Posts

Showing posts from May, 2024

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 66)

శ్రీమద్రామాయణము అరణ్య కాండము అరువది ఆరవ సర్గ లక్షణుని మాటలు రాముని మీద పనిచేయలేదు. ప్రస్తుతానికి లోకాలను క్షోభింపజేసే కార్యక్రమము విరమించాడు కానీ, సీతను గురించి శోకించడం మానలేదు. రాముని మానసిక స్థితి పూర్తిగా దిగజారి పోయింది. మానసికంగా శక్తిని, బలాన్ని కోల్పోయాడు. రాముని స్థితిని గమనించిన లక్ష్మణుడు రామునికి ధైర్యం చెప్పడం మొదలెట్టాడు. “రామా! మన తండ్రి దశరథుడు అనేక సంవత్సరాలు పుత్ర సంతతి లేక. యజ్ఞములు, యాగములు చేసి మనలను పొందాడు. నీ వియోగమును తట్టుకోలేక ఈ లోకాన్నే విడిచిపెట్టాడు మన తండ్రి దశరథుడు. నీవు రాజ్యాని పోగొట్టుకున్నావు. ఇటువంటి కష్టములను ధీరోదాత్తుడవైన నీవే తట్టుకోలేకపోతే సామాన్య ప్రజలు ఎలా తట్టుకోగలరు. యయాతి లాంటి మహారాజుకే కష్టములు తప్పలేదు. ఇంక మనము ఎంత! కష్టములు, సుఖములు, ఒకదాని వెంట ఒకటి రావడం లోక సహజం. వాటిని తట్టుకొని నిలబడడమే మానవుని కర్తవ్యము. మన తండ్రి పురోహితులు వసిష్ఠులవారికి ఒకే రోజు నూర్గురు కుమారులు కలిగారు. వారందరూ విశ్వామిత్రుని కోపాగ్నికి బలి అయి ఒకేరోజు మరణించారు. ఇంతెందుకు, భూదేవి కూడా ప్రతిరోజూ ఈ మానవుల చేతిలో ఎన్నో కష్టములను భరిస్తూ ఉంది. సూర్య చంద్రులు క...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 65)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము అరువది ఐదవ సర్గ సీతా వియోగంతో రామునికి తాను ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. ముల్లోకాల్ని నాశనం చేస్తానని విల్లు ఎక్కుపెట్టడం చూచి లక్ష్మణుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే రామునితో ఇలా అన్నాడు. “రామా! నీవు సౌమ్యుడవు. మృదుస్వభావుడవు. సకల జనులకు హితుడవు. అటువంటి నీవు ముల్లోకములకు హాని కలిగిస్తాను అనడం భావ్యమా! నీ శాంత స్వభావాన్ని విడిచిపెట్టవచ్చునా! చంద్రునికి వెన్నెల, సూర్యునికి వేడి, భూమికి క్షమ ఎలా అలంకారాలో నీకు సౌమ్యత, సాధుజన ప్రియత్వము అలంకారాలు. ఇన్నాళ్లు సంపాదించుకున్న కీర్తిని ఒక్కసారిగా నాశనం చేసుకుంటావా! సీతను అపహరించింది ఎవడో ఒక రాక్షసుడు. వాడిని శిక్షించాలి గానీ, ముల్లోకాలను క్షోభింపజేయడం యుక్తము కాదు కదా! ఇక్కడ ఏం జరిగిందో, ఎవరెవరికి యుద్ధం జరిగిందో, అసలు ఈ యుద్ధముతో సీతాపహరణమునకు సంబంధం ఉందో లేదో తెలియదు. ఈ రక్తపు మరకలు ఎవరివో తెలియదు. కాని ఇక్కడ ఒక యుద్ధము జరిగింది అన్నమాట వాస్తవము. కాని ఈ యుద్ధము ఇద్దరి మధ్య జరిగిందే కానీ, పెద్ద సైన్యము మధ్య జరిగింది కాదు. పెద్దసైన్యము వచ్చిన గుర్తులు కనిపించడం లేదు. ఇద్దరు యుద్ధం చేసుకుంటే ఒకడు చావాలి. మరొకడు గెలవాలి...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది నాల్గవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 64)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము అరువది నాల్గవ సర్గ రాముడికి ఇంకా ఆశ చావలేదు. 'ఏమో సీత ఎక్కడికైనా వెళ్లిందేమో. మనము అనవసరంగా ఆందోళన పడుతున్నామేమో' అనే ఆలోచన వచ్చింది. వెంటనే లక్ష్మణుని పిలిచి "లక్ష్మణా! నీవు వెంటనే గోదావరీనదీ తీరానికి వెళ్లు. అక్కడ సీత తామరపూలు కొయ్యడానికి కానీ,స్నానానికి కానీ వెళ్లిందేమో చూడు.' ఇదే ఆఖరి ఆశ." అన్నాడు రాముడు. అన్న మాట ప్రకారము లక్ష్మణుడు గోదావరీ నదీతీరానికి వెళ్లాడు. తీర ప్రాంతము అంతా వెదికాడు. కానీ సీత జాడ ఎక్కడా కనపడలేదు. నిరాశతో రాముని వద్దకు వచ్చాడు. “అన్నయ్యా! నేను గోదావరి తీరం అంతా వెదికాను. బిగ్గరగా అరిచాను. సీత ఎక్కడా కనిపించలేదు." అని చెప్పాడు. ఆఖరి ఆ ఆశ కూడా వమ్ముకావడంతో రాముడు హతాశు డయ్యాడు. కాని రామునికి ఇంకా కొన ఆశ మిగిలి ఉంది. “లక్ష్మణుడు సరిగా చూచాడో! లేదో ఏమో!" అని తానే స్వయంగా గోదావరీ నదీ తీరానికి వెళ్లాడు. సీతా! సీతా!అని బిగ్గరగా అరుస్తూ ఆ ప్రాంతమంతా కలయ తిరిగాడు. రావణుడు సీతను అపహరించిన సంగతి అక్కడ ఉన్న వృక్షములకు, జంతువులకు, పక్షులకు, గోదావరీ నదికి తెలుసు. కాని అవి చెప్పలేవు. రాముడు నిరాశ చెందాడు. లక్ష్మణున...