప్రవేశించింది. ఆకాశం నిర్మలమయింది. కాని సుగ్రీవుడు ఇంకా కామభోగములలో మునిగి తేలుతున్నాడు. అంత:పురము విడిచి రావడం లేదు. స్త్రీల సాహచర్యంలోనే గడుపుతున్నాడు. తన భార్య రుమతోనూ, తన అన్న భార్య తార సాహచర్యంలోనూ ఆనందంగా గడుపుతున్నాడు. (స్వాం చ పత్నీమభిప్రేతాం తారాం చాపి సమీప్సితామ్, విహరన్తమహోరాత్రం అంటే తన భార్యను, తానుకోరిన తారను అహోరాత్రాలు విహరిస్తున్నాడు... అని ఉంది. అలాగే ముప్పది ఒకటవ సర్గలో కూడా ఈ క్రింది శ్లోకము ఉంది. "తారయా సహిత: కామాసక్త:" అంటే తారతో కలిసి కామాసక్తుడై ఉన్నవాడు అనిఉంది. అంటే వాలి చని పోయిన తరువాత వాలి భార్య తార సుగ్రీవుని వశం అయిందని అర్ధం అవుతూ ఉంది. మరి వాలి చేసిన తప్పే సుగ్రీవుడు చేస్తున్నాడు కదా! అంటే సుగ్రీవుడు బతికి ఉండగానే వాలి, సుగ్రీవుని భార్య రుమను అనుభవించాడు. కానీ సుగ్రీవుడు, వాలి చనిపోయిన తరువాత, వాలి భార్య తారను అనుభవించాడు అని అర్థం చెప్పుకోవాలి.) సుగ్రీవుడు కనీసం మంత్రులకు కూడా దర్శనం ఇవ్వడం లేదు. కార్యభారము అంతా మంత్రులకు అప్పచెప్పాడు. ఇంక ఎవరి వల్లా తనకు...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 28)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఇరువది ఎనిమిదవ సర్గ వర్షాకాలము మొదలయింది. ఆకాశమంతా మేఘావృతము అయింది. వేసవి కాలము అంతా ఆకాశము సూర్య కిరణముల ద్వారా నీటిని తాగి, వర్షాకాలములో ఆ జలములను మరలా భూమి మీదికి వదులుతూ ఉంది. ఆకాశమునుండి కారుతున్న వర్షపు ధారలు సీత కళ్ల నుండి కారుతున్న కన్నీళ్ల మాదిరి కనపడుతున్నాయి రామునికి. మేఘాలు వర్షిస్తున్నాయి. నదులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి. నెమళ్లు నర్తిస్తున్నాయి. అప్పటి వరకూ నిద్రాణంగా ఉన్న రకరకాలైన కప్పజాతులు, వర్షము పడగానే భూమిపైకి వచ్చి రణగొణ ధ్వనులు చేస్తున్నాయి. నదులన్నీ గట్లు తెంచుకొని ప్రవహిస్తూ తమ నాధుడైన సముద్రుని చేరుటకు ఉరకలు వేస్తున్నాయి. ఇవన్నీ చూచి రాముడు ఇలా అనుకుంటున్నాడు. “అయోధ్యలో కూడా సరయూ నది నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. భరతుడు కూడా తన దైనందిన కర్మలు పూర్తి చేసుకొని ఆషాఢ మాస వ్రతమును ప్రారంభించి ఉంటాడు. భరతుడు అయోధ్యలో వ్రతాలు చేస్తుంటే నేను ఇక్కడ భార్యను పోగొట్టు కొని దు:ఖిస్తున్నాను. సుగ్రీవుడు ఎప్పుడు వస్తాడో ఏమో! ఒకవేళ వచ్చినా ఈ వర్షాకాలంలో వానరులు వెళ్లి వెతకడం అసాధ్యం కదా! అందుకే సుగ్రీవుడు వర్షాకాలము అయిపోయిన తరువాత వస్తాడు. అప్...