Posts

Showing posts from January, 2024

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 61)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము అరువది ఒకటవ సర్గ తరువాత కౌసల్య, మహారాజు దశరథుని చూచి ఇలా పలికింది. “మహారాజా! తమరు దయగలవారని ముల్లోకములలో అనుకుంటారు కదా! కాని కన్నకుమారుని, కోడలిని, ఎలా అడవులకు పంపగలిగావు. నీ దయాగుణము అంతా ఏమయింది? అది సరే! ఏ పాపమూ ఎరుగని సీతను కూడా అడవులకు పంపావు కదా! ఆమె అడవులలో ఎలా తిరుగ గలదు? ఆ కందమూలములు ఎలా తినగలదు అని ఆలోచించావా! పొద్దుటే మంగళవాద్యములను వినడానికి అలవాటు పడిన సీత క్రూరమృగముల అరుపులు ఎలా వినగలదు అని ఎన్నడైనా ఆలోచించారా! తమరి కన్న కుమారుడు అడవులలో ఎటువంటి బాధలు పడుతున్నాడో మీకు తెలుసా! రాముని చూడకుండా ఉండటానికి మీది హృదయమా లేక బండరాయా! మహారాజా! రాముడు పదునాలుగు సంవత్సరములు వనవాసము ముగించుకొనితిరిగి అయోధ్యకు వచ్చిన నాడు భరతుడు తిరిగి రాజ్యమును రామునికి ఇస్తాడంటారా! ఒక వేళ భరతుడు ఇచ్చినా రాముడు తిరిగి రాజ్యము స్వీకరిస్తాడా! ఏమో నాకు మాత్రం ఊహకు కూడా అందటం లేదు. ఎందుకంటే మరొక మృగము తిన్న ఆహారమును పెద్దపులి తినదు. అలాగే భరతుడుకి ఇవ్వబడిన రాజ్యమును రాముడు తిరిగి స్వీకరించడు.  రాముడు ఆత్మాభిమానము కలవాడు కదా! యుద్ధము చేసి అన్నా రాజ్యము తీసుకుంటాడు కానీ ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరవయ్యవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 60)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము అరవయ్యవ సర్గ ఇంతలో కౌసల్య సుమంత్రుని చూచి ఏడుస్తూ ఇలా అంది. “సుమంత్రా! నేను రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను కూడా రాముని వద్దకు తీసుకొనిపో. నీవు నన్ను రాముని వద్దకు తీసుకొని పోతావా లేక నన్ను యమలోకానికి పొమ్మంటావా నువ్వే చెప్పు. రథమును వెనక్కు మరల్చు." అని ఆవేశంతో పలికింది కౌసల్య. అప్పుడు సుమంత్రుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. “అమ్మా! మీరు శోకమును వదిలిపెట్టండి. రాముడికి అడవులలో ఏ కష్టమూ రాదు. లక్ష్మణుడు రాముని పక్కన ఉండగా రామునికి ఏలోటూ రాదు. ఇంక సీత కూడా ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంది. ఏ మాత్రం భయం, బాధ పడటం లేదు. భర్తతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉద్యానవనములలో ఎలా విహరిస్తూ ఉందో అడవులలో కూడా అలాగే విహరిస్తూ ఉంది. సీత తనకు ఇచ్చిన ఆభరణములు ధరించి ఎంతో ఉల్లాసంగా ఉద్యానవనములో తిరుగుతున్నట్టు అడవులలో విహరిస్తూ ఉంది. ఆమెలో ఆత్మ విశ్వాసము కనపడుతూ ఉంది. ఏ మాత్రం దు:ఖము కనపడటం లేదు. సీత హృదయము ఎల్లప్పుడూ రాముని యందే లగ్నం అయి ఉంది. రాముడు ఎక్కడ ఉంటే అదే ఆమెకు అయోధ్య. రాముడు లేని అయోధ్య సీతకు అడవులతో సమానమే. కాబట్టి మనము రామ లక్ష్మణుల గురించి గానీ సీత ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 59)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము యాభై తొమ్మిదవ సర్గ సుమంత్రుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు దశరథుడు. “సుమంత్రా! ఇంతేనా! వారు ఇంక ఏమీ అనలేదా! పోనీలే. తరువాత ఏమి జరిగిందీ వివరంగాచెప్పు." అని అడిగాడు. సుమంత్రుడు తరువాత జరిగిన విషయాలు ఇలా చెప్పసాగాడు. “మహారాజా! రామలక్ష్మణులు తమ వెంట్రుకలకు మర్రిపాలు పూసుకొని జడలు కట్టుకున్నారు. వారు గంగానదిని దాటి ప్రయాగ క్షేత్రము వైపు వెళ్లారు. లక్ష్మణుడు ముందు నడుస్తుంటే, సీతమధ్య నడుస్తుంటే, రాముడు వెనక నడుస్తూ వారు వెళ్లిపోయారు. నేను వారు వెళ్లిన వంక చూస్తూ వారు కనుమరుగు కాగానే వెనుకకు తిరిగి వచ్చాను. రాముడు తన మనసు మార్చుకొని వెనకుకు వస్తాడేమో అని మూడురోజులు గుహుడు ఉన్నచోట ఉండి పోయాను. కాని రాముడు తిరిగిరాలేదు. ఇంక చేసేది లేక వెనకకు తిరిగివచ్చాను. దారిలో ఉన్న ఉద్యానవనములు కూడా రాముని వియోగమునకు శోకిస్తున్నాయా అన్నట్టు వాడిపోయి ఉన్నాయి. నేను అయోధ్యలో ప్రవేశించగానే రామునికోసరం అయోధ్యా ప్రజలు విడిచే నిట్టూర్పులు వినబడ్డాయి. రాజవీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. మేడమీద నిలబడి ఉన్న