Posts

Showing posts from October, 2024

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 10)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము పదవ సర్గ తాను ఎన్ని హితమైన వాక్యములు చెప్పినా ఏమీ మాట్లాడ కుండా వెళ్లిపోయిన రావణుని ప్రవర్తన చూచి కూడా తన పట్టు వీడలేదు విభీషణుడు. వ్యక్తిగత శ్రేయస్సుకన్నా సమాజ శ్రేయస్సు ముఖ్యమని నమ్మిన విభీషణుడు మరలా తన ప్రయత్నాలను కొనసాగించాడు. మరునాడు ప్రాతః కాలమునందే లేచి రావణుని గృహమునకు వెళ్లాడు. రావణుని గృహములో వేదఘోషలు మిన్నుముడుతున్నాయి. రావణుని విజయాన్ని ఆకాంక్షిస్తూ పండితులు వేదములు పఠిస్తున్నారు. మరి కొందరు పుణ్యాహవచనములు చదువుతున్నారు. రాక్షసులతో పూజింపబడుతున్న రావణుని చూచి విభీషణుడు భక్తితో నమస్కరించాడు. రావణుడు విభీషణుని పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చోమని సంజ్ఞచేసాడు. విభీషణుడు రావణుడు చూపిన ఆసనము మీద కూర్చున్నాడు. రావణుడు విభీషణుని చూచి ఎందుకు వచ్చావు అన్నట్టు చూచాడు. అప్పుడు విభీషణుడు రావణునితో ఇలా అన్నాడు. "ఓ రాక్షసరాజా! నీకు జయము కలుగుగాక! సీత లంకలో అడుగు పెట్టినది మొదలు అశుభశకునములు కనపడుతున్నాయి. తరచుగా పాలు విరిగిపోతున్నాయి. హోమాగ్ని ప్రకాశవంతంగా వెలగడం లేదు. గుర్రములు గాడిదలు ఏదో తెలియని రోగాలతో బాధపడుతున్నాయి. కాకులు గుంపులు గుంపులుగా ఇండ్ల మీద కూర...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - తొమ్మిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 9)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము తొమ్మిదవ సర్గ తరువాత రాక్షసవీరులైన నికుంభుడు, రభసుడు, సూర్యశత్రువు, సుప్తఘ్నడు, యజ్ఞకోపుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, దుర్ధర్షుడు, రశ్మికేతువు, రావణుని కుమారుడు ఇంద్రజిత్తు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, వజ్రదంష్ట్రుడు, ధూమ్రాక్షుడు, నికుంభుడు, దుర్ముఖుడు అనే పేరు గల రాక్షస వీరులు రావణునితో తమ తమ శౌర్యప్రతాపాలను ప్రదర్శిస్తూ, వెంటనే హనుమంతుని చంపివేద్దాము అని ప్రతిజ్ఞలు చేసారు. రావణుని మెప్పు సంపాదించడం కోసరం రాక్షస వీరులు చెప్పిన మాటలను రావణుని తమ్ముడు విభీషణుడు శ్రద్ధగా విన్నాడు. వారందరినీ శాంతింపజేసి వారి వారి స్థానములలోకూర్చోపెట్టాడు. తరువాత విభీషణుడు లేచి సభను ఉద్దేశించి ఇలా అన్నాడు. “ఏదైనా ఒక కార్యమును సాధించాలంటే సామ, దాన, భేదో పాయములను ముందు ప్రయోగించాలి. అవి సఫలము కానప్పుడు దండోపాయమును ప్రయోగించాలి అని తెలివికలవాళ్లు చెబుతారు. శత్రువు ఏమరిపాటుగా ఉన్నప్పుడు, ఇతర రాజులచేత ఓడింపబడినప్పుడు, వారికి దైవము అనుకూలంగా లేనప్పుడూ, శత్రువును మన పరాక్రమము ఉపయోగించి లొంగదీసుకోవచ్చును. ప్రస్తుతము మన శత్రువు రాముడు, మహా పరాక్రమవంతుడు. ఏ మాత్రం ఏమరిపాటు లేని వాడు. కోపమున...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 8)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఎనిమిదవ సర్గ తరువాత ప్రహస్తుడు అనే రాక్షస సేనాధిపతి లేచి ఇలా అన్నాడు. “ఓ రాక్షసేంద్రా! నీవు యుద్ధములో దేవతలను, గంధర్వులను, దానవులను, నాగులను జయింప సమర్ధుడవు. ఇంక ఈ ఇద్దరు మానవులు నీముందు నిలువగలరా! హనుమంతుడు అనే వానరము వచ్చినప్పుడు మనమందరమూ అప్రత్తంగా, యుద్ధమునకు సిద్ధంగా లేము. అందువలన ఆ వానరము అంతటి దురాగతములు చేయగలిగాడు. లేనిఎడల, ఆ తుచ్ఛ వానరము లంకను దాటి పోగలడా! నీవు ఆజ్ఞాపిస్తే చాలు. ముల్లోకములలో వానరము అనే మాట వినపడకుండా చేస్తాము. వానర జాతిని సర్వనాశనము చేస్తాము. ఓ రాక్షసరాజా! మీరు సుగ్రీవుని విషయం నాకు విడిచిపెట్టండి. వాడిని నేను కట్టడి చేస్తాను. సీతను తీసుకు వచ్చినందుకు మీరేమీ చింతించకండి." అని పలికాడు ప్రహస్తుడు. తరువాత దుర్ముఖుడు అనే రాక్షసుడు లేచి ఇలా పలికాడు. “ఓ రాజా! ఆ వానరుడు మన లంకకు చేసిన అపకారము సహించరానిది. ఒక వానరుడు లంకాధిపతిని ఎదిరించడమా! అది మేము సహించడమా! నేను ఇప్పుడే పోయి ఆ వానర జాతిని వారు ఎక్కడ దాక్కున్నా వెతికి వెతికి సర్వనాశనము చేస్తాను." అని అన్నాడు. తరువాత వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడు ఇలా అన్నాడు. “మనము ఆ వానరము హనుమంతు...