Posts

Showing posts from March, 2024

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 5)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఐదవ సర్గ విరాధుని బారి నుండి సీతను కాపాడిన రాముడు, ఆమెను కౌగలించుకొని ఓదార్చాడు. సీత ఆ భయం నుండి తేరుకుంది. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. "లక్ష్మణా! మొదటి సారిగా మనము రాక్షసులను ఎదుర్కొన్నాము. మనకు ఈ వనవాసము అలవాటు లేదు కదా. ముఖ్యంగా సీతకు. అందువల్ల చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనము త్వరగా శరభంగ ముని ఆశ్రమమునకు వెళదాము." అని అన్నాడు. లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా రాముడు సీత లక్ష్మణుని వెంట నడిచారు. అందరూ శరభంగ ఆశ్రమమునకు చేరుకున్నారు. శరభంగ మహాముని దర్శనము చేసుకున్నారు. అక్కడ వారు చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చూచారు. శరభంగ ముని వద్దకు దేవేంద్రుడు, దేవతల సమేతంగా తన రథం మీద ముని వద్దకు వచ్చాడు. దేవేంద్రుని, గంధర్వులు, అమరులు, సిద్ధులు, మునులు స్తుతిస్తున్నారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమము దగ్గరకు వచ్చారు. ఆకాశంలో నిలిచి ఉన్న దేవేంద్రుని రథమును రాముడు లక్ష్మణునికి చూపించి దాని గురించి చెప్పాడు. తరువాత రాముడు, లక్ష్మణుని అక్కడే ఉండమని, తాను మాత్రము శరభంగ ఆశ్రమము వైపు వెళ్లాడు. ఆశ్రమము వద్దకు వస్తున్న రా...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 4)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము నాలుగవ సర్గ ఆ ప్రకారంగా రాముని లక్ష్మణుని విరాధుడు ఎత్తుకొని పోవడం చూచి సీత పెద్దగా ఏడవసాగింది. పెద్ద పెద్ద గా కేకలు వేసింది. "ఓ రాక్షసుడా నీకు ఓ నమస్కారము. వాళ్లను వదిలిపెట్టు. కావాలంటే నన్ను తీసుకొనిపో. నాకు భయంగా ఉంది. నేను ఒంటరిగా ఇక్కడ ఉంటే ఈ అరణ్యములో ఉండే క్రూర మృగాలు నన్ను తినేస్తాయి.” అని పెద్ద పెట్టున కేకలు వేసింది. ఆ కేకలు విన్నారు రామలక్ష్మణులు. వెంటనే విరాధుని చంపడానికి పూనుకున్నారు. వెంటనే లక్ష్మణుడు తన చేతిలో ఉన్న కత్తితో విరాధుని ఎడమచేతిని ఖండించాడు. రాముడు విరాధుని కుడి చేతిని విరిచేసాడు. రెండు చేతులు విరిగిన విరాధుడు రామలక్ష్మణులను కిందికి విసిరేసాడు. బాధతో గిలా గిలా కొట్టుకుంటూ కిందపడి మూర్ఛపోయాడు. కిందపడ్డ విరాధుని రామలక్ష్మణులు కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. పైకి ఎత్తి నేల మీద పడేసారు. కత్తులతో చీల్చారు. ఏమి చేసినా విరాధుని ప్రాణం పోలేదు. వరప్రసాది అయిన విరాధుడు ఆ ప్రకారంగా చావడు అని గ్రహించాడు రాముడు. "లక్ష్మణా! ఈ విరాధుడు కత్తులతోనూ, ఆయుధములతోనూ చావడు. అలా చావు రాకుండా వీడికి వరం ఉంది. అందుకని మనం వీడిని గొయ్యి తీసి పాతిపెడద...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 3)

 శ్రీమద్రామాయణము అరణ్యకాండము మూడవ సర్గ తాను రామలక్ష్మణులను వివరాలు అడుగుతుంటే వాళ్లిద్దరూ ఏవేవో మాట్లాడుకోవడం చూచి సహించలేకపోయాడు విరాధుడు. “నేను మీ ఇద్దరి గురించి అడుగుతుంటే మీలో మీరే ఏం మాట్లాడుకుంటున్నారు. చెప్పండి మీరు ఎవరు? ఈ అరణ్యములకు ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళుతున్నారు?” అని అడిగాడు. అప్పుడు రాముడు విరాధునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షసుడా! మేము క్షత్రియులము. మునులము కాము. నా పేరు రాముడు. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఆమె నా భార్య సీత. కాల వశమున ఈ అరణ్యములో తిరుగుతున్నాము. ఇంతకూ నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు?" అని అడిగాడు రాముడు. "ఓ రామా! నేను రాక్షసుడను. నాపేరు విరాధుడు. నా తండ్రి పేరు జవుడు. నా తల్లి పేరు శతహ్రద. నేను బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసాను. ఆయన వలన ఎవరిచేతా గాయపడకుండా, చావకుండా వరము పొందాను. నాకు ఈమె మీద మోహము కలిగింది. కాబట్టి మీరు ఇద్దరూ ఈమెను నాకు విడిచి పెట్టి ఇక్కడ నుండి పారిపొండి. లేకపోతే మీ ఇద్దరిని చంపి తింటాను. వెంటనే వెళ్లిపొండి." అనిఅన్నాడు విరాధుడు. ఆ మాటలకు రామునికి కోపం వచ్చింది. కళ్లు ఎర్రబడ్డాయి. కోపంతో విరాధునితో ఇలా అన్నాడు. ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 2)

