Posts

Showing posts from November, 2023

శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 76)

శ్రీమద్రామాయణము బాలకాండ డెబ్బది ఆరవ సర్గ అప్పటి వరకూ శ్రీ రాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని ఇంక ఊరుకోలేక పోయాడు. తండ్రి వంక చూచి ఆయన అనుమతితో పరశురామునితో ఇలా అన్నాడు. “పరశురామా! మీ గురించి విన్నాను. నీవు తండ్రి ఋణమును తీర్చుకోడానికి యావత్తు క్షత్రియ లోకమును మట్టు బెట్టిన సంగతి నాకు తెలుసు. దానికి నిన్ను అభినందిస్తున్నాను. కాని నాకు నీవు పరీక్ష పెడుతున్నావు. నేను పరాక్రమము లేని వాడిగా నీవు భావిస్తున్నావు. దానిని నేను నాకు జరిగిన అవమానముగా భావిస్తున్నాను. ఇప్పుడు నా పరాక్రమమును నీకు ప్రదర్శిస్తాను. చూడు.” అని పలికి పరశు రాముని చేతిలోని ఆ దివ్యమైన ధనుస్సును బాణమును తీసుకున్నాడు. ఆ ధనుస్సుకు ఉన్న నారిని సవరించాడు. ధనుస్సును ఎక్కుపెట్టాడు. బాణమును ఆ ధనుస్సులో సంధించాడు.  పరశురాముని చూచి ఇలా అన్నాడు. “ఓ పరశురామా! మీరు బ్రాహ్మణులు. నాకు పూజ్యులు. కాబట్టి ఈ బాణమును మీ మీద ప్రయోగింపలేను. కాని సంధించిన బాణము వృధాకారాదు. కాబట్టి ఈ బాణమును దేని మీద ప్రయోగింప వలెనో చెప్పండి. నీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది. నా బాణమును ఆశక్తి మీద ప్రయోగింపనా. లేక నీవు ఇప్పటి...

శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 75)

శ్రీమద్రామాయణము బాలకాండ డెబ్బది ఐదవ సర్గ వసిష్ఠుడు, దశరథుడు, అర్పించిన అర్ఘ్య పాద్యములు, అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు, రాముని చూచి ఇలా అన్నాడు. “ఓ రామా! నీ పరాక్రమము గురించి విన్నాను. నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది. నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు. అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకొని వచ్చాను. ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్ని ఇచ్చాడు. ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమమును ప్రదర్శించు. అప్పుడు నేను నీవు పరాక్రమ వంతుడవనీ, వీర్య వంతుడవనీ ఒప్పుకుంటాను. నీతో ద్వంద్వ యుద్ధము చేస్తాను. రా! ఈ విల్లు తీసుకో! " అని రాముని పిలిచాడు పరశురాముడు. ఆ మాటలు విని దశరథుడు నిలువెల్లా వణికిపోయాడు. చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఇలా అన్నాడు. "ఓ పరశురామా! నీ కీర్తి లోకమంతా వ్యాపించింది. నీవు బ్రాహ్మణుడవు. కాని నీవు క్షత్రియుల మీద కోపించి వారిని 21 మార్లు ఓడించావు. తరువాత శాంతిని పొందావు. కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుని యుద్ధానికి పిలుస్తున్నావు. ఇది న్యాయమా! నా కుమారులను ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 74)

శ్రీమద్రామాయణము బాలకాండ డెబ్బది నాల్గవ సర్గ సీతారాముల కల్యాణం జరిగింది. ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు, నూతన వధూవరు లందరినీ ఆశీర్వదించి, జనకుని వద్ద, దశరథుని వద్ద సెలవు తీసుకొని హిమవత్పర్వతమునకు వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు వెళ్లిపోయిన తరువాత జనక మహారాజు వద్ద అనుమతి తీసుకొని దశరథుడు కూడా అయోధ్యకు బయలుదేరాడు. అప్పుడు జనక మహారాజు తన కుమార్తెలకు అంతులేని ధనము, ఆభరణములు కానుకగా ఇచ్చాడు. లక్ష ఆవులను, అనేక వస్త్రాభరణములను, ఏనుగులు, హయములు, రథములను అరణంగా ఇచ్చాడు. దాసులను దాసీజనమును తన కుమార్తెల వెంట అయోధ్యకు పంపాడు. దారిలో రక్షణ గా చతురంగ బలములను పంపాడు. వారితో పాటు మిథిలా నగరము బయట దాకా వచ్చి వారికి వీడ్కోలు పలికాడు. తరువాత వెను తిరిగి మిథిలకు వచ్చాడు. దశరథుడు కుమారులు కోడళ్లతో ప్రయాణమై వెళుతున్నాడు. దారిలో వారికి కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి. వెంటనే దశరథుడు వసిష్ఠుని పిలిచి ఆ దుశ్శకునముల కు అర్థం చెప్పమని అడిగాడు.  అప్పుడు వసిష్ఠుడు ఇలా అన్నాడు. "ఓ దశరథమహారాజా! మనకు ఏదో ఒక ఆపద వచ్చి పడుతుంది అని ఈ దుశ్శకునములు సూచిస్తూ ఉన్నాయి. కాని ఆ ఆపద సులభంగా తొలగ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 73)

