Posts

Showing posts from September, 2024

శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 47)

శ్రీమద్రామాయణము సుందర కాండము నలుబది ఏడవ సర్గ పట్టుదల, కోపము, అహంకారమూ మనసులో ప్రజ్వరిల్లితే మనిషి కానీ, రాక్షసుడు కానీ యుక్తాయుక్త వివేచన కోల్పోతాడు. రావణుని పరిస్థితి అలాగే ఉంది. వచ్చిన వానరుడు ఒక్కడు. చచ్చిన వాళ్లు వేలకు వేలు. కారణం ఏమిటి? ఆలోచించలేదు. జంబుమాలి చచ్చాడు. ఏడుగురు మంత్రి కుమారులు వధింపబడ్డారు. ఐదుగురు సేనాపతులు పరలోక గతులయ్యారు. కానీ రావణునికి బుద్ధిరాలేదు. అసలు విషయం కనుక్కోవాలనే ఆలోచన రాలేదు. ఐదుగురు సేనాపతులు మరణించారు అన్న వార్త విని తన ఎదురుగా కూర్చుని ఉన్న తన కుమారుడు అక్ష కుమారుని వంక చూచాడు రావణుడు. తండ్రి అభిప్రాయాన్ని అర్ధం చేసుకున్నాడు అక్ష కుమారుడు. పైకి లేచాడు. అపార సేనావాహినితో హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. అక్షకుమారుడు ఎక్కిన రథము అతడు ఎంతో తపస్సు చేసి సంపాదించినది. దానికి ఎనిమిది గుర్రములు కట్టి ఉన్నాయి. అది మనస్సు కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది. ఆ రథాన్ని దేవతలు, అసురులు, గంధర్వులు కూడా ఆప శక్యం కాదు. ఆ రథము భూమి మీద ఆకాశంలోనూ నిరాఘాటంగా ప్రయాణం చేస్తుంది. అటువంటి రథాన్ని ఎక్కాడు అక్షకుమారుడు. ధనుర్బాణములు ధరించాడు. ఖడ్గములు, తోమరములు, శక్తి అస...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 46)

శ్రీమద్రామాయణము సుందర కాండము నలుబది ఆరవ సర్గ తను పంపిన ఏడుగురు మంత్రి కుమారులు సైన్యంతో సహా హనుమంతుని చేతిలో మరణించారు అన్న వార్త విన్న రావణాసురునిలో మొట్ట మొదటి సారిగా భయం ప్రవేశించింది. “తాను ఓడిపోతున్నాడా! తాను ఓడిపోవడం మొదలయిందా! ఒక్క వానరాన్ని చంపడానికి ఇంతమంది బలికావాలా! ఏమిటీ విపరీత పరిణామం!" అని మనసులోనే మధనపడసాగాడు. కాని తన భయాన్ని బయటకు కనిపిపంచకుండా నిబ్బరంగా ఉన్నాడు. ఈ సారి ఐదుగురు సేనానాయకులను పిలిపించాడు. వారు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు, భాసకర్ణుడు. వారిని పిలిపించాడు రావణుడు. “ఓ సేనానాయకులారా! మీరందరూ మీకు కావలసిన సైన్యమును తీసుకొని వెళ్లండి. ఆ వానరాన్ని చంపండి. కాని మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు, చంపబడిన సైనికులు, వీరులను బట్టి చూస్తే అది సామాన్యమైన వానరము కాదు. ఏదో మహత్తర శక్తి కల భూతము అనిపిస్తూ ఉంది. మనకు బద్ధశత్రువు అయిన ఇంద్రుడు మనలను తుదముట్టించడానికి తన మహత్తర శక్తితో ఆ భూతాన్ని సృష్టించాడా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం అందరం దేవతలను, నాగులను, గంధర్వులను, యక్షులను ఓడించాము. వారిలో ఎవరో ఒకరు మ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 45)

శ్రీమద్రామాయణము సుందర కాండము నలుబది ఐదవ సర్గ రావణుని చేత ఆజ్ఞాపింపబడిన ఏడుగురు మంత్రుల కుమారులు అశ్వములు కట్టిన రథములను ఎక్కి హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరారు. వారు కూడా సామాన్యులు కారు. మహా బలశాలురు. వారంతా ధనుర్బాణములను ధరించి ఉన్నారు. వారి వెంట పెద్ద సైన్యము బయలుదేరింది. ఏడుగురు మంత్రుల కుమారులు ఉత్సాహంతో హనుమంతుని మీదికి యుద్ధానికి బయలు దేరారు. వారి తల్లి తండ్రులు, బంధువులు మాత్రము "జంబుమాలి వంటి మహావీరుడే హనుమంతుని ధాటికి తట్టుకోలేక మరణించాడు. వీళ్ల గతి ఏమవుతుందో" అని ఆందోళన చెందారు. కాని ఆ మంత్రి పుత్రులు మాత్రము హనుమంతుని నేను చంపుతాను అంటే నేను చంపుతాను అంటూ ఉరకలు వేస్తూ దూసుకు వెళుతున్నారు. ఏడుగురు మంత్రుల కుమారులు తమ తమ బాణపరంపరలతో హనుమంతుని కప్పివేసారు. ఆ బాణవర్షంలో తడిసిపోయాడు హనుమంతుడు. కాని ఒక్క బాణము కూడా తనకు తగల కుండా వేగంగా గిరా గిరా తిరుగుతూ తప్పించుకుంటున్నాడు. హనుమంతుడు. మంత్రి కుమారులు ప్రయోగించిన బాణములు అన్నీ వృధా అయ్యాయి. హనుమంతుడు అర్భకులైన మంత్రి కుమారులతో ఆడుకుంటున్నాడా అన్నట్టు ఉంది. తరువాత గట్టిగా అరిచాడు హనుమంతుడు. ఆ అరుపుకు రాక్షససేన కకావ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది నాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 44)

శ్రీమద్రామాయణము సుందర కాండము నలుబది నాలుగవ సర్గ ప్రహస్తుని కుమారుని పేరు జంబుమాలి. మహా పరాక్రమ వంతుడు. రావణుడు జంబుమాలిని సైన్యసమేతంగా, హనుమంతుని వధించి రమ్మని, పంపించాడు. జంబుమాలి పెద్ద శరీరంతో అతి వికృతంగా క్రూరంగా ఉంటాడు. అప్పటిదాకా జంబుమాలి అపజయము అనే మాట ఎరుగడు. జంబుమాలి ధనుస్సు, బాణములు ధరించి వచ్చాడు. జంబుమాలి చేసే ధనుష్టంకారానికి దిక్కులు మార్మోగు తున్నాయి. గాడిదలు కట్టిన రథం మీద జంబుమాలి అశోకవనము దగ్గర ఉన్న చైత్యప్రాసాదము వద్దకు వచ్చాడు. జంబు మాలిని చూచి హనుమంతుడు సంతోషంతో కిచా కిచా నవ్వాడు. జంబుమాలి ముఖద్వారము పైన కూర్చుని ఉన్న హనుమంతుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. అర్థచంద్రబాణముతో హనుమంతుని ముఖము మీద, కర్ణిబాణముతో హనుమంతుని శిరస్సును, పది నారాచబాణములతో హనుమంతుని బాహువుల మీద కొట్టాడు. హనుమంతుని నుదుటి మీద బాణం తగిలి రక్తం బయటకు చిమ్మింది. హనుమంతుడికి కోపం వచ్చింది. పక్కకు చూచాడు. పక్కన ఒక పెద్ద రాతి బండ కనపడింది. హనుమంతుడు కిందికి దుమికి ఆ రాతి బండను ఎత్తి జంబుమాలి మీదికి విసిరాడు. జంబుమాలి పది బాణములతో ఆ రాతి బండను ముక్కలు చేసాడు. ఇంక లాభం లేదు అనుకొని అశోకవనంలో ఉన్...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది మూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 43)

శ్రీమద్రామాయణము సుందర కాండము నలుబది మూడవ సర్గ రాక్షస సైనికులను చంపిన తరువాత ఇంకా ఎవరు వస్తారా అని తోరణస్తంభము మీద ఎక్కి కూర్చుని ఎదురు చూస్తున్నాడు హనుమంతుడు. ఎదురుగుండా అశోక వనములో ఉన్న చైత్యప్రాసాదము కనపడింది. అప్పుడు హనుమంతునికి ఒక ఆలోచన వచ్చింది. “అశోకవనము అంతా ధ్వంసము చేసాను. ఈ చైత్యప్రాసాదమును మాత్రము ఎందుకు వదిలిపెట్టాలి.. దీనిని కూడా ధ్వంసం చేస్తే ఓ పనైపోతుంది" అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పైకి లేచాడు. చైత్యప్రాసాదము మీదికి లంఘించాడు. ఆ చైత్యప్రాసాదము మీద ఎక్కి కూర్చున్నాడు. తరువాత తన శరీరమును పెంచాడు. లంకా పట్టణం అంతా అదిరిపోయేట్టు తన జబ్బలు చరుచుకున్నాడు. సింహనాదం చేసాడు. ఆ శబ్దానికి తట్టుకోలేక చైత్యప్రాసాదమును రక్షించుచున్న రక్షకభటులు మూర్ఛపోయారు. మరి కొంత మంది సైనికులు వివిధములైన ఆయుధములను పట్టుకొని అక్కడకు వచ్చారు. చైత్యప్రాసాదము మీద ఉన్న హనుమంతుని చూచారు. హనుమంతుడు కిందికి దుమికాడు. వెంటనే ఆ సైనికులు హనుమంతుని చుట్టుముట్టారు. హనుమంతుడు ఆ చైత్యప్రాసాదము స్తంభమును ఒకదానిని పెకలించి, గిరా గిరా తిప్పి ఆ సైనికుల మీదికి విసిరాడు. హనుమంతుడు ఆ స్తంభమును గిరా గిరా తిప్పుతుం...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది రెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 42)