  శ్రీమద్రామాయణము అరణ్య కాండము రెండవ సర్గ రామలక్షణులు, సీత ఆ రాత్రికి ఆ పర్ణశాలలోనే విశ్రమించారు. మరునాడు ఉదయము ఆ మునుల వద్ద అనుజ్ఞ తీసుకొని రాముడు, లక్ష్మణుడు, సీతతో సహా అరణ్యములోకి వెళ్లాడు. వారు అడవిలో ప్రయాణము చేస్తూ ఎన్నో వన్యమృగములను చూచారు. హటాత్తుగా వారి ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షం అయ్యాడు. వాడి శరీరం ఒక కొండ మాదిరి ఉంది. వాడు నరమాంసభక్షకుడు అని రాముడు గ్రహించాడు. రామలక్ష్మణులు వాడి వంక నిశితంగా చూచారు. వాడు నల్లగా కొండ మాదిరి ఉన్నాడు. కళ్లు ఎర్రగా ఉన్నాయి. వికృతాకారంతో ఉన్నాడు. వాడి శరీరం అంతా రక్తంతో తడిసి ఉంది. వాడి బుజం మీద ఒక శూలం ఉంది. దానికి మూడు సింహాలను, నాలుగు పెద్దపులులను, రెండు తోడేళ్లను, పది జింకలను, గుచ్చి తీసుకొని వెళుతున్నాడు. ఆ రాక్షసుడు రామ లక్ష్మణులను చూచాడు. గట్టిగా అరిచాడు. వారిని చంపడానికి వారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. వాడి కళ్లకు అందమైన సీత కనిపిపించింది. రావడం రావడం సీతను పట్టుకొన్నాడు. సీతను తీసుకొని పక్కకు వెళ్లాడు. రామలక్ష్మణులను చూచి ఇలా అన్నాడు. “జటలు ధరించిన మీరు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు? మీరు ఎవరైనా ఈ రోజు నా చేతిలో చావడం ఖాయం. ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - మొదటి సర్గ (Ramayanam - Aranyakanda - Part 1)

శ్రీమద్రామాయణము అరణ్య కాండము మొదటి సర్గ రాముడు సీత, లక్ష్మణుడు వెంటరాగా దండకారణ్యములోనికి ప్రవేశించాడు. ఆ దండకారణ్యములో ఎంతో మంది మహా మునులు ఆశ్రమములు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండటం చూచాడు రాముడు. ఆ మునుల ఆశ్రమముల దగ్గర వన్య మృగములు పరస్పర వైరము, భయమూ లేకుండా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పక్షుల కిల కిలారావములతో, వన్యప్రాణుల విహారములతో ఆ వనసీమలో ఉన్న ముని ఆశ్రమములు ఎంతో శోభాయమానంగా ఉన్నాయి. ఆ మునుల ఆశ్రమములు విశాలమైన అగ్ని గృహములతోనూ, యజ్ఞమునకు కావలసిన సంభారములతోనూ, వేలాడుతున్న జింక చర్మములతోనూ, దర్భలతోనూ, అగ్నికార్యమునకు కావలసిన సమిధలతోనూ, నీళ్లతో నిండి ఉన్న పాత్రలతోనూ, తినడానికి కావలసిన ఫలములతోనూ నిండి ఉన్నాయి. ఒక పక్కనుండి వేదమంత్రములు చదువుతున్న ధ్వనులు, మరొక పక్క నుండి పూజా కార్యక్రమముల మంత్ర ధ్వనులు వీనుల విందుగా వినపడుతున్నాయి. ఆ ఆశ్రమములలో కేవలము తపస్సుచేసుకొనే మునులు మాత్రమే నివసిస్తున్నారు. రామలక్ష్మణులకు ఆ ప్రాంతము బ్రహ్మలోకము వలె కనిపించింది. రాముడు, సీత, లక్ష్మణుడు తమ ఆశ్రమముల వంక రావడం ఆ మునులు చూచారు. వారంతా రామ లక్ష్మణులకు ఎదురు వెళ్లి స్వాగతము పలికారు. వారికి అర్ఘ్యము ప...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పంతొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 119)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట పంతొమ్మిదవ సర్గ సీతారాముల కల్యాణ గాధను విన్న అనసూయ ఆనందంతో పరవశించిపోయింది. సీతను గాఢంగా కౌగలించుకొని ఆమె నుదుటి మీద ముద్దుపెట్టుకుంది. అంతలోనే రాత్రి అయింది. మునులు అందరూ వారి వారి సాయంకాల సంధ్యావందనారి కార్యక్రమములను ముగించుకొని తమ కుటీరములకు వస్తున్నారు. అంతలో చంద్రోదయము అయింది. అనసూయ సీతను చూచి, "సీతా! ఇంక నీవు రాముని వద్దకు వెళ్లు. నేను ఇచ్చిన ఆభరణములను, వస్త్రములను నా ఎదుటనే అలంకరించుకో. నిన్ను చూచి ఆనందిస్తాను." అన్నది అనసూయ. ఆమె కోరిక మేరకు సీత అనసూయ ఇచ్చిన దివ్య వస్త్రములను, ఆభరణములను ధరించి, అనసూయకు నమస్కారము చేసింది. తరువాత సీత అనసూయ వద్ద సెలవు తీసుకొని రాముని వద్దకు వెళ్లింది. సర్వాలంకార భూషిత అయిన సీతను చూచి రాముడు ఎంతో సంతోషించాడు. సీత కూడా అనసూయ తనకు ఇచ్చిన దివ్య