శ్రీమద్రామాయణము బాలకాండ డెబ్బది మూడవ సర్గ దశరథుడు తన కుమారులచేత గోదానములు ఇప్పించు చున్న సమయంలో భరతుని మేనమామ యుధాజిత్తు అక్కడకు వచ్చాడు. (భరతుని మేనమామ అంటే దశరథుని మూడవ భార్య, భరతుని తల్లి అయిన కైకేయి సోదరుడు అనగా కేకయ రాజు కుమారుడు) . కేకయ రాజ కుమారుడు, భరతునికి మేనమామ అయిన యుధాజిత్తును చూచి దశరథుడు ఎంతో సంతోషించాడు. యుధాజిత్తు దశరథునితో ఇలా అన్నాడు. “బావగారూ! మా తండ్రికేకయ రాజుగారు తమరిని కుశలము అడగమని అన్నాడు. ఇక్కడ మీరందరూ క్షేమమే కదా! మా తండ్రిగారు తన మేనల్లుడు అయిన భరతుని చూడవలెనని ముచ్చట పడు తున్నాడు. భరతుని నా వెంట తీసుకొని రమ్మని నన్ను పంపాడు. అందుకని నేను అయోధ్యానగరమునకు వెళ్లాను. మీరందరూ మీ కుమారుల వివాహమలు జరిపించుటకు విదేహ కు వెళ్లారని తెలిసి ఇక్కడకు వచ్చాను." అని అన్నాడు యుధాజిత్తు. దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథి సత్కారములు చేసాడు. అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు. మరునాడు ఉదయము అందరూ పెందలకడనే నిద్రలేచి ప్రాతఃకాల సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొన్నారు. తరువాత వారందరూ విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు. ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 72)

శ్రీమద్రామాయణము బాలకాండ డెబ్బది రెండవ సర్గ జనకుని మాటలు విన్న వసిష్ఠుడు విశ్వామిత్రునితో సంప్రదించాడు. తరువాత ఇరువురు మహాఋషులు జనకునితో ఇలాఅన్నారు. “ఓ జనకమహారాజా! అటు ఇక్ష్వాకు వంశము, ఇటు విదేహ వంశమూ రెండూ విశిష్ఠమైనవే. ఒకదానికి ఒకటి తీసిపోవు. ఈ రెండు వంశములు కలవడం అత్యంత శుభదాయకము. నీ కుమార్తె అయిన సీతను రామునికి, నీ తమ్ముడు కుశధ్వజుని కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చెయ్యడం వారి వంశ గౌరవములకు, రూప సంపదలకు తగిఉన్నది. ఈ సందర్భములో ఒక మాట చెప్పాలని మాకు అనిపించింది. నీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మాత్ముడు. ఆయనకు ఊర్మిళ కాకుండా ఇంకా ఇరువురు కుమార్తెలు ఉన్న సంగతి మాకు తెలుసు. ఆయన ఇరువురు కుమార్తెలను దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహము జరిపించండి. రెండు వంశములు ధన్యమవుతాయి. దశరథుని కుమారులైన భరత శత్రుఘ్నులు అంద చందములలోనూ, రూప లావణ్యములలోనూ, బల పరాక్రమములలోనూ రామ లక్ష్మణు లకు ఏ విధంగానూ తీసి పోరు. ఈ వివాహములతో మీ ఇరువురి రాజ్యములు ధృడమైన సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటాయి." అని పలికారు. ఆ మాటలు విన్న జనకుడు, వసిష్ఠ విశ్వామిత్రులతో ఇలా అన్నాడు. “ ఓ మునిశ్రేష్ఠులారా...

శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బది ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 71)

శ్రీమద్రామాయణము బాలకాండ డెబ్బది ఒకటవ సర్గ ఆ ప్రకారంగా వసిష్ఠుడు దశరథుని వంశము గురించి చెప్పిన తరువాత, జనకుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. "ఓ దశరథ మహారాజా! తమరి వంశక్రమమును గూర్చి విని చాలా ఆనందించాను. కన్యాదాన సమయములో వధువు యొక్క వంశమును గూర్చి కూడా వివరించడం సాంప్రదాయము. కాబట్టి మా వంశ చరిత్రను వివరిస్తాను. అవధరించండి. మాది మిథిలా నగరము. ఈ మిథిలా నగరమును నిర్మించిన వాడు మిథి అనే చక్రవర్తి. మిది, నిమి చక్రవర్తి కుమారుడు. ఆయనే మా వంశమునకు మూలపురుషుడు. మిథిని జనకుడు అని కూడా పిలుస్తారు. ఆయనే మా వంశములో మొట్ట మొదటి జనకుడు. మిథి కుమారుడు ఉదావసువు. ఉదావసుని కుమారుడు నందివర్థనుడు. నంది వర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతుని కుమారుడు దేవరాతుడు. దేవరాతుని కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. మహావీరుని కుమారుడు సుధృతి. సుధృతి కుమారుడు దుష్టకేతువు. ఆయన రాజర్షి. రాజర్షిఅయిన దుష్టకేతువు కుమారుడు హర్యశ్వుడు. హర్యశ్వుని కుమారుడు మరుడు. మరుని కుమారుడు ప్రతింధకుడు. ప్రతింధకుని కుమారుడు కీర్తిరథుడు. కీర్తిరథుని కుమారుడు దేవమీఢుడు. దేవమీఢుని కుమారుడు విబుధుడు. విబుధుని కుమారుడు మహీధ్రక...

శ్రీమద్రామాయణం - బాలకాండ - డెబ్బదియవ సర్గ (Ramayanam - Balakanda - Part 70)

శ్రీమద్రామాయణము బాలకాండ డెబ్బదియవ సర్గ మరునాడు ఉదయం జనకుడు అగ్ని కార్యము, యజ్ఞము పూర్తిచేసాడు. తనపురోహితుడు అయిన శతానందునితో ఇలా అన్నాడు. “శతానందులవారూ! మా తమ్ముడు శతధ్వజుని, ఆయన కుటుంబమును ఈ వివాహమునకు తీసుకొని వచ్చుటకు తగిన ఏర్పాట్లు చేయండి." అని చెప్పాడు. శతానందుడు వెంటనే జనకుని సోదరుడు కుశధ్వజుని తీసుకొని వచ్చుటకు సాంకాశ్యనగరమునకు దూతలను పంపారు. వారు వాయువేగ మనోవేగములతో సాంకాశ్యనగరము చేరుకున్నారు. జనక మహారాజు సందేశమును వినిపించారు. తమతో మిథిలకు రమ్మని ఆహ్మానించారు. వెంటనే కుశధ్వజుడు అన్నగారి ఆజ్ఞమేరకు బంధుమిత్ర పరివారములతో మిథిలకు వచ్చాడు. జనకునికి అభివాదము చేసి పురోహితుడు శతానందునికి నమస్కరించాడు. అన్నదమ్ములు ఇరువురూ ఆలోచించుకొని తమ మంత్రులలో శ్రేష్టుడు అయిన సుదాముని దశరథమహారాజును విడిది నుండి బంధుమిత్రులతో సహా తీసుకొని వచ్చుటకు పంపారు. సుదాముడు దశరథుడు విడిది చేసి ఉన్న చోటికి వెళ్లాడు. దశరథునితో ఇలా అన్నాడు. “దశరథమహారాజా! తమకు శుభం కలుగుగాక! మా మహారాజు జనకుడు తమరిని సపరివారసమేతంగా తోడ్కొని రమ్మని నన్ను నియోగించాడు. తమరిని చూచుటకు మా మహారాజు గారు ఆతురతగా ఉన్నారు.” అని పలికాడ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 69)