శ్రీమద్రామాయణము సుందర కాండము నలుబది రెండవ సర్గ పక్షులు, జంతువులు భయంతో అరిచే అరుపులు, చెట్లు పెళ పెళా విరిగిన శబ్దాలు, వినిన రాక్షసులు భయంతో వణికిపోయారు. పైగా రాక్షసులకు దుశ్శకునములు విపరీతంగా కనపడసాగాయి. వారంత నలుదిక్కులకు పోయి చూచారు. విరిగిన చెట్లు, పాడైపోయిన వనము, గట్లు తెగిన సరోవరములు, స్తంభము మీద కూర్చున్న హనుమంతుని చూచారు. వారిని చూచిన హనుమంతుడు తన ఆకారమును పెంచి వారిని భయపెట్టాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత వద్దకు వెళ్లారు. “వాడు ఎవరు? ఎవరి కోసం వచ్చాడు? నీ కోసం వచ్చాడా? వాడు నీకు తెలుసా? వాడు నీతో ఏమి మాట్లాడాడు? అసలు వాడు ఇక్కడు ఎందుకు వచ్చాడు? వాడికి నీకు ఏమి సంబంధం? చెప్పు.” అని గద్దించి అడిగారు. మరి కొంత మంది రాక్షసస్త్రీలు సీతను చూచి "సీతా! నువ్వు ఏమీ భయపడవద్దు. వాడు ఎవరో మాకు చెప్పు? వాడు నీతో ఏమేమి మాట్లాడాడు. చెప్పు." అనునయంగా అడిగారు. అప్పుడు సీత వారితో ఇలా అంది. “ఆ వానరాన్ని చూడండి ఎంత భయంకరంగా ఉందో. అది మాయా రూపము ధరించిన రాక్షసుడు కాబోలు. అటువంటి రాక్షసుల గురించి తెలుసుకొనే పరిజ్ఞానం నాకు ఎక్కడుంది. వాడిని చూస్తేనే భయంగా ఉంది. అయినా అటువంటి రాక్షసుల గుర...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది ఒకటవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 41)

శ్రీమద్రామాయణము సుందర కాండము నలుబది ఒకటవ సర్గ హనుమంతుడు సీత వద్ద నుండి బయలు దేరి కొంత దూరము వెళ్లాడు. అక్కడ నిలబడి ఆలోచించాడు. "లంకకు వచ్చాను, సీతను చూచాను. వచ్చిన పని అయిపోయింది. ఇంకా ఏదో మిగిలిపోయింది అని అనుమానంగా ఉంది. ఊరికే పోవడం ఏం బాగుంటుంది. నా పరాక్రమం కూడా కొంచెం ప్రదర్శిస్తే బాగుంటుంది కదా! ఈ రాక్షసుల విషయంలో సామ, దాన, భేదో పాయములు పనికిరావు. దండోపాయమే యుక్తము. కాబట్టి ప్రస్తుతము నా పరాక్రమమును వీళ్లకు రుచి చూపించడమే మంచిది. ఒక పని చెయ్యాలంటే ఒకే ఉపాయము పనికిరాదు. అనేక ఉపాయములను ఆలోచించాలి. తొందరలో రాక్షసులతో యుద్ధము జరుగబోతోంది. అలాంటప్పుడు, రాక్షసుల బలం ఎంతో, వీరిలో వీరులు ఎవరెవరుఉన్నారో, వీళ్లలో రావణునికి అండగా నిలిచేవాళ్లు ఎవరో, రావణునితో విభేధించే వాళ్లు ఎవరో తెలుసుకొని సుగ్రీవునికి చెప్పడం మంచిది. అప్పుడే నేను లంకకు వచ్చిన పని పూర్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాక్షసులతో అనవసర కలహం పెట్టుకోవాలి! రావణుని, అతని మంత్రులను, సేనాధిపతులను సైనికులను నాతో యుద్ధానికి వచ్చేట్టు చెయ్యాలి! రాక్షసుల యుద్ధరీతులు ఎలా ఉంటాయో గమనించాలి. ఇదంతా మంచిదే! కానీ, వీరితో కలహం ఎలా పెట్టుకోవ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 40)

శ్రీమద్రామాయణము సుందర కాండము నలుబదవ సర్గ హనుమంతుడు పలికిన ధైర్యవచనములకు ఎంతో సంతోషించింది సీత.  "హనుమా! ఇక్కడ ఈ లంకలో, ఈ రాక్షసులు చెరలో, నా చెవికి మంచి మాటలు వినడమే కరువు అయింది. ఇన్నాళ్లకు నీ నోటి నుండి నాలుగు మంచి మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది. నువ్వు వెళ్లిపోతున్నావు అంటే దిగులుగా ఉంది. నాలో ఉన్న ఉద్వేగముతో మరలా మరలా చెబుతున్నాను. నా గురించి రామునికి చెప్పి రాముని ఇక్కడకు తీసుకొని రా! నేను చెప్పిన కాకి కధను రామునికి నా ఆనవాలుగా చెప్పు. అంతే కాకుండా ఒక సారి నా నుదుటనున్న తిలకము చెరిగి పోతే రాముడు ఒక శిలను తీసుకొని దానిని అరగదీసి, ఆ గంధమును నా నుదుటికి బదులు గండస్థలము మీద తిలకముగా దిద్దాడు. ఈ విషయం కూడా రామునికి చెప్పు. ఇంకా రామునితో నా మాటగా ఇలా చెప్పు. “నేను ఇక్కడ ఈ రాక్షసుల మధ్య నానా బాధలు పడుతుంటే, దేవేంద్రునితో సమానమయిన పరాక్రమము కలిగి ఉండీ నా వద్దకు రావడానికి ఎందుకు ఉపేక్షిస్తున్నావు.  ఓ రామా! నేను ఇంతకాలమూ ఈ చూడామణిని చూస్తూ నువ్వు నా దగ్గర ఉన్నట్టే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ చూడామణిని నా ఆనవాలుగా నీకు పంపుతున్నాను.  ఓ రామా! నీవు ఏ నాటికైనా రాకపోతావా! ఈ రా...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 39)

