Posts

Showing posts from December, 2024

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 67)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై ఏడవ సర్గ పారిపోయి తిరిగివచ్చిన వానర వీరులు ప్రాణాలకు తెగించి యుద్ధంచేస్తున్నారు. వారు పెద్ద పెద్ద వృక్షములను, గండ శిలలను, పర్వత శిఖరములను తీసుకొని కుంభకర్ణుని మీదికి విసురుతున్నారు. కుంభకర్ణుడు తన గదను అటు ఇటు ఊపుతూ వానరులను చెదరగొడుతున్నాడు. ఆ చెదర గొట్టడంలో వందలు వేలు వానరులు దూరంగా విసిరివేయబడుతున్నారు. కుంభ కర్ణుడు వందల కొద్దీ వానరులను రెండు చేతులతో పట్టుకొని నోట్లో కుక్కుకొని తింటున్నాడు. అయినా వానరులు కుంభకర్ణుని మీదికి వృక్షములు, రాళ్లు విసురుతూ యుద్ధం చేస్తున్నారు. ఇంతలో ద్వివిదుడు ఒక పర్వత శిఖరమును పెకలించి చేతపట్టుకొని కుంభకర్ణుని వైపుకు పరుగెత్తాడు. ద్వివిదుడు ఆ పర్వతమును తీసుకొని పైకి ఎగిరి దానిని కుంభకర్ణుని మీదికి విసిరాడు. ఆ పర్వత శిఖరము కుంభకర్ణుని మీద పడకుండా రాక్షససేనల మీద పడింది. ఆ పర్వతము కిందపడి వందలకొద్దీ రాక్షసులు మరణించారు. అది చూచిన రాక్షస సైనికులు వానరుల మీద పడి బాణములతో వానరుల శిరస్సులను బంతుల మాదిరి ఎగురగొడుతున్నారు. వానరులు కూడా పెద్ద పెద్దవృక్షములను బండరాళ్లను తీసుకొని రాక్షసులను చంపుతున్నారు. హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 66)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై ఆరవ సర్గ కుంభకర్ణుని చూచి పారిపోతున్న వానరులలో వానర ప్రముఖులైన నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు మొదలగువారు ఉన్నారు. ఆ ప్రకారంగా పారిపోతున్న వానర ప్రముఖులను చూచి అంగదుడు ఇలా అన్నాడు.  “ఓ వానరవీరులారా! ఒక రాక్షసుని చూచి ఇలా పారిపోవడం ధర్మమా! మీరు ఎంతటి ఉన్నత కుటుంబంలో జన్మించారు. ఒక నీచ రాక్షసునికి భయపడు తున్నారా! అయినా పారిపోయి ఎక్కడికి పోతారు! ఎంత దూరం పోతారు! వెనక్కురండి. ఇతడు రాక్షసుడు కాడు. మనలను భయపెట్టడానికి రాక్షసులు సృష్టించిన పెద్ద విగ్రహము. రండి. మనమందరమూ కలిసి ఈ బొమ్మను తునాతునకలు చేద్దాము.” అని ఎలుగెత్తి అరిచాడు. అంగదుని మాటలకు వానరులకు ధైర్యము వచ్చింది. పారిపోయిన వాళ్లు తిరిగి వచ్చారు. చేతికి అందిన వృక్షములను, పర్వత శిఖరములను పట్టుకొని యుద్ధమునకు సిద్ధం అయ్యారు. ఆ కుంభకర్ణుని చుట్టూ చేరి వాడిని వృక్షములతో పర్వతశిఖరములతో కొట్టారు. ఆ వానరులు కొట్టే దెబ్బలు కుంభకర్ణునికి చీమకుట్టినట్టయినా లేదు. కుంభకర్ణుని మీదకు విసిరిన వృక్షములు, పర్వతశిఖరములు కుంభకర్ణుని శరీరమునకు తగిలి తునాతునకలై పోతున్నాయి. కుంభకర్ణుడు కోపించి వానరసేనలను తన ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 65)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై ఐదవ సర్గ మహోదరుని మాటలు విన్న కుంభకర్ణునికి మిక్కుటంగా కోపం వచ్చింది. మహోదరుని ఒక్కసారిగా విదిలించి కొట్టాడు. తన అన్న రావణుని చూచి ఇలా అన్నాడు. “రాక్షసేంద్రా! నీవు