స్త్రీలు, నేను రాముని లేని రథమును తీసుకొని రావడం చూచి రోదించడం స్వయంగా చూ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 58)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము యాభై ఎనిమిదవ సర్గ కొంచెం సేపటికి దశరథుడు తెప్పరిల్లాడు. సుమంత్రుని పిలిపించాడు. సుమంత్రుడు దశరథుని వద్దకు వెళ్లాడు. దశరథుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. తల ఎత్తి సుమంత్రుని చూచి దశరథుడు ఇలాఅన్నాడు. “సుమంత్రా! రాముడు ఎలా ఉన్నాడు? ఎక్కడ పడుకుంటు న్నాడు? ఏమి తింటున్నాడు? సుమంత్రా! రాముడు ఎన్నడూ అడవులలో ఉండలేదు. ఇటువంటి కష్టములు అతనికి తెలియవు. రాజ భోజనములు ఆరగించి హంసతూలికా తల్పముల మీద శయనించు రాముడు అడవులలో కందమూలములు తింటూ, కటిక నేల మీద ఎలా పడుకుంటున్నాడో కదా! రాముడు ఎప్పుడు బయటకు వెళ్లినా అతని వెంట రథములు, కాల్బలములు, ఏనుగులు వెంట ఉండేవి. అవన్నీ లేకుండా అడవులలో ఎలా ఉంటున్నాడో కదా! సీతా రామ లక్ష్మణులు క్రూరజంతువులు, పాములు ఉన్న వనములలో ఎలా ఉంటున్నారో కదా! సుమంత్రా! సీతారాములు నీ రథము దిగి అడవులలో ఎలా ప్రవేశించారు? ఏది ఏమైనా నా కన్నా నువ్వే అదృష్టవంతుడవు. రాముడు అడవులలో ప్రవేశించు వరకూ అతని వెన్నంటి ఉన్నావు. రాముడు, సీత, లక్ష్మణుడునాతో చెప్పమని ఏమన్నా చెప్పారా! వివరంగా చెప్పు." అని అన్నాడు దశరథుడు. సుమంత్రుడు ఇలా బదులు చెప్పాడు. “మహారాజా! రాముడు తమకు నమస్...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 57)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము యాభై ఏడవ సర్గ గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషులద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు.  సుమంత్రుడు తన రథమును అయోధ్యవైపు తీసుకొని వెళుతున్నాడు. మూడవ రోజు సాయంత్రానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్య అంతా అంధకార బంధురంగా ఉంది. ఎవరి ఇంట్లోనూ దీపాలు వెలగటం లేదు. ఎప్పుడూ ఆనందోత్సాహాలతో కళకళలాడే అయోధ్య రాముని వియోగంతో విలవిలలాడిపోతోంది అని బాధపడ్డాడు సుమంత్రుడు. సుమంత్రుడు నగరప్రవేశము చేసాడు. రాముని రథము చూచి పౌరులు గుంపులు గుంపులుగా సుమంత్రుని వెంట బడ్డారు. “రాముడు ఎక్కడ? రాముని ఎక్కడ వదిలి వచ్చావు?" అని ప్రశ్నల వర్షము కురిపిస్తున్నారు.  సుమంత్రుడురథము ఆపి వారితో ఇలా అన్నాడు. “నేనురాముని గంగానదిని దాటించి వచ్చాను. రాముని వద్దనుండి ఆజ్ఞతీసుకొని వచ్చాను." అని బాధతో చెప్పాడు సుమంత్రుడు. “రాముడు వనవాసమునకు వెళ్లిపోయాడా. రాముడ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 56)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము యాభై ఆరవ సర్గ మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. "లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు. రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు. “లక్ష్మణా! ఇక్కడ మనము ప్రశాంతంగా వనవాసము చేయవచ్చును. మనకు కావలసిన ఫలములు,కాయలు దుంపలు, ఆహారమునకు పనికి వచ్చు జంతువులు, స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్వతము మీద చాలామంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు.” అని అన్నాడు. వారు అలా మాట్లాడుకుంటూ వాల్మీకి ఆశ్రమమునకు చేరుకున్నారు. వాల్మీకి వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేసాడు. తన గురించి తనయొక్క వనవాసము గురించి వాల్మీకి మహర్షికి వివరంగా తెలిపాడు రాముడు. తరువ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 55)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము యాభై ఐదవ సర్గ ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు. “ఓ రామా! మీరు గంగా యమునా సంగమ స్థానము చేరిన తరువాత యమునా నది ఒడ్డునే పడమటి వైపుగా వెళ్లండి. అక్కడ మీరు ఒక తెప్పను కట్టుకొని యమునను దాటండి. మీరు యమునను దాటిన తరువాత మీకు ఒక పెద్ద మర్రిచెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పేరు శ్యామము. అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. సీత ఆ చెట్టుకు నమస్కారము చేసి ఏ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయి. మీరు ఆ చెట్టు కింద ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొన వచ్చును. లేని ఎడల మీరు ప్రయాణము కొనసాగించవచ్చును. అలా ఒక క్రోసెడు దూరము వెళ్లగానే మోదుగ చెట్లతోనూ, రేగు చెట్లతోనూ వెదురు పొదలతోనూ నిండి ఉన్న ఒక అరణ్యము కనిపిస్తుంది. అది యమునా నది ఒడ్డున ఉంటుంది. అదే చిత్రకూటమునకు పోవు దారి. నేను ఆమార్గములో...