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 63)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము అరువది మూడవ సర్గ రాముడి దు:ఖానికి అంతులేకుండా పోయింది. లక్ష్మణుడు ఎంత ఓదారుస్తున్నా రాముడు సీత మీద ఉన్న ప్రేమ వలన ఆమెకోసం విలపిస్తున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. “నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను. అందుకనే నాకు కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. నేను ఊరికే అనడం లేదు లక్ష్మణా! నాకు రాజ్యం పోయింది. బంధుమిత్రులు దూరం అయ్యారు. తల్లి దూరం అయింది. తండ్రి మరణించాడు. ఇప్పుడు నా భార్యకూడా నాకు దూరం అయింది. ఇది పాపకర్మల ఫలితం కాదా! సీతను ఎవరైనా ఎత్తుకుపోతుంటే ఆమె ఎంతగా విలపించి ఉంటుందో తలచుకుంటేనే భయంగా ఉంది. సందేహము లేదు. సీతను రాక్షసులే అపహరించారు. నరమాంస భక్షకులైన రాక్షసులు సీతను అపహరించి, ఆమె కంఠమును ఖండించి ఆమె నెత్తురు తాగి ఉంటారు. ఆ సమయంలో ఆమె ఎంతగా ఏడ్చిందో కదా! లక్ష్మణా! నీకు తెలుసుకదా! సీత, నేను, ఆ శిలాఫలకము మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు గడిపాము కదా! లక్ష్మణా! సీత గోదావరికి స్నానం నిమిత్తం వెళ్లి ఉంటుందంటావా! కాని ఆమె ఎప్పుడూ ఒంటరిగా గోదావరికి స్నానానికి వెళ్లదే! నేను తోడు లేనిదే సీత కనీసము తామరపూల కోసరం కూడా తటాకమునకు వెళ్లదు. ఎందుకంటే సీత మహాభయస్తురా...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 62)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము అరువది రెండవ సర్గ వివాహం అయినప్పటి నుండి తనను క్షణం కూడా ఎడబాయని సీత ఒక్కసారిగా తనను విడిచి పోవడం చూచి రాముడు హతాశుడయ్యాడు. రాముడికి కన్ను మూసినా తెరిచినా సీత రూపమే కనిపిస్తూ ఉంది. సీత చెట్ల నుండి పూలు కోస్తున్నట్టు, పూపొదలలో తిరుగుతున్నట్టు ఊహించుకుంటున్నాడు. ఆమెను తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. తన దగ్గరకు రాలేదేమా అని అలుగుతున్నాడు. సీత తనను ఆట పట్టించడానికి తనకు దూరంగా తనకు కనపడకుండా ఉందని ఆమెను రా రమ్మని పిలుస్తున్నాడు. నీవు లేకపోతే పర్ణశాల శూన్యంగా ఉందని నిష్టూరం ఆడుతున్నాడు. ఎంతకూ సీత కనపడలేదు. మరలా లక్ష్మణుడి వంక చూచాడు. “లక్ష్మణా! నేను ఇంతగా పిలుస్తుంటే, ఇంతగా పరితపిస్తుంటే సీత ఎందుకు రావడం లేదు. సీతను రాక్షసులు చంపి తిని ఉంటారంటావా!" అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు. మరలా తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. “ఓ సీతా! నీకు ఎంత ఆపద సంభవించినది. ఇది తెలిస్తే పాపం కైక ఎంత సంతోషిస్తుందో! ఆమె కోరిక తీరినట్టయింది కదా! సీతా! నీతో కలిసి అయోధ్యనుండి బయటకు కాలు పెట్టాను. వనవాసానంతరము నీవు లేకుండా అయోధ్యలో ఎలా కాలు పెట్టను? సీతను ఎవరికో అప్పగించి వచ్చాను అని తల...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరువది ఒకటవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 61)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము అరువది ఒకటవ సర్గ ప్రాణాధికంగా ప్రేమించిన భార్య సీత హటాత్తుగా కనపడక పోయేసరికి రాముడికి దు:ఖము,కోపము ముంచుకొచ్చాయి. దానికి కారణం లక్ష్మణుడు అని రాముని అభిప్రాయము. సీతను గూర్చి అడగాలంటే లక్ష్మణుని అడగాలి. అందుకే పదే పదే లక్ష్మణుని అడుగుతున్నాడు. “లక్ష్మణా! చెప్పు. నా భార్య సీత ఎక్కడ ఉంది. నీకు అప్పగించి వెళ్లాను కదా. నా భార్యను ఏమి చేసావు? ఆమె ఎక్కడకు వెళ్లి ఉంటుంది. నా భార్యను ఎవరు బలవంతంగా తీసుకొని వెళ్లారు? నా భార్యను ఎవరు చంపి తిన్నారు? చెప్పు" అంటూ నిలదీస్తున్నాడు. లక్ష్మణుడికి సీత గురించి తెలియదు అని రామునికి తెలుసు. కాని మనసు నిలవడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. కాబట్టి చేస్తున్నాడు. లక్ష్మణుని విడిచి పెట్టాడు. చెట్ల దగ్గరకుపోయి “సీతా సీతా రా! ఎక్కడ దాక్కుని ఉ న్నావు” అని బిగ్గరగా పిలుస్తున్నాడు. "ఓ సీతా! నీవు ఎక్కడన్నా ఆడుకుంటున్నావా! ఇందాక లేడిపిల్ల కావాలి అని అడిగావు కదా. నీకు ఏదైనా లేడి దొరికిందా. దానితో ఆడుతున్నావా. త్వరగా రా” అని ఎలుగెత్తి పిలుస్తున్నాడు. మరలా రాముడు లక్ష్మణుని వద్దకు వచ్చాడు. “లక్ష్మణా! సీత లేకుండా నేను బతకలేను లక్ష్మణా! సీతా...