Posts

Showing posts from April, 2024

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 35)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ముప్పది ఐదవ సర్గ శూర్పణఖ చెప్పిన విషయాలను సావధానంగా విన్నాడు. రావణుడు. సభచాలించాడు. మంత్రులకు దండనాధులకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. శూర్పణఖ చెప్పిన విషయములను ఒకటికి రెండు సార్లు ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. శూర్పణఖ మాటల్లో అతనికి నచ్చింది సీత సౌందర్యవర్ణన. ఎక్కడ తగలాలో అక్యడే తగిలింది శూర్పణఖ వదిలిన మాటల బాణము. అంతా రహస్యంగా జరగాలి అనుకున్నాడు. మారువేషంలో రథశాలకు వెళ్లాడు. సారధిని వెంటనే రథము సిద్ధం చేయమన్నాడు. సారథి రథం సిద్ధం చేసాడు. రథానికి గాడిదలను కట్టాడు. వాటి ముఖాలు పిశాచాల మాదిరి ఉన్నాయి. రావణుడు రథం ఎక్కి సముద్రం వైపుకు వెళ్లాడు. రావణుడు సముద్రం తీరం వెంట తన రథములో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఎన్నో ముని ఆశ్రమములను చూస్తున్నాడు. ఆ అరణ్యములలో నాగులు, పక్షులు, గంధర్వులు, కింనరులు, వైఖానసులు, వాలఖిల్యులు, ఋషులు, సిద్ధులు, చారణులు స్వేచ్ఛగా నివసిస్తున్నారు. దారిలో రావణునికి దేవతలు ప్రయాణిస్తున్న విమానాలు కనపడుతున్నాయి. ఈ ప్రకారంగా అనేకములైన అరణ్యములను ఉద్యానవనములను, సరస్సులను దాటుకుంటా ప్రయాణిస్తున్నాడు రావణుడు. రావణుడు ప్రయాణిస్తున్న ప్రదేశమును...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 34)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ముప్పది నాలుగవ సర్గ నిండు సభలో, మంత్రి సామంత దండనాధుల ముందు తనను తన చెల్లెలు శూర్పణఖ ఆ ప్రకారంగా కించపరిచి మాట్లాడటం సహించలేకపోయాడు రావణుడు. ఆమె మాటలలో నిజం ఉన్నా, ఆ నిజాన్ని ఒప్పుకోడానికి అతని అహం అంగీకరించలేదు. అందుకని పెద్ద స్వరంతో ఇలా అన్నాడు. "శూర్పణఖా! ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? రాముడు రాముడు అంటున్నావు. ఎవరా రాముడు! అతని బలపరాక్రమములు ఏపాటివి? అతను ఎలా ఉంటాడు? అతడు దండకారణ్యములోకి ఎందుకు ప్రవేశించాడు? నా సోదరులు ఖరుని, దూషణుని చంపాడు అంటున్నావు. అతని వద్ద ఏయే ఆయుధములు ఉన్నాయి. అనవసరమైన మాటలు మాని అసలు విషయం చెప్పు!" అని అన్నాడు రావణుడు. అప్పటికి శూర్పణఖకు కూడా ఆవేశం చల్లారింది. రావణునికి ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిది అని తలచి ఇలా చెప్పసాగింది. “ఓ రాక్షసేంద్రా! ఆ రాముడు అయోధ్యాధిపతి దశరథుని కుమారుడు. అతడు ఆజానుబాహుడు. అరవిందళాయతాక్షుడు. ముని వేషములో ఉన్నాడు కానీ ధనుర్బాణములను ధరించాడు. సౌందర్యములో మన్మధుని మించినవాడు. అతడు నారాచ బాణములను అత్యంత వేగముగా ప్రయోగించగల నేర్పుగలవాడు. అతడు ఎప్పుడు బాణం తీస్తాడో ఎప్పుడు సంధిస్తాడో ఎప్పుడు...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 33)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ముప్పది మూడవ సర్గ “అన్నా రావణా! అక్కడ జనస్థానములో జరగకూడని ఘోరాలు జరిగిపోతూ ఉంటే నువ్వు ఇక్కడ, సంతోషంగా బంగారు సింహాసనము మీద కూర్చుని రాజభోగములు, అంత:పుర స్త్రీలతో కామసుఖాలు అనుభవిస్తున్నావా! నీ రాజ్యములో ఏమి జరుగుతూ ఉందో తెలుసుకోవాలి అన్న జ్ఞానం కూడా నీకు లేదా! నీ వలె కామోప భోగములలో మునిగి తేలుతూ రాజ్యక్షేమమును మరిచే రాజును ప్రజలు గౌరవించరు. అది తెలుసుకో! రాజు ఏ కాలంలో చేయాల్సిన పనులను ఆయాకాలములలో చేయక పోతే, ఆ రాజు, అతని రాజ్యము నశించిపోవడం తథ్యం. ప్రజలకు దూరంగా ఉంటూ, గూఢచారుల ద్వారా ప్రజల కష్టనష్టములు తెలుసుకోకుండా, ఇంద్రియలోలుడై ప్రవర్తించేరాజును ప్రజలు పదవీచ్యుతుడిని చేస్తారు. తమ ఇంద్రియములను తాము నిగ్రహించుకోలేని రాజులు, ప్రజలను ఏమి రక్షిస్తారు? అత్యంత బలవంతులైన దేవతలు, గంధర్వులు, దానవులు నీకు ప్రబల విరోధులు. వారి వలన నీకు ఎప్పుడూ ముప్పు పొంచి ఉంది. కాని నీవు వారి కదలికలను గూఢచారుల వలన తెలుసుకోకుండా ప్రమత్తుడవై ఉంటున్నావు. అటువంటి వాడివి నీవు రాజుగా ఎలా ఉండగలవు? ఓ రావణా! రాజు అయిన వాడు తన కోశాగారమును, గూఢచార వ్యవస్థను, పరిపాలనా వ్యవహారములను, తన అధీనములో...