నిశ్చింతగా ఉండు. నేను యుద్ధభూమికి పోయి ఆ రామలక్ష్మణులను చంపి నీ భయాన్ని పోగొడతాను. నావంటి శూరులు నీరులేని మేఘముల వలె ఊరికే గర్జించరు. నేను నా పరాక్రమము యుద్ధభూమిలో చూపిస్తాను కానీ మాటలలో చూపించను. నా వంటి శూరుడు తనను తాను పొగుడుకోడు. తనకు శక్యము కాని పనులను కూడా చేసి చూపిస్తాడు. ఓ మహోదరా! నీ వంటి వారు పలికే మాటలు తమను తాము గొప్పవారము అనుకొనే రాజులు వింటారు కానీ రావణుడు కాదు. మీరు పిరికి పందలు. మీకు యుద్ధము అంటే భయము. కుయుక్తులు, కుతంత్రములతో పని కానిద్దామంటారు. రాజు దగ్గర ప్రగల్భాలు పలుకుతూ రాజు మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాజును అపకీర్తిపాలు చేస్తుంటారు. రావణుని హితం కోరేవారు, రావణునికి మంచి సలహాలు చెప్పేవారు ఈ లంకలో లేనట్టుంది. పాపము రావణుడు ఒంటరివాడయ్యాడు. ఇప్పటి దాకా మీరు చేసిన తప్పులను నేను సరిదిద్దుతాను. ఇప్పుడే యుద్ధమునకు బయలుదేరుతున్నాను." అని అన్నాడు కుంభకర్ణుడు. కుంభ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై నాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 64)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై నాలుగవ సర్గ కుంభకర్ణుడు రావణునితో పలికిన పలుకులు అన్నీ పక్కనే కూర్చుని ఉన్న మహెూదరుడు విన్నాడు. మహోదరుడు కుంభకర్ణునితో ఇలా అన్నాడు. “ఓ కుంభకర్ణా! నీవు ఉన్నత వంశంలో జన్మించావు. కాని ఉన్నతంగా ఆలోచించడం లేదు. గర్వంతో ఎప్పుడు ఏమి చెయ్యాలో తెలియకుండా మాట్లాడుతున్నావు. రావణుడు మహారాజు. ఆయనకు తెలియని నీతి లేదు. నీవు ఇప్పుడు రావణునికి నీతులు చెప్ప పనిలేదు. ఏదో బాల్యచాపల్యంతో మాట్లాడుతున్నావు. రావణుడు లంకాధిపతి. దేశ కాలములను బాగా ఎరిగిన వాడు. ఎప్పుడు ఎక్కడ ఏ పని చెయ్యాలో తెలిసినవాడు. తాను చేయబోయే పని గురించి మంచి చెడ్డలు బాగా తెలిసినవాడు. నీవు ధర్మము అర్థము కామము గురించి మాట్లాడావు. కానీ వాటి లక్షణముల గురించి, స్వరూప స్వభావముల గురించి నీకు తెలుసా! సుఖం కలిగినా దు:ఖము కలిగినా, దానికి ముందు చేసిన కర్మలే కారణము. కానీ ఒక్కోసారి చెడ్డపనులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ధర్మం కోసరం చేసే పనులూ, అధర్మం కోసం చేసే పనులూ రెండూ శ్రేయస్సును కలుగచేస్తాయి. ఒక్కోసారి ధర్మం కొరకు చేసే పనులు కీడును కలిగిస్తాయి. పురుషులు ఈ లోకానికి పరలోకానికి పనికి వచ్చే కర్మలను కోరికలతో చేస్తూ ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 63)

శ్రీమద్రామాయణము యుద్ధ కాండము అరవై మూడవ సర్గ ముల్లోకములను గడగడలాడించిన పరాక్రమవంతుడు అయిన రావణుడు తన ముందు అంత దీనంగా మాట్లాడటం చూచి కుంభకర్ణుడు బిగ్గరగా నవ్వాడు. రావణునితో ఇలా అన్నాడు. “అన్నా రావణా! నాకు చూడగా, నీవు నీ మంత్రులతో చర్చించినపుడు, వారు చెప్పిన మంచి మాటలను చెవిని పెట్టినట్టులేదు. అందుకే నీకు ఈ ఆపదకలిగింది. అవునా! ఇది ఎవరో చేసినది కాదు. నీవు చేసుకున్న దుష్కర్మ నీకు ఈ కష్టములను తెచ్చిపెట్టింది. నీవు