వస్త్రములను, ఆభరణములను రాముని చూపించింది. మహాపతివ్రత అనసూయతో సత్కారమును పొందిన సీతను చూచి రాముడు లక్ష్మణుడు ఎంతో ఆనందించారు. రాముడు, సీత, చల్లని వెన్నెలలో ఆనందంగా విహరించారు. ఆ రాత్రి గడిచిపోయింది. మరునాడు ఉదయము రామలక్ష్మణులు, ప్రాతఃసంధ్యావందనాది కార్యక్రములు ముగించు ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదునెనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 118)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట పదునెనిమిదవ సర్గ అత్రిమహాముని భార్య అనసూయ చెప్పిన మాటలను సావధానంగా విన్న సీత, ఆమెతో ఇలా అన్నది. “పూజ్యురాలా! స్త్రీకి పతియే దైవము అన్న విషయం నాకు బాగా తెలుసు. భర్త గుణవంతుడైనా, గుణహీనుడైనా, నాకు పూజ్యుడే. అటువంటప్పుడు గుణవంతుడు, దయాగుణము కలవాడూ, ఇంద్రియములను జయించినవాడు, నా మీద అమితమైన ప్రేమకలవాడూ, ధర్మము తెలిసినవాడూ, నన్ను నా తల్లితండ్రులకంటే ఎక్కువగా ఆదరించేవాడు అయిన నా భర్త రాముని నేను పూజించకుండా ఎలా ఉండగలను. రాముడు నా మీదనే కాదు, తన తల్లి కౌసల్యమీదా, ఆయన ఇతర తల్లుల మీదా సమానమైన పూజ్యభావంతో ఉంటాడు. మా మామగారు దశరథునికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. రాముడు వారి నందరినీ మాతృభావంతో గౌరవిస్తాడు. వారేకాదు. నన్ను తప్ప లోకంలో మిగిలిన స్త్రీలనందరినీ మాతృ భావంతో చూస్తాడు. మీరు చెప్పినమాటలే నేను వనవాసమునకు వచ్చునపుడు మా అత్తగారు కౌసల్యాదేవిగారు కూడా చెప్పారు. అవి ఇంకా నా మనసులో మెదులుతున్నాయి. అంతేకాదు, నాకు వివాహము చేసి అత్తగారి ఇంటికి పంపేటప్పుడు మా తల్లిగారు కూడా ఇదే ఉపదేశము చేసారు. అది కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు మీ మాటలు వినగానే నాకు మా అమ్మ, అత్తగారు...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదునేడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 117)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట పదునేడవ సర్గ మునులందరూ వెళ్లిపోయిన తరువాత రాముడు ఆలోచనలో పడ్డాడు. మునులు చెప్పినది నిజమే అనిపించింది. ఆ ప్రదేశంలో ఉండటం క్షేమం కాదనుకున్నాడు. దానికి తోడు రామునికి పాతజ్ఞాపకాలు వెంటాడ సాగాయి. ఆ పర్ణశాలలోనే రాముడు భరతుని, శత్రుఘ్నుని, తన తల్లులను కలుసుకున్నాడు. ఇప్పుడు వారు లేకపోవడంతో మాటి మాటికీ వారే మనసులో మెదులు తున్నారు. వారి జ్ఞాపకాలతోనే మనసు నిండిపోయింది. స్థలం మారితేనే గానీ ప్రయోజనం లేదు అని అనుకున్నాడు. దానికి తోడు భరతుడు తన సేనలతో వచ్చి అక్కడ ఉన్నాడు. వారు అక్కడ ఉన్న కాలంలో వారు వాడేసిన వ్యర్థ పదార్థాలు, గుర్రములు, ఏనుగులు వదిలిన మలమూత్రములతో ఆ ప్రదేశం అంతా దుర్గంధం వ్యాపించింది. ఆ కారణం చేత కూడా ఆ ప్రదేశం తమ నివాసమునకు అనుకూలంగా లేదు అని అనుకున్నాడు రాముడు. అందుకని ఆ ప్రదేశము విడిచి సీతతో, లక్ష్మణునితో కలిసి అత్రి మహాముని ఆశ్రమమునకు వెళ్లాడు. అత్రి మహాముని రాముని తన కుమారుని వలె ఆదరించాడు. వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించాడు. తినడానికి ఫలములు ఇచ్చాడు. తన భార్య వృద్ధురాలు అయిన అనసూయకు రాముని, సీతను పరిచయం చేసాడు. “రామా! ఈమె నా భార్య అనసూయ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదునారవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 116)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట పదునారవ సర్గ భరతుడు అయోధ్యకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు, సీత, వనవాసము చేస్తున్నారు. రాముడు అక్కడున్న ఋషుల మొహాల్లో ఏదోభయాన్ని చూచాడు. వారు ఆందోళనగా ఉన్నట్టు గమనించాడు. ప్రదేశమును వదిలి వెళ్లబోతున్నట్టు తెలుసుకున్నాడు. రాముని చూచి వారు ఏదో గుసగుసగా రహస్యంగా మాట్లాడుకోవడం చూచాడు రాముడు. రామునికి ఏమీ అర్థం కావడం లేదు. తాము అక్కడ ఉండటం వలన ఆ ఋషులకు ఏమైనా అసౌకర్యం కలిగిందేమో అని అనుమాన పడ్డాడు. ఏమైనా సరే అనుమానము నివృత్తి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ ఋషుల కందరిలోకీ పెద్దవాడి దగ్గరకు వెళ్లాడు. ఆయనకు భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు. “మహాత్మా! గత కొద్దిరోజులుగా ఇక్కడ ఉన్న ఋషుల ప్రవర్తనలో ఏదో మార్పుకనపడుతూ ఉంది. కారణం తెలియడం లేదు. మా వల్ల ఏదైనా అపరాధము జరిగిందా? నా తమ్ముడు తమరి పట్ల ప్రమాదవశాత్తు అనుచితంగా ప్రవర్తించాడా! నా భార్య సీత తమరికి కూడా సేవలు చేస్తూ ఉంది కదా. ఆమెసేవలలో ఏమైనా లోపం కనిపించిందా! మా వల్ల ఏమైనా అపరాధము జరిగితే చెప్పండి సరిదిద్దుకుంటాము." అని అన్నాడు రాముడు. దానికి ఆ వృద్ధుడైన ఋషి ఇలాఅన్నాడు. “రామా! నీ భార్య కల్యాణి. కల్యాణ స్వభావము కలద...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదునాలుగు, పదునైదవ సర్గలు (Ramayanam - Ayodhyakanda - Part 114 & 115)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట పదునాలుగు, పదునైదవ సర్గలు భరతుడు అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్య నిర్మానుష్యంగా ఉంది. కళావిహీనంగా ఉంది. పిల్లులు గుడ్లగూబలు తిరుగుతున్నాయి కానీ మనుషులు, పెంపుడు జంతువుల సంచారం లేదు. హోమాగ్నులు జ్వలించనందున, హెూమధూమములు పైకి లేవడంలేదు. కార్యాలయములు పనిచేయడం లేదు. విపణివీధులలో వ్యాపారం జరగడం లేదు. సంగీతవాద్యధ్వనులు, నాట్య విన్యాసములు మచ్చుకైనా కానరావడం లేదు. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తూ వెళుతున్నాడు భరతుడు . రాముడు అయోధ్యను విడిచి వెళ్లడం తోటే రాజ్యలక్ష్మి రామునితోనే వెళ్లిపోయినట్టుంది అని అనుకున్నాడు భరతుడు. భరతుడు దశరథుని మందిరములోనికి ప్రవేశించాడు. సింహము వెళ్లిపోయిన తరువాత సింహము నివసించిన గుహ ఎలా ఉంటుందో అలా ఉంది దశరథుని మందిరము. భరతునికి కన్నీళ్లు ఆగలేదు. ధారాపాతంగా కారుతున్నాయి. తరువాత భరతుడు తన తల్లులతోనూ కులగురువు వసిష్ఠునితోనూ బ్రాహ్మణులతోనూ సమావేశం అయ్యాడు. అక్కడ తన నిర్ణయాన్ని వెళ్లడించాడు. “నేను ఇప్పుడు అయోధ్య సరిహద్దులలో ఉన్న నందిగ్రామమునకు వెళుతున్నాను. నా తండ్రి దశరథుడు, నా అన్న రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను. నేను నందిగ్రామము నుండి రాముడి...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదమూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 113)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట పదమూడవ సర్గ భరతుడు, శత్రుఘ్నుడు, తల్లులు, మంత్రులు, వసిష్ఠుని తో సహా అందరూ అయోధ్యకు తిరుగు ప్రయాణం అయ్యారు. భరతుడు రాముని పాదుకలను గౌరవ పూర్వకంగా తన శిరస్సుమీద ధరించాడు. వారందరూ చిత్రకూటపర్వతమును దాటి మందాకినీ నది వైపుకు ప్రయాణం చేసారు. భరద్వాజ ఆశ్రమమునకు చేరుకున్నారు. భరతుడు, వసిష్ఠుడు వెంటరాగా భరద్వాజుని దర్శనార్థము వెళ్లాడు. భరతుని చూచి భరద్వాజుడు కుశల ప్రశ్నలు వేసాడు. వెళ్లిన కార్యము సఫలము అయిందా అని అడిగాడు. భరతుడు భరద్వాజునితో ఇలా అన్నాడు. “మహాత్మా! నేను రాముని అయోధ్యకురమ్మని పలువిధముల ప్రార్థించాను. రాముడు అంగీకరించలేదు. “నా తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యములలో ఉండెదను" అని తన నిర్ణయాన్ని తెలియజేసాడు. అప్పుడు కులగురువు వసిష్ఠుడు రాముని తో ఇలా అన్నాడు. “రామా! ఇవిగో బంగారముతో చేసిన పాదుకలు. వీటిని నీవు తొడుగుకొని వాటిని మాకు ఇమ్ము. ఇవి నీ ప్రతినిధిగా మనసులో తలంచి, భరతుడు అయోధ్యను పాలిస్తాడు." అని అన్నాడు. రాముడు సంతోషంతో అంగీకరించాడు. రాముడు తూర్పు వైపుకు తిరిగి ఆ బంగారు పాదుకలను తొడుగుకొన్నాడు. వాటిని నాకు ఇచ్చాడు...