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 54)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము యాభై నాలుగవ సర్గ సీతా,రామ,లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్లిపోయారు. వారు అలా నడుస్తూ గంగానదీ యమునా నదీ కలిసే ప్రయాగ క్షేత్రమునకు చేరుకున్నారు. అప్పటికి చీకటి పడింది. “లక్ష్మణా! మనము గంగా యమునా సంగమ స్థానమునకు చేరుకున్నట్టున్నాము. ఒక నదీజలాలతో మరొక నదీజలాలు కొట్టుకుంటున్న శబ్దము వినపడుతూ ఉంది. ఇక్కడే ఏదో ఒక ముని ఆశ్రమము ఉండాలి. ఎందు కంటే ఇక్కడ వంట చేసుకోడానికి కట్టెలు కొట్టి కొన్ని ఇక్కడే పడవేసినట్టున్నట్టు కనపడుతూ ఉంది." అని అన్నాడు. రామలక్ష్మణులు అలా నడుస్తూ భరద్వాజముని ఆశ్రమము చేరుకున్నారు. భరద్వాజముని ఉన్న కుటీరము బయట రామలక్ష్మణులు, సీత నిలబడ్డారు. ఎవరూ బయటకు రాలేదు. అందుకని రాముడు కుటీరములోకి వెళ్లాడు. కుటీరము లోపల అగ్నిహోత్రము ముందు, శిష్యుల మధ్య అగ్ని మాదిరివెలుగుతున్న భరద్వాజమహర్షిని చూచాడు రాముడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆయనకు నమస్కరించారు. రాముడు తమ్ముతాము పరిచయం చేసుకున్నాడు. " ఓ భగవాన్ భరద్వాజ మహర్షీ! ప్రణామాలు. మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులము. రామలక్ష్మణులము. ఈమె...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 53)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము యాభై మూడవ సర్గ రాముని అరణ్యవాసములో మొదటి రోజు సాయంకాలము అయింది. రాముడు సాయం సంధ్యను పూర్తిచేసుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. "ఓ లక్ష్మణా! మన వనవాసములో ఒంటరిగా మొదటి రాత్రి గడప బోతున్నాము. సీత నిద్ర పోతుంటే నువ్వు, నేను, రాత్రిళ్లు ఆమెను రక్షించాలి. ఆకులతో మనకు పడకలు సిద్ధము చేయుము.” అని అన్నాడు. లక్ష్మణుడు అదే ప్రకారము చెట్లఆకులతో మెత్తని పడకలు సిద్ధం చేసాడు. వాటి మీద పడుకున్నారు రామలక్ష్మణులు. సీత నిద్ర పోయింది. రామ లక్ష్మణులకు నిద్రపట్టలేదు. లక్ష్మణునితో రాముడు ఇలా అన్నాడు. "లక్ష్మణా! మన తండ్రి దశరథునికి రాత్రిళ్లు నిద్రపడుతుందంటావా! భరతుడు రాగానే, రాజ్యము కోసరము కైక మహారాజును చంపివేయదు కదా! ఏం చేస్తాం. మహారాజు కామంతో భార్యకు లొంగిపోయాడు. అందరినీ దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు ఏం జరిగినా అడిగే దిక్కు లేదు. మన మహారాజు చేసిన పని చూస్తుంటే ఆయన అర్థ కామములలో కామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడుతూ ఉంది. అర్థమును వదిలి కామమునకే ప్రాధాన్యము ఇచ్చువాడు ఎల్లప్పుడూ చిక్కుల్లో పడతాడు అనడానికి మన మహారాజే ఉదాహరణ. అయి...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 52)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము యాభై రెండవ సర్గ మరునాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! మనము గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి.గుహునితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పు." అని అన్నాడు. లక్ష్మణుడు వెంటనే గుహుని పిలిచి ఒక నావను సిద్ధము చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేసాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు. "మిత్రమా! నన్ను నావను ఎక్కించుము" అని అన్నాడు. గుహుడు రామలక్ష్మణులను సీతను నావ ఉన్న ప్రదేశమునకు తీసుకొని వెళుతున్నాడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలాఅన్నాడు. “రామా! మీరు గంగానదిని దాటి ఆవల ఒడ్డుకు వెళుతున్నారు. నేనేమి చేయాలి. సెలవివ్వండి."