దుష్కార్యమును చేసావు. అది చేయబోయే ముందు ఎవరితోనన్నా ఆలోచించావా! బాగోగులు విచారించావా! ఆ చేయబోయే పనికి ఫలితం ఎలా ఉంటుందో ఊహించావా! ఇవేమీ ఆలోచించకుండా చేయకూడని పనులు చేసి ఇప్పుడు చింతించి ఏమి ప్రయోజనము. నీకు బలము, దర్ఘము, పరాక్రమము ఉంది కదా అని చేయకూడని పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇంకా దారుణంగా కూడా ఉంటుంది. నీవు లంకాధీశుడవు. నీకు తగ్గపనులు చెయ్యాలి కానీ, నీవు చేయకూడని పనులు చేయడం ధర్మమా! ఒక పని చేసే ముందు దేశ, కాలములు అనుకూలంగా ఉన్నవా లేవా అని చూచుకోవాలి కదా! ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చేసెయ్యడమేనా! ఏ పని చేసే ముందు అయినా మంత్రులతో మంచి చెడ్డల...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 62)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై రెండవ సర్గ కుంభకర్ణుడు లంకా నగర రాజమార్గములో నడుస్తున్నాడు. రావణుని మందిరము చేరుకున్నాడు. కుంభకర్ణుని దూరం నుండి చూచాడు రావణుడు. సింహాసనము మీది నుండి లేచి కుంభకర్ణునికి ఎదురుపోయి ప్రేమతో కౌగలించుకున్నాడు. కుంభకర్ణుడు రావణునికి పాదాభివందనము చేసాడు. “అన్నా రావణా! నన్ను ఎందుకునిద్ర లేపారు? నేను ఏమి చెయ్యాలి?" అని సూటిగా అడిగాడు. అప్పుడు రావణుడు ఇలా అన్నాడు. "తమ్ముడా కుంభకర్ణా! నీవు చాలా కాలము కిందట నిద్రకు ఉపక్రమించావు. ఈ లోపల చాలా విషయాలు జరిగాయి. ఇటీవల నాకు రాముడు అనే నరుని వలన కలిగిన భయం గురించి నీకు తెలియదు. ఈ రాముడు అయోధ్య రాజైన దశరథుని కుమారుడు. ఇతని స్నేహితుడు సుగ్రీవుడు అనే వానరుడు. రాముడు, సుగ్రీవుని సాయంతో సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు. లంకానగరాన్ని ముట్టడించాడు. లంకను ఆక్రమించాడు. ఎక్కడ చూచినా వానరులే. ఈ వానరయోధులు మన రాక్షస వీరులను ప్రముఖులను ఎంతోమందిని చంపారు. వానరులకు కలిగిన నష్టం కంటే మనకు జరిగిన నష్టం అపారము. ఈ వానరులు ఎప్పుడూ యుద్ధం చేసినట్టు గానీ అందులో ఓడిపోయినట్టు గానీ కనపడదు. ఈ విధంగా నాకు నరులతో, వానరులతో భయం కలిగింది. ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఒకటవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 61)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై ఒకటవ సర్గ రాముడు కూడా ఆకాశం అంత ఎత్తున ఉన్న కుంభకర్ణుని చూచాడు. ఆ అనూహ్యమైన ఆకారమును చూచి పారిపోతున్న వానరములను చూచాడు. ఆశ్చర్యపోయాడు. విభీషణుని చూచి ఇలా అన్నాడు. “విభీషణా! ఆకాశమంత ఎత్తున ఉన్న ఈ ఆకారము ఎవరు? ఇంత పెద్ద దేహము కలవాడు ఈ భూమి మీద వీడు ఒక్కడే ఉన్నట్టు ఉంది. వీడు ఎవరు? వీడి పేరేమి? వీడు అసురుడా, రాక్షసుడా, లేక వేరే జాతి ప్రాణియా. ఎందుకంటే నేను ఇంతవరకూ ఇటువంటి ప్రాణిని భూమి మీద చూడలేదు." అని అన్నాడు. అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు. “ఓ రామా! ఇతని పేరు కుంభకర్ణుడు. రావణుని సోదరుడు. ఇతడు విశ్రవసుని కుమారుడు. యుద్ధములో ఇంద్రుని, యముడిని