Posts

Showing posts from November, 2024

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 40)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము నలుబదవ సర్గ (ఈ సర్గ వాల్మీకి రామాయణంలోనిది కాదని, తరువాతి కాలంలో ఎవరో ఉత్సాహవంతుడైన కవి కల్పించి చేర్చినది అనీ, ఈ సర్గ ప్రాచ్చపాఠంలో లేదని ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తమ రామాయణ మహా కావ్యము బాలనందినీ వ్యాఖ్యలో అభిప్రాయ పడ్డారు.) రాముడు, సుగ్రీవునితోనూ, వానర సేనాధిపతులతోనూ సువేల పర్వతము మీద ఎక్కాడు. అక్కడి నుండి అన్ని దిక్కుల వంక చూచాడు. విశాలమైన త్రికూట పర్వత శిఖరము మీద నిర్మింపబడిన లంకా నగరాన్ని చూచాడు. దూరంగా కనిపిస్తున్న లంకా నగరంలో రావణుడు, ఎత్తైన తన మందిరం పైన కూర్చుని ఉండటం రాముడు చూచాడు. రావణుని ఇరు పక్కల సుందరీమణులు నిలబడి వింజామరలు వీస్తున్నారు. రావణుని తల మీద విజయ ఛత్రము శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. రావణుడు ఎర్రని చందనము పూసుకొని ఉన్నాడు. ఐరావతము పొడిచిన దంతపు పోట్లు రావణుని వక్షస్థలము మీద కనిపిస్తున్నాయి. అటువంటి రావణుని సుగ్రీవుడు చూచాడు. సుగ్రీవుని కోపం తారస్థాయికి చేరుకుంది. దిగ్గున పైకి లేచాడు. సువేల పర్వతము మీది నుండి రావణుని మందిరము మీదికి దూకాడు. రావణుని ఎదురుగా నిలబడి ఇలా అన్నాడు. “ఓరి రాక్షసాధమా! నేను ముల్లోకములకు ప్రభువైన రాముని ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 39)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ముప్పది తొమ్మిదవ సర్గ వానర సేనలకు అధిపతులు ఆ రాత్రి సువేల పర్వతము మీద ఉండి, అక్కడి నుండి లంకా నగరాన్ని చూచారు. లంకా నగరంలో ఉన్న ఉద్యానవనములను, ఎత్తైన భవనములను, చూచారు. ఇంద్రుని రాజధాని అయిన అమరావతి వలె ప్రకాశించుచున్న లంకా నగర సౌందర్యమునకు వారంతా ఆశ్చర్యపోయారు. కొంత మంది వానరులకు లంకా నగరంలో ప్రవేశించవలెనని కోరిక కలిగింది. వారు సుగ్రీవుని అనుమతి తీసుకొని లంకా నగరం వైపుకు వెళ్లారు. ఆ వానరులు పెద్ద పెద్దగా అరుస్తూ, ఆ పర్వతము మీద ఉన్న మృగములకు ఏనుగులకు భయం కలిగిస్తూ వెళు తున్నారు. వారి అరుపులకు కేకలకు ఆ పర్వత ప్రాంతము అదిరిపోతూ ఉంది. వారి అరుపులకు క్రూరమృగములు నలుదిక్కులకు పారిపోయాయి. సువేల పర్వతము పక్కన ఎత్తైన త్రికూట పర్వత శిఖరము ఉంది. దానిని ఎక్కడానికి ఎవరి తరమూ కాదు. ఆ త్రికూట పర్వత శిఖరము మీద లంకా నగరము నిర్మింపబడి ఉంది. ఆ లంకానగరము ఇరవై యోజనముల పొడవు, పది యోజనముల వెడల్పు కలిగి ఉంది. ఆ లంకా నగరం ఎత్తైన గోపురములు, బంగారముతోనూ వెండితోనూ కట్టబడిన ప్రాకారములతోనూ, పెద్ద పెద్ద భవనములతోనూ, ఎత్తైన ప్రాసాదములతోనూ, విమానములతోనూ, శోభిల్లుతూ ఉంది. ఆ లంకా నగరంలో వెయ్యి...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 38)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ముప్పది ఎనిమిదవ సర్గ రాముడు లక్షణునితో సహా సువేల పర్వతమును ఎక్కడానికి నిర్ణయించుకొని, సుగ్రీవుడు, విభీషణునితో ఇలా అన్నాడు. "మేము ఇద్దరమ పర్వతమును ఎక్కి అక్కడ ఈ రాత్రికి ఉంటాము. తన చావును చేజేతులా కొనితెచ్చుకున్న రావణుని నివాసమైన లంకా నగరమును నేను లక్షణుడు చూడవలెనని కుతూహలపడుతున్నాము. రావణుని పేరు వింటేనే నాకు ఒళ్లంతా తాపము కలుగుతూ ఉంది. వాడి ఒక్కడి మూలంగా రాక్షసజాతి యావత్తు నాశనం కాబోతోంది. ఒక్కడు చేసిన పాపమునకు రాక్షస కులము నశించడం తప్పదు." అని అన్నాడు రాముడు. తరువాత రాముడు లక్ష్మణునితో కూడి సువేల పర్వతమును ఎక్కడం మొదలెట్టాడు. రామలక్ష్మణుల వెంట సుగ్రీవుడు, అతని మంత్రులు, విభీషణుడు కూడా వెళ్లారు. వారి వెంట హనుమంతుడు, అంగదుడు మొదలగు వానర వీరులు కూడా వెళ్లారు. అందరూ సువేల పర్వతమును ఎక్కి అక్కడి నుండి సుందరమైన కాంచన లంకను చూచారు. లంకా నగరము ప్రాకారముల మీద నల్లని శరీర ఛాయగల కొండల వంటి దేహములు గల రాక్షసులు నిలబడి ఉండటం వలన, నల్లటి రాళ్లతో మరొక ప్రాకారము కట్టారా అన్న భ్రమ కలుగుతూ ఉంది. ఆ రాక్షసులను చూచి వానరులు వింత వింత కిచ కిచ ధ్వనులు చేసారు. అంతలోనే స...