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - అరవయ్యవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 60)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము అరవయ్యవ సర్గ రాముడు సీత కోసం పిచ్చిగా పర్ణశాల అంతా తిరుగు తున్నాడు పరిసరాలు వెతికిన చోటనే వెతుకుతున్నాడు. సీత ఎక్కడన్నా దొరక్కపోతుందా అనే కొన ఆశతో వెదుకుతున్నాడు. సీత నిలబడ్డ చోటు, సీత కూర్చున్న చోటు, సీత వాడిన దర్భాసనము, వీటిని చూచి భోరున విలపిస్తున్నాడు. “నాసీతను రాక్షసులు పీక్కుతిని ఉంటారు. లేదా రాక్షసులను చూచి సీత మరణించి ఉంటుంది. లేక సీతను ఎవరైనా అపహరించి ఉంటారు. లేక సీత నన్ను వెదుక్కుంటూ అరణ్యంలో దారి తప్పిపోయి ఉంటుంది. లేక సీత నన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉంటుంది. లేదా పుష్పములు ఫలములు తీసుకురావడానికి ఆడవిలోకి వెళ్లి ఉంటుందేమో! సీతకు తామర పూలుఅంటే ఇష్టం. వాటిని కోయడానికి సరస్సు వద్దకు వెళ్ళిందేమో. లేక సీత నీరు తీసుకురావడానికి గోదావరి తీరాననికివెళ్లి ఉంటుందా!” ఇలా పరి పరి విధములుగా ఆలోచిస్తూ ఆ ప్రాంతం అంటా కలయ తిరుగుతున్నాడు రాముడు. ఒక చెట్టు దగ్గర నుండి మరొక చెట్టు వద్దకు, ఒక కొండ నుండి మరొక కొండవద్దకు, ఒక కాలువ నుండి మరొక కాలువ వద్దకు తిరుగుతున్నాడు. పొదలు,పుట్టలు గుట్టలువెదుకుతున్నాడు. చెట్లను అడుగుతున్నాడు. సీతకు ఇష్టమైనపూలమొక్కలను అడుగ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది తొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 59)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబది తొమ్మిదవ సర్గ అప్పటి వరకు సీత ఆశ్రమంతో ఉంటుంది అనే ఆశతో వడివడిగా ఆశ్రమానికి వచ్చారు రామలక్ష్మణులు. కాని సీత ఆశ్రమంలో లేదు అని తెలిసిన తరువాత సీతను రాక్షసులు అపహరించడం కానీ, చంపడం కానీ చేసి ఉంటారని రూఢి చేసుకున్నాడు రాముడు. ఇప్పుడు లక్ష్మణుని చూచి సూటిగా ఒక ప్రశ్న వేసాడు. “లక్ష్మణా! నేను నీ మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో, సీతను నట్టడివిలో వదిలి వచ్చాను కదా! మరి నా 'ఆజ్ఞలేకుండా నీవు ఆమెను ఎందుకు వదిలివచ్చావు? ఇది నీకు భావ్యమా!" అని సూటిగా ప్రశ్నించాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో జరిగింది జరిగినట్టు పూసగుచ్చినట్టు వివరించాడు. “రామా! నేను స్వయంగా సీతను విడిచి రాలేదు. నేను నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేదు. నీ మాట శిరసావహించి సీతను కాపాడుతున్నాను. కానీ సీత హా సీతా హా లక్ష్మణా అన్న నీ అరుపులు విని నన్ను నీ వద్దకు పొమ్మని, నిన్ను రక్షించమనీ ప్రేరేపించింది. ఆమె బలవంతంతోనే నేను ఆమెను విడిచి నీ వద్దకు వచ్చాను. నీవు అరిచినట్టు అరుపులు వినపడగానే, సీత తల్లడిల్లిపోయింది. నన్ను చూచి "లక్ష్మణా! మీ అన్న ఆపదలో ఉన్నాడు. వెళ్లు. ఆయనను రక్షించు." ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఎనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 58)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబది ఎనిమిదవ సర్గ అప్పటిదాకా రాముడు లక్ష్మణుడిని ఏం జరిగింది అని అడగలేదు. తాను ఏం చేసిందిచెప్పాడు. ఇప్పుడు అడగడం మొదలెట్టాడు. “లక్ష్మణా! నేను నిన్నుసీతకు రక్షణగా ఉంచాను కదా! నా సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు? నా సీత ఇప్పుడు ఎక్కడ ఉంది.? పర్ణశాలలో క్షేమంగా ఉందా! ఉందని నీవు చెప్పగలవా? నేను అరణ్యాలకు వస్తున్నా కష్టనష్టాలకు ఓర్చి నన్ను అనుసరించిన సీత ఇప్పుడు ఎక్కడ ఉంది? సీత లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించలేను కదా! మరి నా సీత ఎక్కడుందో చెప్పవా? లక్ష్మణా! నాకు సీత తోడిదే లోకం. సీత లేకుండా నేను స్వర్గాధిపత్యము కూడా అంగీకరించను. అటువంటి నా సీతను ఏమి చేసావు? సీత జీవించి ఉంటుందంటావా! నా సీత మరణిస్తే, ఆమె దు:ఖంతో నేను మరణిస్తే, మమ్ములను అడవులకు పంపిన కైక ఆనందిస్తుందేమో కదా! అప్పుడు నాతల్లి కౌసల్య, కైకకు ఊడిగం చేస్తుందేమోకదా! లక్ష్మణా! నిజంచెప్పు. సీత జీవించి ఉంది అంటేనే నేను ఆశ్రమానికి వస్తాను. లేకపోతే ఇక్కడే ప్రాణ త్యాగం చేస్తాను. నేను ఆశ్రమం చేరగానే సీత ఎదురొచ్చి చిరునవ్వుతో నన్ను పలకరించక పోతే నేను బతికి ఉండీ వృధా!  