ఓడించాడు. రాక్షస జాతిలో ఇంత దేహము కల రాక్షసుడు ఎవరూ లేరు. ఇతడు దేవతలను, గంధర్వులను, పన్నగులను, దానవులను, యక్షులను, విద్యాధరులను ఓడించాడు. ఇతడు శూలం ధరించి యుద్ధభూమిలో తిరుగుతుంటే సాక్షాత్తు యముడు తిరిగినట్టు ఉంటుంది. ఇతడు సహజ బలసంపన్నుడు. ఈ కుంభకర్ణుడు పుట్టీ పుట్ట గానే వేలకొలది ప్రాణులను భక్షించాడు. వీడికి ఆకలి ఎక్కువ. దొరికిన దానిని దొరికినట్టు తినేసేవాడు. వాడు అలా తినడం మొదలెడితే భూమి మీద కొంతకాలానికి ప్రాణి ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవయ్యవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 60)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవయ్యవ సర్గ రాముడి చేతిలో ఓడి పోయిన రావణుడు అవమాన భారంతో లంకకు వెళ్లాడు. ఏమీ చెయ్యడానికి తోచడం లేదు. ఒక మానవుని చేతిలో ఓటమి రావణునికి చాలా బాధాకరంగా, అవమానకరంగా పరిణమించింది. రామ బాణాలను తలచుకుంటేనే రావణునికి కంపరంగా ఉంది. తన ఆంతరంగీకులను పిలిచి ఇలా అన్నాడు. “ఈ రోజు నేను ఒక మానవుని చేతిలో ఓడిపోయాను. నా బలము, పరాక్రమము, నేను చేసిన తపస్సు అంతా వృధా అయిపోయాయి. నేను బ్రహ్మను వరము కోరునపుడు మానవులను బలహీనులుగా తలంచి వారి వలన కూడా చావు లేనట్టు వరకు కోరలేదు. అప్పుడే బ్రహ్మ నాకు మానవుల వలన కీడు ఉందని చెప్పాడు. ప్రస్తుత పరిణామములు అలాగే జరుగుతూ ఉన్నాయి. దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస, పన్నగుల నుండి మరణము లేకుండా వరము కోరిన నేను మానవులను ఎందుకు విస్మరించాలి! మానవుల వలన కూడా మరణము లేకుండా వరము కోరి ఉంటే బాగుండేది. ఇక్ష్వాకు వంశములో పుట్టిన అనరణ్యుడు నాతో అన్న మాటలు యదార్థములు అయ్యాయి. “ఓ రాక్షసుడా! నిన్ను, నీ వంశమును, నాశనము చేయగల వాడు నా వంశములో జన్మించగలడు" అని ఆరోజే అన్నాడు. ఆ మానవుడు రాముడే కావచ్చును. అన్నీ ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. పూర్వము నేను వేదవతి...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై తొమ్మిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 59)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము యాభై తొమ్మిదవ సర్గ నీలుడి చేతిలో ప్రహస్తుడు చావడం చూచిన రావణ సేనలు లంకలోకి పారిపోయాయి. అందరూ గబా గబా వెళ్లి నీలుడి చేతిలో ప్రహస్తుడు మరణించాడు అన్న వార్త రావణునితో చెప్పారు. రావణుని మనసులో కోపము, శోకము, బాధ అన్నీ ఒకేసారి కలిగాయి. ఇతర సేనాధి పతులను చూచి రావణుడు ఇలా అన్నాడు. "సేనానాయకులారా! నేను ఇప్పటిదాకా ఓర్పు వహించాను. నా సహనం నశించింది. నా ప్రధాన సేనానాయకులను చంపిన వారిని నేను ఇంక ఎంత మాత్రమూ ఉపేక్షించలేను. నేను స్వయంగా యుద్ధరంగమునకు పోవలెనని నిశ్చయించుకున్నాను. అగ్నిగోళముల వంటి నా బాణములతో శత్రువులను నిర్మూలిస్తాను. వానరుల రక్తంతో భూదేవిని తృప్తిపరుస్తాను. రామలక్ష్మణులు నా బాణములకు ఆహుతి కాక తప్పదు." అని పలికాడు వెంటనే తన రథమును ఎక్కాడు. స్వయంగా రావణుడే యుద్ధరంగానికి