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 37)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ముప్పది ఏడవ సర్గ లంకా నగరంలో రావణుని పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ లంకా నగరము వెలుపల మోహరించి ఉన్న వానర సైనికుల మధ్య ఉన్న రాముడు, లక్ష్మణుడు,సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, శరభుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిదుడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు, నలుడు, పనసుడు, ఇంకా తదితరులు కూర్చుని ఆలోచిస్తున్నారు. మనమందరమూ రావణుని చేత పరిపాలింపబడుతున్న లంకా పట్టణమును చేరుకున్నాము. తదుపరి కార్యక్రమమును గురించి ఆలోచించండి అని ఒకరితో ఒకరు అనుకొంటున్నారు. లంకా పట్టణము గురించి బాగా తెలిసిన విభీషణుడు లేచి ఇలా అన్నాడు. “రామా! నా వెంట నా అనుచరులు నలుగురు రాక్షసులు వచ్చారు. నేను ఆ నలుగురిని లంకకు పంపాను. వారు లంకలో జరుగుతున్న విషయాలను జాగ్రత్తగా పరిశీలించి వచ్చారు. వారు పక్షిరూపములలో రాక్షస సేనలలో ప్రవేశించి వారి ప్రయత్నములు అన్నీ తెలుసుకొని వచ్చారు. రావణుడు చేయుచున్న సైనిక ఏర్పాట్లను గురించి వారు నాకు తెలిపిన విషయాలను నేను మీకు తెలియపరుస్తాను. లంకకు నాలుగు ప్రధాన ద్వారములు కలవు. తూర్పు ద్వారమునకు ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు దక్షిణ ద్వారము వద్ద, ఇంద్రజిత్తు పశ్...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 36)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ముప్పది ఆరవ సర్గ రావణునికి రెండే గుణాలు. అతనికి తెలియదు. ఒకరు చెబితే వినడు. వీళ్లనే మూర్ఖులు అంటారు. ఆ మూర్ఖులలో కెల్లా అగ్రగణ్యుడు రావణుడు. రావణునికి ఎంతో మంది చెప్పారు, తల్లి కైకసి కూడా చెప్పింది. సీతను రామునికి ఇచ్చి యుద్ధము నివారించు అని. కాని వినలేదు. ఇప్పుడు మాల్యవంతుడు చెప్పాడు. రావణుడు వినలేదు. పైగా కోపం వచ్చింది. మాల్యవంతుడు చెప్పిన మాటలకు రావణుడికి కోపం వచ్చింది. మాల్యవంతునితో ఎంతో కఠినంగా ఇలా అన్నాడు. "మాల్యవంతా! నీ హితబోధలు నాకు అక్కరలేదు. మీరు శత్రుపక్షము వహించి, నాకు హితబోధ చేస్తే అవి నా చెవికి ఎక్కవు. రాముడు కేవలం మానవుడు. రాజ్యము పోగొట్టుకొని అడవులు పట్టి తిరుగుతున్న అభాగ్యుడు. సైన్యము లేక, ఎవరూ దొరక్క, వానరుల సాయం తీసుకున్నాడు. అటువంటి వాడు నన్ను గెలువగలడా! రామునికి అంత సమర్ధత ఉందా! నేను ఎవరు; రాక్షసులకు రాజును. దేవతలను జయించిన వాడను. పరాక్రమ వంతుడను. దిక్పాలకులను నా పాద దాసులుగా చేసుకున్న మేటిని. నన్ను భీరుడుగా, బలహీనుడుగా ఎందుకు అనుకుంటున్నావు. మాల్యవంతా! నీవూ రాక్షసుడవే. నేను రాక్షసుడనే. ఇరువురమూ ఒకే జాతికి చెందిన వారము. కానీ నీవు మా...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 35)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ముప్పది ఐదవ సర్గ లంకా నగరము బయట వానర సైన్యము యొక్క యుద్ధ సన్నాహాలు, వారి యుద్ధభేరీ శబ్దాలు విన్న రావణుడు తన మంత్రుల వంక చూచాడు. వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు. “ఓ మంత్రులారా! రాముడు వానర సేనతో సముద్రమును దాటిన విషయము, లంకను ముట్టడించిన విషయము మీ ద్వారా విన్నాను. ఎంత సేపటికీ రాముని పొగడడం, రామునితో సంధిచేసుకోమని నాకు సలహా ఇవ్వడం, సీతను తీసుకొని పోయి రామునికి అప్పగించమనడం తప్ప మీరు ఏమీ చేయడం లేదు. చేతకాని వారిలా చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూచుకుంటున్నారు. ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. మీ పౌరుషము, పరాక్రమము ఏమైనాయి. రామునికి, వానర సేనలకు భయపడుతున్నారా!" అని నిష్టూరంగా కోపంగా అన్నాడు. అప్పుడు మాల్యవంతుడు అనే రాక్షస మంత్రి లేచి ఇలా అన్నాడు. “ఓ రాక్షసేంద్రా! నీతి మార్గమును, ధర్మ మార్గమును అనుసరించు రాజు ఎల్లప్పుడూ విజయమును పొందుతాడు. అటువంటి రాజుకు శత్రువులు కూడా భయపడతారు. యుద్ధము వచ్చినపుడు సమయానుకూలంగా ప్రవర్తించాలి. మన బలము ఎదిరి బలమును గుర్తెరిగి యుద్ధము చేయడమో సంధిచేసుకోవడమో చేయడం ఉత్తమం. అటువంటి రాజు ఎల్లప్పుడూ జయమును పొందుతాడు. రాజు...