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 7)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఏడవ సర్గ రాక్షస రాజు రావణుని మాటలు శ్రద్ధగా విన్నారు రావణుని మంత్రులు. బాగా ఆలోచించారు. వారికి తోచిన ఉపాయములను ఇలా చెప్పసాగారు. “రాక్షసేంద్రా! మన రాక్షస బలము తక్కువ కాదు. పరిఘలు, కత్తులు, పట్టిశములు మొదలగు మారణాయుధములను ధరించిన రాక్షససేన లెక్కకు మించి ఉంది. నీకు దిగులుపడాల్సిన పనిలేదు. ఇంక నీ బలపరాక్రమములు తక్కువేమీ కాదు. నీవు పాతాళములో ఉన్న భోగవతీ నగరమును జయించిన వీరుడివి. యక్షులను జయించి, యక్షరాజు, నీ సోదరుడు అయిన కుబేరుని ఓడించిన శూరుడవు. మహేశ్వరునకు సఖుడు అని చెప్పుకొనుచున్న కుబేరుని గర్వము అణిచిన మహాబలుడవు. కుబేరుని వద్దనుండి పుష్పకమును తీసుకొని వచ్చిన ధీరుడవు. దానవ రాజు మయుడు నీ బలపరాక్రమములకు భయపడి తన కుమార్తె మండోదరిని నీకు ఇచ్చి వివాహం చేసాడు. నీతో బంధుత్వము కలుపుకున్నాడు. దానవ వీరుడు, నీ సోదరి కుంభీనసి భర్త అయిన మధువును ఓడించిన పరాక్రమశాలివి. నీవు రసాతలములో ఉన్న వాసుకి, తక్షకుడు, శంఖుడు మొదలగు నాగులను జయించి, నాగజాతిని వశం చేసుకున్నావు. నీవు ఒంటరిగానే కాలకేయులు అనే దానవులను జయించావు. వాళ్ల దగ్గర నుండి అనేక మాయలను గ్రహించావు. చతురంగ బలములు కలిగిన వర...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 6)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఆరవ సర్గ ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ లంకాపురిలో రావణుడు చింత్రాక్రాంతుడయి ఉన్నాడు. ఒక కోతి వచ్చి లంకను దహనం చేసింది. తన కుమారుని చంపింది. వేలకొద్దీ రాక్షస వీరులను హతమార్చింది. రావణుని మనసంతా కలత చెందింది. తన మంత్రులతో సమావేశము ఏర్పాటు చేసాడు.  "ఒక వానరము శత్రుదుర్భేధ్యమైన లంకా నగరంలో ప్రవేశించి అశోక వనములో ఉన్న సీతను చూడగలిగాడు. అంతే కాకుండా అశోక వనములో ఉన్న చైత్యప్రాసాదమును నాశనం చేసాడు. ఎందరో రాక్షసులను చంపాడు. లంకను కాల్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది. మీకు తోచిన విధంగా నాకు సలహాలు ఇవ్వండి. ఈ సమయములో నేను ఒక్కడినే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఇదంతా రాముని వలన జరిగింది. రాముని విషయంలో మనం ఏం చెయ్యాలి. లోకంలో మూడు రకాలైన మనుషులు ఉంటారు. వారు ఉత్తములు, మధ్యములు, అధములు. రాజు హితము కోరేవారు, మంత్రాంగములో సమర్ధులు, హితులతోనూ, బంధువులతోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొనే వాళ్లు, దైవానుకూలము కొరకు ప్రయత్నము చేసేవారు ఉత్తములు అని పిలువబడుతారు. ఇతరుల ప్రమేయం లేకుండా, ఇతరులతో ఆలోచించకుండా, సొంత నిర్ణయాలు తీసుకొనే వాడు, ఇతరుల సాయం లేకుండా ఒ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 5)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఐదవ సర్గ నీలుడు తన సేనలను సముద్రము ఉత్తరదిక్కుగా నిలిపాడు. మైందుడు, ద్వివిదుడు వానర సేనలు విడిది చేసిన ప్రాంతం అంతా సంచరిస్తూ, వారి రక్షణ గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సముద్రమును చూస్తున్నరాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! రోజులు గడిచే కొద్దీ మనిషిలో ఉన్న శోకము తగ్గి పోతుంది అంటారు. కానీ సీత గురించి నేను పడుతున్న శోకము తగ్గకపోగా రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది.  లక్ష్మణా! ఈ గాలి ముందు నా సీత మీద ప్రసరించి, తరువాత నా మీద ప్రసరిస్తే నేను నా సీతను సృశించిన సుఖమును పొందుతాను. నా సీత ఇప్పుడు చంద్రుడిని చూస్తూ ఉంటుంది. నేను కూడా అదే చంద్రుడిని చూస్తున్నాను. అప్పుడు మా ఇరువుని చూపులు కలిసినట్టే కదా! నేను, సీత ఇదే భూమి మీద ఉన్నాము. అంటే నేను నా సీత దగ్గర దగ్గరగా ఉన్నట్టే కదా! నా సీతను రావణుడు తీసుకొని పోతుంటే నా సీత అరిచిన అరుపులు నాకు హృదయవిదారకంగా వినపడుతున్నాయి. నేను ఏమీ చేయలేని అసమర్ధుడిలా మిగిలిపోయాను. సీత లేని తాపము నేను భరించలేను. ఈ సముద్రము జలములలో మునిగి నా తాపమును చల్లార్చుకుంటాను. నేను ఎన్నడు ఈ సముద్రమును దాటి, రావణుని చంపి, నా సీతను తి...