శ్రీమద్రామాయణము బాలకాండ అరవై తొమ్మిదవ సర్గ గడిచి తెల్లవారింది. దశరథుడు తెల్లరాజుజామున లేచి కాలకృత్యములు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించుకొని తన మంత్రి సుమంతుని పిలిపించాడు. “సుమంతా! రాముని వివాహమునకు మనకు మిథిలకు వెళుతున్నాము. ముందు ధనరాసులు, రత్నములు, ఆభరణములతో కొంతమంది వెళ్లాలి. తరువాత మా వెంట చతురంగ బలములు బయలుదేరాలి. మన పురోహితులు వసిష్ఠుడు, వామదేవుడు, మహాఋషులు జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, కాత్యాయనుడు కూడా వస్తున్నారు. వారి ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి. ఆలస్యము చేయవద్దు." అని ఆదేశాలు ఇచ్చాడు. సుమంతుడు దశరథుని ప్రయాణానికి తగు ఏర్పాట్లు చేసాడు. నాలుగు రోజుల ప్రయాణము తరువాత అందరూ మిథిలకు చేరుకున్నారు. జనకుడు వారిని తగు మర్యాదలతో ఆహ్యానించాడు. అతిథి సత్కారములు, విడిది ఏర్పాట్లు చేసాడు. దశరథ మహారాజును కలుసుకొని జనకుడు ఇలా అన్నాడు. "ఓ దశరథమహారాజా! తమరికి మిథిలాధిపతి జనకుడు స్వాగతము పలుకుతున్నాడు. తమరి రాకతో మా మిథిలా నగరము పావనముఅయింది. తమరి కుమారుల పరాక్రమము అనుపమానము, అద్వితీయము. మా భాగ్యము కొద్దీ వసిష్ఠ మహర్షి మా నగరమునకు వచ్చారు. మాకు ఎంతో ఆనందముగా ఉంది. ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 68)

శ్రీమద్రామాయణము బాలకాండ అరవై ఎనిమిదవ సర్గ జనకమహారాజు పంపిన దూతలు అత్యంత ప్రయాసల కోర్చి మూడుదినములకు అయోధ్య నగరమునకు చేరుకున్నారు. రాజభవనమునకు వెళ్లారు. బయట ఉన్న ద్వార పాలకులకు “మిథిలా నగరము నుండి జనకమహారాజు దూతలు వచ్చారు అని దశరథ మహారాజు గారికి మనవి చేయండి." అని వర్తమానము పంపారు. ఆ వర్తమానమును అందుకున్న దశరథుడు వారిని లోపలకు రమ్మన్నాడు. జనక మహారాజు పంపిన దూతలు జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు అయిన దశరథమహారాజును చూచి వినయంతో నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు. “దశరథ మహారాజా! తమరికి జయము కలుగు గాక! మేము మిథిలాధిపతి అయిన జనకమహారాజు వద్దనుండి దూతలుగా వచ్చాము. జనక మహారాజు తమరియొక్క, తమరి మంత్రి, సామంత, పురోహితుల యొక్క యోగ క్షేమ సమాచారములు విచారించుచున్నారు. తమరి కుశలము కనుక్కోమని చెప్పారు. తమరి కుమారులు రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుల వారి సంరక్షణలో సురక్షితముగా ఉన్నారని తమరికి చెప్పమన్నారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మిథిలలో జనక మహారాజు అతిధి సత్కారములు అందుకుంటున్నారు అని చెప్పమన్నారు.  విశ్వామిత్రుల వారి అనుమతితో తమరితో ఈ మాటలు, వారి మాటలుగా చెప్పమన్నారు. “నేను నా కుమార్తె సీతను వీరత్వమ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 67)

శ్రీమద్రామాయణము బాలకాండ అరవై ఏడవ సర్గ జనకుడు చెప్పిన మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. “ఓ జనక మహారాజా! నీవు చెప్పినది అంతా విన్నాము. నీవద్ద ఉన్న ధనుస్సును రామునికి చూపించు." అని అన్నాడు. జనకుడు పూజా మందిరములో పూజలందుకుంటున్న ఆ ధనుస్సును తీసుకొని రమ్మని సామంతులను ఆజ్ఞాపించాడు. జనకుని ఆజ్ఞాను అనుసరించి సామంతులు ఎనిమిది చక్రముల గల ఒక వాహనము మీద అమర్చి ఉన్న ఆ శివ ధనుస్సును తీసుకొని వచ్చారు. 5,000 మంది ధృడకాయులు ఆ ధనుస్సు ఉన్న వాహనమును లాగుకొని వచ్చారు. "జనక మహారాజా! తమరు ఆదేశించినట్టు, నీవు రామునికి చూపదలచుకొన్న శివధనుస్సును తీసుకొని వచ్చాము." అని అన్నారు సామంత రాజులు. జనకుడు విశ్వామిత్రుని, రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! ఈ ధనుస్సు మాకు వంశపారంపర్యముగా వచ్చింది. దీనిని ఎంతో మంది రాజులు, రాజకుమారులు ఎక్కుబెట్టబోయి విఫలమయ్యారు. రాజులే కాదు, దేవతలు, గంధర్వులు, అసురులు కూడా దీనిని ఎక్కుపెట్టలేకపోయారు. కాబట్టి ఈ ధనుస్సును ఎత్తుటకు గానీ, ఎక్కుబెట్టుటకు కానీ మానవ మాత్రులకు సాధ్యము కాదుకదా! ఓ విశ్వామిత్ర మహర్షీ! దీనిని రామలక్ష్మణులకు చూపుము."అని అన్నాడు జ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 66)