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది నాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 34)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ముప్పది నాలుగవ సర్గ అమృతముతో సమానమైన సరమ మాటలు విన్న సీత పరమానంద భరితురాలైంది. రాముడు బతికి ఉన్నాడు మరణించలేదు అన్న మాటలు ఆమెకు కర్ణపేయములుగా వినిపించాయి. సీత సంతోషమును చూచి సరమ ఇంకా ఇలా అంది. “ఓ సీతా! ఇప్పటికి ఈ విషయాలు మాత్రము సేకరించాను. నేను ఇప్పుడే పోయి మరిన్ని విశేషములను సేకరించి తీసుకొని వస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. ఎలాగా అంటే నాకు ఆకాశగమనము తెలుసు. హాయిగా ఆకాశంలో ఎగురుతూ వెళ్లగలను.” అంది సరమ. ఆ మాటలు విన్న సీత సరమతో ఇలా అంది. "సరమా! నీవు అటు ఆకాశములో గానీ, ఇటు పాతాళములో గాని నిర్భయంగా పోగలవని నాకు తెలుసు. రాముడు బతికి ఉన్నాడని చెప్పావు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సమయంలో రావణుడు ఏంచేస్తున్నాడు. అతని యుద్ధతంత్రము ఏమిటి? అనే విషయములు తెలుసుకొని వచ్చి నాకుచెప్పగలవా! ఆ రావణుడు తన మాయలతో నన్ను మోహింపజేస్తున్నాడు. దానికి తోడు ఈ రాక్షస స్త్రీలను ప్రేరేపించి నన్ను భయపెడుతున్నాడు. కాబట్టి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదు. అందుకని రావణుని మాయల గురించి, అతడి యుద్ధతంత్రముల గురించి నాకు తెలియజేస్తే నేను నిశ్చింతగా ఉంటాను." అని అడిగింది సీత. సీత మ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 33)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ముప్పది మూడవ సర్గ ఎప్పుడైతే రావణుడు, రావణుని వెంట విద్యుజ్జిహ్వుడు అక్కడి నుండి వెళ్లిపోయారో, వారి మాయచేత కల్పితమైన రాముని ఖండిత శిరస్సు, రాముని ధనుస్సు, బాణములుకూడా మాయం అయ్యాయి. అది చూచిన సీత నిశ్చేష్టురాలయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సరమ అనే రాక్షస స్త్రీ సీత దగ్గరకు వచ్చింది. రాక్షసులలో కూడా మంచి వాళ్లు ఉన్నట్టు సరమ రాక్షస స్త్రీ అయినా సీత అంటే ఆమెకు ప్రేమ అభిమానము. సీత కు కూడా సరమ అంటే ప్రీతి, నమ్మకము. సరమ సీతను చూచి ఇలా అంది. "సీతా! ఏడవకు. ఊరుకో. ఈ పరిణామాలు చూచి బాధపడకు. రావణుడు ఇక్కడకు వచ్చినప్పటి నుండి అతడు పలికిన పలుకులు, నువ్వు నీ భర్త గురించి పడ్డ ఆవేదన, నువ్వు రావణునితో పలికిన పలుకులు అన్నీ నేను ఆ చెట్టు చాటున ఉండి విన్నాను. నాకు రావణుడు అంటే ఏ మాత్రం భయం లేదు. ఏం చేస్తాడు. చంపుతాడు అంతే కదా. నీకోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను. నన్ను నమ్ము. సీతా! నువ్వు ఒక్కటి గమనించావో లేదు. రాముడు చనిపోయాడు అని నిన్ను నమ్మించడానికి రాముని శిరస్సు తీసుకొని వచ్చిన రావణుడు, సేవకుడు వచ్చి ప్రహస్తుడు వచ్చాడు అనగానే వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోయాడు. నేను కూడా వారిని...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 32)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ముప్పది రెండవ సర్గ ప్రశాంతంగా కూర్చుని మనసులో రాముని తలచుకుంటున్న సీతకు ఇదంతా కలగా అనిపించింది. ఎదురుగా పడి ఉన్న రాముని ఖండిత శిరస్సు, ధనుర్బాణములు చూచింది. నాడు హనుమంతుడు వానర సేనానాయకుల గురించి, సుగ్రీవుని గురించి ఏమి చెప్పాడో అవే రావణుడు కూడా చెప్పడం గమనించింది సీత. రాముని శిరస్సు వంక చూచింది. సంవత్సరాల తరబడి పరిచయం ఉన్న ముఖం రామునిది. ఆ కళ్లు, ముఖము, నుదురు, అవన్నీ చూచి ఆ శిరస్సు రామునిదే అని నిర్ధారించుకుంది సీత. సీతకు దుఃఖము ముంచుకొచ్చింది. తట్టకోలేక పోయింది. వలా వలా ఏడిచింది. ఇన్ని ఆపదలకు కారణమైన తన అత్తగారు కైకను నిందించింది. “అమ్మా కైకమ్మతల్లీ! నీ కోరిక తీరిందా! రాముని అయోధ్యలో లేకుండా చేద్దామని అనుకున్నావు. తుదకు ఈ లోకంలోనే లేకుండా పోయాడు. నీవు మమ్ములనే కాదు ఇక్ష్వాకు వంశమునే నాశనం చేసావు. నాకు, రామునికి నార చీరలు ఇచ్చి అడవులకు పంపావు. నేను, నా రాముడు, నీకేమి అపకారం చేసాము. నీవు అరణ్యములకు పంపబట్టికదా నాకు రామునికి ఇన్నికష్టాలు వచ్చి పడ్డాయి." అని దీనంగా విలపించింది. తన పాచిక పారినందుకు రావణుడు లోలోపల సంతోషి స్తున్నాడు, పైకి మాత్రం గంభీరంగా ఉన...