లక్ష్మణా! సీత ఇంకా జీవించి ఉందంటావా! లేక...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఏడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 57)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబది ఏడవ సర్గ లంకలో సీత పరిస్థితి ఇలాఉంటే, అక్కడ అరణ్యములో మారీచుని చంపిన రాముడు, వెనక్కు తిరిగి పర్ణశాలకు వస్తున్నాడు. అప్పుడు రామునికి నక్కకూత వికృతంగా వినిపించింది. అపశకున సూచకమైన ఆ నక్కకూత విని రాముడు మనసులో కీడు శంకించాడు. సీతకు లక్ష్మణునికి ఏదైనా ఆపద కలిగిందేమో అని భయపడ్డాడు. అప్పుడు మారీచుడు తన గొంతును అనుకరిస్తూ సీతా లక్ష్మణా అని అరిచిన అరుపులు గుర్తుకు వచ్చాయి రామునికి. “అయ్యో! ఆ అరుపులు నావి అనుకొని, నాకేమైనా ఆపద కలిగిందని శంకించి, సీత లక్ష్మణుని నా రక్షణ కొరకు పంపలేదు కదా! ఆ సమయంలో రాక్షసులు సీతకు ఏమైనా అపాయము తలపెట్టారో ఏమో! అవును ఇప్పుడు అంతా అర్థం అయింది. ఇది రాక్షసుల మాయోపాయమే. మారీచుడు మాయలేడి రూపం ధరించి నన్ను ఆశ్రమానికి దూరంగా తీసుకొని వెళ్లాడు. నేను మారీచుని కొట్టినపుడు హా సీతా! హా లక్ష్మణా! అని అరిచాడు. సీత తప్పకుండా లక్ష్మణుని నా రక్షణ కోసం పంపి ఉంటుంది. నేను, లక్ష్మణుడు, దగ్గర లేని సమయంలో సీత క్షేమంగా ఉంటుందా! అసలే ఈ జనస్థానములో ఉన్న రాక్షసులతో నాకు విరోధము ఉంది. ఆ విరోధమును మనసులో పెట్టుకొని రాక్షసులు సీతకు ఏమైనా అపాయం తలపెట్టారో ఏమో! ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 56)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబది ఆరవ సర్గ తన ముందు అలా ప్రాధేయపడుతున్న రావణుని చూచింది సీత. పక్కన పడి ఉన్న ఒక గడ్డిపరకను తీసి తనకూ రావణుని మధ్య పడవేసింది. రావణునితో ఇలాఅంది. “ఓ రావణా! ధర్మానికి ప్రతిరూపము, సత్యసంధతకు నిలయము అయిన దశరథుని కుమారుడు రాముడు, ఆజాను బాహుడు, అరవిందదళాయతాక్షుడు అయిన ఆ రాముడు, నా భర్త. నా భర్తే నాకు దైవము. రాముని సోదరుడు లక్ష్మణుడు. వీరిద్దరూ కలిసి నీ ప్రాణములు బలి తీసుకుంటారు. అది తథ్యము. నీవు రాముని ఎదుట నా మీద చేయివేసినట్టయితే, నీసోదరుడు ఖర, దూషణులకుపట్టిన గతే నీకూపట్టి ఉండేది. ఇందాకటినుండి, నీవు నీ రాక్షస వీరుల గురించి ఏవేవో గొప్పలు చెప్పావు. కానీ అటువంటి రాక్షసులు 14,000 మందిని నా రాముడు ఒంటిచేత్తో మట్టికరిపించాడు. అది మరిచిపోయావా! నా రాముని ధనుస్సునుండి వచ్చిన ఒక్కొక్క బాణము నీ ఒక్కొక్క ప్రాణము తీస్తుంటే అప్పుడు తెలుస్తుంది నా రాముని ప్రతాపం ఏమిటో! నీవు దేవతలు, దానవులు, అసురులు, గంధర్వులు మొదలగు దేవాసుర గణములతో చావక పోవచ్చు. కాని మానవమాత్రుడైన నా రాముని చేతిలో నీకు చావు తప్పదు. యజ్ఞములో ఊపస్తంభమునకు కట్టిన పశువులాగా నువ్వు గిలా గిలా కొట్టుకుంటున్నావు. నీ చ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబది ఐదవ సర్గ ఆ ప్రకారంగా ఎనిమిది మంది రాక్షసులను జనస్థానమునకు పంపిన తరువాత రావణుడు, ఇంక రాముని వలన ఇబ్బంది లేదనుకున్నాడు. సీత గురించి ఆలోచంచడం మొదలెట్టాడు. సీతను తలచుకుంటేనే రావణుడికి మదనతాపం ఎక్కువ కాసాగింది. ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అని తొందర తొందరగా అంత:పురమునకు వెళ్లాడు. రాక్షస స్త్రీల మధ్య మూర్తీభవించిన శోకదేవత మాదిరి ఉన్న సీతను చూచాడు రావణుడు. సీత కళ్లనుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమెతలవంచి కూర్చుని ఉంది. రావణుడు సీత దగ్గరకు వెళ్లాడు ఆమెను చెయ్యిపట్టుకొని లేవనెత్తాడు. బలవంతంగా ఆమెను తనతో తీసుకువెళ్లాడు. సీతకు తన అంత:పురము అంతా చూపించాడు. రావణుని అంత:పురము అనేక మేడలతోనూ, ప్రాసాదములతోనూ నిండి ఉంది. అక్కడ వేలకొలది దాసదాసీ జనములు నివసిస్తున్నారు. రావణుని అంతఃపురము అంతా రత్నములతోనూ మణి మాణిక్యాదులతోనూ తులతూగుతూ ఉంది. ప్రాసాదములకు అమర్చిన స్తంభములు అన్నీ బంగారు, వెండితో నిర్మింపబడి ఉన్నాయి. ముఖ ద్వారముల వద్ద దుందుభుల ధ్వనులు శ్రావ్యంగా వినబడుతున్నాయి. రావణుడు సీతను తీసుకొని సోపానములు అన్నీ ఎక్కాడు. ప్రాసాదములు అన్నీ చూపించాడు. తన అంతఃపురము బయట ఉ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 