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నాల్గవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 4)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము నాలుగవ సర్గ హనుమంతుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. రామునిలోని శౌర్యము, ప్రతాపము ఉప్పొంగింది.  “మనమందరము లంకకు చేరుకొని దానిని నాశనం చేద్దాము. సుగ్రీవా! వెంటనే ప్రయాణమునకు ముహూర్తము నిశ్చయించు. వానర సేనలను సర్వసన్నద్ధము కావించు. నా సీతను అపహరించిన ఆ రావణుడు నన్ను తప్పించుకొని ఎక్కడకు పోగలడు? సుగ్రీవా! నేడు ఉత్తరఫల్గునీ నక్షత్రము. రేపు చంద్రుడు హస్తా నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అంతే కాకుండా శుభశకునములు కనపడుతున్నాయి. కాబట్టి ప్రయాణమునకు ఇదే మంచి ముహూర్తము. మనకు విజయము తథ్యము. సుగ్రీవా! సైన్యములను బయలుదేరమని ఆజ్ఞాపించు.” అని అన్నాడు రాముడు. సుగ్రీవుడు, లక్ష్మణుడు రాముని ఆదేశములను శిరసావహించారు. తరువాత రాముడు వానర సేనాపతులకు ఈ ప్రకారంగా ఆదేశాలు ఇచ్చాడు.  “నీలుడు లక్షమంది సైనికులను తీసుకొని మార్గమును సరి చూచుకుంటూ ముందు వెళతాడు. మన సైనికులు వెనక వస్తారు. నీలుడు మార్గమధ్యంలో ఫలములు, దుంపలు, చల్లని నీడనిచ్చే అడవులు, నీరు, తేనె ఉన్న మార్గములను ఎంచుకొని ఆ దారిలో ప్రయాణిస్తూ మనకు మార్గము చూపుతాడు.  ఓ నీలుడా! మనము సైన్యముతో వస్తున్నామని తెలిసి ర...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 3)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము మూడవ సర్గ సుగ్రీవుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. సముద్రము మీద వారధి కట్టి సముద్రమును దాటాలి అన్న ఆలోచన రామునికి బాగా నచ్చింది. వెంటనే హనుమంతుని చూచి ఇలా అన్నాడు.  “హనుమా! సముద్రమును దాటడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి తపశ్శక్తి. రెండు. సముద్రమును ఎండించి, అప్పుడు దాటడం. మూడవది సముద్రము మీద వారధి కట్టడం. ఈమూడు చేయడానికి నేను సమర్ధుడను. నీవు లంకను బాగా పరిశీలించావు కదా! లంకలో ఎన్ని దుర్గములు ఉన్నాయి? అవి ఎలా నిర్మింపబడ్డాయి. రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి. లంకలో ఎంత మంది సైనికులు ఉన్నారు. నగరంలో ప్రవేశించడానికి ద్వారములు ఎన్ని ఉన్నాయి. నగరం పరిమాణం ఎంత. నాకు సవిస్తరంగా చెప్పు." అని అడిగాడు. రాముడికి నమస్కరించి హనుమంతుడు ఇలా చెప్పసాగాడు. "ఓ రామా! నాకు తెలిసినంతవరకూ, లంకా నగరము గురించి, దుర్గ నిర్మాణము గురించి చెబుతాను. లంకలో లెక్కకు మించి ఏనుగులు, రథములు ఉన్నాయి. లంక చాలా విశాలమైన నగరము. అది ఒక పర్వతము మీద నిర్మింపబడి ఉంది. లంకా నగరమునకు నాలుగు పక్కలా నాలుగు ప్రధాన ద్వారములు ఉన్నాయి. ఆ ద్వారములకు ధృడంగా, గట్టిగా నిర్మించ బడ్డ దుర్భేద్యమైన ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 2)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము రెండవ సర్గ రాముడు పలికిన పలుకులు విన్న సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు.  “రామా! నీవు మహా వీరుడవు. ఈ చిన్నవిషయానికి సామాన్యుని వలె ఇంతగా చింతించవలెనా!  ఓరామా! ఇప్పుడు మనకు సీత ఎక్కడ ఉందో తెలిసింది. ఆమెను ఎవరు అపహరించుకొని వెళ్లారో, శత్రువు ఎక్కడ ఉంటాడో తెలిసింది. ఇంక యుద్ధమే మిగిలింది. దీనికి దుఃఖించడం ఎందుకు? రామా! నీవు బుద్ధిమంతుడవు. సకల శాస్త్ర పారంగతుడవు. మంచి ఆలోచనా శక్తి కలవాడవు. ఎంతటి క్లిష్ట సమయంలో కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకోడంలో సమర్ధుడవు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం వదిలిపెట్టు. మనం అందరం అపారమైన వానరసేనతో సముద్రమును దాటి లంకకు వెళుతున్నాము. నీ శత్రువును సంహరిస్తున్నాము. సీతను అయోధ్యకు తీసుకొని వస్తున్నాము.  