అని అడిగాడు. రాముడు సుమంత్రుని వీపుమీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరి "సుమంత్రా! నీవు అయోధ్యకు తిరిగి పొమ్ము. మా తండ్రి దశరథుని జాగ్రత్తగా చూచుకొమ్ము. నీవు చేసిన సాయమునకు కృతజ్ఞుడను. ఇంక నేను కాలి నడకన అరణ్యములలోకి వెళ్లెదను. నీవు అయోధ్యకు వెళ్లుము." అని అన్నాడు రాముడు. అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలాఅన్నాడు. “రామా...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 51)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము యాభై ఒకటవ సర్గ గుహుడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. "లక్ష్మణ కుమారా! వనవాస వ్రతము రామునికి కానీ నీకు కాదు కదా! నీకోసరము మెత్తని శయ్య సిద్ధమే చేసాము. నీవు దీని మీద పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాచబిడ్డవు. నీవు పడుకోలేవు. మేము రాత్రి అంతా మేలుకొని రామునికి, నీకు కాపలా కాస్తాము. లక్ష్మణా! నాకు ఈ లోకములో రాముని కంటే ఇష్టమైన వాడు ఎవరూ లేరు. అటువంటి రాముడు ఇలా ఒంటరిగా అడవిలో కటికనేల మీద నిరాహారంగా నిదించడం బాధాకరంగా ఉంది. నీకు, రామునికి ఈ అరణ్యములో ఎలాంటి భయమూ లేదు. మాకు ఈ అరణ్యము కొత్త కాదు. నీవు సుఖంగా నిద్రించు." అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు గుహునితో ఇలా అన్నాడు.“మిత్రమా! నీవు మా పక్కన ఉండగా మాకు ఏమి భయము. అటుచూడు. నా అన్న, నా వదిన అలా కటికనేల మీద పడుకొని ఉండగా నాకు సుఖంగా నిద్ర ఎలా వస్తుంది. అసలు నాకు సుఖాలు పొందాలనే కోరిక ఎలా కలుగుతుంది. రాజాంత:పురములలో పట్టుపరుపుల మీద పవళించిన సీతారాములు నేడు ఆ గడ్డిపానుపు మీద ఎలా సుఖంగా నిద్రిస్తున్నారో చూడు.  రాముడు దశరథునికి, ఎన్నో పూజలు వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే పుట్టిన వాడు. అటువంటి...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభైయవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 50)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము యాభైయవ సర్గ రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రథము మీద కోసల దేశపు సరిహద్దుల వద్దకు వచ్చాడు. అయోధ్య ఉన్న వంక తిరిగాడు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ “కాకుత్థ్స వంశస్థులచే పరిపాలింప బడుతున్న ఓ అయోధ్యా నగరమా! పుట్టినప్పటి నుండి నీ ఒడిలో పెరిగాను. ఇప్పుడు విధి వశాత్తు నిన్ను విడిచి వెళుతున్నాను. నిన్ను, నీలో నివసించు ప్రజలను విడిచిపోవుటకు మీ అనుమతి కోరుతున్నాను. అచిరకాలములోనే నేను వనవాసము పూర్తి చేసుకొని తిరిగి వస్తాను. అయోధ్యానగర ప్రవేశము చేస్తాను.”అని అయోధ్యాపురికి నమస్కరించాడు. అప్పటికే రాముడు వచ్చాడని వార్త తెలిసి సమీప గ్రామ ప్రజలు రాముని చూడటానికి అక్కడకు చేరుకున్నారు. వారిని చూచి రాముడు ఇలా అన్నాడు. “మీరు నా మీద జాలి చూపించారు. కాని మీ మీ పనులు మానుకొని నాకోసం దు:ఖించడం మంచిది కాదు. మీ పనులు చూచుకొనుడు." అని వారికి నమస్కరించి చెప్పాడు. వారుకూడా రామునికి పట్టిన దుర్దశకు దుఃఖిస్తున్నారు. తరువాత రాముడు కోసల దేశమును దాటి వెళ్లిపోయాడు. రాముడు ప్రయాణించు రథము పరమ పవిత్రమైన గంగాతీరము చేరుకొంది. గంగానదీ తీరమున గల మున్యాశ్రమ ములు గంగానదికి అలంకారముగా శోభిల్లుతున్...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 49)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నలుబది తొమ్మిదవ సర్గ తనతో వచ్చిన అయోధ్యావాసులు నిద్ర లేవకముందే లేచిన రాముడు తన ప్రయాణం కొనసాగించాడు. సూర్యోదయము అయేటప్పటికి చాలా దూరం వచ్చేసారు. రామ లక్ష్మణులు ప్రాతఃసంధ్యను పూర్తి చేసుకొని మరలా ప్రయాణం అయ్యారు. అనేక గ్రామాల గుండా ప్రయాణిస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు రాముని వనవాసము గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. "ఆ దశరథుడు కామానికి వశుడై తన భార్య కైక మాటలు విని కన్నకుమారుని అడవులకు వెళ్లగొట్టాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి మాట కాదనలేక అడవులకు వెళ్లాడు ఏమి ఆశ్చర్యము. అయినా రాముడు అడవులకు వెళ్లాడు. ఆయనతో పాటు సీత ఎందుకు వెళ్లాలి? సుకుమారి అయిన సీత అడవులలో ఎలా ఉండగలదు? రామునితోపాటు సీత కూడా అన్ని కష్టాలు పడవలసిన దేనా! ఎంత దారుణము.” అని రక రకాలుగా అనుకుంటున్నారు. వారి మాటలు వింటూ రాముడు అరణ్యముల వంక సాగుతున్నాడు. వారు వేదశ్రుతి అనే నదిని దాటారు. దక్షిణ దిక్కుగా ఉన్న అగస్త్య ఆశ్రమము వైపు ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ వారు గోమతీ నదీ తీరానికి చేరుకున్నారు. గోమతీ నదిని దాటిన తరువాత వారు స్యందికా నదిని చేరుకున్నారు. ఆ నదిని కూడా దాటి వారు పూర్...