54)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబది నాలుగవ సర్గ రావణాసురుడు సీతను తీసుకొని ఆకాశమార్గాన పోతుంటే ఎవరైనా తనను చూస్తారా రక్షిస్తారా అనే ఆశతో సీత కిందికి చూస్తూ ఉంది. అంతలో ఒక కొండశిఖరం మీద కొంత మంది వానరులు కూర్చుని ఉండటం గమనించింది సీత. సీతకు ఒక ఆలోచన వచ్చింది. రావణుడు వెళుతున్న వేగానికి ఎగురుతున్న తన వల్లెవాటును పట్టుకుంది. తన ఆభరణాలు ఆ వల్లెవాటు వస్త్రములో మూటగా కట్టింది. సరిగ్గా రావణుడు ఆ పర్వతము మీద ఎగురుతున్నప్పుడు. ఆ ఆభరణాల మూటను ఆ వానరుల మధ్య పడేటట్టు జారవిడిచింది. రావణుడు ముందుకు చూస్తూ ఎగురుతూ ఉండటంతో సీత చేసిన పనిని గుర్తించలేదు. తమ మీద దబ్బున పడ్డ మూటను చూచారు ఆ వానరులు. వెంటనే తలలు పైకెత్తి చూచారు. వారికి ఆకాశంలో ఎగురుతున్న రావణుడు, రావణుని సందిట్లో బందీ అయిన సీత కనిపించారు. వారు రావణుడు వెళ్లిన వేపు చూస్తున్నారు. రావణుడు సీతను తీసుకొని పంపానదిని దాటి దక్షిణదిక్కుగా వెళ్లాడు. రావణుడు అడవులు, పర్వతములు, నదులు, సరస్సులు దాటుకుంటూ లంకా నగరం వైపు వేగంగా ఎగురుతున్నాడు. తుదకు సముద్రం వద్దకు వచ్చాడు. వేగంగా సముద్రాన్ని దాటాడు. సీతను సందిట్లో ఇరికించుకున్న రావణుడు లంకానగరంలో ప్రవేశించాడు...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 53)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబది మూడవ సర్గ రావణుడు ఆకాశమార్గాన ఎగురుతున్నాడు. సీత వాడి చేతిలో పిట్ట మాదిరి నలిగిపోతూ ఉంది. రావణుని చూచి సీత ఇలా అంది. “ఓరి రావణా! నీచుడా!నాభర్త ఇంటలేని సమయంలో, కుక్క మాదిరి ఇంట్లోకి దూరి, దొంగమాదిరి నన్ను అపహరించుకొని పోతున్నావే. నీకు సిగ్గులేదట్రా! నీదీ ఒక పరాక్రమమేనా! దమ్ముంటే, ధైర్యం ఉంటే నా భర్త ఉన్నప్పుడు నా వంక కన్నెత్తిచూడు. నా భర్త నిన్ను భస్మం చేస్తాడు. ఒక ఆడదాన్ని అపహరించడానికి ఇంత పన్నాగమా! ఒక లేడిని పంపి, నా భర్తను దూరంగా పంపి నన్ను అపహరిస్తావా! నీదీ ఒక మగతనమేనా నీచుడా! నా మామగారి చిరకాల మిత్రుడు అయిన జటాయువు నన్ను రక్షించడానికి వస్తే ఆయనను కూడా చంపుతావా! నీ దుర్మార్గానికి హద్దులేదా! నీ పేరు గొప్ప గా చెప్పుకుంటున్నావు. ఇదా నీ పరాక్రమము. పక్షిని చంపడమా నీ వీరత్వము. ఎటువంటి దుర్మార్గుడైనా ఒంటరిగా ఉన్న స్త్రీని కన్నెత్తి కూడా చూడడే. అటువంటిది నువ్వు ఎంతటి నీచుడివి అయితే నన్ను అపహరించుకు పోతావు! ఇంతటి నీచమైన పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా! ఇటువంటి సిగ్గుమాలిని పని చేసినందుకు, నీ ప్రజలే నిన్ను నిందిస్తారని నీకు తెలియదా! నీవు పుట్టిన వంశము ఎట్టిద...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది రెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 52)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబది రెండవ సర్గ “అయ్యో! నన్ను కాపాడటానికి వచ్చిన జటాయువు కూడా ఈ దుర్మార్గుడి దౌష్ట్యానికి బలి అయ్యాడే. ఈ పాపాత్ముడు ఈ జటాయువును పక్షి అని కూడా చూడకుండా చంపాడు.  “ఓ రామా! ఓ లక్ష్మణా! ఎక్కడున్నారు. రండి. నన్ను రక్షించండి" అని ఎలుగెత్తి అరిచింది. అది చూచిన రావణుడు సీత దగ్గరగా వెళ్లాడు. వికటాట్టహాసం చేసాడు. సీత జుట్టు పట్టుకున్నాడు. అది చూచి ప్రకృతి రోదించింది. వృక్షములు తలలు వంచాయి. గాలి వీచడం మానింది. సీత రామా రామా అంటూ అరుస్తూనే ఉంది. రావణుడు సీతను జుట్టుపట్టుకొని లేవదీసి,తన సందిట ఇరికించుకొని ఆకాశంలో కి ఎగిరాడు. సీతను తీసుకొని ఆకాశమార్గంలో పోతున్నాడు. ఆ సమయంలో తనను ఎవరన్నా రక్షిస్తారా అని సీత కిందకు చూస్తూ ఉంది. సీత కట్టుకున్న వస్త్రములు గాలికి ఎగురుతూ ఉన్యాయి. సీత పెట్టుకున్న ఆభరణములు చెల్లాచెదురుగా నేల మీద రాలి పడుతున్నాయి. సీత కళ్ల నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమె జుట్టు ముడి వీడిపోయింది. సీత నోటి నుండి రామా రామా అనే మాట తప్ప మరోమాట రావడం లేదు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబదిరెండవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ శ్రీమద్రామాయణం ...