ఓరామా! నిరుత్సాహంతో, బుద్ధిమందగించి, చేయబోయే కార్యమును గురించి దిగులు పడే వాడికి అతడు తలపెట్టిన కార్యములు నెరవేరవు. పైగా అన్నీ కష్టాలే కలుగుతాయి. ఓ రామా! ఒక్కసారి ఈ వానర నాయకులను ఒక్కసారి చూడు. వీరు అత్యంత శూరులు. ఏ పని చెయ్యడానికైనా సమర్థులు. నీవు ఆజ్ఞాపిస్తే అగ్నిలో కూడా దూకడానికి వెనుకాడరు. వారి మొహాలలో తొణ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - మొదటి సర్గ (Ramayanam - YuddhaKanda - Part 1)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము మొదటి సర్గ శ్రీరాముడు హనుమంతుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు. చాలా సంతోషించాడు. "హనుమా! ఇతరులకు దుర్లభమైన కార్యమును నువ్వు నెరవేర్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నూరు యోజనముల దూరము ఉన్న సముద్రమును వాయు దేవుడు, గరుడుడు, నీవు తప్ప తక్కిన వారు దాటలేరు. అంతే కాదు, దేవతలకు, దానవులకు, గంధర్వులకు, నాగులకు కూడా ప్రవేశించుటకు వీలుకాని లంకానగరములోకి ప్రవేశించి క్షేమంగా తిరిగి వచ్చావు. అది నీకే సాధ్యమయింది. దీనిని బట్టి చూస్తే లంకా నగరములోకి హనుమంతుడు, అతనికి సమానమైన బలపరాక్రమములు కలవాడు తప్ప, ఇతరులు ప్రవేశించలేరు అని తేలింది. కేవలము హనుమంతుడే తన బలమును పరాక్రమమును ఉపయోగించి సుగ్రీవుని ఆజ్ఞను నెరవేర్చాడు. అది ఎంత కష్టమైన కార్యము అయినా, దానిని ఆసక్తితో, చాకచక్యముతో నెరవేర్చినవాడే భృత్యులలో ఉత్తముడు అని చెప్పబడతాడు. బుద్ధిముంతుడు, సమర్ధుడు అయి ఉండి కూడా, చెప్పిన పనిని ఎంత వరకు చెప్పాడో అంతవరకే చేసేవాడిని మధ్యముడు అని చెప్పబడతాడు. బుద్ధిమంతుడు, సమర్ధుడు అయి ఉండి కూడా, రాజు చెప్పిన కార్యమును శ్రద్ధతో చేయడో, అతడు అధముడుఅని చెప్పబడతాడు. హనుమంతుడు ఉత్తముడైన భృత్యుడు. ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 68)

శ్రీమద్రామాయణము సుందర కాండము అరువది ఎనిమిదవ సర్గ "ఓ రామా! నేను బయలు దేరి వస్తుంటే సీతమ్మ నాతో ఇంకా ఈ విధంగా పలికింది.  “హనుమా! ఇక్కడ జరుగుతున్న విషయములు యధాతథముగా రామునికి చెప్పి రాముని ఇక్కడకు తీసుకొని వచ్చి, రావణ సంహారము చేసి, నన్ను రక్షించునట్టు చెయ్యి. ఓ హనుమా! నీవు ఇక్కడ ఉన్నంత సేపూ నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు నీవు వెళ్ళిపోతున్నావు, మరలా నా కష్టాలు మొదలవుతాయి. రాముడు తన సమగ్రసైన్యముతో వచ్చి, రావణుని జయించి నన్ను తీసుకొని వెళ్లడం రామునికి యశస్సు కలిగిస్తుంది. అంతేకానీ, రావణుడు నన్ను దొంగతనంగా తీసుకొని వచ్చినట్టు నీవు కూడా నన్ను దొంగతనంగా తీసుకొని వెళ్లడం మంచిది కాదు." అని పలికింది సీత. ఆ మాటలకు నేను సీతాదేవితో ఇలా అన్నాను. “అమ్మా! సుగ్రీవుని వద్ద ఉన్న వానరులు సామాన్యులు కారు. ఆకాశంలో ఎగురుతూ భూమిని చుట్టిరాగల సమర్థులు. ఆ వానరసేన లంక మీద ఎగరడం, లంకను చుట్టుముట్టడం నీవు తొందరలోనే చూస్తావు. వారితో పాటు వచ్చిన రాముడు, శత్రు సంహారము చేసి, నిన్ను తీసుకొని అయోధ్యానగరము చేరి, అయోధ్యము పట్టాభిషిక్తుడవడం నీవు తొందరలోనే చూడగలవు." అని నేను సీతాదేవికి ధైర్యము చెప్పాను. సీ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 67)

శ్రీమద్రామాయణము సుందర కాండము అరువది ఏడవ సర్గ రాముని మాటలు విన్న హనుమంతుడు, రామునితో సీత గురించి ఇలా చెప్పసాగాడు. “ఓ రామా! చిత్రకూట పర్వతము మీద మీరూ, సీతాదేవి ఏకాంతముగా ఉన్న సమయంలో జరిగిన కాకి విషయం ఆనవాలుగా చెప్పమని నాతో చెప్పింది. ఎందుకంటే ఆ విషయము మీకు, సీతాదేవికి తప్ప మూడో వానికి తెలియదట. మీరు, సీతా దేవి చిత్రకూట పర్వతము మీద ఉన్నప్పుడు, మీరు ఇద్దరూ నిద్రపోతున్నారట. సీతాదేవి ముందే మేలుకొన్నదట. మీరు ఇంకా నిద్రపోతున్నారట. అప్పుడు ఒక కాకి వచ్చి సీతాదేవి స్తనముల మధ్య తన ముక్కుతో చీరినదట. అలా మాటి మాటికీ ఆ కాకి చీరుతూ ఉంటే సీతా దేవి శరీరమునుండి రక్తము వచ్చినదట. ఆ రక్తము నీ శరీరమును తడుపగా నీవు మేల్కొన్నావట. నిద్రలోనుండి మేల్కొన్న నీవు, గాయపడిన సీతను, చూచి కోపంతో ఊగిపోయావట. "సీతా! నిన్ను ఎవరు గాయపరిచారు. చెప్పు" అని అడిగావట. అప్పుడు సీత ఆ కాకిని చూపినదట. నీవు రక్తముతో తడిసిన గోళ్లతో ఉన్న కాకిని చూచావట. నీవు ఒక దర్భను తీసుకొని మంత్రించి ఆ కాకి మీదికి విసిరావట. అప్పుడు ఆ దర్భ మండుతూ, ఆ కాకిని దహించడానికి ఆ కాకిని తరుముతూ వెళ్లిందట. ఆ కాకి తన తండ్రి అయిన దేవేంద్రుని వద్దకు వెళ్లినదట...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 66)