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 32)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ముప్పది రెండవ సర్గ తన అన్నలు ఖరుడు, దూషణుడు, వారి 14,000 సైన్యము తన కళ్లముందు నాశనం కావడం చూచి తట్టుకోలేక పోయింది శూర్పణఖ. ఒక్క రాముని చేతిలోనే ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు చావడం చూచి పెద్దగా కేకలుపెట్టింది. భయంతో శూర్పణఖ వణికిపోయింది. వెంటనే ఈ విషయం తన అన్న రావణునకు చెప్పడానికి శూర్పణఖ లంకకు పరుగెత్తింది. లంకానగరంలో, రావణుడు, మూర్తీభవించిన దేవేంద్రుని వలె, సభాప్రాంగణంలో, తన బంగారు సింహాసనము మీద, కూర్చుని ఉన్నాడు. రావణుని చుట్టు అతని మంత్రులు కూర్చుని ఉన్నారు. రావణుడు సామాన్యుడు కాడు. దేవతలను, గంధర్వులను యుద్ధములో గెలిచినవాడు. ముల్లోకములలో అతనికి తిరుగు లేదు. శత్రువులకు యముడు లాగా వెలుగుతున్నాడు రావణుడు. దేవాసుర యుద్ధములో అతని శరీరమునకు ఇంద్రుని వజ్రాయుధము వలనా, విష్ణువు చక్రాయుధము వలన తగిలిన గాయముల మచ్చలు అతని విజయాలకు చిహ్నాలుగా రావణుని ఒంటిమీద ప్రకాశిస్తున్నాయి. రావరణుని ఒంటికి తగిలి దేవతల ఆయుధములు తమ శక్తిని కోల్పోయాయి. రావణుడు దశకంఠుడు. అంటే పది తలలు కలవాడు. అతనికి ఇరువది చేతులు, పది తలలు. ఆ కనకపు సింహాసనము మీద వెండి కొండమాదిరి ప్రకాశిస్తున్నాడు రావణుడు. ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 31)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ముప్పది ఒకటవ సర్గ (ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు. ఇది ప్రక్షిప్తము అనగా తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము) ఖరుడు, దూషణుడు తమతమ సేనలతో సహా యుద్ధంలో మరణించారు అన్న వార్త జనస్థానంలో దావానలంలా పాకిపోయింది. వెంటనే అకంపనుడు అనే రాక్షసుడు లంకానగరానికి బయలు దేరాడు. రావణుని కలుసుకున్నాడు. “ఓ రావణా! నేను జనస్థానము నుండి వస్తున్నాను. అక్కడ మీ ప్రతినిధులుగా ఉన్న ఖరుడు, దూషణుడు, వారి సైన్యము పూర్తిగా యుద్ధంలో చంపబడ్డారు. నేను మాత్రము తప్పించుకొని ఈ వార్త తమకు చెబుదామని వచ్చాను.” అని జరిగింది క్లుప్తంగా వివరించాడు. ఆ మాటలు విన్న దశగ్రీవుడు కోపంతో మండి పడ్డాడు. అకంపనుని చూచి ఇలా అన్నాడు. "ఓ అకంపనా! ఇది నిజమా! నా అధీనంలో ఉన్న జనస్థానమును నాశనం చేసి, ఖరదూషణాదులను చంపిన వాడు ఎవరు? వాడికి ఆయువు మూడిందా! లేకపోతే ఇలా ఎందుకు చేస్తాడు. నాకు అపకారము చేసిన తరువాత దేవేంద్రుడైనా, కుబేరుడైనా, యముడైనా ఆఖరుకు విష్ణువైనా సుఖంగా బతకలేరు కదా! ఇంక వీడెంత? వాడెవరో వాడికి నా సంగతి తెలియనట్టుంది. నేను యముడికి యముడను. అగ్నిని కూడా కాల్చివేయగల సమర్థుడను. మృత్యుదేవతకే మృత్యువును. నాకు కో...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ముప్పదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 30)

శ్రీమద్రామాయణము అరణ్య కాండము ముప్పదవ సర్గ రాముడు ఖరుని గదను తుత్తునియలు చేయగానే ఖరుడు నివ్వెరపోయాడు. రాముడు ఖరుడు అప్పటిదాకా మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరము ఇచ్చాడు. “ఓ రాక్షసాధమా! నీ బలం ఎంతో తేలిపోయింది కదా! వృధాగా అరుస్తావు ఎందుకు. ఏ గదాఘాతముతో నన్ను చంపుదామనుకున్నావో ఆ గద నా బాణఘాతముతో విరిగి ముక్కలై నేలమీద పడిపోయింది. మరి ఇప్పుడు నీవు పోయి మరణించిన నీ సైనికుల బంధుమిత్రుల కన్నీళ్లు ఎలా తుడుస్తావు. నీ మాటలు వమ్ముఅయినట్లే కదా! దుష్టుడు, దుర్మార్గుడు అయిన నిన్ను చంపడానికి నాకు కారణం ఉంది. నీవు చంపదగ్గవాడవు. అందుకే నిన్ను చంపుతున్నాను. నీ కంఠమును తెగనరుకుతాను. నీ నెత్తురుతో భూమాతను తడుపుతాను. నీకు భూపతనము తప్పదు. నిన్ను చంపి ఈ దండకారణ్యమును శత్రుపీడ, రాక్షస పీడ లేకుండా చేస్తాను. ఇప్పటి దాకా ఈ దండకారణ్యములో నిత్యము బ్రాహ్మణులను, మునులను నీవు నీ పరివారము బాధిస్తున్నారు, చంపుతున్నారు. ఈ రోజు నుంచి ఈ దండకారణ్యములో ఋషులు, మునులు, బ్రాహ్మణులు నిర్భయంగా తపస్సు చేసుకొనేలా చేస్తాను. ఎంతోమంది ఋషులకు, మునులకు ఈ దండకారణ్యము ఆశ్రయము కాగలదు. ఇప్పటి దాకా ఋషులను, మునులను భయపెడుతూ, వారి యజ్ఞయాగములను నాశ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 