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 48)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నలుబది ఎనిమిదవ సర్గ రామునితో వెళ్లిన పౌరులు తిరిగి రావడం చూచారు అయోధ్యపుర స్త్రీలు. వారు రాముని తిరిగి తీసుకొని వస్తారు అని ఎంతో ఆశతో ఉన్నారు. వారి ఆశలు అన్నీ నిరాశలు అయ్యాయి. రాముని అడవిలో వదిలి ఇళ్లు చేరిన పౌరులు తమ తమ భార్యా పుత్రులకు తమ ముఖములు చూపించలేక పోయారు. అయోధ్యలో ఎవరూ తమ తమ ఇళ్లలో వంటచేసుకోలేదు. దేవాలయములలో పూజలు జరగలేదు. వర్తకవాణిజ్యములు మూతబడ్డాయి. రాముడు అడవులకు పోయినందుకు ప్రతి ఇంటిలోనూ దు:ఖము శోకము తాండిస్తూ ఉంది. రాముని లేని అయోధ్యలో తమకు సుఖసంతోషాలు ఎక్కడివని అందరూ అనుకుంటున్నారు. ఈ లోకంలో ఎవరన్నా పుణ్యము చేసుకున్న వాడు ఉన్నాడు అంటే అతడు లక్ష్మణుడే. ఎందుకంటే అతడు ఒక్కడే రాముడి వెంట అరణ్యములకు వెళ్లాడు. రామునికి సేవచేస్తున్నాడు. ఇది వారందరి నిశ్చితాభిప్రాయము. రామునికి అనునిత్యమూ ఫలములను ఇస్తూ సేవ చేసే వృక్షములు తమ కన్నా ఎంతో మేలు అని అనుకొన్నారు. సీతారాములకు ఆనందం కలిగించే వివిధరకములైన పూలు తమకన్నా ఎంత పుణ్యం చేసు కున్నాయి అని అనుకొన్నారు. కొండల మీదినుండి పర్వతముల మీది నుండి జలజలపారే సెల ఏళ్లు రామునికి స్నానమునకు కావలసిన నీటిని సమకూరు స్...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 47)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నలుబది ఏడవ సర్గ రాముని వెంట అడవులకు వచ్చిన బ్రాహ్మణులు పౌరులు ఉదయమే నిద్ర లేచారు. కాలకృత్యములు తీర్చుకున్నారు. సంధ్యా వందనము ఆచరించారు. రాముని కొరకు చూచారు. కాని సీతారామలక్ష్మణులు కనిపించలేదు. అడవి అంతా వెతికారు. కాని వారి జాడలేదు. వారిలో వారు ఇలా అనుకుంటున్నారు. "ఏమిటీ మనము ఒళ్లు తెలియకుండా నిద్రపోయాము. ఉదయమే మెలుకువ రాలేదు. మన కోసం చూచి రాముడు తన దారిన తాను వెళ్లిపోయి ఉంటాడు. ఏం చేస్తాం. రాముడు ఇన్నాళ్లు మనలను కన్నబిడ్డలవలె చూచుకున్నాడు. ఇప్పుడు ఆయనకు అరణ్యవాసము దాపురించింది. అందుకే మనలను విడిచి వెళ్లి పోయాడు. ఇంక మనకు దిక్కు ఎవ్వరు. రాముని విడిచి మనము జీవించలేము. మనము కూడా రాముడు వెళ్లిన ఉత్తర దిక్కుగా వెళ్లాము. ఏనాటి కైనా రాముడు మనకు కనపడకపోతాడా! రాముడు లేకుండా జీవించడం కంటే రాముని వెదకడమే ఉత్తమము. లేకపోతే ఇక్కడే మనము పెద్ద చితి పేర్చుకొని అందులో అందరమూ అగ్ని ప్రవేశము చేస్తాము. ఇప్పుడు మనము రాముడు లేకుండా అయోధ్యకు వెళితే, మన ఇంట్లో వాళ్లు “రాముడు ఏడీ!" అని అడిగితే ఏమని సమాధానము చెప్పగలము. రాముని అరణ్యములలో వదిలి వచ్చాము అని చెప్పాలా! మనమందరమ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 46)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నలుబది ఆరవ సర్గ తమసానదీ తీరమునకు చేరుకున్న రాముడు, సీతతో, లక్ష్మణునితో ఇలా అన్నాడు. “ఓ సీతా! లక్ష్మణా! ఇప్పుడు మనము వనవాసములోకి ప్రవేశించాము. మన వనవాసములో ఇది తొలి రాత్రి. చీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్షులు కూడా తమ తమ గూళ్లకు చేరి నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. అయోధ్యలోని మనవారందరూ మన కోసము దు:ఖిస్తూ ఉంటారు. ముఖ్యంగా నా తల్లి కౌసల్య, నా తండ్రి దశరథుడు నా కోసం ఏడ్చి ఏడ్చి అంధులుగా మారిపోతారా అని భయంగా ఉంది. నా తల్లి తండ్రులను ఇంక భరతుడే ఓదార్చాలి. అయినా ధర్మాత్ముడు అయిన భరతుడు ఉండగా నా తల్లితండ్రులకు భయమేముంటుంది. లక్ష్మణా! నీవు నా వెంబడి రావడం నా మంచికే జరిగింది. లేకపోతే నేను ఒక్కడినే సీతా సంరక్షణ భారం వహించవలసి వచ్చేది. ఓ లక్ష్మణా! ఈ రాత్రికి నేను ఆహారం ఏమీ తీసుకోను. కేవలము నీళ్లు తాగి ఉంటాను. నాకు భోజనము చెయ్యాలని కోరిక లేదు. నీవు మాత్రము మన రథాశ్వములను జాగ్రత్తగా చూచుకో. వాటికి కావలసిన ఆహారపానీయాలు అందాయోలేదో చూడు." అని అన్నాడు రాముడు. రథమును తోలుకొని వచ్చిన సుమంత్రుడు గుర్రములకు కావలసిన ఆహారము పెట్టాడు. వాటిదగ్గరే ఉన్నాడు. తరువాత సుమంత్రుడు రామునకు,...