శ్రీమద్రామాయణము సుందర కాండము అరువది ఆరవ సర్గ హనుమంతుడు ఇచ్చిన చూడామణిని చూడగానే రామునికి సీతను చూచినట్టు అనిపించింది. రామునికి దు:ఖము పొర్లుకొచ్చింది. మాటి మాటికీ చూడామణిని చూస్తూ రాముడు ఏడుస్తున్నాడు. రాముడు తన మిత్రుడు సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు. 'సుగ్రీవా! ఈ చూడామణి మా వివాహ సమయములో నా మామ గారు అయిన జనక మహారాజు సీత శిరస్సున ధరించడానికి ఆమెకు ఇచ్చారు. ఈ మణి జలములో నుండి పుట్టింది. ఈ మణి తొలుత దేవేంద్రుని వద్ద ఉండేది. జనక మహారాజు ఒక యజ్ఞము చేసినప్పుడు, దేవేంద్రుడు సంతోషించి ఈ మణిని జనకమహారాజుకు ఇచ్చాడు. జనకుడు ఈ మణిని తన కుమార్తె సీతకు ఇచ్చాడు. ఈ మణిని చూస్తుంటే నాకు నా తండ్రి దశరథుడు, నా మామగారు జనక మహారాజు గుర్తుకు వస్తున్నారు. సీత ఎల్లప్పుడూ ఈ మణిని తన శిరస్సున ధరించేది. ఈ మణిని చూస్తుంటే నాకు సీతను చూస్తున్నట్టు ఉంది. లక్ష్మణా! చూచావా! సీత నా దగ్గర లేదు. కానీ సీత ధరించిన మణి నా దగ్గర ఉంది. లక్ష్మణా! సీత ఇంక ఒక మాసము రోజులు మాత్రమే జీవించి ఉండునట! సీత లేనిదే నాకు జీవితము లేదు. నన్ను వెంటనే సీత ఎక్కడ ఉందో అక్కడకు తీసుకొని వెళ్లండి. సీతను చూడకుండా నేను క్షణకాలం కూడా ఉండలేను. సీత...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 65)

శ్రీమద్రామాయణము సుందర కాండము అరువది ఐదవ సర్గ అంగదుడు మొదలగు వానరులు రామునితో, తాము సీతను చూచామనీ, సీత లంకలో క్షేమంగా ఉందనీ, ఆమె రావణుని అంత:పురములో బందీగా ఉందనీ, రాక్షస స్త్రీలు ఆమెను భయపెడుతున్నారనీ, సీత ఎల్లప్పుడూ రాముని తలచుకుంటూ ఉందనీ, రావణుడు ఆమెకు రెండు మాసముల గడువు ఇచ్చాడనీ, గబాగబా, గాభరాగా, కలగా పులగంగా చెప్పసాగారు. రాముడు వారిని ఆపి, వారితో ఇలా అన్నాడు. “ఓ వానరులారా! సీత ఎక్కడ ఉంది? నా గురించి ఏమని అనుకుంటూ ఉంది? సీతను ఎవరు చూచారు. ఆ విషయములు అన్నీ నాకు వివరంగా చెప్పండి." అని అడిగాడు. అప్పుడు ఆ వానరులు అందరూ సీతను చూచిన హనుమంతుని ముందుకు తోసారు. అప్పుడు హనుమంతుడు తన ఎదురుగా ఉన్న రామునికి, లంక వైపు తిరిగి లంకలో ఉన్న సీతకు నమస్కరించి, సీతను తను ఎలా చూచింది, సీత లంకలో ఎలా ఉ న్నదీ, రాముని గురించి ఏమనుకుంటూ ఉన్నదీ చెప్పనారంభించాడు. “ఓ రామా! నేను నూరు యోజనముల దూరము ఉన్న సముద్రమును దాటి లంకకు చేరుకున్నాను. లంకలో సీత కోసరం అన్ని చోట్లా వెదికాను. రావణుని అంతఃపురములో నేను సీతను చూచాను. సీత తన ప్రాణములు అన్నీ నీ మీదనే పెట్టుకొని జీవిస్తూ ఉంది. ఆమెకు కాపలాగా వికృతాకారులైన రాక్షస స్త్...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది నాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 64)

శ్రీమద్రామాయణము సుందర కాండము అరువది నాలుగవ సర్గ సుగ్రీవుని మాటలను సావధానంగా విన్నాడు దధిముఖుడు. అసలు విషయం అర్థం అయింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు నమస్కరించాడు. తనతో వచ్చిన వనపాలకులతో కలిసి వెంటనే మధువనమునకు ఎగిరిపోయాడు. అప్పటికే బాగా మధువును సేవించిన వానరులు మత్తులో తూలుతున్నారు. దధిముఖుడు చేతులు జోడించి నమస్కరిస్తూ యువరాజైన అంగదుని వద్దకు వెళ్లాడు. “యువరాజా! తమరు ఎవరో తెలియక మా వనరక్షకులు మీకు ఆటంకము కలిగించారు. మమ్ములను క్షమించండి. నీవు కిష్కింధకు యువరాజువు. నీకు ఈ మధువనము మీద సర్వాధికారములు కలవు. మా మూర్ఖత్వముచేత మీ గురించి తెలియక అపరాధము చేసినాము. మమ్ములను క్షమించండి. మీరు ఇక్కడకు వచ్చినట్టు నేను మీ పినతండ్రి సుగ్రీవుల వారికి తెలియజేసాను. మీ రాకను గురించి విని సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. ఈ మధువనము ధ్వంసము అయిన దాని గురించి ఆయన విచారించలేదు. మీ అందరినీ తొందరగా రమ్మని చెప్పారు. మీ రాక కోసం రామలక్ష్మణులు, సుగ్రీవుడు ఆతురతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ వెంటనే సుగ్రీవుని వద్దకు పోవుట యుక్తము." అని దధిముఖుడు అంగదునితో చెప్పాడు. దధిముఖుని మాటలు విన్న అంగదుడు హనుమంతుడు మొద...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది మూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 63)