శ్రీమద్రామాయణము సుందర కాండము ముప్పది తొమ్మిదవ సర్గ సీత తన కొంగున ముడివేసి దాచిపెట్టిన చూడామణిని తీసి హనుమంతునికి ఇచ్చి ఇలా పలికింది. “హనుమా! ఈ చూడామణిని గురించి రామునికి బాగా తెలుసు.ఈ చూడామణిని చూస్తే రామునికి నా తల్లి, తన తండ్రి దశరథుడు, నేనూ గుర్తుకు వస్తాము. కాబట్టి ఈ చూడామణిని రామునికి ఇవ్వు. తరువాత జరగ వలసిన కార్యమును గూర్చి ఆలోచించి ఏది సమంజసమో అది చెయ్యి. కాని నా దుఃఖము మాత్రము త్వరగా పోగొట్టే మార్గము చూడు." అని పలికింది సీత. హనుమంతుడు తల వంచి సీతకు నమస్కరించి “నీవు చెప్పినట్టే చేస్తాను.” అని అన్నాడు.  తరువాత అక్కడి నుండి వెళ్లడానికి సిద్ధం అయ్యాడు. హనుమ వెళుతుంటే తన ఆప్తుడు తనను విడిచి వెళుతున్నట్టు బాధపడింది సీత. “ఓ హనుమా! వానరవీరా! రాముని, లక్ష్మణుని, సుగ్రీవుని అడిగినట్టు చెప్పు. రామునితో నన్ను ఈ దుఃఖసాగరమునుండి ఉద్ధరించమని చెప్పు. నా శరీరములో ప్రాణాలు ఉండగానే వచ్చి రక్షించమని రామునితో చెప్పు. కాస్త ఈ మాట సాయం చేసి పుణ్యం కట్టుకో.  హనుమా! నీవు నేను చెప్పిన మాటలు పదే పదే రామునికి చెప్పడం వల్ల రామునికి నన్ను సత్వరమే రక్షించవలెనని కోరిక కలుగుతుంది. రాముడు నా సందేశమును ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 38)

శ్రీమద్రామాయణము సుందర కాండము ముప్పది ఎనిమిదవ సర్గ హనుమంతునికి సీత పలికిన మాటలలో పొరపాటు ఏమీ లేదు అనిపించింది. "సీతా దేవీ! నీవు పతివ్రతలకు అనుకూలమైన మాటలే చెప్పావు. నాకు చాలా సంతోషంగా ఉంది. స్త్రీవైన నీకు నా వీపు మీద కూర్చుని నా వేగమునకు తట్టుకుంటూ నూరుయోజనముల దూరమును దాటడం చాలా కష్టమైన విషయం. రాముని తప్ప పరపురుషుని తాకను అన్న నీ మాటలు రాముని భార్యవు అయిన నీకే తగును. ఇటువంటి కష్టములలో ఉన్న ఏ స్త్రీ కూడా ఇక్కడి నుండి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తుంది కానీ నీ వలె మాట్లాడదు. అందుకే నీ మాటలు నాకు బాగా నచ్చాయి. సీతా దేవీ! నీవు ఇప్పుడు నాతో పలికిన పలుకులు అన్నీ నేను రామునికి యథాతథంగా తెలుపుతాను. అమ్మా! నీకూ, రామునికి మేలు చేయవలెననే తలంపుతో నేను అలా చెప్పానే కానీ వేరు కాదు. నాకు నిన్ను నా వీపు మీద మోసుకొని పోవడానికి తగిన సామర్థ్యం ఉంది అనే నమ్మకంతో చెప్పాను కానీ, ఈ మహాసముద్రమును దాటడం కష్టము అని నాకు తెలుసు. నీవు నాతో పాటు రాముని వద్దకు రావడానికి ఇష్టపడటం లేదు. అందుకని నేను నిన్ను కలుసుకొని మాట్లాడినట్టుగా నాకు ఆనవాలుగా ఏదైనా ఇస్తే నేను దానిని రామునికి ఇస్తాను. అప్పుడే నేను నిన్ను చూచాను, కల...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 37)