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 45)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నలుబది ఐదవ సర్గ అయోధ్యలో పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ రాముడు రథము మీద అరణ్యములకు వెళుతున్నాడు. రాముని రథం వెంట ఎంతో మంది అయోధ్యాపౌరులు రాముని అనుసరిస్తున్నారు. రాముడు ఎంత చెప్పినా వారు వినకుండా ఆయన రథమును వెంబడిస్తున్నారు. రాముని మీద వారికి ఉన్న ప్రేమ వారిని రాముని నుండి విడదీయ లేక పోయింది. తన తండ్రి మాట నిలబెట్ట డానికి రాముడు అడవులకు వెళుతున్నప్పుడు, రామునికి తోడుగా మేము కూడా అడవులకు ఎందుకు వెళ్లకూడదు అని వారు అనుకున్నట్టు న్నారు. తన వెంటవచ్చు అయోధ్యాపౌరులను చూచి రాముడు తన రథమును ఆపించాడు. వారిని చూచి ఇలా అన్నాడు. “ఓ అయోధ్యా ప్రజలారా! మీరు నా మీద చూపుతున్న ప్రేమాభిమానములకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. కాని నాది ఒక కోరిక. నా మీద మీరు చూపుతున్న ప్రేమాభిమానములు ఇదేరీతిలో భరతుని మీద కూడా చూపించండి. అలా చేస్తే నాకు ఇంకా ఆనందం కలుగుతుంది. భరతుడు నా తమ్ముడు. సద్గుణవంతుడు. నా కాన్న బాగుగా రాజ్యమును పరిపాలించగలడు. నా తమ్ముడు భరతుడు వయసులో నా కన్నా చిన్న వాడయినా జ్ఞానములో నా కన్నా పెద్దవాడు. నా కంటే పరాక్రమ వంతుడు. అయోధ్యకు తగిన రాజు అనిపించుకుంటాడు. భరతుడు అన్నివిధములా ర...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 44)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నలుబది నాలుగవ సర్గ కౌసల్య తన కుమారుడు రాముని తలచుకొని విలపిస్తూ ఉంటే పక్కనే ఉన్న సుమిత్ర ఆమెను ఓదారుస్తూ ఉంది. ఆ మాటకొస్తే సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్లాడు. కాని సుమిత్ర ఎంతో గుండె నిబ్బరంతో కౌసల్యను ఊరడించింది. “అక్కా! కౌసల్యా! రాముడి గురించి ఏడవడం ఎందుకు? రాముడు సకల సద్గుణ సంపన్నుడు. ఎక్కడ ఉన్నా రాణించగలడు. రాముని కోసం విలపించడం తగదు. రాముడు కేవలము తన తండ్రి మాటను నిలబెట్టడానికి అరణ్యాలకు వెళ్లాడు. అది ఉత్తములు అనుసరించే మార్గము కదా. రాముడు ధర్మం నిలబెట్టాడు. ఇహ పరాలను సాధించాడు. రాముని కోసం విలపించడం వృధా! అంతెందుకు రాముని వెంట నా కుమారుడు కూడా వెళ్లాడు. రామునికి సేవచేస్తూ కాపాడుతూ ఉంటాడు. రాముని గురించి భయం ఎందుకు. పైగా సీత. సుకుమారి. ఎండకన్నెరుగనిది. సుఖములు తప్ప దు:ఖము అంటే ఏమిటో తెలియనిది. అటువంటి సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్లింది కదా. రాముడు ధర్మమును సత్యమును నమ్ముకున్నాడు. రాముని కీర్తి ప్రతిష్టలు ముల్లోకములలోనూ వ్యాపిస్తుంది. దీనికి సంతోషించాలి గానీ దు:ఖిస్తావెందుకు. సూర్యుడు తన కిరణములతో రాముని శోషింపచేయడు. ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 43)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నలుబది మూడవ సర్గ వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే కౌసల్య పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఆమె కూడా రాముని విడిచి ఉండలేక మనసులోనే కుమిలిపోతూ ఉంది. దశరథుని చూచి ఇలా అంది: "మహారాజా! మన జీవితములలో కైక విషము చిలకరించినది. ఇప్పుడు కుముసము విడిచిన పాము వలె నిగ నిగ లాడుతూ మెరిసిపోతూ ఉంది. మనకు దుఃఖంతో కుమిలిపోతున్నాము. ఓ మహారాజా! రాముని అయోధ్యనుండి వెడలగొట్టిన కైక నన్నుకూడా విడిచిపెట్టదు. నన్ను వెంటాడి వేధిస్తుంది. పాము వలె కాటేస్తుంది. కనీసము కైక రాముని అరణ్యములకు పంపకుండా తన వద్ద దాసునిగా నియమించుకొనినా కూడా ఎంతో బాగుండేది. నాకళ్ల ఎదుట నా కుమారుడు ఉండే వాడు. నాలుగు ఇళ్లలో బిక్ష తీసుకొని వచ్చి నన్ను పోషించేవాడు. ఓ మహారాజా! నీవు మాత్రము తక్కువ చేసావా! దేవతలకు ఇవ్వవలసిన హవిస్సులను రాక్షసులకు ఇచ్చినట్టు, రామునికి ఇవ్వవలసిన రాజ్యమును భరతునికి ఇచ్చావు. ఓ మహారాజా! ఈ పాటికి నా రాముడు అడవిలోకి ప్రవేశించి ఉంటాడంటావా! సీత, లక్ష్మణుడు వెంటరాగా అడవులలో దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటాడంటావా! ఎన్నడూ కష్టములు అంటే తెలియని రాముని, సీతను లక్ష్మణుని, ఆ కైక మాటవిని అడవులకు పంపావు. వ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 42)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నలుబది రెండవ సర్గ. రాముని రథము వెళుతున్నంత దూరమూ దశరథుడు అటువేపు చూస్తూనే ఉన్నాడు. రథము పోవు వేగముతో రేగిన ధూళితో రథము కనపడటం లేదు. రామునికి తనకూ దూరము పెరిగిపోతున్నట్టు భావించాడు దశరథుడు. దశరథునికి దు:ఖము ముంచుకొచ్చింది. ఇంక రాముడు తనకు కనపడడు అనే భావనను తట్టుకోలేకపోయాడు. అలాగే నేలమీద కూలబడ్డాడు. పక్కనే ఉన్న కౌసల్య, కైక ఆయననుపట్టుకున్నారు. దశరథుడు కైక వంక దీనంగా చూచాడు. “ఓ కైకా! దయచేసి నన్ను తాకవద్దు. నీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు నాకు భార్యవు కావు, బంధువుకావు. నీవు ఎవరని నన్ను తాకుతున్నావు. నీకే కాదు నీ వారికి కూడా నేను ఏమీ కాను. మీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టావో అదే క్షణంలో నేనూ నిన్ను విడిచిపెట్టాను. నీచేయి పట్టుకొని పాణిగ్రహణము చేసి అగ్నిహోత్రము చుట్టు మూడు ప్రదక్షిణములు చేసిన నాడు ముడివడిన మన బంధము నేటితో తెగిపోయినది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ మన ఇద్దరికీ ఎలాంటి సంబంధము లేదు. నీకూ నీ కుమారుడు భరతునికీ ఈ రాజ్యము కావాలి. తీసుకోండి. నన్ను విడిచిపెట్టండి. నేను చచ్చిపోయిన తరువాత మీరు నాకు జలతర్పణము విడవడా...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 41)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నలుబది ఒకటవ సర్గ ఎప్పుడైతే రాముడు అంత:పురస్త్రీలకు అందరికీ నమస్కరించి బయటు దేరాడో, వారందరూ ఏడవడం మొదలుపెట్టారు. “ఇంత కాలమూ రాముడు మాకు రక్షకుడుగా ఉండేవాడు. ఆ రాముడు ఇప్పుడు ఏడీ!మనము ఎలా బతకాలి!" అని వాపోతున్నారు. రాముని మంచి గుణములను తలచుకుంటూ ఏడుస్తున్నారు. “రాముడికి అసలు కోపమే రాదు. ఎవరి మీద కోపగించడు. ఒకవేళ ఎవరన్నా రాముని మీద కోపించిన, తిరిగి వారి మీద కోపింపడు. అటువంటి ఉత్తముడు రాముడు. అందరి కష్టసుఖములు తనవిగా అనుకొని ఆదరించెడి వాడు రాముడు. రాముడు తన తల్లి కౌసల్యను ఏ మాదిరి ఆదరించేవాడో మా అందరిని కూడా అంతే గౌరవంతో ఆదరించేవాడు. ఈ నాడు ఈ కైకేయి వలన మాకు రాముని అండలేకుండా పోయింది. అయినా కైక వరాలు కోరిందే అనుకో. మహారాజుగారు ఏదో ఒక వరం ఇచ్చి సరిపుచ్చవచ్చుకదా. ఆమె మాట విని రాముని వనములకు పంపాలా! బుద్ధిలేకపోతే సరి!” అని దశరథుని కూడా నిందిస్తున్నారు. అసలే రాముడు అడవులకుపోయిన దుఃఖంతో ఉన్న దశరథునికి అంత:పుర స్త్రీల సూటిపోటీ మాటలు భరించరానివిగా ఉన్నాయి. కానీ ఏమీ అనలేడు. తను చేసిన పని అటువంటిది కదా! రాముడు లేని అయోధ్యలో బ్రాహ్మణులు అగ్నిహోత్రములు వెలిగించలేదు...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 40)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నలుబదవ సర్గ సీతారామలక్ష్మణులు వనవాసమునకు పోవడానికి సర్వం సిద్ధం అయింది. వారు దశరథునికి నమస్కరించి ఆయనకు ప్రదక్షిణం చేసారు. సాష్టాంగ పడ్డారు. ఆయన పాదములు తాకారు. దశరథుడు మౌనంగా వారిని ఆశీర్వదించాడు. వనవాసానికి అనుమతి ఇచ్చాడు. తరువాత వారు కౌసల్యకు నమస్కరించారు. ఆమె ఆశీర్వాదము తీసుకున్నారు. లక్ష్మణుడు తన తల్లి సుమిత్రకు నమస్కరించి ఆమె ఆశీర్వాదముతీసుకున్నాడు. సుమిత్ర లక్ష్మణుని తలను నిమిరి ఇలా అంది. “నాయనా లక్ష్మణా! రాముడు నీ అన్న వనవాస సమయము లో రాముని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. ఎందుకంటే సుఖదుఃఖములలో రాముడే నీకు దిక్కు. రాముని నీ తండ్రి దశరథుని గా భావించు. ఇంక నీ వదిన సీతను నీ తల్లి అంటే నేనుగా భావించు. నీ తల్లి తండ్రులకు సేవ చేసినట్టు వారికి కూడా సేవలు చెయ్యి. జాగ్రత్తగా వెళ్లిరా!" అనిపలికింది సుమిత్ర. అందరూ రథము దగ్గరకు వచ్చారు. సుమంత్రుడు రథమువద్ద నిలబడి ఉన్నాడు. రాముని చూచి “రామా! రథము సిద్ధముగా ఉన్నది. మీరు రథము ఎక్కండి. మనము ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడకు తీసుకొని వెళుతాను.” అని అన్నాడు సుమంత్రుడు.  