శ్రీమద్రామాయణము సుందర కాండము అరువది మూడవ సర్గ సుగ్రీవుడు దధిముఖుని బుజాలు పట్టుకొని లేవ నెత్తాడు. “ఏమయింది దధిముఖా! నీకు నీ వారికి క్షేమమే కదా! ఎందుకు అలా దిగాలుగా ఉన్నావు. ఏం జరిగింది. వివరంగా చెప్పు" అని అడిగాడు సుగ్రీవుడు. “ఓ మహారాజా! మధువనము నీకు చెందినది. నీ తండ్రి గానీ, నీవు గానీ, నీ అన్న వాలి గానీ, ఆ మధువనమును ఎవరికీ అనుభవించమని ఇవ్వలేదు. ఆ మధువనమునకు మమ్ములను రక్షకులుగా నియమించావు. కాని ఈ రోజు కొంత మంది వానరులు వచ్చి ఆ మధువనమును ఆక్రమించుకొని, మధువును తాగి. నానా అల్లరీ చేసారు. మా అందరినీ కొట్టారు. వన రక్షకులు అడ్డుకోగా వారిని కూడా లెక్క చేయలేదు. అందరినీ కొట్టారు. వారు మధువును తాగుతూ మిగిలింది పారబోస్తూ అదేమని అడిగితే కళ్లెర్ర చేస్తున్నారు. మేము మరలా మరలా వారిని అలా చేయవద్దు అని వారింపగా మా అందరినీ అక్కడి నుండి తరిమివేసారు. మా అందరినీ కొట్టి, తన్ని ఈడ్చి, మారు మూల ప్రదేశాలకు తరిమేసారు. మీరు మాకు రాజుగా ఉండి కూడా, ఆ వానరులు ఇంతటి దురాగతానికి పాలుబడ్డారు. మధువనమును పూర్తిగా నాశనం చేస్తున్నారు. మీరు వారిని కఠినంగా శిక్షించాలి." అని విన్నవించుకున్నాడు దధిముఖుడు. ఈ మాటలు అన...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది రెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 62)

శ్రీమద్రామాయణము సుందర కాండము అరువది రెండవ సర్గ దదిముఖుడు వానరములను అడ్డుకోవడం చూచి అందరూ హనుమంతుని వద్దకు వెళ్లారు.  “హనుమా! మేము ఈ వనములో మధువును సేవించడానికి ప్రయత్నిస్తుంటే ఈ దధిముఖుడు అడ్డుకుంటున్నాడు." అని అన్నారు. హనుమంతుడు వానరములను చూచి ఇలా అన్నాడు. “మీరు ఎవరికీ భయపడకండి. మీ ఇష్టం వచ్చినట్టు ఈ మధు వనములో మధువు సేవించండి.  మీకు ఎవరైనా అడ్డుచెబితే నేను వాళ్లను అదుపు చేస్తాను." అని అన్నాడు. ఆ మాటలు విన్న అంగదుడు చాలా సంతోషించాడు. “మీరందరూ ఈ మధువనములో సేకరింపబడిన మధువును తనివిదీరా తాగండి. మన హనుమంతుడు మనము చేయలేని కార్యమును సాధించుకొని వచ్చాడు. ఈ సంతోష సమయంలో మీరు ఏమి చేసినా ఏమీ అనను. ఇక్కడ మధువును తాగడం మనము చేయకూడని పని అయినా, హనుమంతుడు చెప్పాడు కాబట్టి మనం చేద్దాము." అని అనుజ్ఞ ఇచ్చాడు. ఆ మాటలు విన్న వానరములు అంగదుని అభినందించారు. అందరూ మధువనములో ఉన్న మధువును తాగడానికి ఉద్యమించారు యధేచ్ఛగా మధువును సేవించారు. ఫలములను తిన్నారు. అడ్డం వచ్చిన వనపాలకులను చావ చితకా కొట్టారు. కుండలతో మధువును సేవించారు. అందరూ మత్తులో తూలుతున్నారు. అసలే వానరులు. పైగా మధువు సేవించారు. తాగిన...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువది ఒకటవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 61)

శ్రీమద్రామాయణము సుందర కాండము అరువది ఒకటవ సర్గ పెద్దవాడు అయిన జాంబ వంతుని మాటలు అంగదునికి మిగిలిన వానరులకు బాగా నచ్చాయి. అందరూ జాంబవంతుడు ఎలా చెబితే అలా చేద్దాము అని అన్నారు. అందరూ కిష్కింధకు తిరిగి వెళ్లిపోదాము అని అనుకున్నారు. అందరూ హనుమంతుని ముందుంచుకొని మహేంద్ర పర్వతమును వదిలి పెట్టి ఆకాశంలో ఎగిరిపోయారు. అందరిలోనూ ఒకటే నిశ్చయము. రాముడికి సీత గురించి చెప్పడం, రావణుని చంపడం, సీతను తీసుకురావడం. ఎంత తొందరగా రాముడికి సీత గురించి చెబుదామా అని ఆతురతగా ఉన్నారు. వారందరూ ఒక ఉద్యానవనమును చేరారు. దానిని సుగ్రీవుని మేనమామ మహా పరాక్రమ వంతుడు అయిన దధిముఖుడు అనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ వనము అంటే సుగ్రీవునికి ఎంతో ఇష్టం. అటువంటి వనములో మధువు బాగా దొరుకుతుంది. ఆ మధువును తాగాలని వానరులు అందరూ నిశ్చయించుకున్నారు. అందరూ ఆ మధువనములోకి ప్రవేశించారు. అసలే వానరులు. అందులోనూ సీతను చూచిన ఆనందంలో ఉన్నారు. వారి సంతోషానికి పట్టపగ్గాలు లేవు. వానరులు అందరూ ఆ మధువనములోని మధువును తాగడానికి అంగదుని అనుమతి కోరారు. అంగదుడు పెద్దవాడైన జాంబవతుని అనుమతి కోరాడు. వానరుల ఉత్సాహమును చూచి జాంబవంతుడు మధువనములో మధువును తాగడా...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - అరువదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 60)