29)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఇరువది తొమ్మిదవ సర్గ ఒంటరిగా గద ధరించి తన మీదికి వస్తున్న ఖరుని చూచి రాముడు ఇలా అన్నాడు. “ఓ రాక్షసాధమా! నీవు సామాన్యుడివి కావు. చతురంగ బలములు కలిగిన 14,000 మంది సేనలకు అధిపతివి. కాని సాధు జనులు అసహ్యించుకొనే ఎన్నో అకృత్యాలు చేసావు. నీవలన సాధు జనులకు ప్రాణ భయం కలిగింది. ఎల్లప్పుడూ పాపకృత్యములు చేసే నీ వంటి పాపాత్ముడు ఎల్లకాలము జీవించలేడు. అతని పాపములే అతనిని నాశనం చేస్తాయి. అసలు నిన్ను ఆ జనులే చంపాల్సింది. కానీ వారి బదులుగా నేను నిన్ను చంపుతున్నాను. కాని నీవు చేస్తున్నది తప్పు, పాపము అని నీకు తెలియదు. అందుకే ఇన్ని పాపపు పనులు చేసావు. చేసిన పాపములకు ఫలితము అనుభవిస్తున్నావు. ఈ దండకారణ్యములో ఎంతో మంది ఋషులు, మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు. వారు నీకు ఏమి అపకారము చేసారని వారిని అనేక బాధలు పెట్టావు. అడ్డం వచ్చిన వారిని చంపావు. నీకు ధనబలము, అంగ బలమ, సైనిక బలము ఉంది కదా అని విర్రవీగావు. కాని సాధుజనుల ఆగ్రహము ముందు నీ బలము నిలువలేదు. అందుకే పతనమయ్యావు. నీవే కాదు ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా తాను చేసిన పాపపు పనులకు ఫలితమును అనుభవింపక తప్పదు. విషం కలిపిన అన్నం...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 28)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఇరువది ఎనిమిదవ సర్గ రాముని మీదికి పోతున్నాడే కానీ ఖరునికి లోలోపల భయంగానే ఉంది. ఎందుకంటే అప్పటికే రాముడు మహా వీరులు, అసమాన బలవంతులు అయిన దూషణుని, త్రిశిరుని సంహరించాడు. ఇంక తన వంతు వచ్చింది అనుకున్నాడు. పైగా సైన్యము అంతా నశించి పోయింది. కొద్దిమంది మాత్రమే మిగిలి ఉన్నారు. కొద్దిమందితో రాముని ఎదుర్కోగలనా అని సందేహిస్తున్నాడు. కానీ ధైర్యంగా ముందుకు దూకాడు. ఖరుడు రాముని మీద నారాచములను(ఇనుప ములికలు అమర్చిన బాణములను) ప్రయోగించాడు. ఖరుడు ఒక చోట ఉండకుండా రణభూమి అంతా కలయ తిరుగుతూ, బాణ ప్రయోగం చేస్తున్నాడు. రాముని కదలనీయకుండా నాలుగు దిక్కులను తన బాణములతో కప్పివేసాడు. రాముడు తన ధనుస్సు ఎక్కుపెట్టాడు. ఖరుడు సంధించిన బాణములను ఛిన్నాభిన్నం చేసాడు రాముడు. తన బాణములతో ఆకాశం అంతా నింపాడు రాముడు. సూర్యుడు కూడా కనపడటం లేదు. రాముడు ఖరుడు ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు. ఖరుడు రాముని మీద నారాచములు, నాళీకములు, వికర్ణికలు మొదలగు బాణపరంపరలు ప్రయోగించాడు. ఆ సమయంలో రథము మీద ఉన్న ఖరుడు యమధర్మరాజు మాదిరి కనిపించాడు. అప్పటికే యుద్ధము చేసి పదునాలుగువేలమంది రాక్షసులను చంపిన రాముడు బాగా ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది ఏడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 27)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఇరువది ఏడవ సర్గ త్రిశిరస్సుడు అనే సైన్యాధిపతి ఖరుడు రాముని వైపు దూసుకువెళ్లడం చూచాడు. వెంటనే త్రిశిరస్సుడు ఖరుడి వద్దకు వచ్చాడు. “ఓ వీరుడా! ఒక సాధారణ మానవుని సంహరించడానికి నీవు వెళ్లవలెనా! మేము లేమా! నాకు అనుజ్ఞ ఇమ్ము. నేను వెళ్లి రాముని సంహరిస్తాను. ఈ రాముడి చావు నా చేతిలో ఉంది. నేను చంపుతాను. లేకపోతే రాముని చేతిలో నేను చస్తాను. నువ్వు మాత్రం చూస్తూ ఉండు. ఒక వేళ నేను రాముణ్ణి చంపితే మనం అందరం ఆనందంతో జనస్థానమునకు వెళ్లాము. లేక రాముడు నన్ను చంపితే, అప్పుడు నువ్వే వెళ్లి రాముని చంపవచ్చును." అని అన్నాడు త్రిశిరుడు. ఆమాటలు విన్న ఖరుడు ఆనందంతో త్రిశిరునికి రామునితో యుద్ధము చేయమని అనుమతి ఇచ్చాడు. త్రిశిరుడు తన రథము ఎక్కి రాముని మీదికి యుద్ధమునకు వెళ్లాడు. రాముని మీద బాణములను వర్షము వలె కురిపించాడు. ఆ బాణములనన్నింటికీ రాముడు మధ్యలోనే తుంచాడు. రాముడు త్రిశిరస్సుల మధ్య పోరు భయంకరంగా జరిగింది. త్రిశిరుడు రాముని నుదుటిపై తగిలేటట్టు మూడు బాణములను వదిలాడు. రాముడు కోపించి సర్పములవలె దూసుకు వెళ్లే నాలుగు బాణములను త్రిశిరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. మరొక నాలుగు బ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 