శ్రీమద్రామాయణము సుందర కాండము ముప్పది ఏడవ సర్గ హనుమంతుడు చెప్పిన మాటలు విన్న సీత హనుమతో ఇలా అంది. "హనుమా! రాముడు జీవించి ఉన్నాడు అని చెప్పావు. కానీ రాముడు నా గురించి శోకిస్తున్నాడు అని చెప్పావు. రాముడు జీవించి ఉన్నందుకు సంతోషించాలో, నా గురించి శోకిస్తున్నందుకు దు:ఖించాలో అర్థం కావడం లేదు. మనిషికి ఎక్కువ సుఖము వచ్చినా ఎక్కువ దు:ఖము వచ్చినా తట్టుకోలేడు. అదే దైవ లీల. ఆ దైవ లీలను దాటడం ఎవరికీ శక్యముకాదు. మా ప్రమేయం లేకుండానే నేను, రాముడు, లక్ష్మణుడు ఎటువంటి కష్టములు పడుతున్నామో చూడు! అక్కడ రాముని శోకము ఇక్కడ నా శోకము ఎప్పుడు అంతం అవుతుందో కదా! రాముడు లంకకు వచ్చి రావణుని చంపి నా కష్టములను ఎప్పుడు తీరుస్తాడో కదా! రావణుడు నాకు ఒక సంవత్సరము గడువు ఇచ్చాడు. అందులో పది మాసములు గడిచిపోయినవి, ఇంక రెండు మాసములు మాత్రమే మిగిలి ఉన్నవి. ఈ రెండు మాసములలో రాముడు వచ్చి నన్ను రక్షించడం సాధ్యమా! హనుమా! నీవు వెళ్లి రామునితో చెప్పు. నీ సీత కేవలము ఇంక రెండు మాసములు మాత్రమే ప్రాణములతో ఉంటుంది అని చెప్పు. రావణుని తమ్ముడు విభీషణుడు అను వాడు “సీతను రామునికి ఇచ్చివేయి" అని ఎంత చెప్పినా రావణుడు వినడం లేదు. ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 36)

శ్రీమద్రామాయణము సుందర కాండము ముప్పది ఆరవ సర్గ అంతా చెప్పి సీత వంక చూచాడు హనుమంతుడు. సీతకు ఇంకా తన మీద నమ్మకం కలిగినట్టులేదు అని అర్థం అయింది హనుమంతునికి. అప్పుడు హటాత్తుగా రాముడు తనకు ఆనవాలుగా ఇచ్చిన ఉంగరము గుర్తుకు వచ్చింది. వెంటనే తాను భద్రపరచిన రాముని ఉంగరమును బయటకు తీసాడు. సీతతో ఇలా అన్నాడు. “అమ్మా! సీతా! నేను రాముని వద్ద నుండి వచ్చాను, రాముని దూతను అని నిరూపించుకోడానికి నాకు రాముడు ఇచ్చిన ఉంగరమును చూడు. దీనిని నీకు ఆనవాలుగా చూపించమని నాకు రాముడు ఇచ్చాడు.” అంటూ హనుమంతుడు రాముడు తనకు ఇచ్చిన ముద్రికను సీతమ్మకు ఇచ్చాడు.  సీత సంభ్రమంతో ఈ ముద్రికను తీసుకొంది. అది రామునిదే. సందేహము లేదు. సీత ఆ ముద్రికను కళ్లకు అద్దుకొంది. తాను రాముని చేరినట్టు రాముని చెంత ఉన్నట్టు ఆనందపడింది. సీతమ్మ మొహంలో ఆనందం చూచి హనుమంతుడు ఎంతో ఆనందించాడు. సీత మొహంలో నునుసిగ్గులు ఆవరించాయి. హనుమంతుని వంక ప్రశంసా పూర్వకంగా చూచింది. “ఓ వానరోత్తమా! సందేహము లేదు. నీవు రాముని వద్ద నుండి వచ్చావు. నీవు మహా పరాక్రమ వంతుడివి. లేకపోతే నూరుయోజనముల సముద్రము దాటి ఈ రాక్షస రాజ్యంలోకి ప్రవేశించలేవు. నీకు రావణుని వలన అసలు భయం ఉన...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 35)

శ్రీమద్రామాయణము సుందర కాండము ముప్పది ఐదవ సర్గ హనుమంతుడు ఎన్ని చెప్పినా సీత మనసులో ఉన్న సందేహము తీరడం లేదు. ఏమో! మరలా తాను మోసపోతున్నానేమో! అని మనసులో మథనపడుతూ ఉంది సీత. అందుకని హనుమంతునితో ఇలా అంది. “నీవు రాముని వద్దనుండి వచ్చాను అన్నావు కదా! నీవు రాముని ఎప్పుడు కలిసావు. నీకూ రామునికి సంబంధము ఎలా కలిగింది? నీకు లక్ష్మణుడు ఎలా తెలుసు? మీరు వానరులు. రామలక్ష్మణులు నరులు, వారికీ మీకూ స్నేహం ఎలా కుదిరింది? నువ్వు రాముని, లక్ష్మణుని, నిజంగా చూస్తే రాముడు ఎలా ఉంటాడు. లక్ష్మణుడు ఎలా ఉంటాడు. వివరించి చెప్ప. అప్పుడే నేను నిన్ను నమ్ముతాను." అని అడిగింది సీత. సీతతో హనుమంతుడు ఇలా చెప్పసాగాడు. “నీకు రాముని గురించి బాగా తెలుసు కాబట్టి రాముని రూపు రేఖల గురించి అడుగుతున్నావు. నేనూ రాముని చూచాను కాబట్టి రాముని గురించి చెబుతాను విను. రాముని కన్నులు కమలముల వలె ఉంటాయి. రాముడు మనోహరుడు. అందరి మనస్సులనూ తన మంచితనంతో హరించేవాడు. మంచి రూపవంతుడు. మంచి నేర్పుకలవాడు. ఇంకా రాముడు తేజస్సులో సూర్యునితోనూ, బుద్ధిలో బృహస్పతి తోనూ, ఓర్పులో భూదేవితోనూ, కీర్తిలో దేవేంద్రునితోనూ సమానుడు. రాముడు తన పరాక్రమంతో తన వారిన...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది నాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 34)