శ్రీమద్రామాయణము సుందర కాండము అరువదవ సర్గ హనుమంతుని మాటలను సావధానంగా విన్న అంగదుడు ఇలా అన్నాడు. “హనుమంతుడు నూరుయోజనముల సముద్రమును దాటి లంకను చేరి సీతను చూచాడు. సీతను చూచి కూడా మనము సీతను మనతో తీసుకొని వెళ్లకుండా వట్టి చేతులతో పోవడం మంచిది కాదు. మనమంతా రాముని వద్దకు పోయి “రామా! మేము సీతను చూచాము కానీ ఆమెను అక్కడే వదిలి వచ్చాము" అని చెప్పపడం శోభస్కరము కాదని నా అభిప్రాయము. ముల్లోకములలో ఎక్కడి కైనా మనము ఎగిరిపోగల శక్తి మనకు ఉంది. ఇప్పటికే హనుమంతుడు చాలా మంది రాక్షస వీరులను సంహరించాడు. ఇంక మనము లంకకు వెళ్లి సీతను రావడమే మిగిలి ఉంది." అని పలికాడు అంగదుడు. ఆ మాటలు విన్న జాంబవంతుడు వారితో ఇలా అన్నాడు. "అంగదా! నీవు చెప్పిన మాటలు బాగుగా ఉన్నాయి. సీతను లంక నుండి తీసుకురావడం మన శక్తికి మించిన పనేం కాదు. కానీ ఇది రామ కార్యము. రాముడు మనలను కేవలం సీతను వెదకడానికి సీత జాడ తెలుసుకోడానికి పంపించాడు. మనం అంతవరకే చెయ్యాలి. ముందు మనం రాముని వద్దకు పోయి, సీత గురించి రామునికి వివరంగా చెబుదాము. రాముడు ఏమి చెబితే అలా చేద్దాము. రాముని ఆలోచన ఎలా ఉందో అలా చేద్దాము. అంతే కానీ మనం స్వతంత్రించి ఏమీ చేయ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది తొమ్మిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 59)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఏబది తొమ్మిదవ సర్గ హనుమంతుడు లంకలో తాను చేసిన పనులు జరిగిన విషయములు అన్నీ జాంబవంతునికి, అంగదునకు మిగిలిన వానరశ్రేష్టులకు చెప్పి, ఇంకా ఇలా చెప్పసాగాడు. "సీతా దేవి మహా పతివ్రత. ఆమె పాతివ్రత్య మహత్తు చేత రాముని ప్రయత్నము సఫలం అవుతుంది అని నా నమ్మకము. కానీ రాక్షస రాజు రావణుడు సామాన్యుడు కాడు. మహా బలవంతుడు. అతడికి కోపం వస్తే ఎవరినీ లెక్క చెయ్యడు. తన తపోబలంతో ముల్లోకములను నాశనం చెయ్యగల సమర్ధుడు. రావణుడు సీతను తీసుకొని వెళ్లేటప్పుడు ఆమె శరీరాన్ని తాకాడు. కానీ రావణుడు భస్మం కాకపోవడానికి కారణం అతడు చేసిన తపస్సు ఫలితమే. మరొకడు అయితే సీత పాతివ్రత్య మహిమకు భస్మంకాక తప్పదు. సీతకు కోపం వస్తే తన పాతివ్రత్య మహిమతో ఏమైనా చెయ్యగలదు. ఇదీ పరిస్థితి. మనము ఇప్పుడు ఏం చెయ్యాలి. మనం అందరం లంకకు పోయి సీతను తీసుకొని వచ్చి రామునికి అప్పగించడమా! ఎందుకంటే రావణుని ససైన్యముగా నాశనం చెయ్యడానికి నేను ఒక్కడినే చాలు. నాకు రావణుని సైన్యము యొక్క ఆనుపానులు బాగా తెలుసు. నాకు తోడు మీరందరూ ఉన్నారు. మీరందరూ బలవంతులు, అస్త్రములను శస్త్రములను ప్రయోగించడంలో నిపుణులు. మీరందరూ నాతో ఉంటే ఇంక చెప్పేద...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 58)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఏబది ఎనిమిదవ సర్గ వారందరిలోకీ పెద్దవాడు అయిన జాంబవంతుడు లేచి హనుమతో ఇలా అన్నాడు. “హనుమా! నీవు సీతను వెదుకుతూ బయలు దేరావు కదా! అప్పటి నుండి ఇప్పటి దాకా ఏమేమి జరిగిందో విపులంగా చెప్పు. నీవు సీతాదేవిని ఎలా చూచావు? సీత లంకలో ఎక్కడ ఉంది? ఎలా ఉంది? రావణుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఈ విషయములు అన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పు. తరువాత మనము ఏమి చెయ్యాలో నిర్ణయించుకుందాము. మనము కిష్కింధకు వెళ్లిన తరువాత సుగ్రీవునికి ఏయే విషయాలు చెప్పాలి. ఏయే విషయాలు దాచి పెట్టాలి అన్న విషయం కూడా బుద్ధిమంతుడివి అయిన నీవు మాకు తెలియజేయాలి. " అని అన్నాడు జాంబవంతుడు. ఆ మాటలు విన్న హనుమంతుడి ఒళ్లు పులకరించింది. తన మనసులోనే రామునికి సీతకు నమస్కరించాడు. వారందరితో ఇలా అన్నాడు. “నేను మహేంద్రపర్వతము మీది నుండి మీ అందరి ఎదుటనే ఆకాశంలోకి ఎగిరాను కదా! నాకు దారిలో ఒక ఆటంకము ఏర్పడింది. సముద్రము లోనుండి ఒక పర్వత శిఖరము పైకి లేచింది. నాకు అడ్డుగా వచ్చిన ఆ పర్వత శిఖరమును నేను బద్దలు కొట్టాలి అని అనుకున్నాను. నేను నా తోకతో ఆ పర్వత శిఖరమును కొట్టాను. ఆ పర్వత శిఖరము ముక్కలైపోయింది. ఆ పర్వతము