బయలు దేరడం చూచిన రాక్షస సైన్యము ఉత్సాహంతో ఉరకలు వేసింది. తన సేనలు వెంటరాగా రావణుడు లంకా ద్వారము నుండి బయటకు వచ్చాడు. వానర సేనను తేరిపార చూచాడు. రాముడు రావణుని అతని సేనలను చూచాడు. విభీషణునితో ఇలా అన్నాడు. “ఇప్పుడు యుద్ధానికి వస్తున్నది ఎవరు? ఈ భయంకర సైన్యము ఎవరిది? ఇందులో ప్రముఖులు ఎ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 58)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము యాభై ఎనిమిదవ సర్గ అట్టహాసంగా యుద్ధానికి వస్తున్న ప్రహస్తుని చూచాడు రాముడు. చిరునవ్వు నవ్వాడు. విభీషణునితో ఇలా అన్నాడు. “విభీషణా! ఈ రాక్షస వీరుడు, సైన్యాధిపతి ఎవరు? ఇతని పేరు ఏమిటి? ఇతని బలపరాక్రమములు ఎట్టివి? ఇతనిని గురించి సవిస్తరంగా చెప్పు." అని అని అడిగాడు రాముడు. 'ఇతని పేరు ప్రహస్తుడు. రావణుని రాక్షస సేనలకు అధిపతి. లంకలో ఉన్న మూడు వంతుల సేనలకు అధిపతి ఇతడే. ఇతడు మహా శూరుడు, పరాక్రమవంతుడు. అస్త్రవిద్యానిపుణుడు." అని అన్నాడు విభీషణుడు. ఇంతలో ప్రహస్తుడు తన రాక్షస సేనలను వానర సేనల మీదికి పురికొల్పాడు. వానరులు పర్వతములను, బండరాళ్లను, వృక్షములను చేత ధరించి రాక్షసుల మీదికి పరుగెత్తారు. వానరులు రాక్షసులు ఒకరి మీద ఒకరు బండరాళ్లను, వృక్షములను, అస్త్రశస్త్రములను విసురుతున్నారు. వానరులకు రాక్షసులకు గొప్పయుద్ధము జరిగింది. ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఇరు పక్కలా సైన్యం నష్టపోతున్నారు. రక్తం ఏరులైపారుతూ ఉంది. కొంతమంది శరీరాల్లో శూలాలు గుచ్చుకుంటున్నాయి. కొంతమంది పరిఘలతో కొట్టబడ్డారు. మరి కొంతమంది పర్వతశిఖరముల కిందపడి నలిగిపోతున్నారు. రాక్షసులు వానరులను తమ ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 57)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము యాభై ఏడవ సర్గ రామలక్ష్మణులను, సుగ్రీవుడిని చంపడానికి పంపబడిన అకంపనుడు హనుమంతుని చేతిలో వధింపబడ్డాడు అన్న విషయం తెలిసిన రావణుడుకి మతిపోయింది. కోపంతో ఊగిపోయాడు. కాని అంతలోనే రావణుని ముఖంలో దైన్యం తొంగి చూచింది. ఎందుకిలా జరుగుతూ ఉంది. ఇంతమంది వీరాధివీరులు ఎందుకు మరణిస్తున్నారు అని అంతర్మధనం చేసుకున్నాడు. కాని పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు. వెంటనే మంత్రి మండలిని పిలిపించాడు. వారితో మంతనాలు జరిపాడు. సేనలను వారి వ్యూహములను సమీక్షించడానికి రాచమందిరం లో నుండి లంకానగరంలోకి వెళ్లాడు. సర్వసైన్యాధ్యక్షుడు ప్రహస్తుని చూచాడు. అతనితో ఇలా అన్నాడు. "ప్రహస్తా! లంకానగరాన్ని శత్రువులు ముట్టడించారు. మనకు యుద్ధం చేయడం తప్ప మరోమార్గం కనిపించడం లేదు. ఇప్పటి దాకా ఒకరి వెంట ఒకరు యోధానుయోధులు యుద్ధానికి వెళుతున్నారు, అందరూ మరణిస్తున్నారు. ఒక్కరూ విజయులై తిరిగి రావడం లేదు. గెలుపుజాడ కనపడటం లేదు. సర్వసేనాధిపతి వైన నువ్వు, నికుంభుడు, నా తమ్ముడు కుంభకర్ణుడు, నా కుమారుడు ఇంద్రజిత్తు, ఆఖరున నేను, వీరు మాత్రమే ఈ యుద్ధము అనే మహాసముద్రమును తరించగలము అనిపిస్తూ ఉంది. అందుకని నీవు సర్వసైన్యము...