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 31)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ముప్పది ఒకటవ సర్గ రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు కోట్లకొలదీ వానరసైన్యములతో వచ్చి లంకను ముట్టడించారు అన్న విషయం గూఢచారుల వలన తెలుసుకున్నాడు రావణుడు. రావణుని మనసులో భయం ప్రవేశించింది. తన ముందు ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి సీతను రామునికి అప్పగించడం. అది తనకు ఇష్టం లేదు. రెండవది రామునితో యుద్ధము చేయడం. తన మంత్రులు తనకు ఈ విషమ సమయంలో ఏదైనా సలహా చెప్పకపోతారా అని ఆశపడ్డాడు. వెంటనే మంత్రులను అందరినీ సభకు రావలసినదిగా ఆదేశాలు పంపాడు. రావణుని మంత్రులందరూ సభకు వచ్చారు. రావణుడు వారితో మంత్రాంగము సాగిస్తున్నాడు. మంత్రులు తమకు తోచిన ఉపాయములను వారు చెప్పారు. అవి ఏవీ రావణునికి రుచించలేదు. సభచాలించి అంత:పురమునకు వెళ్లాడు. రావణునికి ఒక విషయం స్ఫురించింది. సీతను తను జనస్థానమునుండి అపహరించుకు రావడమే వంచనతో మొదలయింది. ఇప్పుడు కూడా ఆ వంచనాశిల్పాన్ని ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. ఇటువంటి మాయలకు పెట్టింది పేరు అయిన విద్యుజ్జిహ్వుని పిలిపించాడు. వానితో ఇలా అన్నాడు. “జనకుని కుమార్తె సీత మన దగ్గర ఉంది. ఆమెను మాయతో భ్రమింపచేయాలి. సీత భర్త రాముడు. రాముని తలను పోలిన తలను, రాముని...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 30)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ముప్పదవ సర్గ “ఓ రాక్షసేంద్రా! రాముడు తన అపార మైన సేనలతో సువేల పర్వతము మీద ఉన్నాడు." అని శార్దూలుడు రావణునితో చెప్పాడు. ఈ సారి రావణుడు కొంచెం కంగారు పడ్డాడు. కాస్త భయపడ్డాడు. కాని ఆ భయాన్ని బయటకు కనపడనీయలేదు. శార్దూలుడి మొహంలోకి చూచాడు. వాళ్ల మొహంలో సంతోషము ఉత్సాహము లేదు. వీళ్లు కూడా వానరుల చేతిలో తన్నులు తిని వచ్చిఉంటారు అని అనుకున్నాడు. అంత భయంలో కూడా రావణునికి నవ్వు వచ్చింది. "ఏంటీ! మీ మొహాలు వాడిపోయి ఉన్నాయి. చాలా దీనంగా ఉన్నారు. మీరు కూడా శత్రువులకు పట్టుబడ్డారా!" అని నర్మగర్భంగా అడిగాడు. ఆ మాటలకు శార్దూలుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. "ఓ రాక్షస రాజా! మన గూఢచర్యము వానర సేన ముందు ఫలించడం లేదు. వారందరూ రాముని అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. కనీసము మాకు రామునితో మాట్లాడటం కూడా కుదర లేదు. వానరుల వలయాన్ని ఛేధించుకొని పోవడం ఎవరికీ సాధ్యం కాదు. మేము వానర సైన్యములో ప్రవేశించగానే విభీషణుడు మమ్ములను గుర్తించాడు. వానరులు మా అందరినీ పట్టుకున్నారు. మమ్ములను కాళ్లతోనూ చేతులతోనూ మర్దించారు. మా శరీరాలు రక్తసిక్తం అయ్యాయి. మమ్ములను రాముని ముంద...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 29)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఇరువది తొమ్మిదవ సర్గ రావణుడు శుకుడు సారణుడు చెప్పిన మాటలను సావధానంగా విన్నాడు. కాని తన ముందు తన శత్రువులను, శత్రుసేనలను పొగడడం సహించలేకపోయాడు. కోపంతో ఉగ్రడయ్యాడు. వారితో ఇలా అన్నాడు.  “మీరు నా కింద బతుకుతున్నారు. నా ముందు నాకు అప్రియమైన మాటలు పలకడానికి మీకు నోరు ఎలా వచ్చింది. రాజు ఎదుట రాజుకు ఇష్టము లేని మాటలను పలకడం యుక్తము కాదు అని తెలియదా! శత్రువులు బలవంతులే అయి ఉండవచ్చు అంతమాత్రాన శత్రువును రాజు ముందు పొగుడుతారా! శత్రువును నా ముందు స్తుతిస్తారా! మీరు రాజనీతి నేర్చుకోలేదా! మీ గురువులు రాజనీతి మీకు నేర్పలేదా! లేదా నేర్చుకొని కూడా మీకు అర్థం కాలేదా! లేదా అజ్ఞానంతో ఇలా మాట్లాడుతున్నారా! మీ లాంటి మూర్ఖులను నా మంత్రులుగా, గూఢచారులుగా పెట్టుకొని ఇంకా నేను బతికి ఉన్నాను అంటే అది నా అదృష్టము కాని వేరు కాదు. నా ఎదుట ఇలా శత్రువును పొగిడినందుకు మీకు మరణ దండన విధించబడును అన్న విషయం మీకు తెలియదా! ఒకసారి నా ఆగ్రహానికి గురి అయిన వాళ్లు ఈలోకంలో బతకడం కల్ల అన్న విషయం కూడా తెలియదా! కాని ఒకే ఒక కారణం చేత మీ ఇద్దరినీ క్షమిస్తున్నాను. మీరు ఇంతవరకూ నాకు, లంకకు చేసిన సేవలను...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 28)

శ్రీమద్రామాయణము యుద్ధ కాండము ఇరువది ఎనిమిదవ సర్గ సారణుడు చెప్పడం పూర్తిచేసిన తరువాత శుకుడు తాను తెలుసుకున్న విషయాలు చెప్పనారంభించాడు.  "ఓ రాక్షసరాజా! సారణుడు చెప్పినది అక్షర సత్యము ఈ వానరులు మహాబలవంతులు. ఎవరిచేతా జయింప శక్యము కాని వారు. మన మాదిరే కామరూపులు. వారి ఇష్టం వచ్చిన రూపం ధరించగలరు. ఇందులో దేవతలకు, గంధర్వులకు పుట్టిన వానరులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ సుగ్రీవునితో పాటు కిష్కింధలో నివసిస్తూ ఉంటారు. అందులో అచ్చము దేవతల వలె పోలికలు ఉన్న వానరులు ఇద్దరు ఉన్నారు. వారి పేర్లు మైందుడు, ద్వివిదుడు. వారు ఇద్దరూ అన్నదమ్ములు. యుద్ధములో వారిని ఎదిరించి నిలిచే వారు లేరు. బ్రహ్మదేవుని కృపచేత వారు అమృతము తాగారు. అందుకే అజేయులు అయ్యారు. ఓ లంకేశ్వరా! ఇదివరకు లంకకు వచ్చి సీతను చూచి లంకా దహనము చేసిన వాడు మరలా వచ్చాడు. వాడి పేరు హనుమంతుడు. కేసరి పుత్రుడు. వాయుదేవునికి ఔరస పుత్రుడు. నూరుయోజనముల దూరము కల సముద్రమును దాటగలిగాడు. అతడు కామ రూపుడు. అత్యంత వేగము కలవాడు. ఈ హనుమంతుడు బాలుని గా ఉన్నప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూచి అది ఫలము అని భ్రమించి దానిని తినుటకు సూర్యమండలము వైపునకు ఎగిరిపోయిన మహా...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 27)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఇరువది ఏడవ సర్గ సారణుడు వానర యూధముల గురించి ఇంకా చెప్పసాగాడు. "ఓ రాక్షన రాజా! రాముని కొరకు తమ ప్రాణములను కూడా లెక్కచేయకుండా యుద్ధము చేయడం కోసం ఉరకలు వేస్తున్న వానర నాయకుల గురించి ఇంకా చెబుతాను విను. నున్నటి తోకతో, ఒళ్లంతా ఎర్రటి, పచ్చటి, తెల్లటి రోమములు విస్తారముగా కలిగిన ఆ వానర నాయకుని పేరు హరి. అతని వెంట వందల కొద్దీ వానరులు ఉన్నారు. వారందరూ సుగ్రీవుని నాయకత్వంలో రాక్షసులతో యుద్ధానికి కాలుదువుతున్నారు. అదుగో అటు చూడు. నల్లని మేఘముల వలె కనపడుచున్నది భల్లూకసేన. సముద్రము నల్లగా ఉంటే ఈ భల్లూక సేనకూడా నల్లగా మరొక సముద్రంలా ఉంది. వీరందరూ పర్వత ప్రాంతముల నుండీ, సమతల భూముల నుండి, మరి కొందరు నదీతీరముల నుండీ వచ్చారు. వీరంతా చాలా భయంకరంగా యుద్ధం చేయడంలో నిపుణులు. ఈ భల్లూకములకు నాయకుడు ధూమ్రుడు. ఇతడు నర్మదా నదీ తీరంలో ఉన్న ఋక్షవంతము అనే పర్వతము మీద ఉంటాడు. ఆ పక్కనే ఉన్న వాడు ధూమ్రుని తమ్ముడు. ఇద్దరూ ఒకే రూపంలో ఉన్నారు కదూ. ఇతడు అన్నకంటే పరాక్రమ వంతుడు. ఇతని వెంట కూడా ఎన్నో భల్లూక సేనలు ఉన్నాయి. భల్లూకములలోకి అంతటికీ వృద్ధుడు జాంబవంతుడు. ఇతని వెంట అపారమైన భల్లూకసేన...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 26)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఇరువది ఆరవ సర్గ ఇంత మంది ఇన్ని సార్లు ఇన్ని మాటలు చెప్పినా రావణుడు తన మూర్ఖపు పట్టుదల విడువ లేదు. “ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను. దేవ, దానవ, గంధర్వ, యక్షులు ఒక్కుమ్మడిగా నా మీదికి వచ్చినా, నేను సీతను విడువను. మీరు ఇద్దరూ వానరుల చేతిలో దెబ్బలు తిని బాగా భయపడినట్టున్నారు. అందుకే భయంతో ఇలా మాట్లాడుతున్నారు. నాకు ఎవరిని చూచినా భయం లేదు. నన్ను ఎవరూ ఓడించలేరు. ఇంతకూ రాముని సైన్యము పరిమాణము