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఒకటవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 51)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబది ఒకటవ సర్గ జటాయువు పలికిన పలుకులను చాలా తేలిగ్గా తీసుకున్నాడు రావణుడు. రావణుని దృష్టిలో జటాయువు ఒక సామాన్య పక్షి. అందువల్ల జటాయువు మాటలను లెక్క చేయలేదు. జటాయువు మాటలకు బదులు కూడా పలకలేదు. కానీ ఒక పక్షి తనను అంతలేసి మాటలు అంటుదా. తనకే నీతులు చెబుతుందా అని కోపం ముంచుకొచ్చింది. ఒక్క ఉదుటున జటాయువు మీదికి ఎగిరాడు. రావణునికి జటాయువుకు ఘోరయుద్ధం జరిగింది. రెండు పర్వతములు ఢీకొన్నట్టు ఉంది. రావణుడు జటాయువు మీద నారాచముల వర్షం కురిపించాడు. జటాయువు ఆ బాణములను తనరెక్కలతో చెల్లాచెదరు చేసింది. వాడి అయిన తన గోళ్లతో ముక్కుతో రావణుని మొహం, శరీరం అంతా రక్కింది. రావణుడు పదిబాణములను జటాయువు మీద ప్రయోగించాడు. జటాయువుకు రావణుని రథంలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ సీత కనపడింది. ఆమె బాధ చూచి జటాయువు రావణుడు ప్రయోగించిన బాణములను లెక్కచేయలేదు. రావణుని ధనుస్సును అతని చేతిలోనుండి ఎగురగొట్టాడు. బాణములను విరిచాడు. రావణుడికి కోపం ముంచుకొచ్చింది. మరొక ధనుస్సు తీసుకున్నాడు. వేలకొలది బాణములను జటాయువు మీద ప్రయోగించాడు. రావణుడు వదిలిన బాణములు జటాయువును కప్పివేసాయి. జటాయువు ఆకాశంలో ఎగురుతూ ఆబా...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబదియవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 50)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము ఏబదియవ సర్గ రావణుడు సీతను అపహరించుకొని వెళ్లే సమయంలో జటాయువు ఒక వట వృక్షము మీద నిద్రపోతున్నాడు. సీత అరుపులు, రావణుని హుంకారములు విని జటాయువు నిద్రలేచాడు. జటాయువుకు ఏం జరుగుతుందో అర్థం అయింది. వెంటనే ఎగురుతూ పోయి రావణుని రథం మీద వాలాడు. రావణుడు తన రథం ఆపాడు. అప్పుడు జటాయువు రావణునితో ఇలా అన్నాడు. “రావణా! నేను నిత్యసత్యవ్రతుడను. నా పేరుజటాయువు. నేను గరుడ వంశజుడను. మహా బలిశాలిని. రాముడు అయోధ్యాధి పతి దశరథుని కుమారుడు, ముల్లోకములచేత పూజింపబడేవాడు. ఈమె రాముని భార్య పేరు సీత. నీవు ధర్మమార్గంలో పయనించే మహారాజువు. అటువంటి నీవు ఇతరుల భార్యలను అపహరించ వచ్చునా! ముఖ్యముగా సాటి రాజుల భార్యలను గౌరవించాలి. ఆపదలలో ఉంటే రక్షించాలి కానీ, నీ లాగా అపహరించకూడదు. అదే లోక ధర్మము. కాబట్టి ఇతరుల భార్యల మీద ఉన్న నీ కోరికను మానుకో. ఇది నీ వంటి ధర్మాత్ములు చేయదగ్గపనికాదు. నీ భార్యను ఇతరులు అపహరిస్తుంటే నువ్వు ఎలా రక్షించుకుంటావో, అలాగే ఇతరుల భార్యలను ఎవరైనా అపహరిస్తుంటే నువ్వు రక్షించాలి. కానీ, నువ్వే ఇతరుల భార్యలను అపహరించడం తప్పు కదా! అలాంటి తప్పు చేయకు. ఇతరులు నిన్ను నిందించే పన...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది తొమ్మిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 49)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము నలుబది తొమ్మిదవ సర్గ సీత మాట్లాడే మాటలు వింటుంటే రావణుకి కోపం నసాళానికి అంటింది. అసహనంతో, కోపంతో గంతులేసాడు. రెండు చేతులు గట్టిగా చరిచాడు. పెద్దగా గాండ్రించాడు. “ఓ సీతా! నీకేమైనా పిచ్చా! నా మాటలు అర్థం కావడం లేదా! నా గురించి, నా ఐశ్వర్యము గురించి, నా పరాక్రమము గురించి, నా వైభవము గురించీ ఎంత చెప్పినా నీ చెవికి ఎక్కడం లేదు. నా గురించి నీకు బాగా తెలియదు. నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని బంతిలా పైకి ఎత్తి ఆడుకుంటాను. సముద్రాలన్నీ కలిపి తాగేస్తాను. నా ఎదుట నిలిస్తే మృత్యువును కూడా చంపేస్తాను. సూర్యగమనాన్ని అడ్డుకుంటాను. భూమిని బద్దలు కొడతాను. నా ఇష్టం వచ్చిన రూపం ధరించగలను. ఇప్పుడు నేను ఉన్నది సన్యాసి రూపంలో. నా అసలు రూపం చూడు.” అంటూ రావణుడు తన సన్యాసి రూపం వదిలి పెట్టి తన అసలు రూపం సీత ముందు ప్రదర్శించాడు. పదితలలతో, ఎర్రటి కళ్లతో, ఒంటినిండా బంగారు ఆభరణములతో, నల్లని మేని ఛాయతో, ధనుర్బాణములను ధరించిన రావణుడు సీత ముందు నిలిచాడు. “ఓ సీతా! చూచావా నా నిజస్వరూపము. ముల్లోకములను శాసించే భర్త కావాలనుకుంటే నన్ను వరించు. నీ లాంటి అతిలోక సౌందర్యవతికి నేను తగిన భర్తను. నేను నీ మా...