శ్రీమద్రామాయణము బాలకాండ అరవై ఆరవ సర్గ మరునాడు ఉదయం జనకమహారాజు కాలకృత్యములను తీర్చుకొనని విశ్వామిత్రుని వద్దకు వెళ్లాడు. విశ్వామిత్రుని, రామ లక్ష్మణులను, వారితో వచ్చిన ఋషులను తన భవనమునకు తీసుకొని వచ్చాడు. విశ్వామితునికి పూజలు చేసాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! రామలక్ష్మణులారా! మీకు ఇదే మా స్వాగతం. నేను మీ ఆజ్ఞాబద్ధుడను. తమరికి ఏమి కావాలో నన్ను ఆజ్ఞాపించండి. తక్షణమే నెరవేరుస్తాను." అని పలికాడు జనకుడు. "ఓ జనకమహారాజా! నీ వినయవిధేయతలు అత్యంత ప్రశంసనీయములు. వీరు ఇరువురు అయోధ్య చక్రవర్తి దశరథి మహారాజు పుత్రులు. వీరు నీ వద్ద ఉన్న శ్రేష్టమైన ధనుస్సును చూడాలని అనుకుంటున్నారు. కాబట్టి నీవు వారికి ఆ ధనుస్సు చూపించు. వారు ఆ ధనుస్సును చూచి అయోధ్యకు తిరిగి వెళ్లిపోతారు."అని అన్నాడు. అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! వారికి ఆ ధనుస్సును చూపించే ముందు ఆ ధనుస్సు గురించి వివరిస్తాను. ఆ ధనుస్సు శివధనుస్సు. పూర్వము దక్షయజ్ఞ సమయములో రుద్రుడు తనకు యజ్ఞములో హవిర్భాగమును ఇవ్వనందుకు ఈ శివధనుస్సును ధరించి దేవతలందరి శిరస్సులను ఖండించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు అ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 65)

శ్రీమద్రామాయణము బాలకాండ అరవై ఐదవ సర్గ ఆ ప్రకారంగా నిర్ణయించుకొన్న విశ్వామిత్రుడు ఉత్తర దిక్కును విడిచి పెట్టాడు. తూర్పు దిక్కుగా వెళ్లాడు. అచ్చట ఆశ్రమమును నిర్మించుకొని వేయి సంవత్సరములు ఘోరమైన తపస్సుచేసాడు. విశ్వామిత్రుని శరీరము ఎండుకట్టె మాదిరి అయింది. అతని తపస్సుకు ఎన్నో విఘ్నాలు కలిగాయి. కాని విశ్వామిత్రుడు చలించలేదు. ఇంద్రియములకు లోబడలేదు. వేయి సంవత్సరములు పూర్తి అయ్యాయి. ఇంక తపస్సు పూర్తి అయింది అనుకొని ఆహారము తీసుకొనడానికి కూర్చున్నాడు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వచ్చాడు. చాలా ఆకలితో ఉన్నాను. అన్నం పెట్టమని యాచించాడు. మారు మాటాడకుండా విశ్వామిత్రుడు తాను తెచ్చుకున్న ఆహారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. బ్రాహ్మణ వేషములో ఉన్న ఇంద్రుని ఒక్కమాట కూడా అనలేదు. ఇంద్రుడి మీద కోప పడలేదు. తాను నిరాహారంగా ఉండిపోయాడు. మరలా తపస్సుకు పూనుకొన్నాడు. కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ మరలా వేయి సంవత్సరములు తపస్సు చేసాడు. విశ్వామిత్రుని తలలో నుండి పొగలు చెలరేగాయి ఆ మంటలు లోకాలను దహిస్తాయేమో అని దేవతలు భయపడ్డారు. అందరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు. “ ఓ బ్రహ్మదేవా! విశ్వామిత్రుని మీరు మహర్షి అన్నారు. కాని ఆయన తప...

శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 64)

శ్రీమద్రామాయణము బాలకాండ అరవై నాల్గవ సర్గ దేవేంద్రుడు రంభను చూచి ఇలా అన్నాడు. “ఓ రంభా! విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నీవు నీ అందరందాలతో అతనిని వశపరచుకొని అతని తపస్సు భగ్నం చేయాలి. ఇది దేవతా కార్యము. నీవు చేయాలి. తప్పదు." అని అన్నాడు. ఆ మాటలు విన్న రంభ చేతులు జోడించి ఇలా పలికింది. “ఓ దేవేంద్రా! నీమాటలు మాకు శిరోధార్యము. కాని ఆ విశ్వామిత్రుడు మహా కోపిష్టి. నా చేష్టలకు ఆయన నన్ను కోపంతో శపించగలడు. నాకు చాలా భయంగా ఉంది. తరువాత మీ ఇష్టం.”అని చెప్పింది. దానికి దేవేంద్రుడు ఇలా అన్నాడు. “రంభా! నీకేం భయం లేదు. నేను, మన్మధుడు, కోకిలల రూపంలో నీ పక్కనేఉంటాము. సమ యానికి వచ్చి ఆదుకుంటాము. నీవేం భయపడపనిలేదు. నీ హావభావవిలాసములతో విశ్వామిత్రుని మత్తెక్కించు. నా మాట మన్నించు." అని అన్నాడు. రంభకు ఒప్పుకోక తప్పలేదు. సరే అని విశ్వామిత్రుని వద్దకు వెళ్లింది. ఆయన ముందు నాట్యం చేసింది. ఆడింది. పాడింది. విశ్వామిత్రుని దృష్టిని ఆకర్షించింది. విశ్వామిత్రుడు రంభను చూచాడు. అందంగా ఉంది అనుకున్నాడు. ఇంతలో విశ్వామిత్రునికి ఒక సందేహము కలిగింది. ఇది అంతా ఆ దేవేంద్రుని కుతంత్రము కాదు కదా అని అనుమాన పడ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 63)