రాముడు, లక్ష్మణుడు, సీత రథం ఎక్కారు. రథములో దశరథ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 39)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ముప్పది తొమ్మిదవ సర్గ దశరథుడు రాముని వంక చూచాడు. అప్పటికే రాముడు నారచీరలు ధరించాడు. ముని కుమారుని వేషంలో ఉన్నాడు. పట్టాభిషేకము చేసుకుంటూ పట్టు పీతాంబరములు ధరించి సింహాసనము మీద కూర్చుండగా చూడవలసిన రాముని నార చీరలలో మునివేషధారణలో చూడగానే దశరథునికి దుఃఖం ముంచుకొచ్చింది. రామునికి బదులు చెప్పలేకపోయాడు. శరీరం వశం తప్పుతూ ఉంది. నిలదొక్కుకున్నాడు. దు:ఖంతో తలవంచుకొని కూర్చున్నాడు. “పూర్వము నేను ఎందరినో పిల్లలను తమ తల్లి తండ్రుల వద్దనుండి విడదీసిఉంటాను. అందుకే నాకు ఈనాడు ఈ దుర్గతి దాపురించింది. లేకపోతే నా రాముడు నన్ను విడిచి అడవులకు పోవడం ఏమిటి. రాముని మునివేషధారణలో చూచి కూడా నా ప్రాణములు పోలేదంటే నాకు ఇంకా కాలం ఆసన్నం కాలేదన్నమాట. ఈ నాడు ఒక్క కైక స్వార్థము కొరకు అయోధ్యా ప్రజలందరూ బాధపడు తున్నారు. ఒక్కరి లాభం కోసం ఇంతమంది బాధపడవలెనా!" అని తనలో తనే కుమిలిపోతున్నాడు. ఇంకతప్పదని సుమంత్రుని చూచి "సుమంతా! రాముని ప్రయాణమునకు రథము సిద్ధం చెయ్యి. రాముని అందులో ఎక్కించుకొని ఈ దేశపు సరిహద్దులు దాటించి అవతల ఉన్న అరణ్యములో విడిచిపెట్టు. సుమంత్రా! మనిషి మంచివాడుగా ఉండ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 38)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ముప్పది ఎనిమిదవ సర్గ వసిష్ఠుడు కైకతో మాట్లాడిన మాటలు విన్న అంత:పుర స్త్రీలు నార చీర కట్టుకోడానికి రాక అవస్థలుపడుతున్న సీతను చూచి, కైకను దశరథుని మనసులోనే తిట్టుకున్నారు. వారి మనోభావాలను గహించాడు దశరథుడు. దశరథుడు కైక వంక చూచి "ఓ కైకా! వసిష్ఠుల వారి మాటలు విన్నావు కదా! వారు చెప్పినది యదార్థము. సీత నారచీరలు ధరించనవసరము లేదు. సీత సుకుమారి. వయసులో చిన్నది. పుట్టినప్పటినుండి రాజభోగాలలో మునిగితేలింది. సీతకు వనవాసము సరికాదు. అని వసిష్ఠులవారు చెప్పినది అక్షరాలా సత్యము. జనకమహారాజు కుమార్తె సీత ఒక యోగిని వలె నారచీరలు ధరించనవసరం లేదు.  ఓ కైకా! సీత నీకు ఏమి అపకారము చేసిందని ఆమెకు నారచీరలు ఇచ్చావు. నేను నీకు, 'సీత కూడా నార చీరలు ధరించి అడవులకు వెళుతుంది' అని వరం ఇచ్చానా! మరి సీతకు ఎందుకు ఇచ్చావు నారచీరలు? ఆమె ఎవరో తెలుసా! జనకమహారాజు కూతురు. ఆమె నారచీరలు ధరించాలా! కాబట్టి, ఆమెకు పట్టుబట్టలు ఇవ్వు. అంతే కాదు ఆమె వెంట పట్టుబట్టలు, ఆభరణములు పంపించమని ఆదేశిస్తున్నాను. నాకే జీవించడానికి అర్హత లేదు. అటువంటి వాడిని నేను నీకు వరాలు ఇచ్చాను. నా మాటను రాముడు పాటిస్తున...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 37)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ముప్పది ఏడవ సర్గ సుమంత్రుడు, మంత్రి సిద్ధార్థుడు పలికినమాటలు అన్నీ విన్నాడు రాముడు. తరువాత వినయంగా దశరథునితో ఇలా అన్నాడు. “తండ్రిగారూ! తమరు ఏల శ్రమ తీసుకుంటారు. వనములో ఉంటూ కందమూలములు భుజిస్తూ భూమి మీద పడుకొనేవాళ్లము మాకు ఈ సైన్యములు, పరివారము, రథములు ఎందుకు. ఇక్కడ జరిగేది ఎలా ఉందంటే, ఉత్తమమైన ఏనుగును ఇచ్చిన తరువాత, దానికి కట్టే తాడు గురించి వాదులాడుకుంటున్నట్టు ఉంది. రాజ్యమే పోయిన తరువాత పరివారము రాజలాంఛనాలు ఎందుకు చెప్పండి. మాకు ఏమీ అవసరము లేదు. ఆ రాజభోగములు అన్నీ భరతుని అనుభవించ మని చెప్పండి. మాకు కట్టుకోడానికి నారచీరలు తెప్పించండి. మేము రేపటి నుండి వనవాసము చేయబోతున్నాము. మాకు కావలసినవి నేల చదును చేసుకోడానికి ఒక గునపము, గంప. అంతే. అవి తీసుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి." అని అన్నాడురాముడు. ఇంతలో కైక కలుగచేసుకొని "నారచీరలు సిద్ధంగా ఉ న్నాయి. మీరు కట్టుకోవడమే తరువాయి" అని అప్పటికే సిద్ధంగా ఉంచిన నారచీరలు అక్కడకు తెప్పించింది. రాముడు భక్తితో కైక చేతుల మీదుగా ఆ నారచీరలు అందుకున్నాడు. తాను ధరించిన రాజవస్త్రములు విడిచి ఆ నారచీరలు కట్టుకున్నాడు....