26)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఇరువది ఆరవ సర్గ తన సైన్యము అంతా రాముని బాణములకు ఆహుతి కావడం చూచాడు దూషణుడు. దూషణుడు తన వెంట వచ్చిన రాక్షస సేనలను ఐదువేల మందిని తీసుకొని రాముని మీదికి వెళ్లాడు. ఆ ఐదువేల మంది రాక్షస సైన్యము రాముని చుట్టు ముట్టారు. రాముని మీద శూలములు, పట్టిసములు, కత్తులు, రాళ్లు, చెట్లు, బాణములు వర్షంలా కురిపిస్తున్నారు. రాముడు కూడా తన బాణములతో వారు తన మీదికి విసురుతున్న శూలములను, పట్టిసములను, కత్తులను, చెట్లను, సమర్ధంగా ఎదుర్కొంటున్నాడు. రాక్షసులు తన మీద ఆయుధములు ప్రయోగించే కొద్దీ రాముని కోపం పెరుగుతూ ఉంది. రాముడు వేలకొలది బాణములతో దూషణుని సైన్యమును కప్పివేసాడు. ఇది చూచిన దూషణుడు రాముని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. రాముడు అర్ధచంద్రాకారములో ఉన్న బాణముతో దూషణుని విల్లు విరిచాడు. నాలుగుబాణములతో దూషణుని రథమునకు కట్టిన హయములను చంపాడు. మరొక అర్థచంద్రబాణముతో సారధి తల నరికాడు. మూడుబాణములతో దూషణుని కొట్టాడు. దూషణుని ధనుస్సు విరిగింది. రథం కూలింది. సారథి చచ్చాడు. దూషణుడు నేలమీదికి దూకాడు. ఒక పెద్ద పరిఘను తీసుకున్నాడు. రాముని మీదికి పరుగెత్తాడు. అది చూచి రాముడు రెండు బాణములతో దూ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 25)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఇరువది ఐదవ సర్గ ఖరుడు తన రధాన్ని తన సేనల ముందు నిలబెట్టాడు. ధనుర్బాణములతో నేలమీద నిలుచుని ఉన్న రాముని చూచాడు. "రథమును రాముని మీదికి నడిపిపంచు" అని సారధిని ఆజ్ఞాపించాడు ఖరుడు. ఖరుని ఆజ్ఞను అందుకొని సారథి రథమును రాముని మీదికి పోనిచ్చాడు. అది చూచి రాక్షస సేనలు కూడా రాముని మీదికి తమ తమ రథములను నడిపించాయి. రాముని చుట్టుముట్టాయి. రాముని మీద బాణముల వర్షము కురిపించాయి. ఆ బాణఘాతములను రాముడు చిరునవ్వుతో స్వీకరించాడు. ఆ బాణములు తన దేహమును బాధించినా ఓర్చుకున్నాడు. రాక్షసులు ప్రయోగించిన బాణములతో, ఆయుధముల దెబ్బలతో రాముని శరీరం అంతా రక్తసిక్తము అయింది. కాని రాముడు చలించలేదు. అన్ని వేల మంది రాక్షసులు ఒక్కుమ్మడిగా ఒంటరిగా ఉన్న రాముని చుట్టుముట్టి గాయపరచడం చూచి ఆకాశంలో నిలబడ్డ దేవతలు, గంధర్వులు ఎంతో వ్యధచెందారు. అన్ని దెబ్బలు తింటేగానీ, రామునికి రాక్షసులను చంపాలి అన్నంత కోపం రాలేదు. (రాముడు కోపం తెచ్చుకున్నాడు అన్న మాటకు అర్థం ఇదేకాబోలు.) అప్పుడు రాముడు కోపంతో కంపించి పోయాడు. తన ధనుస్సును మండలాకారంగా వంచి వేలకొలది బాణములను రాక్షసుల మీద ప్రయోగించాడు. (ధనుస్సు నిలువుగ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 24)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఇరువది నాలుగవ సర్గ జనస్థానములో ఖరుడికి కనపడ్డ దుశ్శకునములు అన్నీ పంచవటిలో ఉన్న రామలక్ష్మణులకు కూడా కనపడ్డాయి. వాటిని చూచిన రాముడు లక్షణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఆకాశంలో కనపడే దుశ్శకునములను చూచావు కదా! ఇవన్నీ రాక్షస సంహారాన్ని సూచిస్తున్నాయి. ఇటువంటి శకునములు ఒక మహాయుద్ధమునకు ముందుకనపడతాయి. అరణ్యములో మృగములు అరిచే అరుపులు వింటుంటే మనకు కూడా అపాయము కలుగుతుంది అని అనిపిస్తూ ఉంది. ప్రాణాపాయము కూడా కలగ వచ్చు. కాబట్టి ఇక్కడ ఒక మహాయుద్ధము జరగబోతోంది అనుటలో సందేహము లేదు. లక్ష్మణా! జాగ్రత్తగా విను. రాక్షసుల అరుపులు, భేరీనినాదములు వినిపిస్తున్నాయి. రాక్షసులు మనమీదికి యుద్ధానికి వస్తున్నారు. కాబట్టి మనము జరగబోయే దానికి దుఃఖిస్తూ కూర్చోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. నీవు ధనుర్బాణములు ధరించి, సీతను తీసుకొని, చెట్లతోనూ, పొదలతోనూ కప్పబడి ఉన్న ఆ గుహలో ప్రవేశించు. నా మాటకు అడ్డు చెప్పవద్దు. “నేనే రాక్షసులను చంపుతాను." అనే మాటలు చెప్పవద్దు. మనకు సీత క్షేమము ముఖ్యము. నీవు సీతకు రక్షణగా ఉండు. నేను రాక్షసులను చంపుతాను. అంటే నీవు రాక్ష...