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పన్నెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 112)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట పన్నెండవ సర్గ ఆ ప్రకారంగా రాముడు, భరతుని మధ్య జరిగిన వాదోప వాదములు చూచి, విని అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. వారంతా రాముని ధర్మనిరతిని ప్రశంసించారు. అక్కడ ఉన్న ఋషులు భరతునితో ఇలా అన్నారు. "భరతా! నీవు గొప్పవంశములో జన్మించావు. సకల శాస్త్రములు అభ్యసించావు. బుద్ధిమంతుడవు. నీ అన్న రాముడు ఎలా చెబితే అలా చెయ్యి. రాముని బలవంత పెట్టకు. నీ తండ్రి దశరథుడు తన భార్య ఋణము తీర్చుకొని స్వర్గానికి వెళ్లాడు. రాముడు తండ్రి ఋణము తీర్చుకుంటున్నాడు. కాబట్టి రాముని వనవాసము చెయ్యనివ్వు." అని చెప్పారు. తరువాత వారు ఎవరి ఆశ్రమములకు వారు వెళ్లిపోయారు. కాని భరతునికి మాత్రము వారి మాటలు రుచించలేదు. ఆఖరి ప్రయత్నంగా, మాటలు తొట్రుపడుతుంటే గద్గద స్వరంతో, వణుకుతూ, చేతులు జోడించి, భయం భయంగా రామునితో ఇలా అన్నాడు. “అన్నయ్యా! రాజధర్మము, కులధర్మము ప్రకారము పెద్దవాడే రాజుగా ఉండాలి కానీ చిన్నవాడు కాదు. ఇప్పుడు నీవు రాజధర్మమునకు కులధర్మమునకు విఘాతము కలిగించకు. నా మాట నా తల్లి మాట మన్నించు. అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేపట్టు. ఎందుకంటే నేను నీ కన్నా చిన్నవాడిని. ఈ రాజ్యభారము మోయలేను. నేను...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదకొండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 111)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట పదకొండవ సర్గ వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశరాజుల నందరి గురించి చెప్పి, వారందరూ రాజధర్మమును పాటించారనీ, ఆ వంశముల రాజులందరూ జ్యేష్టునికే పట్టం కట్టారనీ వివరించాడు. కానీ రాముడు ఏమీ మాట్లాడలేదు. వసిష్ఠుడు మరలా చెప్పనారంభించాడు. “ఓరామా! జన్మఎత్తిన ప్రతివాడికీ ముగ్గురు గురువులు ఉంటారు. వారు తల్లి, తండ్రి, విద్యనేర్పిన గురువు. తండ్రి పురుషుని జన్మకు కారకుడవుతాడు. తల్లి జన్మనిస్తుంది. గురువు జ్ఞానమును ఉపదేశిస్తాడు. నేను నీ తండ్రిగారికీ. ఇప్పుడు నీకూ గురువును. గురువుచెప్పిన మాటలు వినడం లోకధర్మం. గురువుచెప్పిన మాటలు వినకపోతే నీవు పెద్దల మాటలను ఎదిరించినవాడివి అవుతావు. నీకు సహజ గురువు నీ తల్లి కౌసల్య. ఆమె భర్తను పోగొట్టుకొని వృద్ధాప్యములో ఉంది. ఒక కుమారునిగా నీ తల్లికి సేవచేయడం నీ ధర్మం. నీ తల్లి సేవను మరిచి, నీవు అడవులలో ఉంటే నీవు నీ ధర్మమును అతిక్రమించిన వాడవు అవుతావు. భరతుడు నీ తమ్ముడు. చిన్న వాడి మాటలు మన్నించడం పెద్దల ధర్మము. కాబట్టి నీ తమ్ముని మాటలు మన్నించు.ఒక గురువుగా ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను." అని పలికాడు వసిష్టుడు. కులగురువు వసిష్ఠుడు చెప్పిన మాటలను సావ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట పదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 110)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట పదవ సర్గ సభలో జరుగుతున్న వాదోపవాదాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు కులగురువు వసిష్ఠుడు. ఎవరు చెప్పినా రాముడు ఒప్పుకోడంలేదు. జాబాలి మాటలతో రాముడు కోపగించుకున్నాడు అని అర్ధం అయింది వసిష్ఠునకు. జాబాలి సామాన్యుడు కాదు. అందుకని జాబాలి మాటలను సర్దిచెప్పడానికి ప్రయత్నం చేసాడు వసిష్ఠుడు. “ఓ రామా! ఈ లోకంలో జనులు పుడుతూ చస్తూ ఉంటారనీ, పుణ్య లోకాలకు, పాప లోకాలకూ పోయి మరలా జన్మ ఎత్తుతుంటారనీ జాబాలికి కూడా తెలుసు. కానీ నిన్ను ఎలాగైనా అయోధ్యకు రప్పించాలనే తాపత్రయంతో అలా మాట్లాడాడు కానీ వేరు కాదు. ఇంతకూ ఈ సృష్టి ఎలా మొదలయిందో నాకు తెలిసినంత వరకూ చెబుతాను విను. ఈ సృష్టి ప్రారంభం కాక ముందు ఈ లోకమంతా నీటితో నిండి ఉంది. ఆ జలంలో నుండి భూమి ఆవిర్భవించింది. తరువాత దేవతలు, బ్రహ్మదేవుడు పుట్టారు. తరువాత బ్రహ్మ వరాహ రూపంలో భూమిని పైకి తీసుకొని వచ్చాడు. ( విష్ణుదేవుడు వరాహావతారంలో భూమిని పైకి తీసుకొని వచ్చాడు అని నానుడి కాని బ్రహ్మ దేవుడు వరాహావతారము ధరించాడని కొన్ని పురాణాలలో ఉంది అని పండితుల అభిప్రాయము.) శాశ్వతుడు, నిత్యుడు, నాశరహితుడు అయిన బ్రహ్మ నుండి మరీచి, కశ్యపుడు పుట్టారు...