శ్రీమద్రామాయణము సుందర కాండము ముప్పది నాలుగవ సర్గ సీత పలికిన పలుకులు అన్నీ శ్రద్ధగా విన్నాడు హనుమంతుడు. సీతతో ఇలా అన్నాడు. “ఓ వైదేహీ! నేను రాముడు పంపగా దూతగా నీ వద్దకు వచ్చాను. రాముడు క్షేమంగా ఉన్నాడు. నీ క్షేమ సమాచారములు తెలుసుకొని రమ్మని రాముడు నన్ను నీ వద్దకు పంపాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు కూడా ఆయన పక్కనే ఉన్నాడు. లక్ష్మణుడు కూడా నీకు తన అభివాదములు తెలుపమన్నాడు." అని అన్నాడు హనుమంతుడు. రామలక్ష్మణుల క్షేమవార్తలు విన్న సీత ఆనందంతో పొంగి పోయింది. “మానవుడు బతికి ఉంటే నూరు సంవత్సరములకైనా క్షేమకరమైన వార్తలు వింటాడు అని లోకోక్తి. నేను ఇన్నిరోజుల నుండి రాముని క్షేమ వార్తల కోసరము ఎదురు చూస్తున్నాను. నీ వలన రామలక్ష్మణుల క్షేమము గురించి తెలుసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది." అని పలికింది సీత. హనుమంతుడు ఆమె దగ్గరగా వెళ్లాడు. హనుమంతుడు దగ్గర దగ్గరగా రావడం చూచి మరలా సీత మనసులో అనుమానం పొడసూపింది. వీడు మారువేషములో ఉన్న రావణుడు కాదు కదా! అని అనుమానించింది. "అయ్యో! నేనెంత మందమతిని. నా విషయాలన్నీ అనవసరంగా ఇతనికి చెప్పాను. ఇతడు మాయ వేషంలో వచ్చిన రావణుడు. సందేహం లేదు. లేకపోతే నా దగ్...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది మూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 33)

శ్రీమద్రామాయణము సుందర కాండము ముప్పది మూడవ సర్గ సీత పడుతున్న మనోవేదనను గమనించాడు హనుమంతుడు. ఇలా కాదనుకున్నాడు. చెట్టు దిగాడు. సీత ముందు నిలబడ్డాడు. రెండు చేతులు జోడించి తల మీద పెట్టుకొని వినయంగా నమస్కారం చేసాడు. సీతతో ఇలా అన్నాడు. “అమ్మా! మీరు ఎవరు? మీ ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంది. కాని మాసిన చీర కట్టుకొని ఉన్నారు. ఈ చెట్టు కొమ్మను పట్టుకొని నిలబడి ఉన్నారు. మీరు ఎవరు? మీ రెండు కళ్లనుండి నిరంతరమూ నీళ్లు కారుతున్నాయి. ఎందుకు దు:ఖిస్తున్నారు. నీవు ఏ జాతికి చెందిన స్త్రీవి. దేవకాంతవా! రాక్షస కాంతవా! గంధర్వ కాంతవా! నాగదేవతవా! యక్షిణివా! లేక కిన్నెర కాంతవా! పోనీ రుద్రగణములు, మరుత్ గణములు, వసుగణములు, ఈ గణములకు చెందిన కాంతవా! నీవు మానవ కాంతవు కావు. దేవతా స్త్రీవి అని అనిపిస్తూ ఉంది. స్వర్గం నుండి భూమికి దిగిన అప్సరసవా! వసిష్టుని భార్య అరుంధతివి కాదు కదా! నీ భర్త మీద కోపంతో ఆయనను వదిలి వచ్చి ఆయన కోసం దు:ఖిస్తున్నావా! లేక పోతే నీ వాళ్లు ఎవరన్నా చనిపోతే వారి కోసరం ఏడుస్తున్నావా! ఆ చనిపోయింది నీ కొడుకా, భర్తా, సోదరుడా లేక నీ తండ్రియా! ఎందుకోసం ఏడుస్తున్నావు? నీవు ఏడవడం చూస్తుంటే నీవు దేవతా స్త...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది రెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 32)