ఎంత? వారు ఎక్కడ ఉన్నారు. నాకు చూపించండి." అని అన్నాడు రావణుడు. శుకుడు, సారణుడు రావణుని ఒక ఎత్తైన ప్రాసాదము మీదికి తీసుకొని వెళ్లారు. అక్కడ ముగ్గురు నిలబడ్డారు. అక్కడి నుండి వానర సైన్యము సుస్పష్టంగా కనపడుతూ ఉంది. వానర సేన భూమి అంతా కప్పినట్టు ఉంది. అసలు భూమి కనిపించడం లేదు. పూర్తిగా వానరులతో నిండిపోయినట్టు ఉంది. రావణునికి వానర సేన మరొక సముద్రం లాగా కనిపిస్తూ ఉంది. రావణుడు సారణుని చూచి ఇలా అన్నాడు. "ఆ కనిపిస్తున్న వానర సేనలో ముఖ్యమైన వారు ఎవరు? బలవంతులు, శూరులు, పరాక్రమ వంతులు ఎవరు? ముందు నిలిచి యుద్ధము చేసే వాళ్లు ఎవరు? సుగ్రీవుడు ఎవరి మాట వింటాడు? సేనానాయకులు ఎవరు? వీ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 25)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఇరువది ఐదవ సర్గ తరువాత రావణుడు ఇద్దరు గూఢచారులను పిలిపించాడు. రావణుడు పిలిపించిన గూఢచారుల పేర్లు శుకుడు, సారణుడు. రావణుడు వారితో ఇలా అన్నాడు. “రాముడు వానర సైన్యముతో సముద్రము దాటినాడు అని వార్త వచ్చింది. ఇదివరలో ఎవరూ చేయజాలని సేతువును రాముడు నిర్మింపజేసాడు. రాముడు వానరులతో నూరుయోజనముల దూరము సేతువును నిర్మించాడు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇంతకూ వానరుల బలము ఎంత అని మనం ముందు తెలుసుకోవాలి. వారి యుద్ధ వ్యూహములను తెలుసుకోవాలి. కాబట్టి మీరు ఇద్దరూ కోటదాటి వెళ్లండి. వానర రూపములతో వానరసేనలలో కలిసిపోండి. వానర సేన ఎంత ఉంది. వారి నాయకులు ఎవరు. ఎవరి దగ్గర ఎంతెంతమంది వానర సేన ఉంది. సముద్రము మీద సేతువును నిర్మించిన వారు ఎవరు. ఎవరి సాయంతో నిర్మించారు. సుగ్రీవునితో ఉన్న మంత్రులు ఎవరు. ఎంత మంది. వానర సేనలకు ముఖ్య సేనాని ఎవరు? వానర సేనలో ముందు నిలిచి యుద్ధం చేసే వారు ఎవరు. వానర సేన ఉపయోగించే ప్రధాన ఆయుధములు ఏవి? నాకు ఈ సమాచారమును వెంటనే సేకరించి తెలియపరచండి." అని ఆదేశించాడు. రావణుని ఆదేశము ప్రకారము శుకుడు, సారణుడు వానర రూపములను ధరించి వానర సేనలలో ప్రవేశించారు. వారు ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది నాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 24)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఇరువది నాలుగవ సర్గ రాముని వెంట వెడుతున్న వానర సేన పాదఘట్టనలకు భూమి అదురుతూ ఉంది. లంక బయట ఇలా ఉంటే, లంకా నగరంలో కూడా రాక్షస సేనలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. రాక్షస సేనలు చేసే సింహనాదాలు, భేరీమృదంగ ధ్వనులు లంక బయట ఉన్న వానర సేనలకు వినబడుతున్నాయి. వానర సేనలు కూడా వాటికి మించిన ధ్వనులు చేస్తున్నారు. దూరం నుండి లంకా పట్టణమును చూచిన రామునికి సీత గుర్తుకు వచ్చింది. “ఆహా! నా సీత ఈ లంకా నగరంలోనే కదా బంధింపబడి ఉంది!" అని మనసులో అనుకున్నాడు.  పక్కనే ఉన్న లక్ష్మణుని చూచి రాముడు ఇలా అన్నాడు. "లక్ష్మణా! ఆ పర్వత శిఖరము మీద విశ్వకర్మచేత నిర్మింపబడిన ఆ కాంచన లంకను చూచావా! ఆ లంకా నగరము ఆకాశాన్ని తాకుతూ ఉన్నదా అన్నట్టు లేదూ! ఎంతో కాలము కిందట నిర్మింపబడిన ఈ లంకా నగరము ఎత్తైన భవనములతో అత్యంత శోభాయమానముగా ఉంది." అని అన్నాడు. తరువాత రాముడు వానర సేనలను వ్యూహములుగా విభజించాడు. గరుడ వ్యూహాకారంరలో సేనలను నిలబెట్టాడు. సేనలకు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చాడు. "అంగదుడు తన సేనలతో, ఈ గరుడవ్యూహమునకు వక్షస్థల భాగమున నిలువ వలెను. ఋషభుడు తన సేనలతో ఈ గరుడ వ్యూహమునకు కుడి వైపున ఉ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 23)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఇరువది మూడవ సర్గ లంకా ద్వీపములో అడుగు పెట్టగానే రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు.  "లక్ష్మణా! మన వానర సేనలను వివిధ భాగములుగా, వ్యూహములుగా విభజించి వారిని సమృద్ధిగా ఫలములు, తేనె, జలము దొరుకు స్థలములలో నిలుపు.  