శ్రీమద్రామాయణము బాలకాండ అరవై మూడవ సర్గ విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రంలో వేయి సంవత్సరములు తపస్సు చేసాడు. అతడి తపస్సుకు మెచ్చుకొన్న బ్రహ్మదేవుడు ఇతర దేవతలు అతనికి వరాలు ఇవ్వడానికి వచ్చారు. విశ్వామిత్రుని చూచి బ్రహ్మ “ఓ విశ్వామిత్రా! నీవు ఆచరించిన తపస్సు వలన నీవు ఋషివి అయ్యావు." అని చెప్పాడు. తరువాత బ్రహ్మ తన లోకమునకు వెళ్లిపోయాడు. కాని విశ్వామిత్రునికి తృప్తి కలగలేదు. తాను కూడా వసిష్ఠుని మాదిరి బ్రహ్మర్షి కావాలని ఆయన కోరిక. అందువల్ల మరలా తపస్సు చేయడం మొదలెట్టాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. ఒకరోజు మేనక అనే అప్సరస విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న ఆశ్రమమునకు దగ్గరలో ఉన్న ఒక కొలనులో స్నానం చేస్తూ ఉంది. విశ్వామిత్రుడు మేనకను చూచాడు. మేనక అందచందాలు చూచి మోహితుడైనాడు. ఆమె దగ్గరకు వెళ్లాడు. " ఓ అప్సరసా! నీకు నా ఆశ్రమమునకు స్వాగతము. నిన్ను చూచి నేను పరవశుడను అయ్యాను. మన్మధబాధకు తట్టుకోలేకున్నాను. నన్ను కరుణించు."అని వేడుకున్నాడు. విశ్వామిత్రుని కోరికను మన్నిచింది మేనక. విశ్వామిత్రుని ఆశ్రమంలోనే ఉండిపోయింది. పది సంవత్సరములు ఇద్దరూ సుఖంగా కాలం గడిపారు. అప్పుడు విశ్వామిత్రునికి జ్ఞాన...

శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 62)

శ్రీమద్రామాయణము బాలకాండ అరవై రెండవ సర్గ ఋచీకుని వద్దనుండి అతని కుమారుడైన శునశేపుని లక్షగోవులు ఇచ్చి కొనుక్నున్న అంబరీషుడు, అతనిని తన రథము మీద ఎక్కించుకొని తీసుకొని పోతున్నాడు. మార్గ మధ్యంలో పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ శునశేపునకు విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శునశేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. వారందరూ శునశేపుని విశ్వామిత్రుని వద్దకు తీసుకొని వెళ్లారు. శునశేపుడు మేనమామ ఒడిలో తల పెట్టుకొని ఏడిచాడు. “ఓ మహర్షీ! నాకు తల్లి లేదు. తండ్రిలేడు. ఇద్దరూ నన్ను వదిలేసారు. బంధువులు లేరు. కాబట్టి నన్ను తమరే రక్షించాలి. నీవు అందరినీ రక్షిస్తావు అని ప్రతీతి. కాబట్టి అంబరీషుని కార్యము నెరవేరేటట్టు, నాకు దీర్ఘాయుష్షు కలిగేటట్టు దీవించండి. మీరే నాకు తండ్రివంటివారు. తండ్రి కుమారుని రక్షించినట్టు తమరు నన్ను రక్షించండి. " అని వేడుకున్నాడు. శునశేపుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో జాలిపడ్డాడు. తన కుమారులను చూచి ఇలా అన్నాడు. “కుమారులారా! తండ్రులు పుత్రులను ఏ ఫలాన్ని ఆశించి కంటారో ఆ సమయము వచ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవై ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 61)

శ్రీమద్రామాయణము బాలకాండ అరవై ఒకటవ సర్గ ఆ ప్రకారంగా త్రిశంకు స్వర్గము సృష్టించి త్రిశంకును అక్కడ తలకిందులుగా నిలిపాడు విశ్వామిత్రుడు. తరువాత యాగమునకు వచ్చిను ఋషులతో ఇలా అన్నాడు. “ఇప్పటి వరకూ నేను దక్షిణ దిక్కున తపస్సు చేసాను. ఇక్కడ అన్నీ విఘ్నములు కలుగుతున్నాయి. ఇంక మీదట పడమర దిక్కున ఉన్న పుష్కర క్షేత్రములో తపస్సు చేసు కుంటాను.”అని అన్నాడు. ఆ ప్రకారంగా విశ్వామిత్రుడు పశ్చిమ దిక్కుగా ప్రయాణమై వెళ్లాడు. పుష్కర క్షేత్రము చేరుకున్నాడు. అది ఒక పవిత్రమైన వనము. అక్కడ విశ్వామిత్రుడు కేవలము ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేసాడు. అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అంబరీషుడు ఒక యాగము చేస్తున్నాడు. అంబరీషుడు యాగం చేయడం ఇష్టం లేని ఇంద్రుడు, యాగపశువును దొంగిలించాడు. యాగ పశువు కనపడకపోయేసరికి పురోహితుడు అంబరీషునితో ఇలా అన్నాడు. “రాజా! యజ్ఞపశువును ఎవరో తీసుకొని పోయారు. నీవు చేసిన అధర్మము వలననే ఈ ప్రకారము జరిగింది. దీనికి పాయశ్చిత్తము చేయాలి. నీవు యజ్ఞపశువును అయినా తీసుకొని రా లేక పోతే పశు వుకు బదులు ఒక మనిషిని అన్నా తీసుకొని రా. అప్పుడు యజ్ఞము పూర్తి అవుతుంది." అని అన్నాడు పుర...