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 23)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఇరువది మూడవ సర్గ రాముని మీదికి ఉత్సాహంగా బయలుదేరిన ఖరునికి ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. వారి మీద రక్తవర్షము కురిసింది. ఖరుని రథమునకు కట్టిన గుర్రములు సమతలప్రదేశము మీద కూడా తడబడుతూ పరుగెడుతున్నాయి. దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుని చుట్టూ నల్లని వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఖరుని రథముమీద ఎగురుతున్న ధ్వజము మీద నిలబడింది. అనేకములైన క్రూర మృగములు జనస్థానము వద్ద గుమిగూడి వికృతంగా అరుస్తున్నాయి. ఒక పక్కనుంచి నక్కలు తలలు పైకెత్తి ఏదో అమంగళము జరగబోతున్నట్టు కూస్తున్నాయి. పక్షులు, డేగలు, గ్రద్దలు ఖరుని రథానికి అడ్డంగా ఎగురుతున్నాయి. ఇంతలో సాయం సమయం అయింది.. గ్రహణ కాలం కాకుండానే రాహువు సూర్యుని మింగుతున్నాడా అన్నట్టు సూర్యుడు అస్తమించాడు. ఆకాశంనుండి ఉల్కాపాతం జరిగింది. స్వల్పంగా భూమి కంపించింది. రథం మీద కూర్చుని పెద్దగా అరుస్తున్న ఖరుడికి ఎడమ భుజము అదిరింది. మాట తడబడుతూ ఉంది. కళ్లు మండటం మొదలెట్టాయి. ఇన్ని అపశకునాలు కనపడుతున్నా ఖరుడు చలించలేదు. వెనుకకు మరలలేదు. ముందుకు దూకుతున్నాడు.  "సైనికులారా! ఈ ఉత్పాతాలకు భయపడకండి. ఇలాంటివి పిరికి వాళ్లను భయపెడతాయి కానీ మనలను...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 22)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఇరువది రెండవ సర్గ శూర్పణఖ తనను అన్న సూటీ పోటీ మాటలు అన్నీ మౌనంగా విన్నాడు ఖరుడు. అవమానభారంతో కుమిలిపోయాడు. అతనిలో పౌరుషం పెల్లుబికింది. కోపం తారస్థాయికి చేరుకుంది. శూర్పణఖను చూచి ఇలా అన్నాడు. "నీకు జరిగిన అవమానము నాకు జరిగినట్టే భావిస్తాను. నాకు పట్టలేనంతగా కోపం వస్తూ ఉంది. ప్రతీకార జ్వాలలలో రగిలిపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక మానవుడికి నేను భయపడడమా! ఆ మానవుడు ఒక అల్పాయుష్కుడు. వాడి ప్రాణాలు హరిస్తాను. నీవు ఏడవకు. వాడి మరణవార్తను నీకు త్వరలో తెలియజేస్తాను. ఇప్పుడే వాడితో యుద్ధానికి వెళుతున్నాను. నా గొడ్డలితో వాడిని నరుకుతాను. వాడి వెచ్చని రక్తాన్ని నీకు పానీయంగా అందిస్తాను. ఇది నా నిర్ణయము." అని పలికాడు ఖరుడు. “అదేంటి అన్నయ్యా! నీ పరాక్రమం గురించి నాకు తెలీయదా. నీకు సాటి వీరుడు ముల్లోకములలో ఎవరు ఉన్నారు. రాక్షస వీరులలో నీకు సాటిగలవారు ఎవరున్నారు.” అని పొగిడింది. శూర్పణఖ మాటలతో ఉప్పొంగి పోయాడు ఖరుడు. వెంటనే తన సేనాపతులను పిలిచాడు. "సేనాపతీ! మన దగ్గర 14 వేల మంది సైనికులు ఉన్నారు. కదా. వారినందరినీ యుద్ధమునకు సిద్ధం చేయండి. నేనే స్వయంగా వారికి ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువది ఒకటవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 21)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఇరువది ఒకటవ సర్గ పదునాలుగు మంది రాక్షస వీరులను వెంటబెట్టుకొని వెళ్లిన శూర్పణఖ వెంటనే ఒంటరిగా రావడం చూచి ఆశ్చర్యపోయాడు ఖరుడు. "ఏంటి శూర్పణఖా! ఏమయింది. నీవు కోరితేనేకదా నీ వెంట 14 మంది రాక్షస వీరులను పంపాను. మరలా ఏడుస్తూ వచ్చావెందుకు. ఊరికే అలా భయపడితే ఎలాగా! నేను ఉన్నాగా నీకెందుకు భయం. ఏం జరిగిందో చెప్పు" అన్నాడు ఖరుడు. ఖరుని చూచి వ్యంగ్యంగా ఇలా అంది శూర్పణఖ. "ముక్కు చెవులూ కోయించుకొని రక్తం కారుకుంటూ ఏడ్చుకుంటూ నీదగ్గరకు వచ్చానా! నీవు నన్ను ఓదార్చావు కదా! రామలక్ష్మణులను చంపడానికి 14 మంది రాక్షస వీరులను పంపావు కదా! మహావీరుల మాదిరి శూలాలు ధరించి ఆ 14మంది నా వెంట వచ్చారు కదా! క్షణకాలంలో రాముడిచేతిలో గుండెలు పగిలి చచ్చారు. ఇదీ మనవాళ్ల ప్రతాపం. ఇంక భయపడక చస్తానా! వాళ్లందరూ అలా క్షణకాలంలో నేలమీద పడగానే నాకు వణుకు పుట్టింది. పరుగెత్తుకుంటూ వచ్చాను. ఓ ఖరా! నాకు భయంగా ఉంది. రామలక్ష్మణులు ఏవైపు నుంచి అన్నా రావచ్చు. నిన్ను, నన్ను చంపవచ్చు నీకు నా మీద జాలి దయ ఉంటే, ఆ రామలక్ష్మణులను ఎదిరించే శక్తి, బలము ఉంటే, దండకారణ్యములో నివాసమేర్పరచుకొన్న ఆ రామలక్ష్మణుల...