లక్ష్మణా! మనకు కనపడు శకునములను చూస్తుంటే ఇటు వానరులకు అటు రాక్షసులకు మహాభయంకరమైన ఆపద రాబోతుతున్నదని అనిపిస్తూ ఉంది. భూమి కంపిస్తూ ఉంది. ధూళితో కూడిన గాలి చెలరేగుతూ ఉంది. ఆ గాలి దెబ్బకు పర్వత శిఖరములు కంపిస్తున్నాయి. చెట్లు కూలిపోతున్నాయి. ఆకాశము నుండి ఉల్కాపాతము జరుగుతూ ఉంది. అడవి మృగములు తూర్పుదిక్కుగా చూచి వికృతంగా అరుస్తున్నాయి. చంద్రుడు కాంతి విహీనంగా కనపడుతున్నాడు. సూర్యమండలము చుట్టు ఎర్రని వలయము కనపడుతూ ఉంది, మధ్యలో నల్లని మచ్చ కనపడుతున్నాయి. ఇవన్నీ రాబోవు ప్రళయాన్ని సూచిస్తున్నాయి. ఈ యుద్ధభూమి వానరులు, రాక్షసుల రక్తంతో తడిసిపోయే కాలం సమీపిస్తూ ఉంది. యుద్ధము తప్పదు. లంకను ముట్టడించమని వానర సేనలకు ఆదేశాలు ఇవ్వండి." అని పలికాడు రాముడు.  తన ధనుస్సు తీసుకొని లంకా నగరం దిశగా వెళ్లాడు రాముడు. విభీషణుడు, సుగ్రీవుడు వానర సేనలతో రాముని అనుసరిం...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 22)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఇరువది రెండవ సర్గ రాముడు తన మాట మీదనే ఉన్నాడు. సముద్రుని చూచి ఇలా అన్నాడు. “ఓ సముద్రమా! నిన్ను ఇప్పుడే ఎండింపచేస్తాను. నేను నా బాణములతో నీ లోని నీటిని ఆవిరిగా మారుస్తాను. జలచరములను అన్నిటినీ చంపుతాను. అప్పుడు వానరులు నీ మీదుగా హాయిగా నడుచుకుంటూ లంకకు చేరుతారు. ఓ సముద్రుడా! నేను ఎన్ని విధముల బతిమాలిననూ, ప్రార్ధించిననూ కనీసము నా ముందుకు వచ్చి నాతో మాట్లాడలేదు. నా పౌరుషాన్ని, నా పరాక్రమాన్ని నువ్వు గుర్తించలేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఈ గతి పట్టింది." అంటూ రాముడు బ్రహ్మాస్త్రమును సంధించాడు. అప్పుడు భూమి ఆకాశము బద్దలు అయినట్టు శబ్దము వచ్చింది. పర్వతములు కంపించాయి. లోకమంతా చీకట్లు కమ్మాయి. సరస్సులు, నదులు గతులు తప్పాయి. చంద్రుడు సూర్యుడు తమ తమ గమనమును మార్చుకున్నాయి. ఆకాశం నుండి ఉల్కాపాతము మొదలయింది. మహావేగంతో విపరీతంగా గాలి వీచింది. వృక్షములు కూలిపోతున్నాయి. మేఘాలు చెదిరిపోతున్నాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు ఉధృతిగా ఉన్నాయి. పిడుగులు పడుతూ విద్యుత్ సంబంధమైన మంటలు మండు తున్నాయి. ఆ పిడుగుపాటుకు సమస్త జీవజాతులు అల్లల్లాడి పోతున్నాయి. సముద్రము అల్లకల్లోలము అయింది....

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది ఒకటవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 21)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఇరువది ఒకటవ సర్గ పంతొమ్మిదవ సర్గలో ముగించినట్టు రాముడు సముద్ర తీరంలో, సముద్రునికి నమస్కారము చేసి, “నేను ఈ సముద్రమును దాటనైనా దాటవలె. లేకపోతే ప్రాయోపవేశము చేసి మరణించవలె. మరొక మార్గము లేదు." అని సంకల్పించి, దర్భలమీద పడుకొని ఉన్నాడు. ఆ ప్రకారంగా మూడు రాత్రులు గడిచాయి. మూడు రోజులూ రాముడు సముద్రుని ఉపాసిస్తున్నాడు. కాని, సముద్రుడు రాముని వద్దకు రాలేదు. రాముడికి కోపం వచ్చింది. కళ్లు ఎర్రబడ్డాయి. పక్కనే ఉన్న లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. "లక్ష్మణా! ఈ సముద్రునికి ఎంత గర్వము. నేను ఎంత వేడుకున్నను నా వద్దకు రాలేదు. నాలో ఉన్న శాంతి కాముకత, ఓర్పు, మంచి తనము నా చేతగాని తనంగా పరిగణిస్తున్నాడు సముద్రుడు. సాధారణంగా ఈ లోకంలో తనను తాను పొగుడుకొనే వాడికి, దుర్మార్గుడికి, అందరిమీద అధికారము చూపేవాడికి, అకారణంగా అటు ఇటు హడావిడిగా పరుగెత్తేవాడికి, అందరి మీదా బలప్రయోగము చేసేవాడికి ప్రజలు భయపడతారు. భక్తితో కొలుస్తారు. ఈ లోకంలో మంచి తనంతో, సౌమ్యతతో పనులు సాధించలేము. యుద్ధములో విజయము దక్కించుకోలేము. నేను నా బాణములచేత ఈ సముద్రమును ఎండింపజేస్తాను. సముద్రజలాలు ఇంకిపోయి సముద్రము...