శ్రీమద్రామాయణం - బాలకాండ - అరవయ్యవ సర్గ (Ramayanam - Balakanda - Part 60)

శ్రీమద్రామాయణము బాలకాండ అరవయ్యవ సర్గ ఆ ప్రకారంగా వసిష్టకుమారులను, మహెూదయుని శపించిన తరువాత అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, బ్రాహ్మణులను, ఋషులను చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. "ఇక్ష్వాకు వంశ రాజు, పరమ ధార్మికుడు అయిన త్రిశంకు నా వద్దకు తనను సశరీరంగా స్వర్గమునకు పంపేటందుకు ఒక యజ్ఞము చేయించమని నా సహాయము కోరాడు. ఆయన కోరికను నేను మన్నించాను. త్రిశంకును ఈ శరీరంతో స్వర్గమునకు పంపడానికి నేను ఒక యజ్ఞము చేస్తున్నాను. ఆ యజ్ఞమునకు మీరందరూ సాయపడాలి." అని అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న ఋత్విక్కులు, బ్రాహ్మణులు, ఋషులు తమలో తమరు ఇలా అనుకున్నారు. “ఈ విశ్వామిత్రుడు మహా కోపిష్టి. మన కళ్ల ముందే వసిష్ఠకుమారులను దారుణంగా శపించాడు. ఆయన మాట వినక పోతే మనలకు కూడా శపించగలడు. అందుకని ఆయన చెప్పినట్టు చెయ్యడమే ప్రస్తుత కర్తవ్యము" అని అనుకున్నారు. తరువాత విశ్వామిత్రునితో ఇలా అన్నారు. “ఓ విశ్వామిత్ర మహర్షీ! నీవు చెప్పినట్లే మేము చేస్తాము. యజ్ఞమును ప్రారంభం చేస్తాము."అని అన్నారు. తరువాత అందరూ కలిసి యజ్ఞము ఆరంభించారు. యజ్ఞమునకు యాజకుడుగా విశ్వామిత్రుడు ఉన్నాడు. ఋత్విక్కులు వేద మంతములు చదువుతు...

శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 59)

శ్రీమద్రామాయణము బాలకాండ యాభై తొమ్మిదవ సర్గ ఛండాలరూపంలో ఉన్న త్రిశంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలి పడ్డాడు. అతని తో ఇలా అన్నాడు. "ఓ శంకూ బాధ పడకు. నిన్ను, నీ కోరికను, నేను స్వాగతిస్తున్నాను. భయపడకు. నీ వంటి ధర్మాత్మునకు నేను సాయ పడతాను. నీచేత యాగము చేయిస్తాను. ఎంతో మంది మహా ఋషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను. నిన్ను ఇదే శరీరముతో అంటే ఈ ఛండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను. నీవు నా శరణు పొందావు. నీకు ఏం భయంలేదు. స్వర్గము నీ అరిచేతిలో ఉన్నట్టే."అని అన్నాడు విశ్వామిత్రుడు. వెంటనే తన కుమారులను పిలిచాడు. యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు. విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు. “మీరందరూ వెళ్లి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు. అందరూ రండి అని బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను అందరినీ ఆహ్వానించండి. వారిని మీ వెంట తీసుకొని రండి."అని ఆజ్ఞాపించాడు.  విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు ఆయన శిష్యులు అందరూ నలు దిక్కులకు వెళ్లారు. బ్రాహ్మణులను, ఋత్విక్కులను, ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు. ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నా...

శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 58)

శ్రీమద్రామాయణము బాలకాండ యాభై ఎనిమిదవ సర్గ త్రిశంకు ఆ మాటలు అంటున్నంత సేపూ వసిష్ఠుని కుమారులు కోపంతో ఊగి పోతున్నారు. వారి కోపము కట్టలు తెంచుకొంది. "ఓ త్రిశంకూ! నీవు దుర్బుద్ధివి. చెడ్డవాడివి. నీ కుల గురువు వసిష్ఠుడు. ఆయన సత్యసంధుడు. ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ల గలవు? నీకే కాదు, వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకే పురోహితుడు. గురువు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అటువంటి కులగురువు మాటను నీవు ఎలా అతిక్రమి స్తున్నావు? మా తండ్రిగారు, నీ కులగురువు అయిన వసిష్ఠుడు తన వల్లకాదు అని చెప్పిన యజ్ఞమును మేము ఎలా చేయిస్తాము అని అనుకున్నావు? నీవు మూర్ఖుడవు. లేకపోతే సశరీరంగా స్వర్గమునకు పోవడం సాధ్యమా కాదా అని కూడా తెలుసుకోలేక పోతున్నావు. వసిష్ఠుడు మూడు లోకములలో ఎవరిచేతనైనా ఎటువంటి యాగము నైనా చేయించగల సమర్ధులు. అటువంటి వసిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభమో అర్థం చేసుకో. ఆయన కాదు అన్న యాగమును మేము చేయించి ఆయనను అవమానించలేము. కాబట్టి, వెంటనే నీవు తిరిగినీ నగరమునకు వెళ్లు. ఈ దుష్ట ఆలోచన మానుకో." అని కోపంతో పలికారు వసిష్ఠుని కుమారులు. ఆ మాటలు విన్న త్రిశంకు వినయంతో వార...

శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 57)

శ్రీమద్రామాయణము బాలకాండ యాభై ఏడవ సర్గ "ఓ రామా! వసిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తరువాత, ఆ అవమాన భారము తట్టుకోలేని విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్లాడు. అక్కడ కేవలం ఫలములు మాత్రము ఆహారముగా తీసుకుంటూ, ఘోరమైన తపస్సుచేసాడు. ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, ధృడనేతుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మించారు. అప్పటికి వేయి సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “ఓ విశ్వామిత్రా! నీ తపస్సునకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడవు. ఇప్పుడు బ్రాహ్మణత్వము అవలంబించి తపస్సు చేసావు. అందుచేత నీవు రాజర్షివి అయ్యావు." అని పలికాడు. తరువాత బ్రహ్మదేవుడు స్వర్గలోకమునకు వెళ్లిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు. పైగా కోపం వచ్చింది. ఇంత కాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా. నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు. బ్రహ్మర్షి అని పిలువబడేవరకు తపస్సు చేస్తాను. అని నిర్ణయించుకున్నాడు.  మరలా తపస్సు చేయడం మొదలు పెట్టాడు విశ్వామిత్రుడు. ఆవిధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష...

శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 56)

శ్రీమద్రామాయణము బాలకాండ యాభై ఆరవ సర్గ వసిష్ఠుడు రెండవ యమ దండము మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మ దండము పట్టుకొని “ఓరి దుష్టుడా! నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలువ లేవు. నీ అస్త్రశస్త్రములను సర్వనాశనం చేస్తాను" అని విశ్వామితుని ఎదురుగా నిలబడ్డాడు. విశ్వామిత్రుడు వసిష్ఠుని లెక్క చెయ్యలేదు. వసిష్ఠునిమీద ఆగ్నేయాస్త్రము ప్రయోగించాడు. వసిష్టుని బ్రహ్మదండము ముందు ఆ ఆగ్నేయాస్త్రము నీటి ముందు అగ్ని మాదిరి శాంతించింది. వెనక్కు తిరిగి పోయింది. తరువాత విశ్వామిత్రుడు తాను మహాశివుని వలన పొందిన వారుణాస్త్రము, రుద్ర అస్త్రము, ఇంద్రాస్త్రము, పాశు పతాస్త్రము, ఇషీకాస్త్రము, మానవాస్త్రము, మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, స్వపనాస్త్రము, జృంభణాస్త్రము, మాదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, వరుణ పాశము, పైనాక, దైత అస్త్రములు, శుష్కము, ఆర్ధము, దారుణము మొదలగు అస్త్రములు, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములు, ధర్మ చక్రము, కాల చక్రము, విష్ణుచక్రములను, వాయవ్యాస్త్రము, మదనాస్త్రము, హయశిరోస్త్రము, కంకాళము, ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 55)

శ్రీమద్రామాయణము బాలకాండ యాభై ఐదవ సర్గ కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామితుని పరాక్రమమునకు చెల్లా చెదరు కావడం చూచాడు వసిష్ఠుడు. “ఓ కామధేనువా! ఇంకా సేనలను సృష్టించు.” అని ఆదేశిం చాడు వసిష్ఠుడు.  మరలా కామధేనువు అంబా అని అరిచింది. ఆ అంబారవము నుండి సూర్య తేజస్సుతో సమానమైన కాంభోజవీరులు పుట్టారు. ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి. ఆవు కాళ్ల నుండి ప్లవులు అనే సేనలు, యోనినుండి యవనులు, గోమయమునుండి శకులు, ఆవు రోమకూపముల నుండి మ్లేచ్ఛులు పుట్టారు. వారందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేసారు. తమ సేనలు నాశనం కావడం చూచారు విశ్వామిత్రుని నూర్గురు కుమారులు. వారందరూ ఒక్కుమ్మడిగా వసిష్ఠుని మీదికి దుమికారు. వసిష్ఠుడు తన తపశ్శక్తితో వారిని తుదముట్టించాడు. తన కుమారులు, సైన్యము నాశనం కావడం కళ్లారా చూచాడు విశ్వామిత్రుడు. చాలా సేపు చింతించాడు, సిగ్గుపడ్డాడు. విశ్వామిత్రుని శౌర్యము, సాహసము, పరాక్రమము ఎందుకూ పనికిరాకుండా పోయూయి. కొడుకులను పోగొట్టుకున్న విశ్వామితుడు రెక్కలు తెగిన పక్షిమాదిరి మిగిలిపోయాడు. తుదకు ఒక కుమారుడు బతికి ఉ న్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ కుమారునికి రాజ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 54)

శ్రీమద్రామాయణము బాలకాండ యాభై నాల్గవ సర్గ ఈ ప్రకారంగా వసిష్ఠుడు కామధేనువు ఇవ్వడానికి ఎంతకూ ఒప్పుకోలేదు. అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామ ధేనువును బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడిచింది. తనలో తాను ఇలా అనుకొంది. “ఇదేమిటి. ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఇంతకాలము నేను వసిష్ఠుని వద్ద ఉన్నాను కదా. వసిష్ఠుడు నన్ను విడిచి పెట్టినాడా! లేక పోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకొని పోతాడు. ఈ మహర్షికి నేను ఏమి అపకారం చేసాను. ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేసాను కదా. ఈ రోజుకూడా వసిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనము సమకూర్చాను కదా! మరి ఎందుకు నన్ను వదిలివేసాడు. ఆయననే అడుగుతాను." అని తనలో తాను అనుకుంది. వెంటనే ఒక్కసారి హుంకరించింది. తనను పట్టుకొన్న భటులను విదిల్చి కొట్టింది. పరుగుపరుగున వసిష్ఠుని వద్దకు వెళ్లింది. ఏడుస్తూ వసిష్ఠునితో ఇలా పలికింది. "ఓ బ్రహ్మర్షీ! దుర్మార్గులైన రాజ భటులు నన్ను నీ వద్దనుండి లాక్కొని పోతున్నారు. నన్ను వారికి ఇచ్చేసావా. నేను ఏం అపరాధము చేసానని నన్ను వాళ్లకి ఇచ్చావు." అని అడిగింది కామధేన...

శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 53)

శ్రీమద్రామాయణము బాలకాండ యాభై మూడవ సర్గ వసిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమ కూర్చింది. చెరకు గడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు అడిగినవారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనము చేసారు. వసిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు. విశ్వామిత్రుడు, అతని అంత:పుర కాంతలు, వారి వెంటవచ్చిన పురోహితులు, పరివారము, అందరూ ఎంతో సంతోషించారు. అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠునితో ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! నీ ఆతిథ్యమునకు మేమందరమూ ఎంతో ఆనందించాము. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి లక్ష గోవులను ఇస్తాను. ఈ కామధేనువు నాకు ఇవ్వండి. ఓ మహర్షీ! ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యములో ఉన్న సంపద అంతా రాజు యొక్క అధీనము కదా! కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనము. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి." అని అడిగాడు. ఆ మాటలకు వసిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు. “ఓ విశ్వామిత్రా! నీవు వందల వేల ఆవులు ఇచ్చినను, వెండి బంగారము రాసులు ఇచ్చినను. నా కామధేనువును నేను నీకు ఇవ్వను. ఇది నా ప్రాణము. మా బం...

శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 52)

శ్రీమద్రామాయణము బాలకాండ యాభై రెండవ సర్గ విశ్వామిత్రుడు వసిష్ఠుని చూచి వినయంగా నమస్కారం చేసాడు. వసిష్ఠమహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానిం చాడు. అర్ఘ్యము పాద్యము ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను, కందమూలములను ఆహారంగా ఇచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు వసిష్ఠుని ఇలా అడిగాడు. “ఓ మహర్షీ! మీకు మీ శిష్యులకు క్షేమమే కదా! మీ ఆశ్రమములో అందరూ సుఖంగా ఉన్నారు కదా! మీ తపస్సు అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా! " అని అడిగాడు. “విశ్వామిత్ర మహారాజా! తమ పాలనలో మేమందరమూ సుఖంగానే ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు. మీరు క్షేమంగా ఉన్నారా! మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా! రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా! నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మీరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా! నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా! నీవు శత్రుసంహారము చేసి, శాంతి స్థాపన చేసావు కదా! ఓ విశ్వామిత్రా! నీ సేనలు, నీ కోశాగారము, నీ మిత్రులు, నీ పుత్రులు అందరూ క్షేమమే కదా! " అని కుశల ప్రశ్నలు అడిగాడు వసిష్ఠుడు. వసిష్ఠుడు అడిగిన దానికి “ఓ మహర్షీ! తమరి దయవలన అంతా సవ్యంగానే ఉంది. మేమందరమూ ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభై ఒకటవ సర్గ (Ramayanam - Balakanda - Part 51)

శ్రీమద్రామాయణము బాలకాండ యాభై ఒకటవ సర్గ జనకుని పక్కను ఉన్న శతానందుడు విశ్వామితుని మాటలు విని పరమానంద భరితుడు అయ్యాడు. వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు. " ఓ మహర్షీ! శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా! నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా! మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసినదా! దైవము ప్రతికూలించడం వలన మా తల్లి గారికి జరిగిన దురదృష్టము గురించి వివరంగా చెప్పావా! రాముని అర్చించిన తరువాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్లినదా! మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరిం చాడా! నా తండ్రి అయిన గౌతముడు శ్రీ రాముని పూజించాడా! అతిధి సత్కారములు చేసాడా! శ్రీ రాముడు నా తండ్రిని ఆదరించాడా! గౌరవించాడా! మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా!" అని శతానందుడు ఆతురతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు. “ఓ శతానందా! నేను చెప్పవలసినది అంతా రామునికి చెప్పాను. చేయవలసినది అంతా చేసాను. రేణుకా దేవి జమదగ్నిని చేరి నట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరినది." అని విశ్వామిత్రుడు శతానందునితో అన్నాడు. ఆ మాటల...

శ్రీమద్రామాయణం - బాలకాండ - యాభయ్యవ సర్గ (Ramayanam - Balakanda - Part 50)

శ్రీమద్రామాయణము బాలకాండ యాభయ్యవ సర్గ రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, మునులు అందరూ మిథిలా నగరము చేరుకున్నారు. జనకుడు చేయు యాగమునకు వచ్చిన ఆహూతులతో మిథిలా నగరము కిక్కిరిసి పోయింది. యాగమునకు వచ్చిన మునులకు వేసిన ఋషివాటికలతో మిథిలా నగరము నిండిపోయింది. అప్పుడు రాముడు విశ్వామితుని చూచి ఇలా అన్నాడు. “ఓ మునీంద్రా! ఇక్కడ అంతా జనసమ్మర్దముగా ఉంది. మనకు ఉండుటకు తగిన ప్రదేశమును నిర్ణయింపుడు." అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు జనసమ్మర్దములేని ప్రదేశములో, జలము బాగా దొరికే ప్రదేశములో తమకు అతిథిగృహమును ఏర్పాటు చేసాడు. ఇంతలో జనకునకు విశ్వామిత్రుడు యాగమునకు వచ్చాడు అన్న విషయం తెలిసింది. జనక మహారాజు తన పురోహితుడు అయిన శతానందుని, ఋత్విక్కులను వెంట బెట్టుకొని విశ్వామితుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునకు అర్ఘ్యము పాద్యము అర్పించి పూజించాడు. జనకుడు ఇచ్చిన ఆతిథ్యమును సంతోషంతో స్వీకరించాడు విశ్వామిత్రుడు. "ఓ జనక మహారాజా! నీకు క్షేమమేనా! నీ రాజ్యములో ప్రజలు క్షేమముగా ఉన్నారా! యజ్ఞము ఎట్టి అవాంతరములు లేకుండా సక్రమంగా జరుగుతూ ఉందా!" అని అడిగాడు. తరువాత విశ్వామిత్రుడు అక్కడకు వచ్చిన ఋత్విక్కుల...

శ్రీమద్రామాయణం - బాలకాండ - నలభై తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 49)

శ్రీమద్రామాయణము బాలకాండ నలభై తొమ్మిదవ సర్గ ఆ ప్రకారంగా గౌతముని శాపముతో ఇందుని వృషణములు కిందపడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరకు వచ్చిన అగ్ని, మొదలగు దేవతలతోనూ, ఋషులతోనూ ఇలా అన్నాడు. “నేను మీ కోసం ఇదంతా చేసాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేసాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేసాను. తద్వారా దేవ కార్యము సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీ కోసం ఇదంతా చేసాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరలా వచ్చేట్టు చెయ్యాలి.” అని అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుని మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలు అందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్లారు. “ఓ పితృ దేవతలారా! మానవుడు యజ్ఞములు చేయునపుడు మేషములను(మేకలు, గొర్రెలు) బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయములో మీకు ఇవ్వబడిన మేషము యొక్క వృషణములను మీరు వృషణములు లేని దేవేంద్రునికి ఇవ్వండి.” అని అన్నాడు. అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములలో అర్పించిన వృషణములను దేవేంద్రునికి ఇచ్చారు. మేషము యొక్క వృషణము లను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు య...