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఇరువదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 20)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఇరువదవ సర్గ శూర్పణఖ ఆ పదునాలుగు మంది రాక్షస వీరులను రాముని పర్ణశాలకు తీసుకొని వెళ్లింది. పర్ణశాల ముందు కూర్చుని ఉన్న రామలక్ష్మణులను వారికి చూపించింది. ఆ రాక్షసులు బలవంతులైన రామలక్ష్మణులను, సౌందర్యరాసి అయిన సీతను చూచారు. రాముడు కూడా శూర్పణఖ వెంట వచ్చిన రాక్షసులను చూచాడు. లక్ష్మణునితో ఇలా అన్నాడు. "లక్ష్మణా! నేను వెళ్లి ఆ రాక్షసులను సంహరించి వస్తాను. నీవు ఇక్కడే ఉండి సీతను రక్షిస్తూ ఉండు." అని అన్నాడు. లక్ష్మణుడు సరే అని సీత రక్షణ బాధ్యతను స్వీకరించాడు. రాముడు తన ధనుస్సుకు నారిని సంధించాడు. ఆ రాక్షసులను చూచి ఇలా అన్నాడు. “ఓ రాక్షసులారా! నా పేరు రాముడు. నా తమ్ముడి పేరు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. మేము వనవాసము నిమిత్తము ఈ దండకారణ్యములో ప్రవేశించాము. మేము ముని వృత్తిలో ఉన్నాము. కందమూలములు, ఫలములు తింటూ కాలక్షేపము చేస్తున్నాము. మేము గానీ, మా లాంటి తాపసులు కానీ మీకు ఎలాంటి అపకారము చెయ్యలేదు. మీరు ఎందుకు మాబోటి తాపసులను బాధిస్తున్నారు. చంపుతున్నారు. మీలాంటి దుర్మార్గులను చంపడానికే మేము ధనుర్బాణములను ధరించాము. మీకు ప్రాణముల మీద ఆశ ఉంటే వెనక్కు తిరిగి వెళ్...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పంతొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 19)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము పంతొమ్మిదవ సర్గ ముక్కులలో నుండి చెవుల నుండి రక్తం కారుతూ తన ముందు నేల మీద పడి రోదిస్తూ ఉన్న చెల్లెలు శూర్పణఖను చూచాడు ఖరుడు. ఆమెను రెండుచేతులతో లేవనెత్తాడు. “చెల్లెలా శూర్పణఖా! ఏమిటీ ఘోరము. ఎవరు చేసారీ పని? నీవు ఎవరో తెలిసే ఈ పని చేసాడా! వాడు తాచు పాముతో ఆడుకుంటున్నాడు అని మరిచిపోయినట్టున్నాడు. వాడికి మూడింది. వాడికి కాలపాశం మెడకు చుట్టుకోబట్టే ఇలాంటి పని చేసాడు. ఎవడు వాడు! ఎక్కడ ఉంటాడు! ఉన్నది ఉన్నట్టు చెప్పు. అయినా నీవు సహజంగా బలవంతురాలివి కదా! పైగా కామరూపివి. నిన్ను చూస్తే యముడిని చూచినట్టే కదా! అలాంటి నీకు ఈ గతి పట్టించిన వాడు ఎవడు? వాడు దేవతా! గంధర్వుడా! భూతమా! లేక ఎవరన్నా పరాక్రమ వంతుడైన ఋషిపుంగవుడా! ఎందుకంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా నాకు అపకారం చెయ్యడానికి వెనుకాడుతాడు. అటువంటిది నీవు నా చెల్లెలు అని తెలిసికూడా నీకు అవమానం చేసాడంటే వాడికి ఆయువు మూడింది. ఇప్పుడే నేను వాడిని సంహరించి నీకు జరిగిన అవమానమునకు ప్రతీకారము చేస్తాను. వాడి శరీరమును కాకులు, గ్రద్దలు తింటాయి. దేవతలు గానీ, గంధర్వులు కానీ, రాక్షసులు గానీ, పిశాచములు గానీ ఎవరు అడ్డం వచ్చినా సరే వా...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదునెనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 18)

శ్రీమద్రామాయణము అరణ్య కాండము పదునెనిమిదవ సర్గ కామంతో కాలిపోతున్న శూర్పణఖను చూచాడు. రాముడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. “ఓ సుందరీ! నీవు నన్ను పెళ్లిచేసుకుంటాను అన్నావు. కాని నాకు ఇదివరకే పెళ్లి అయింది. ఈమే నా భార్య. ఈమె అంటే నాకు ప్రాణము. నీవు మళ్లీ నన్ను పెళ్లిచేసుకుంటే నీకు సవతి పోరు తప్పదు. నాతో కోరికలు తీర్చుకోవాలి అని గాఢంగా కోరుకున్న నీకు సవతి పోరు ఉండటం నీవు సహించగలవా! నీవంటి కాముకులు సవతి పోరు అస్సలు సహించలేరు.  అడుగో అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన నా తమ్ముడు లక్ష్మణుడు. మంచి అందగాడు. పాపం అతనికి భార్యాసౌఖ్యము లేదు. ప్రస్తుతము అతనికి భార్య అవసరము ఉంది. కాబట్టి అతడు నీకు తగిన భర్త. పైగా నీవు అతనిని పెళ్లిచేసుకుంటే నీకు సవతి బాధ ఉండదు. కాబట్టి నన్ను విడిచిపెట్టి అతని వద్దకు పో!" అని అన్నాడు రాముడు. ఇద్దరూ అందగాళ్లే. ఎవరైనా ఒకటే అనుకుంటూ శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్లింది. శూర్పణఖ మొదట రాముని వద్దకు పోవడం, ఆయనతో మాట్లాడటం, తరువాత తన వద్దకు రావడం చూస్తున్నాడు లక్ష్మణుడు. శూర్పణఖ చకా చకా లక్ష్మణుని వద్దకు వెళ్లింది. “ఓ సుందరాకారా! నా పేరు శూర్పణఖ. నన్ను వివాహం చేసుకుంటే నీకు అమర ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదిహేడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 17)

శ్రీమద్రామాయణము అరణ్య కాండము పదిహేడవ సర్గ రాముడు ఆశ్రమానికి వచ్చిన తరువాత అగ్నిహోత్రము మొదలగు కార్యములు నిర్వర్తించాడు. సీతతో, లక్ష్మణునితోనూ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆశ్రమము బయట కూర్చుని ఉన్నాడు. ఇంతలో జటాయువు వారి వద్దకు వచ్చాడు. “రామా! నేను ఇక్కడకు వచ్చి చాలాకాలము అయినది. నాకు నా బంధువులను, మిత్రులను చూడవలెనని కోరికగా ఉన్నది. నేను పోయి నా బంధుమిత్రులను చూచి వెంటనే వస్తాను. అనుజ్ఞ ఇవ్వండి.” అని అడిగాడు. రాముడు సంతోషంతో సమ్మతించాడు. జటాయువు వెళ్లిపోయాడు. కొంత సేపు తరువాత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశమునకు వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. రావణుని చెల్లెలు. ఆమె అక్కడకు వచ్చి రాముని చూచింది. బలిష్టమైన బాహువులతో, సింహము వక్షస్థలము వలె విశాలమైన వక్షస్థలముతో, తామర రేకుల వంటి కన్నులతో, ఆజానుబాహుడైన రాముని చూచింది. జగన్మోహనాకారుడైన రాముని చూచి శూర్పణఖ మోహపరవశురాలయింది. మన్మధుడు ఆమె మీద పుష్పబాణములు ప్రయోగించాడు. రాముని మొహం చాలా అందంగా ఉంటే, శూర్పణఖ ముఖం వికృతంగా ఉంది. రాముని నడుము సన్నగా ఉంటే, ఆమెది బానపొట్ట. రాముని కళ్లు విశాలంగా ఉంటే, ఆమె కళ్లు వికృతంగా ఉన్నాయి. రాముని జుట్టు అందంగా ఉంటే ఆమె జుట్టు...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదహారవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 16)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము పదహారవ  సర్గ రాముడు సీతతో సహా పంచవటిలో ఆనందంగా గడుపుతున్నాడు. ఇంతలో శరదృతువు ముగిసి, హేమంత ఋతువు ప్రవేశించింది. చలికాలము మొదలయింది. ఒక రోజు రాముడు పొద్దునే గోదావరినదికి స్నానానికి వెళ్లాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. ఆ హేమంత ఋతువు అందాలను చూచి లక్ష్మణుడు రాముని తో ఇలా అన్నాడు. “రామా! నీకు హేమంత ఋతువు అంటే ఎంతో ఇష్టం కదా. ఇప్పుడు హేమంత ఋతువు ప్రవేశించింది. మంచు కురుస్తూ ఉంది. నదీజలాలు స్నానానికి అనుకూలంగా లేవు. చలికి వెచ్చగా అగ్నిహోత్రము దగ్గర ఉండవలెనని కోరికగా ఉంది. పంటలు బాగా పండి కొత్త ధాన్యములు ఇంటికి చేరుతున్నాయి. ఉత్తరాయనము రాగానే పితృదేవతలను పూజించి జనులు తరిస్తున్నారు. వర్షాకాలము ముగియడంతో రాజులు ఇతర రాజ్యముల మీదికి దండెత్తడానికి ఆసక్తిగా ఉన్నారు. అసలే మంచుతో కప్పబడిన హిమవత్పర్వతము సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో ఇంకా ఎక్కువ మంచుతో శోభిల్లుతోంది. మనుష్యులు మధ్యాహ్నపు ఎండలో హాయిగా ఉంటున్నారు. రాత్రిళ్లు చలితో వణుకుతున్నారు. పగటి భాగమున కూడా సూర్యుడు తన తీక్షతను కోల్పోయాడు. పగలు కూడా చలిగాలులు వీస్తున్నాయి. అడవులలో జంతువులు కూడా తిరగడ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదునైదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 15)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము పదునైదవ సర్గ రాముడు, లక్ష్మణుడు, సీత, జటాయువు అందరూ కలిసి పంచవటి ని చేరుకున్నారు. రాముడు లక్ష్మణుని చూచి "లక్ష్మణా! ఇక్కడ పూలు చక్కగా పుష్పించి ఉన్నాయి. ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. నేల చదునుగా ఉంది. పక్కనే సెల ఏళ్లు ఉన్నాయి. అగస్త్యుడు చెప్పిన పంచవటి ఇదే కావచ్చును. ఇక్కడ మనము పర్ణశాల నిర్మించు కొనుటకు అనవైన ప్రదేశము చూడుము. లక్ష్మణా! జలాశయము పక్కన, దగ్గరగా ఫలవృక్షములు ఉన్న చోట, దర్భలు, సమిధలు దొరకుచోట, తగిన ప్రదేశమును నిర్ణయింపుము. " అని పలికాడు. “రామా! అట్లు కాదు. స్థల నిర్ణయములో నీ కన్నా సమర్థుడు లేడు. నీవు సీత కలిసి ఆలోచించి స్థల నిర్ణయము చెయ్యండి. అక్కడ నేను సుందరమైన ఆశ్రమమును నిర్మించెదను." అని అన్నాడు. రాముడు, సీత చుట్టపక్కల ప్రదేశములు తిరిగి గోదావరీ నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశమును ఎన్నుకొన్నారు. “లక్ష్మణా! ఈ ప్రదేశములో పర్ణశాలను నిర్మింపుము. ఈ ప్రదేశము మనకు అనుకూలముగా ఉంది. పక్కనే గోదావరీ నది ప్రవహించుచున్నది. మనకు జలమునకు కొదవ లేదు. ఈ సమతల ప్రదేశములో ఫల వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. చుట్టూ పర్వతములు పెట్టని కోటలాగా ప్రకాశిస్తున్నాయి....