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 109)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట తొమ్మిదవ సర్గ జాబాలి చెప్పినది అంతా శ్రద్ధగా విన్నాడు రాముడు. జాబాలితో ఈ విధంగా పలికాడు. “ఓ మహాత్మా! మీరు నా హితము కోరి చెప్పిన మాటలు నాకు బాగున్నా లోకసమ్మతము కావు. అవి లోకానికి హితమును చేకూర్చలేవు. మీ మాటలు ఆచరిస్తే ప్రజలలో కట్టుబాటు తప్పుతుంది. స్వేచ్ఛా విహారము పెచ్చరిల్లుతుంది. ఎవడి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తారు. అరాచకము నెలకొంటుంది. అటువంటి వారిని ఎవరూ గౌరవించరు. ఒక మనిషియొక్క గుణగణములు అతని ప్రవర్తనను బట్టి తెలుస్తాయి. అదీ కాకుండా పైకి ఒకటీ లోన ఒకటి పెట్టుకొని ప్రవర్తించేవారు అంటే పైకి గౌరవనీయుల మాదిరి కనపడుతూ లోపల ఎన్నో చెయ్యకూడని పనులుచేసేవారు, పైకి ఉత్తమ లక్షణములు కనబరుస్తూ లోపల పరమ నీచంగా ప్రవర్తించేవారు, పైకి నీతి మంతుడి మాదిరి కనపడుతూ లోపల నీతి బాహ్యమైన పనులు చేసేవారు, అటువంటి వారు ఎల్లప్పుడూ ధర్మము విడిచి అధర్మమునే ఆచరిస్తారు. కాని పైకి మాత్రం ధర్మాత్ములు మాదిరి కనపడతారు. మీరు చెప్పిన మాదిరి చేస్తే నేను కూడా అలాగే అవుతాను. పైకి నీతులు చెబుతూ లోపల సింహాసనము కోసరం వెంర్లాడేవాడినవుతాను. ఈనాడు నన్ను వెంటనే అయోధ్యకు రమ్మని ఆహ్వానించే వార...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 108)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట ఎనిమిదవ సర్గ త్రేతాయుగంలో జాబాలి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నాస్తిక వాది. ఈ ప్రాకృతిక ప్రపంచము తప్ప వేరే ఏమీ లేదు. ఉన్నంత కాలం సుఖాలు అనుభవించడం మాత్రమే మనము చెయ్యాల్సిన పని అని నమ్మే వాడు. అలాంటి భావాలు ఉన్న జాబాలి ఆసభలో ఉన్నాడు. రాముడు, భరతుడు చేసిన సంవాదమును విన్న జాబాలి ఇలామాట్లాడసాగాడు. “రామా! నీవు ఎంతో బుద్ధిమంతుడివి, జ్ఞానము కలవాడవు అనుకున్నాను. కాని ఇంతమూర్ఖంగా ఆలోచిస్తావు అని అనుకోలేదు. నీ ఆలోచన ఎందుకూ పనికిరాదు. రామా! మానవుడు పుట్టేటప్పుడు ఒంటరి వాడు. చచ్చేటప్పుడు ఒంటరి వాడే. ఈ బంధుత్వాలు, మమతలు మమకారాలు అన్నీ నడుమ వచ్చినవే. చచ్చిన తరువాత ఎవరూ ఎవరికీ ఏమీ కారు. అందుకే ఈ బంధుత్వాలు అన్నీ వ్యర్థము. తల్లి, తండ్రి,మనకు దైవసమానులు, వాళ్ల మాటలను పాటించాలి, అని అనుకోవడం అవివేకము. మీ తండ్రి మరణించాడు. ఇంక ఆయన మాటకు విలువేముంది. దూర ప్రయాణాలు చేసే వాళ్లు రాత్రిళ్లు సత్రములలో బస చేస్తారు. ఆ రాత్రికి కొంతమందితో పరిచయం ఏర్పడుతుంది. మరునాడు ఉదయం ఎవరి దోవన వారు వెళతారు. ఈ జీవితాలూ అంతే. తల్లి, తండ్రి, ధనము, భార్య, సంతానము అన్నీ సత్రములలో పరిచయాల్లాంటివే...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 107)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట ఏడవ సర్గ తన మనోనిశ్చయాన్ని రాముడు భరతునికి ఈ విధంగా తెలిపాడు. “భరతా! ఇప్పటి దాకా నీవు చెప్పినది అంతా మిగుల యుక్తి యుక్తముగా ఉంది. అందులో ఏ దోషమూ లేదు. చాలా చక్కగా చెప్పావు. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ నీకు తెలియని విషయములు కొన్ని నీకు చెప్పక తప్పదు. మన తండ్రి దశరథుడు తాను నీ తల్లి కైకను వివాహమాడు సందర్భంలో తన రాజ్యమునకు ఉత్తర అధికారిగా నిన్ను చేస్తాను అని మీ మాతామహులకు (కైక తండ్రికి) వాగ్దానం చేసాడట. అదీకాకుండా దేవాసుర సంగ్రామంలో నీ తల్లి మన తండ్రి ప్రాణములు రెండు సార్లు కాపాడినందుకు గాను, రెండు వరములు ఇస్తాను అని వాగ్దానము చేసాడట. నీ తల్లి ఆ వరములను తనకు తరువాత ప్రసాదించమని అడిగినదట. ఆ వరములను నా పట్టాభిషేక సందర్భములో కోరినది. అందులో మొదటి వరము నాకు 14 ఏళ్ల వనవాసము. రెండవ వరము నీకు అయోధ్య రాజ్య పట్టాభిషేకము. ఆ వరములను మన తండ్రి నీ తల్లికి ఇచ్చాడు. నన్ను 14 ఏళ్లు అరణ్యములకువెళ్లమని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞమేరకు నేను అరణ్యములకు వచ్చాను. నన్ను విడిచి ఉండలేక నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు నా వెంట అడవులకు వచ్చారు. దీనితో మొదటి వరము నెర...