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది ఎనిమిదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 48)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము నలుబది ఎనిమిదవ సర్గ “ఓ సీతా! నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను దశకంఠుడను. నేను కుబేరునికి తమ్ముడిని. నా పేరు రావణుడు. మృత్యువుకు భయపడి మానవులు ఎలా పారిపోతారో అలాగా నన్ను చూచి దేవతలు, గంధర్వులు, దానవులు భయంతో పారిపోతారు. నేను నా సోదరుడు కుబేరునితో యుద్ధమే చేసి జయించాను. నాకు భయపడి కుబేరుడు సకల భోగములతో తులతూగుతున్న తన నగరమును విడిచి కైలాసంలో తలదాచు కొన్నాడు. నేను కుబేరుని జయించి అతని పుష్పక విమానమును అపహరించాను. దాని మీద నేను ఆకాశంలో విహరిస్తుంటాను. నాకు కోపం వచ్చింది అని తెలిసిన మరుక్షణం దేవతలు దేవేంద్రునితో సహా పారిపోతారు. నేను ఉన్నచోట వాయువు నెమ్మదిగా వీస్తాడు. సూర్యుడు తన కిరణముల తీవ్రతను తగ్గించుకుంటాడు. నేను ఉన్నచోట చెట్టుకూడా తమ ఆకులను కదల్చలేవు. నదులు ప్రవహించ లేవు. నేను ఈ ప్రకృతినంతా శాసిస్తాను. సముద్రము మధ్యలో ఉన్న నా లంకానగరము సకల భోగములలో దేవేంద్రుని అమరావతిని తలదన్నుతుంది. లంకా నగరం బంగారు ప్రాకారాలు, బంగారు మేడలు మణితోరణాలతో నిండి ఉంటుంది. నా లంకా నగరము ప్రశస్తమైన ఏనుగులు, గుర్రములతో నిండి ఉంటుంది. ఎల్లప్పుడూ మంగళ వాద్యములు మ్రోగుతూ ఉంటాయి....

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది ఏడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 47)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము నలుబది ఏడవ సర్గ సన్యాసివేషములో ఉన్న రావణుడు తన గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే, సీత మనసులో ఇలా అనుకుంది. "ఇతడు సన్యాసి. బ్రాహ్మణుడు. పైగా అతిథి. ఈయన అడిగిన వివరాలు చెప్పకపోతే శపిస్తాడేమో. ఉన్నవి ఉన్నట్టు చెబితే తప్పేమిటి" అని మనసులో అనుకొంది. అప్పుడురావణుని చూచి ఇలా అంది. " ఓ బ్రాహ్మణోత్తమా! నేను మిథిలా నగరానికి రాజు జనకుని కుమార్తెను. అయోధ్యా నగరాధి పతి దశరథుని కోడలను. రాముని భార్యను. నా పేరు సీత. నేను చిన్నతనమునుండి రాజభోగములు అనుభవించాను. నా వివాహము అయిన తరువాత కూడా 12 సంవత్సరములు నా అత్తవారి ఇంట రాజభోగములు అనుభవించాను. నా భర్త రామునికి పట్టాభిషేక సమయములో మా మామగారి మూడవ భార్య కైక ఆయనను రెండు వరములు కోరింది. ఒకటి రాముని అరణ్యవాసము. రెండవది తన కుమారుడు భరతుని పట్టాభిషేకము. అప్పుడు నా భర్తకు 25 సంవత్సరాలు. నా భర్త పట్టాభిషేకము ఆగిపోయింది. తండ్రి మాట ప్రకారము నా భర్త 14 ఏళ్లు అరణ్యవాసము చేస్తున్నాడు. ఆయన సహధర్మచారిణిగా నేను కూడా ఆయనతో పాటు అరణ్యవాసము చేస్తున్నాను. ఆయన సవతి తల్లి కుమారుడు లక్ష్మణుడు కూడా మాతో అరణ్యములకు వచ్చాడు. ఆ ప్రకారంగా మే...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది ఆరవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 46)

శ్రీమద్రామాయణము అరణ్య కాండము నలుబది ఆరవ సర్గ సీత మాట్లాడిన పరుషమైన వాక్యములకు బాధపడి లక్ష్మణుడు రాముని వెతుకుతూ వెళ్లిన వెంటనే ఈ అవకాశము కొరకు వేచి ఉన్న రావణుడు తను దాగి ఉన్న పొదలమాటు నుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో రావణాసురుడు ఒక సన్యాసి వేషంలో ఉన్నాడు. కాషాయ బట్టలు ధరించాడు. చేతిలో దండము, కమండలము పట్టుకున్నాడు. జటాజూటములు కట్టుకున్నాడు. ఒక గొడుగు పట్టుకున్నాడు. కాళ్లకు పాదుకలు ధరించాడు. కపట సన్యాసి వేషంలో ఉన్న రావణుడు సీత ఉన్న చోటికి వచ్చాడు. రావణుని రాకతో అక్కడి ప్రకృతి కూడా వణికిపోయింది. గాలి ఆడటం మానేసింది. పక్కనే ప్రవహిస్తున్న గోదావరి నది కూడా మెల్లగా శబ్దం చెయ్యకుండా ప్రవహించసాగింది. రావణుడు సీత దగ్గరగా వచ్చాడు. ఆ సమయంలో సీత రామునికి ఏమి ఆపద సంభవించిందో అని బాధపడుతూ దు:ఖిస్తూ కూర్చుని ఉంది. సీతను చూడగానే రావణుడికి మన్మధుని బాధ ఎక్కువ అయింది. సీతను చూచి రావణుడు ఇలా అన్నాడు. “ఓ తరుణీ! నీవు ఎవరవు? అన్నిశుభలక్షణములు కల నీవు ఎవరు? నీవు ఆ శివుని అర్ధాంగి పార్వతివా? లేక కీర్తికి అధిష్టాన దేవతవా! లేక కాంతి దేవతవా! లేక లక్ష్మివా! దేవ కాంతవా! అప్సరసవా! లేక మన్మధుని మనోహారిణి రతీదేవివా! ఓ లల...