మానవ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 57)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఏబది ఏడవ సర్గ వాయుదేవుని పుత్రుడు అయిన హనుమంతుడు ఆ మహా సముద్రమును అవలీలగా దాటాడు. హనుమంతుడు ఆకాశంలో సముద్రము మీద ఎగురుతుంటే చూచేవాళ్లకు అతడు ఆకాశమును మింగుతున్నాడా అన్న అనుభూతి కలిగింది. ఆ ప్రకారంగా హనుమంతుడు మేఘముల పంక్తులను దాటుకుంటూ వెళుతున్నాడు. హనుమంతుడు కాసేపు మేఘాల చాటుకు వెళుతూ మరలా బయటకు వస్తూ వాయువేగంతో మేఘాల గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రకారంగా ఎగురుతున్న హనుమంతుడు మేఘాల మధ్య దోబూచులాడే చంద్రుడి మాదిరి ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు మేఘాలను చీల్చుకుంటూ, పెద్దగా అరుస్తూ వెళు తుంటే, ఉరుముతున్న ఆకాశంలో గరుడుడు ఎగురుతూ వెళుతున్నాడా అన్నట్టు ఉంది. హనుమంతుడు దారిలో తన కోసరము ఎదురుచూస్తున్న మైనాక పర్వత శిఖరమును తన చేతితో స్నేహపూర్వకముగా తాకి, మరలా విల్లు నుండి వెలువడిన బాణము వలే మహా వేగముతో తన ప్రయాణమును కొనసాగించాడు. అలా ఎగురుతూ హనుమంతుడు సముద్రమునకు ఆవల ఒడ్డున ఉన్న మహేంద్రగిరిని సమీపించాడు. తన వాళ్ల దగ్గరకు వచ్చాను అన్న సంతోషంతో హనుమంతుడు సింహనాదము చేసాడు. తన మిత్రులను చూడబోతున్నాను అన్న సంతోషంతో తన తోకను చిత్రవిచిత్రంగా తిప్పుతూ పెద్ద పెద్దగా అరుస్త...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 56)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఏబది ఆరవ సర్గ అశోకవనములో శింశుపా వృక్షము కింద క్షేమంగా కూర్చుని ఉన్న సీతను చూచాడు హనుమంతుడు. సీతకు నమస్కరించి “అమ్మా! దైవవశాత్తు నీవు క్షేమంగా ఉన్నావు. నిన్ను ఏ అపాయమూ లేకుండా చూడగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంక నేను కిష్కింధకు వెళతాను." అని పలికాడు హనుమంతుడు. సీత మరలా తాను హనుమంతుని చూడగలిగాను అన్న సంతోషంతో ఇలా పలికింది. “రామ కార్యమును సాధించడానికి నీవు ఒక్కడివే సమర్ధుడివి అన్న విషయం ఋజువు అయింది. నీ బలపరాక్రమములు మిక్కిలి ప్రశంసనీయములు. రాముడు ఇక్కడకు వచ్చి నన్ను తీసుకొని వెళితేనే బాగుంటుంది. రాముడు ఆ కార్యము నెరవేర్చుటకు నీవు తగినట్టు సాయము చేయుము." అని పలికింది సీత. “అమ్మా! సీతాదేవీ! రాముడు వానర సేనలతో వచ్చి, రావణుని వధించి నిన్ను అయోధ్యకు తీసుకొని వెళ్లేరోజు త్వరలోనే రానుంది. నీ శోకము తీరే సమయము ఆసన్నమయింది. ఇంక నేను వెళ్లి వస్తాను.” అని సీతకు నమస్కరించాడు. అక్కడి నుండి బయలు దేరి హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరమును ఎక్కాడు. తన దేహమును విపరీతంగా పెంచాడు. ఎదురుగా అలలతో పోటెత్తిన సముద్రాన్ని చూచాడు. ఉత్తర దిక్కుగా తిరిగి ఒక్...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏబది ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 55)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఏబది ఐదవ సర్గ తన కళ్లముందు సమూలంగా దహించుకు పోతున్న లంకానగరాన్ని చూచాడు హనుమంతుడు. హనుమంతునికి మనసులో ఒక ఆలోచన దానితో పాటు భయం మెదిలాయి. తనకు జరిగిన అవమానానికి లంకను, లంకలోని ప్రజలను నాశనం చెయ్యడం అవసరమా! రామ కార్యంలో అది భాగం కాదే! మరి తను ఎందుకు లంకను కాల్చినట్టు? తనలో పుట్టిన కోపానికి ఇంత సుందరమైన లంకానగరము బూడిద కుప్ప అయిపోవాలా! కోపాన్ని అణచుకున్న వాడే బుద్ధికలవాడు. ధన్యుడు. కోపంలో మనిషి ఎంతటి పాపకార్యమైనా చేస్తాడు. ఆఖరుకు పెద్దలను కూడా ఆ కోపంలో చంపడానికి వెనుకాడడు. కోపావేశంలో నరులు ఎంతటి గొప్పవారినైనా పరుషమైన మాటలతో దూషిస్తారు. కోపం ఎక్కువ అయితే నోటికి ఏం మాట వస్తుందో తెలియదు. ఏ మాట మాట్లాడాలో ఏ మాట మాట్లాడకూడదో తెలియదు. ఇష్టం వచ్చినట్టు వాగుతారు. కోపంలో ఉన్న వాడికి చేయకూడని పని, అనకూడని మాట, అంటూ లేదు. అన్ని పనులు తగుదునమ్మా అని చేసేస్తాడు. సర్పము తన కుబుసమును విడిచిపెట్టినట్టు, మంచి వారు తమ కోపమును వెంటనే వదిలేస్తారు. ఎదుటి వారు ఏమన్నా ఓర్పుతో సహిస్తారు. ఆ ఓర్పు నాకు లేకుండా పోయింది. రాక్షసులు నా తోకకు నిప్పంటించినంత మాత్రాన నేను లంకను మొత్తం తగులబెట...