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 27)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఇరువది ఏడవ సర్గ రాముడు, లక్ష్మణుడు ప్రస్రవణ పర్వతము చేరుకున్నారు. ఆ పర్వతము మీద పులులు, సింహములు, మొదలగు క్రూరజంతువులు నివాసముంటున్నాయి. అవే కాకుండా ఎన్నో రకములైన వానరములు, భల్లూకములు కూడా నివాసముంటున్నాయి. అనేకములైన పొదలు, లతలు, వృక్షములతో ఆ పర్వతము శోభిల్లుతూ ఉంది. ఆ పర్వతము మీద ఉన్న ఒక పెద్ద గుహను తమ నివాసంగా చేసుకున్నారు రామలక్ష్మణులు. "లక్ష్మణా! ఈ గుహ మనకు నివాస యోగ్యముగా ఉన్నది కదూ! వర్షాకాలము అంతా ఇక్కడే ఉందాము. ఇక్కడకు దగ్గరలో ఒక సరస్సుఉంది. అందులో అందమైన పద్మములు వికసించి ఉన్నాయి. కొంచెం దూరంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. అందులో మనము స్నానాదులు చేయవచ్చును. ఈ నదీ తీరంలో వందలాది పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయి. ఈ అందమైన ప్రదేశములో మనము సుఖంగా జీవించెదము. పైగా ఇక్కడి నుండి కిష్కింధా నగరము కనుచూపుమేరలోనే ఉంది. వానర రాజైన సుగ్రీవుడు తన రాజ్యమును, తన భార్యను తిరిగి పొంది, తన బంధుమిత్రులతో కలిసి సుఖంగా జీవిస్తున్నాడు.” అని అన్నాడు రాముడు. కాని రాముని మనసులో తన భార్య తనకు దూరంగా ఉంది అనే బాధ మాత్రం తొలుస్తూనే ఉంది. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - ఇరువది ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 26)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము ఇరువది ఆరవ సర్గ వాలికి దహన సంస్కారములు చేసిన అనంతరము, సుగ్రీవుడు, మిగిలిన వానర ప్రముఖులు అందరూ కలిసి రాముని వద్దకు వెళ్లారు. వారందరి సమక్షములో హనుమంతుడు రామునితో ఇలా అన్నాడు. “ఓ ప్రభో! నీ అనుగ్రహము వలన సుగ్రీవునికి తిరిగి రాజ్యము లభించింది. నీ అనుజ్ఞ అయితే సుగ్రీవుడు కిష్కింధలో ప్రవేశించి యథావిధిగా రాజ్యాభిషిక్తుడై, కిష్కింధను పాలిస్తాడు. నీకు తగిన కానుకలు సమర్పించుకొని నిన్ను పూజించవలెనని అనుకుంటున్నాడు. కాబట్టి మా అందరి కోరిక మేరకు నీవు కిష్కింధా నగరమునకు వచ్చి మా సత్కారములను అందుకని మమ్ములను ఆనందింపజేయమని ప్రార్ధించుచున్నాము." అని వినయంగా అన్నాడు హనుమంతుడు. ఆ మాటలకు రాముడు ఇలా అన్నాడు. “హనుమా! నేను నా తండ్రి ఆజ్ఞమేరకు వనవాసము చేయుచున్నాను. ఈ పదునాలుగు సంవత్సరములు జనావాసములలోకి అడుగుపెట్టను. మీరందరూ కలిసి సుగ్రీవునికి పట్టాభిషేకము చేయండి." అని అన్నాడు రాముడు. తరువాత సుగ్రీవునితో ఇలా అన్నాడు. "మిత్రమా! సుగ్రీవా! వాలి కుమారుడు అంగదుని యువరాజుగా అభిషేకించు. నీ అన్నగారి కుమారుడు అంగదుడు యువరాజుగా అభిషేకించడానికి తగినవాడు. ఇప్పుడు వర్షకాలము ...