శ్రీమద్రామాయణము సుందర కాండము ముప్పది రెండవ సర్గ శింశుపా వృక్షము చెట్ల ఆకుల మాటున, ఆకు పచ్చని శరీర ఛాయతో, తెల్లని వస్త్రమును ధరించి, రామకథను గానం చేసిన హనుమంతుని చూచింది సీత. ఆలోచనలో పడింది. చూడబోతే కోతి. మహాభయంకరంగా ఉన్నాడు. ఆ కోతి ముఖం తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. కానీ రామ కధను గానం చేసాడు. ఏమీ అర్థం కాలేదు సీతకు. ఆమెలో భయం ప్రవేశించింది. “రామా! రామా! ఏంటి నాకీ పరీక్ష ఇతను ఎవరు? ఎందుకొచ్చాడు? నీ చరిత్ర ఎందుకు గానం చేసాడు. కొంపదీసి నేను కలగంటున్నానా! ఇదీ కలా! నిజమా!" అని మనసులోనే మధనపడసాగింది. మరలా తల పైకి ఎత్తి హనుమంతుని వంక చూచింది. (ఒకసారి మాయ లేడి విషయంలో మోసపోయి అంతులేని కష్టాల్లో ఇరుక్కుంది. అందుకే ఎవర్ని నమ్మడం లేదు సీత.) సీత తన గురించి ఏమి అనుకుంటూ ఉందో అని సీత వంక తదేకంగా చూస్తున్నాడు హనుమంతుడు. హనుమంతుని చూపులు చూచి సీతకు పైప్రాణాలు పైనే పోయాయి. కాసేపు స్పృహ తప్పినట్టయింది. అంతలోనే తేరుకుంది. సీతకు హనుమంతుడు కనపడటం స్వప్నంలాగా అనిపించింది. “వికృతమైన వానరము కలలో కనిపిస్తే మంచిది కాదంటారు. నా రామునికి, లక్ష్మణునికి, నా తండ్రి జనకునికి ఏమీ కాకూడదు. భగవంతుడు వారి నందరినీ క్షేమ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది ఒకటవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 31)

శ్రీమద్రామాయణము సుందర కాండము ముప్పది ఒకటవ సర్గ ఆలోచించి ఆలోచించి హనుమంతుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. చెట్లచాటున కూర్చుని సీతకు వినబడేటట్టుగా రామకథను గానం చెయ్యాలని అనుకున్నాడు. అదేవిధంగా హనుమంతుడు రామ కధను గానం చెయ్యసాగాడు. "ఇక్ష్వాకు వంశంలో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు దశరథుడు. ఆయన గొప్ప కీర్తి మంతుడు, ఐశ్వర్యవంతుడు. ధర్మాత్ముడు. బలంలో దేవేంద్రుని మించిన వాడు. దశరథుడు గొప్ప రాజర్షి. అహింసావ్రతమును, సత్యవాక్పరిపాలనను అవలంబించిన వాడు. దశరథుడు నాలుగు సముద్రముల మధ్య ఉన్న భూమిని పరిపాలించేవాడు. ఆ దశరథుని పెద్ద కుమారుని పేరు రాముడు. రాముని ముఖం చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. రాముడు మానవులలో ఉత్తముడు. గొప్ప ధనుర్ధారి. రాముడు ఎల్లప్పుడూ ధర్మమునే పాటించేవాడు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడి వాడు. అటువంటి రాముడు, తన తండ్రి ఆదేశము మేరకు అరణ్యవాసమునకు వెళ్లాడు. రాముని వెంట ఆయన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు, కూడా అరణ్యవాసమునకు వెళ్లారు. పరాక్రమవంతుడైన రాముడు అడవిలో ఉండగా అనేకమంది రాక్షసులను చంపాడు. రాముడు రాక్షసులను చంపాడు అన్న విషయం రావణునికి తెలిసింది. రాముని మీద ప్రతీకారము తీర్చుకోవాలి అనుకు...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 30)

శ్రీమద్రామాయణము సుందర కాండము ముప్పదవ సర్గ శింశుపా వృక్షము మీద ఆకుల మాటున దాగి ఉన్న హనుమంతుడు చెట్టు కింద జరుగుతున్న విషయములను అన్నీ ఓపికగా చూస్తున్నాడు. సీత విలపించడం, రాక్షసస్త్రీలు సీతను భయపెట్టడం, సీత బయపడటం, తిజట తనకు వచ్చిన కల గురించి రాక్షసస్త్రీలకు చెప్పడం, సీత తన దుస్థితిని తలచుకొని దుఃఖించడం అన్నీ చూస్తున్నాడు వింటున్నాడు హనుమంతుడు. హనుమంతుని దృష్టి అంతా సీత మీదనే ఉంది. హనుమంతుడు తనలో తాను ఇలా ఆలోచిస్తున్నాడు. “నాలుగు దిక్కులకు వెళ్లిన వానరములకు పట్టని అదృష్టం తనకు పట్టింది. సీతను తాను చూడగలిగాడు. ఎవరికీ కనపడకుండా కూర్చుని అన్నివిషయములను ఆకళింపు చేసుకున్నాను. లంకను గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాను. రావణుని గురించి అతని ప్రవర్తన గురించి బాగుగా అధ్యయనం చేసాను. రాముని భార్య సీత ఎప్పుడెప్పుడు తన భర్త రాముని చూద్దామా అని ఆతురతగా ఉంది. ఆమె దుఃఖసముద్రంలో మునిగి ఉంది. ఇప్పుడు ఆమెను కలుసుకొని ఓదార్చడం తన తక్షణ కర్తవ్యం. సీతను చూస్తుంటే ఆమె ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి కష్టములను అనుభవించినట్టులేదు. ఇప్పుడు ఆమెను కలిసి, ఆమెకు నాలుగు ఓదార్పు వచనములు చెప్పడం అత్యంత ఆవశ్యకము. ఏదో సముద్రం దాట...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 29)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఇరువది తొమ్మిదవ సర్గ చెట్టుకొమ్మకు తన పొడుగాటి జడతో ఉరి పోసుకొని చావాలను కున్న సీతకు ఎన్నో శుభ శకునములుకనిపిపించాయి. సీతకు ఎడమ కన్ను అదిరింది. ఎడమ భుజము కూడా అదిరింది. శరీరంలో ఎడమ భాగము అంతా అదురుతూ ఉంది. ఈ ప్రకారంగా శరీరంలో ఎడమ భాగంలో ఉన్న అవయవములు అదిరి నపుడు సీతకు ఎన్నో శుభాలు జరిగాయి. ఇప్పుడు తనకు ఎడమ భాగం అదరడంతో సీతకు తనకు శుభాలు జరగబోతున్నాయి అన్న భావన కలిగింది. సీత మనసంతా ఆనందంతో నిండి పోయింది. సీత ముఖపద్మము దివ్యంగా ప్రకాశించింది. సీత ఆత్మహత్యా ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించింది. శ్రీమద్రామాయణము సుందర కాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది ఎనిమిదవ సర్గ శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పదవ సర్గ