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదునాల్గవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 14)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము పదునాల్గవ సర్గ రాముడు సీత, లక్ష్మణులతో సహా పంచవటికి వెళుతున్నాడు. దారిలో వారికి ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న పెద్ద ఆకారము కల పక్షి కనపడింది. ఆ అరణ్యములో కామరూపులైన రాక్షసులు నివసిస్తుంటారు అని విని ఉన్నాడు. అందుకని ఆ పక్షిని రాక్షసుడిగా తలచాడు రాముడు. “నీవు ఎవరవు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?" అని అడిగాడు “రామా! నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు. నీవు దశరథుని కుమారుడైన రాముడివి. నీ తండ్రి దశరథుడు నాకు మంచి మిత్రుడు." అని అన్నాడు. తన తండ్రికి మిత్రుడైన వాడు తనకు గౌరవింపతగ్గవాడు అని అనుకొన్నాడు రాముడు. ఆ పక్షికి అభివాదము చేసాడు. ఆ పక్షి రామునితో ఇలా పలికింది. “రామా! నీకు పూర్వము ఎంతమంది ప్రజాపతులున్నారో వారి గురించి చెబుతాను శ్రద్ధగా విను. ప్రజాపతులలో ప్రథముడు కర్దముడు. అతని తరువాతి వాడు విక్రీతుడు. ఆ తరువాత శేషుడు. అతని తరువాత సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు. ఆఖరి వాడు కశ్యప ప్రజాపతి. ఆయనకు అరిష్టనేమి అనే పేరుకూడా ఉంది. నీకు చెప్పానే దక్షుడు అని, ఆయ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదమూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 13)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము పదమూడవ సర్గ అగస్యుడు రామునికి ఆయుధములను ఇచ్చిన తరువాత ఇలా అన్నాడు. “ఓ రామా! మీరు నన్ను చూడటానికి ఇంత దూరము వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరము ప్రయాణము చేసి వచ్చారు. సుకుమారి అయిన సీత బాగా అలసి పోయినట్టు కనపడుతూ ఉంది. తండ్రి ఆదేశము ప్రకారము వనములకు వచ్చిన నీతో పాటు అనుసరించి వచ్చిన నీభార్య సీత ఇప్పటికి ఎవ్వరూ చేయని మహత్తరమైన పని చేసింది. కాబట్టి ఆమె కష్టపడకుండా చూడవలసిన బాధ్యత నీది. సాధారణంగా స్త్రీలు సుఖములలో భర్తను వదలకుండా అంటిపెట్టుకొని ఉంటారు. కష్టకాలములో భర్తను వదిలివేస్తారు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అది స్త్రీ నైజము. ఇంకా స్త్రీల గురించి చెప్పాలంటే వారు మెరుపుల మాదిరి చంచల స్వభావులు. వాడియైన కత్తి మాదిరి చాలా తీక్షణంగా ఉంటారు. గరుడుని మాదిరి వేగంగా ఆలోచిస్తారు. కానీ నీ భార్య సీతలో ఈ దోషములు ఏవీ లేవు. సీత శాంత స్వభావురాలు. ఉత్తమ పతివ్రత. అందుకే నిన్ను అనుసరించి అడవులకు వచ్చి నీతోపాటు కష్టములు పడుతూ ఉంది. ఓ రామా! నీవు, సీత, లక్ష్మణుడు ఎక్కడ ఉంటారో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.” అని వారిని శ్లాఘించాడు అగస్త్యుడు. అగస్యుడు పలికిన మ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పన్నెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 12)

శ్రీమద్రామాయణము అరణ్య కాండము పన్నెండవ సర్గ రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు అగస్త్యముని ఆశ్రమంలోకి వెళ్లాడు. లోపల అగస్త్యముని శిష్యుని వద్దకు పోయి “అయోధ్యాధీశుడు, దశరధ మహారాజు కుమారుడు, రాముడు, తన భార్య సీతతో సహా అగస్యులవారి దర్శనానికి వచ్చి వేచి ఉన్నారని మనవి చెయ్యి." అని అన్నాడు. ఆ శిష్యుడు లక్ష్మణుని చూచి "మీరుఎవరు?” అని అడిగాడు. “నేను రాముని తమ్ముడను. లక్ష్మణుడను, సదా రాముని హితము కోరేవాడిని. రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము అరణ్యవాసము చేయుచున్నాడు. ఆయన భార్య సీత, నేను ఆయనను అనుసరించుచున్నాము. " అని అన్నాడు. “మంచిది. మీరు ఇక్కడే ఉండండి. నేను మహర్షులవారికి మీ గురించి చెప్పి వస్తాను." అని లోపలకు వెళ్లాడు. అగ్ని గృహములో ఉన్న అగస్త్యుని వద్దకు పోయి రాముడు, లక్ష్మణుడు, సీత రాక గురించి తెలిపాడు. ఆ మాటలు వినిన అగస్యుడు ఎంతో సంతోషించాడు. “ఎన్నోనాళ్ల నుండి నేను రాముని దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఇంతకాలానికి రాముడు నన్నే వెదుకు కొనుచూ నా వద్దకు వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వెంటనే పోయి రాముని, సీతను, లక్ష్మణుని సగౌరవంగా నా వద్దకు తీసుకొని రా. అయినా రాముని రా...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదకొండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 11)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము పదకొండవ సర్గ ఆ అడవిలో రాముడు ముందు నడుస్తున్నాడు. సీత మధ్యలో ఉంది. వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. వారు అనేకములైన కొండలను, సెలయేళ్లను దాటుకుంటూ వెళుతున్నారు. నదీతీరములలో ఇసుక తిన్నెల మీద ఎగురుతున్న సారస పక్షులను, చక్రవాక పక్షులను, జలపక్షులను చూస్తూ ఆనందిస్తున్నారు. గుంపులు గుంపులుగా పోవుచున్న వన్యప్రాణులను చూచి, ఆగి అవి వెళ్లిన మీదట వెళుతున్నారు. సాయంత్రము అయింది. వారు ఒక సరస్సును సమీపించారు. ఆ సరస్సులో నుండి గీతాలాపనలు, వాద్య ధ్వనులు శ్రవణానందంగా వినిపిస్తున్నాయి. కాని ఆ దరిదాపులలో మానవ సంచారము లేదు. సీతారామలక్ష్మణులు ఆ ధ్వనులు విని ఆశ్చర్యపోయారు. తమ వెంట వస్తున్న ఋషులను ఆ వాద్య ధ్వనులు ఎక్కడినుండి వస్తున్నాయి అని అడిగారు. అందులో ధర్మభృతుడు అనే వృద్ధుడైన ఒక ఋషిఇలా చెప్పసాగాడు. “రామా! ఈ సరస్సుపేరు పంచ అప్సర సరస్సు. ఈ తటాకము అన్ని ఋతువులలోనూ ఒకే విధంగా నీటితో నిండి ఉంటుంది. ఈ సరస్సును మాణ్ణకర్ణి అనే ఋషి నిర్మించాడు. మాణ్ణకర్ణి అనే ఆ ఋషి పదివేల సంవత్సరములు తీవ్రంగా తపస్సు చేసాడు. ఆ తపస్సుకు దిక్పాలకులు వణికిపోయారు. ఎవరి పదవిని కోరి ఆ ఋషి తపస్సు చేస్తున్నాడో అని...