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 45)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము నలుబది ఐదవ సర్గ మారీచుడు గొంతు మార్చి రాముని గొంతుతో “హా సీతా! హా లక్షణా!" అంటూ అరిచిన అరుపులు ఆశ్రమంలో ఉన్న సీతకు, బయట నిలబడి ఉన్న లక్ష్మణునికి వినపడ్డాయి. లక్షణుడు ఆ అరుపులను పట్టించుకోలేదు. 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో మట్టుబెట్టిన రాముడు, కేవలం ఒక రాక్షసునికి బెదిరి అలా అరుస్తాడా! అసంభవం. ఇదేదో రాక్షస మాయ. ఆ మాయలకు లోబడరాదు"అని నిర్ణయించుకున్నాడు. కాని సీతలో స్త్రీ సహజమైన భయము ఆందోళనా మొదలయ్యాయి. వెంటనే లక్ష్మణుని పిలిచింది. “లక్ష్మణా! విన్నావుగా మీ అన్నగారు అరిచిన అరుపులు. మీ అన్నగారు ఏదో భయంకరమైన ఆపదలో ఉన్నట్టు ఉన్నారు. లేకపోతే అలా కేకలుపెట్టరు. నువ్వు సత్వరమే వెళ్లి మీ అన్నగారిని రక్షించు."అని తొందర పెట్టింది. సీత మాటలకు లక్ష్మణుడు చలించలేదు. మరలా సీత లక్ష్మణుని తొందర పెట్టింది. "లక్ష్మణా! నా మనసు అంతా ఆందోళనగా ఉంది. నా ప్రాణములు నిలవడం లేదు. తొందరగా వెళ్లు. ఏమయిందో తెలుసుకో. రాముని రక్షించు. రాముడు ఏ రాక్షసుల వాత పడ్డాడో. లేక పోతే అలా అరవడు. తొందరగా వెళ్లవయ్యా!! అని తొందర పెట్టింది సీత. అయినా లక్ష్మణుడు కదలలేదు. చుట్టు ఏమైనా...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది నాలుగవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 44)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము నలుబది నాలుగవ సర్గ ఈ విధంగా రాముడు లక్ష్మణునికి ఆ లేడిని చంపాలి అన్న తన నిర్ణయాన్ని, సీత గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు. ఒక కత్తిని తన నడుముకు కట్టుకున్నాడు. ధనర్బాణములను తీసుకున్నాడు. వీపుకు రెండు అమ్ములపొదులను కట్టుకున్నాడు. ఇదంతా క్రీగంటితో చూస్తున్నాడు మారీచుడు. ఇంక రాముడు తనను వేటాడటానికి వస్తున్నాడని గ్రహించి ముందుకు దూకాడు. చెంగు చెంగున గెంతుతూ దూరంగా పారిపోయాడు. అది చూచి రాముడు ఆ మృగము వెంట పరుగెత్తాడు. మారీచుడు రామునికి చిక్కినట్టే చిక్కి మరలా దూరంగా పరుగెత్తుతున్నాడు. రాముడు తన బాణములతో దానిని కొడుతున్నాడు. ఆ బాణములను చిత్రవిచిత్రంగా తిరుగుతూ తప్పించుకుంటూ పరుగెడుతున్నాడు మారీచుడు. మెరుపు తీగవలె ఒక క్షణం కనపడుతూ మరొక క్షణం మాయమౌతూ పారిపోతున్నాడు మారీచుడు. రామునికి పట్టుదల పెరిగింది. ఆ మృగాన్ని వెంబడిస్తున్నాడు. ఆ ప్రకారంగా మారీచుడు రాముని పర్ణశాలకు దూరంగా తీసుకొని వెళ్లాడు. రామునికి విపరీతంగా కోపం వచ్చింది. ఒక చిన్న జింకపిల్ల తనకు చిక్కకుండా పారిపోయిందని ఉక్రోషంతో ఊగిపోతున్నాడు. అప్పటికే రాముడు అలిసిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మార...

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - నలుబది మూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 43)

శ్రీమద్రామాయణము అరణ్యకాండము నలుబది మూడవ సర్గ ఆశ్రమము వెలుపల పూలను కోసుకుంటున్న సీతకు ఆ మాయామృగము కనపడింది. సీతకు సంతోషము, ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి. "ఆర్యపుత్రా! లక్ష్మణా! రండి! త్వరగా రండి. ఇక్కడకు రండి. ఇటు చూడండి. ఈ లేడిని చూడండి. అబ్బా! ఎంత బాగుందో! ఎంత ముచ్చటగా ఉందో!" అని అరిచినట్టు పిలిచింది. రాముడు, లక్ష్మణుడు గబగబా అక్కడకు వచ్చారు. సీత వారికి ఆ లేడిని చూపించింది. సీతతో పాటు రాముడు కూడా ఆ మృగమును చూచి ఆనందించాడు. కాని లక్ష్మణునికి ఆ మృగమును చూచి అనుమానం కలిగింది. “రామా! ఈ మృగము సామాన్య మృగము మాదిరి లేదు. ఎవరో రాక్షసుడు ఈ మృగవేషము ధరించినట్టు కనపడుతూ ఉంది. ఇదివరలో మారీచుడు కూడా ఇలాంటి మాయావేషములను ధరించి, వేటకు వచ్చిన రాజులను వంచించి, వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని చంపి తినేవాడని మనకు తెలుసు. ఆ మారీచుడు ఈ మృగముకాదు కదా! నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మనము ఎన్నో లేళ్లను చూచాము. కానీ ఇంతటి ప్రకాశవంతమైన, బంగారు వర్ణములో ఉన్న లేడిని చూడలేదు. ఇదేదో రాక్షస మాయగా ఉంది. అసలు ఇటువంటి లేడి భూలోకములో ఉంటుందా అని నా అనుమానము. రామా! సందేహము లేదు. ఆలోచించిన కొద్దీ నా అనుమానము బలపడుతూ ...