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 106)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట ఆరవ సర్గ రాముడు చేసిన వాదనను శ్రద్ధగా విన్నాడు భరతుడు. మరలా తనదైన శైలిలో తన వాదనను వినిపించసాగాడు. “ఓ రామా! నీవు జితేంద్రియుడవు. నీకు సుఖమువస్తే సంతోషము, దు:ఖమువస్తే బాధా రెండూ లేవు. నీలాంటి వారు ఈ లోకంలో అరుదుగా ఉంటారు. మేమంతా సామాన్యులము. సుఖదు:ఖములను అనుభవిస్తూ ఉంటాము. జీవించి ఉన్నా, మరణించినా, మంచి చేసినా, చెడు చేసినా, ఆ వ్యక్తి పట్ల సమభావనతో ఉండే వ్యక్తికి దుఃఖము కానీ సుఖము కానీ కలగవు. రెండూ సమభావనలో ఉంటాయి. ఆ గుణాలు నీలో ఉన్నాయి. కానీ నీవు బాధపడుతున్నావు. తండ్రికి ఇచ్చిన మాటను ఎక్కడ తప్పుతానో అని బాధపడుతున్నావు. నీ లాంటివాడికి అలా బాధపడటం యుక్తంకాదు. నీవు రాజ్యం చేసినా, అరణ్యంలో ఉన్న ఒకటే కదా. అందుకని అయోధ్యకు వచ్చి రాజ్యం చేయి. తప్పేముంది. నీవు అన్నిటికీ అతీతుడవు కదా! నీవు రాజ్యం తీసుకుంటే నేను బాధ పడను. ఎందుకంటే నేను దేశాంతరములో ఉన్నప్పుడు నా తల్లి చేసిన అనాలోచిత కార్యము వలన ఇదంతా సంభవించింది. నా తల్లి చేసిన పని నాకు అసలు ఇష్టం లేదు. దానికి నా అంగీకారమూ లేదు. నా తల్లి చేసినది రాజద్రోహము. దానికి మరణదండనే సరి అయిన శిక్ష. కాని ఇక్కడ నిందితురాలు న...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 105)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట ఐదవ సర్గ అంతా మౌనంగా కూర్చుని ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ భరతుడు లేచాడు. రాముని వంక చూచి ఇలా అన్నాడు. “రామా! నా తల్లి కైక మాటను మన్నించి నాకు రాజ్యమును వదిలి, నీవు అరణ్యములకు వచ్చావు. ఇప్పుడు అయోధ్యా రాజ్యము నాది. నా రాజ్యమును నా ఇష్టమువచ్చిన వారికి ఇచ్చే అధికారము నాకు ఉంది. నాది అయిన ఈ రాజ్యమును తిరిగి నీకు ఇస్తున్నాను. దీనిని స్వీకరించి అయోధ్యను పాలించు. ఎందుకంటే దశరథుని తరువాత ఈ రాజ్యమును పాలించే శక్తి, అర్హత నీకు మాత్రమే ఉన్నాయి. నాకు ఆ అర్హత ఎంత మాత్రము లేదు. ఎందుకంటే గాడిద గుర్రము ఒకటి కావు కదా! ఎవని మీద అందరూ ఆధారపడి బతుకుతారో, అతని జీవనము చాలా గొప్పది. కాని ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి జీవిస్తాడో అతని జీవితము దుర్భరము. ఈ అయోధ్య ప్రజలు, మేము అంతా నీ మీద ఆధారపడి ఉన్నాము. నీ పాలనకొరకు ఎదురు చూస్తున్నాము. అలాంటిది నీవు ఈ అరణ్యములో ఒకరి మీద ఆధారపడి బతకడం దుర్భరంకాదా! ఒకడు ఒక వృక్షమును నాటి, పెంచి పోషించాడు. అది పెద్ద మాను అయింది కానీ ఫలములు ఇవ్వడం లేదు. ఆ చెట్టు ఎందుకూ ఉపయోగపడదు కదా! అలాగే తండ్రి దశరథుడు నిన్ను ఈ అయోధ్యకు మహారాజుగా తీర్చిదిద్...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట నాల్గవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 104)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట నాల్గవ సర్గ దశరథుని భార్యలు అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయీ కులగురువు వసిష్ఠుని వెంట రాముని ఆశ్రమానికి వస్తున్నారు. వారు మందాకినీ నది ఒడ్డున నడుస్తున్నారు. అక్కడి వారు, రాముడు, సీత స్నానమునకు ఉపయోగించు నదీతీరమును చూపించారు. కౌసల్యకు దుఃఖము ఆగలేదు. తన వెంట ఉన్న సుమిత్రను చూచి ఇలా అంది. “చూచావా సుమిత్రా! రాజభోగములు అనుభవించవలసిన నీ కుమారుడు లక్ష్మణుడు, నా కుమారుడు రాముడు, నా కోడలు సీత, అయోధ్యనుండి వెడలగొట్టబడి, దిక్కులేని వారి మాదిరి ఒంటరిగా ఈ నదీతీరంలో స్నానం చేస్తున్నారు. సుమిత్రా! నీ కుమారుడు ఇక్కడి నుండి రాముని కొరకు, సీతకొరకు జలములు తీసుకొనిపోవడం నీచకార్యము అని అనుకోకు. తన అన్నకు సేవ చేసే నిమిత్తం చేసే ఏ కార్యమైనా అది దోషము కాదు. అయినా ఇంక ఎన్నాళ్లు? భరతుడు ఇప్పటికే రాముని అయోధ్యకు వచ్చి తన రాజ్యము స్వీకరించమని ప్రార్థిస్తూ ఉంటాడు. రామలక్ష్మణుల కష్టాలు గట్టెక్కుతాయి. లక్ష్మణునికి అన్నగారి దాస్యము తప్పుతుంది.” అని అన్నది కౌలస్య ఇంతలో వారు రాముడు తన తండ్రికి పిండప్రదానము చేసిన చోటికి చేరుకున్నారు. దక్షిణ ముఖంగా పరచిన దర్భలు, వాటి మీద పెట్టబడిన పిండి తో ...