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 20)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము ఇరువదవ సర్గ విభీషణుడు తన వద్దనుండి వెళ్లగానే రావణుడికి అనుమానం కలిగింది. శార్దూలుడు అనే రాక్షసుని పంపించాడు. శార్దూలుడు మారువేషంలో వానర సైన్యం వద్దకు వచ్చాడు. వానర సైన్యము పన్నిన వ్యూహములు అన్నీ గమనించాడు. వెంటనే లంకకు చేరుకున్నాడు. రావణునికి వానర సైన్యము గురించి వివరంగా చెప్పాడు. “మహారాజా! వానర సైన్యము అపారంగా ఉంది. ఇంత అని చెప్పవీలు లేదు. వారందరూ సముద్రము ఆవల ఒడ్డున నిలిచి ఉన్నారు. వారికి రామలక్ష్మణులు నాయకత్వము వహిస్తున్నారు. వానర సైన్యము సముద్రము ఒడ్డున పదియోజనముల దూరము విస్తరించి ఉంది. నేను పైపైన చూచి వచ్చాను. తమరు మరి కొంత మంది గూఢచారులను పంపిన వారు సమగ్రమైన సమాచారమును సేకరించగలరు. ప్రస్తుతము ఆ వానర సేనతో యుద్ధయు కన్నా సామో పాయము, దానో పాయము, భేదోపాయము ప్రయోగించడం ఉచితము." అని అన్నాడు శార్దూలుడు. శార్దూలుని మాటలు విన్న రావణుడు కొంచెం కంగారు పడ్డాడు. ఏదో వానరులు కదా, రామలక్ష్మణులు నరులు కదా అని ఉపేక్ష చేసాడు. కానీ ప్రస్తుత పరిస్తితి చూస్తుంటే వానరులతో యుద్ధము అంత సులభం కాదనిపించింది. వెంటనే రావణుడు శుకుడు అనే రాక్షసుని పిలిపించాడు. “నీవు నా పంపున స...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పంతొమ్మిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 19)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము పంతొమ్మిదవ సర్గ ఆకాశంలో నిలబడి ఉన్న విభీషణుడు, రాముడి ముందు వానర నాయకులు నిలబడి మాట్లాడటం వారిలో వారు వాదించుకోవడం అంతా చూస్తున్నాడు. చివరకు పర్యవసానము ఎలా ఉంటుందో అని భయపడుతున్నాడు. ఎందుకంటే రాముడి వద్దకు వెళదామని రావణునితో విభేదించి వచ్చాడు. రాముడూ కాదంటే ఎక్కడకు వెళ్లాలి అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో సుగ్రీవుడు విభీషణుని కిందికి రమ్మని చెయ్యి ఊపాడు. పట్టరాని సంతోషంతో విభీషణుడు తన అనుచరులతో కిందికి దిగాడు. పరుగు పరుగున రాముని వద్దకు వెళ్లాడు. రాముని ముందు సాగిల పడ్డాడు. రాముని పాదములను స్పృశించాడు. రామునితో ఇలా అన్నాడు. “రామా! నా పేరు విభీషణుడు. రావణుని సోదరుడను. నా అన్న రావణుడు నన్ను అవమానించి రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. నీవు శరణాగతరక్షకుడవు అని విని నీ శరణుకోరి వచ్చాను. నేను లంకను, లంకలో ఉన్న నా భార్యాబిడ్డలను, నా బంధుమిత్రులను అందరినీ వదిలి వచ్చాను. నా రాజ్యము, నా జీవితము నీ మీదనే ఆధారపడి ఉన్నాయి.” అని అన్నాడు. రాముడు విభీషణుని పట్టుకొని లేవనెత్తాడు. విభీషణుని ప్రేమతో చూస్తూ ఇలా అన్నాడు. “నీవు రాక్షసుల బలాబలముల గురించి నాకు వివరంగా చెప్పు" అని అడిగాడ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదునెనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 18)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము పదునెనిమిదవ సర్గ అందరూ మాట్లాడడం అయిన తరువాత రాముడు తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించాడు. “వానరవీరులారా! విభీషణుని గురించి మీరంతా చెప్పినది విన్న తరువాత నా అభిప్రాయం కూడా చెబుతున్నాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి “నేను నీకు మిత్రుడను, శరణాగతుడను" అని చెబితే వారిలో ఎన్ని దోషాలు ఉన్నాకూడా, నేను వారిని విడిచిపెట్టను. అది నా వ్రతము. అన్నీ సుగుణములు ఉన్న వాడిని రక్షించే దానికంటే, దోషములు ఉన్న వాడిని రక్షించడంలోనే మన మంచితనం బయటపడుతుంది." అని ఒక్క వాక్యంలో తన నిర్ణయం తెలిపాడు రాముడు. ఆ మాట విన్న తరువాత కూడా సుగ్రీవుడు తన పట్టుదల విడువ లేదు. “రామా! వచ్చిన వాడు రాక్షసుడు. వాడు దుష్టుడో కాదో మనకు అనవసరము. ఈ విభీషణుడు తనకు బాగా జరిగినంత కాలము తన అన్న రావణుని వద్ద ఉన్నాడు. ఇప్పుడు రావణునితో విభేదము కలిగేటప్పటికి రావణుని విడిచిపెట్టి నీ దగ్గరకు చేరాడు. స్వంత అన్ననే వదిలిన వాడు, రేపు నిన్ను, నన్ను కూడా విడిచిపెట్టకుండా ఉంటాడా! అటువంటి వాడు తన స్వార్ధం కోసం ఎవరినైనా విడిచిపెడతాడు. ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాడు. ఇటువంటి స్వార్ధపరుడికి, అవకాశవాదికి, ఆశ్రయం ఇవ్వడం శ్ర...