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 28)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఇరువది ఎనిమిదవ సర్గ త్రిజటకు వచ్చిన స్వప్నము గురించి కానీ, దాని గురించి త్రిజట తోటి రాక్షస వనితలకు చెప్పడం కానీ సీతకు తెలియదు. రావణుడు వచ్చి తనను అన్న మాటలను తలచుకొని, తరువాత రాక్షస స్త్రీలు తనను చంపుతానని బెదిరిస్తూ మాట్లాడిన మాటలను తలచుకొని బాధపడుతూ ఉంది సీత. “నేను ఎంత పాపం చేసానో గానీ, వీళ్ల చేత ఇన్ని మాటలు పడుతూ కూడా నా ప్రాణములు నా శరీరమును వదలకుండా ఉన్నాయి. కాలము తీరనిది మరణము కూడా దగ్గరకు రాదు అన్న విషయం సత్యము అని తోస్తూ ఉంది. నేను సుఖాలకు నోచుకోలేదు. నా జీవితము అంతా దు:ఖ మయము. అయినా కూడా నా హృదయము పాషాణము కంటే గట్టిగా ఉంది. అందుకే జీవితాంతము కష్టములు వచ్చినా బద్దలు కాకుండా ఇంకా వజ్రసమానంగా ఉంది. అసలు నా తప్పు ఏమీ లేకుండానే రావణుడు నన్ను చంపమని ఆజ్ఞాపించాడు. ఈ రావణుడు ఏమి చేసినా వీడిని మాత్రము నేను దగ్గరకు రానివ్వను. ఈ రెండు నెలల గడువు లోపల రాముడు రాకుంటే ఈ రావణుడు నన్ను చంపుతాడు. రాముడు ఎప్పుడు వస్తాడో తెలియదు. నాకు ఎన్ని కష్టములు వచ్చి పడ్డాయి. రామా! లక్ష్మణా! తొందరగా రండి. నన్ను ఈ రాక్షసుని చెరనుండి నన్ను విడిపించండి. ఆ రోజు కాలమే మృగరూపంలో వచ్చి...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 27)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఇరువది ఏడవ సర్గ సీతకు ఎంత చెప్పినా లాభం లేదు అనుకున్నారు రాక్షస స్త్రీలు. వారిలో కొంతమంది సీత గురించి, సీత మూర్ఖత్వాన్ని గురించీ రావణునికి తెలియజెయ్యాలని వెళ్లారు. మిగిలిన రాక్షస వనితలు మరలా పరుష వాక్యములతో సీతను నిందించడం మొదలెట్టారు. "సీతా! ఇంక నీకు ఏమి చెప్పీ ప్రయోజనము లేదు. నిన్ను తినడం తప్ప మారు మరోమార్గము లేదు." అని సీత మీద పడి చంపుదామని అనుకుంటూ ఉండగానే వారిలో ఒక వృద్దరాక్షసి త్రిజట అనే పేరుకలది అప్పటి దాకా నిద్రపోతూ ఉంది. రాక్షస వనితల ఆర్భాటము చూచి నిద్రలేచింది. తన తోటి రాక్షస స్త్రీలను చూచి ఇలా అంది. “ఏమిటే! ఏమి చేస్తున్నారు? మూర్ఖుల్లారా! మీరు ఎవరిని చంపి తింటున్నారో తెలుసా! దశరధుని కోడలిని. రాముని భార్యను. మీరు సీతను తినడం లేదు. మిమ్మల్ని మీరే చంపుకొని తింటున్నారు. అసలు సంగతి చెబుతాను వినండి. నేను ఇప్పటిదాకా నిద్రపోతున్నానా! ఆ నిద్రలో నాకు ఒళ్లు గగుర్పొడిచే ఒక కల వచ్చింది. అదీ ఈ తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయంటారు కదా! ఆ కలలో రాక్షసులు అంతా నాశనమైనట్టు, రాముడు సీతను తీసుకువెల్లినట్టు కల వచ్చింది. తెలుసా!...