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 103)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట మూడవ సర్గ భరతుడు చెప్పిన తండ్రి మరణ వార్తను వినగానే రాముడు కిందపడి మూర్ఛపోయాడు. మొదలు నరికిన చెట్టులా కిందపడిపోయిన రాముని చూచి సీత ఏడుస్తూ అతని దగ్గరగా వచ్చింది. రాముని మీద నీళ్లు చల్లి అతనికి సేదతీర్చింది. రాముడు మూర్ఛనుండి తేరుకున్నాడు. దీనంగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు. రాముడు తన తండ్రి మరణ వార్త విని భరతునితో ఇలా అన్నాడు. “భరతా! నా తండ్రే లేనపుడు నాకు అయోధ్యతో ఏమి పని! దశరథుడులేని అయోధ్యను నేను మాత్రము ఎలా పరిపాలింపగలను. నా మీద దు:ఖముతో మరణించిన నా తండ్రికి నేను అంతిమ సంస్కారములు చేయడానికి కూడా నోచుకోలేదు కదా! నేను ఆయనకు చెడ పుట్టాను. నేను పెద్దకొడుకుగా ఉండి ఆయనకు ఏమి చేయగలిగాను. పెద్దకొడుకుగా కనీసం నా విధులను కూడా నేను నిర్వర్తించలేకపోయాను. ఓ భరతా! శత్రుఘ్నా! మీరు ఇద్దరూ పుణ్యాత్ములు. తండ్రి గారికి అంతిమ సంస్కారములు చేయగలిగారు. భరతా! ఇప్పుడే చెబుతున్నాను. ఇప్పుడే కాదు, ఈ పధ్నాలుగు సంవత్సరముల వనవాసము తరువాత కూడా, దశరథుడు లేని అయోధ్యలో నేను అడుగుపెట్టను. దశరథుడులేని అయోధ్యను ఊహించలేను. ఎందుకంటే, వనవాసానంతరము నేను రాజ్యాధికారము చేపడితే నాకు ది...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 102)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట రెండవ సర్గ రాముని మాటలు శ్రద్ధగా విన్నాడు భరతుడు. తిరిగి రామునితో ఇలా అన్నాడు. “రామా! నేను ధర్మహీనుడను. నాకు రాజధర్మము గురించి ఏమితెలుసు. నాకు తెలిసిందల్లా ఒకటే. అది మన కులధర్మము. మనవంశాచారము. ఇక్ష్వాకు వంశములో ఇంతవరకూ పెద్దవాడే రాజ్యభారము వహించాడు. పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు కాలేదు. కాకూడదు. ఇప్పుడు నీవు మన వంశములో పెద్దవాడవు. నేను నీ కన్నా చిన్నవాడను. కాబట్టి నీవు రాజ్యాభిషిక్తుడవు కమ్ము. అదే నాకోరిక. రామా! మామూలు ప్రజల దృష్టిలో రాజుకూడా ఒక సాధారణ మానవుడే. కానీ, రాజు అంటే సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. రాజుకాదగ్గ లక్షణాలే నీకే ఉన్నాయి. నాలో ఎంత మాత్రమూ లేవు. కాబట్టి అయోధ్యకు రాజుకాదగ్గ వాడవు నీవే. ఇంక అసలు విషయానికి వద్దాము. నేను కేకయ దేశములో ఉండగా. నీవు అరణ్యములకు వెళ్లగా, మన తండ్రిగారు దశరథమహారాజుగారు స్వర్గస్థులయ్యారు. నేను శత్రుఘ్నుడు కలిసి తండ్రి గారికి అంత్యక్రియలు చేసాము. ఇప్పుడు నీవు తండ్రిగారికి జలతర్పణములు విడువ వలెను. తండ్రిగారికి జ్యేష్టుడవు, ప్రియపుత్రుడవు నీవు. కాబట్టి నీవు విడిచే జలతర్పణములు మన తండ్రిగారికి అత్యంత ప్రియమైనవి. ఎందుకంట...

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 101)

శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము నూట ఒకటవ సర్గ భరతుని రాజ్యమునకు సంబంధించిన విషయములు అన్నీ తెలుసుకున్న తరువాత, రాముడు మరలా అసలు విషయానికి వచ్చాడు. “భరతా! ఇంతకూ నీవు ఈ ముని వేషము ఎందుకు ధరించావు. ఈ అడవులకు ఎందుకు వచ్చావు. దశరథుల వారు నిన్ను అయోధ్యకు రాజ్యాభిషిక్తుని చేసారు కదా. హాయిగా రాజ్యపాలన చేయక, ఈ వనవాసము ఎందుకయ్యా నీకు?" అని అడిగాడు. దానికి భరతుడు రామునికి ఇలా సమాధానము చెప్పాడు. “రామా! నీకు ఒక అప్రియమైన విషయము చెప్పాలి. నీవు నాకు రాజ్యమును వదిలి అడవులకు రాగానే ఆ దుఃఖము తట్టుకోలేక మన తండ్రి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. అప్పుడు నేను కూడా దగ్గర లేను. నా తల్లి ప్రేరణతో ఈ మహాపాపము చేసాడు మన తండ్రి దశరథుడు. కాని నా తల్లికి ఫలితము దక్కలేదు. ఇటు రాజ్యమూ లేదు. సరికదా.. అటు వైధవ్యము మాత్రము ప్రాప్తించింది. నీవు ఉండగా నేను రాజ్యాభిషిక్తుడను అవడం సాధ్యం కాదు. నీవు మాట ఇచ్చిన తండ్రి ఇప్పుడు లేడు. ఆ మాటకు ఇపుడు విలువ లేదు. కాబట్టి నీవు వనవాసము విడిచి అయోధ్యకు వచ్చి, రాజ్యపాలన చేయుము. అదే నేను కోరేది. మన తల్లులు మువ్వురూ ఇదే మాట మీద ఉన్నారు. నిన్ను మరలా అయోధ్య తీసుకుపోవడానికి వారందరూ వచ్చారు. ర...