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 56)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము యాభై ఆరవ సర్గ వానర వీరులు రాక్షస సేనలను ఊచకోత కోస్తూ ఉండడంతో అకంపనుడికి కోపం వచ్చింది. దనుష్టంకారము కావించి తన సారధితో ఇలా అన్నాడు. “ఓ సారధీ! అక్కడ ఆ వానర వీరులు మన రాక్షస సేనలను చంపుతున్నారు. కేవలము ఏ ఆయుధమూ లేకుండా చెట్టను, బండరాళ్లను ఉపయోగించి మన వాళ్లను నుగ్గు నుగ్గు చేస్తున్నారు. మన రథమును అక్కడకు పోనివ్వు." అని అన్నాడు. వెంటనే అకంపనుడి సారథి రథమును వారి వంకకు పోనిచ్చాడు. అకంపనుడు తన ధనుస్సునుండి బాణములను వానరుల మీద వర్షము వలె కురిపిస్తున్నాడు. అకంపనుడి శరముల ధాటికి తట్టుకోలేక వానరులు పారిపోతున్నారు. దూరంనుండి ఇదంతా చూచాడు హనుమంతుడు. వెంటనే అకంపనుడు యుద్ధం చేసే చోటికి వెళ్లాడు హనుమంతుడు. హనుమంతుడు రావడం చూచిన వానరులు, ధైర్యం తెచ్చుకొని హనుమంతుడి చుట్టు చేరారు. హనుమంతుని చూడగానే వారి బలం రెట్టింపు అయింది. ఇది చూచిన అకంపనుడు హనుమంతుని మీద శరవర్షము కురిపించాడు. కాని హనుమంతుడు తన శరీరములో గుచ్చుకుంటున్న బాణములను లెక్కచేయడం లేదు. అకంపనుడిని ఎలా చంపడమా అని ఆలోచిస్తున్నాడు. హనుమంతుడు పెద్దగా అరుస్తూ వికటాట్టహాసం చేస్తూ అకంపనుడి మీదికి వెళ్లాడు. అకంపనుడి మ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 55)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము యాభై ఐదవ సర్గ తాను పంపిన వజ్రదంష్ట్రుడు అంగదుని చేతిలో మరణించాడు అన్న వార్త రావణునికి తెలిసింది. వాడిని పంపినంత సేపు పట్టలేదు వాడు చచ్చాడు అన్న వార్త వినడానికి. మరొకడిని పంపడం కన్నా వేరే మార్గము కనిపించడం లేదు రావణునికి, రావణుడు వెంటనే అకంపనుడు అనే సేనానాయకుడిని పిలిపించాడు. అకంపనుడు మహాయోధుడు. వాడికి యుద్ధము లేకపోతే నిద్రపట్టదు. రామలక్ష్మణులను, సుగ్రీవుడిని అకంపనుడు చంపగలడు అనే విశ్వాసము రావణునికి ఉంది. అకంపనుడి పరాక్రమం ముందు దేవతలు కూడా నిలువలేరు. అందుకని ఈసారి రామలక్ష్మణులను చంపే బాధ్యతను అకంపనుడికి అప్పగించాడు రావణుడు. రావణుని ఆజ్ఞను శిరసావహించిన అకంపనుడు తన అధీనంలో ఉన్న రాక్షస సైన్యమును యుద్ధమునకు సిద్ధం చేసాడు. వారు రకరకాలైన ఆయుధములు ధరించి అకంపనుడి వెంట యుద్ధమునకు బయలుదేరారు. అకంపనుడు తన రథమును ఎక్కి సైన్యమును ముందుండి నడిపించాడు. కాని ఎందుకో అకంపనుడి రథమునకు కట్టిన గుర్రములు దీనంగా కదులుతున్నాయి. దానికి తోడు అకంపనుడి ఎడమ కన్ను అదిరింది. ఎన్నో అపశకునములు కనిపించాయి. కాని అకంపనుడు తన పరాక్రమాన్ని నమ్ముకున్నాడు. ఈ అపశకునములను లెక్కచేయలేదు. కదనరంగాన...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై నాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 54)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము యాభై నాలుగవ సర్గ వానర నాయకుడు అంగదుని విజృంభణ, రాక్షస సైన్యము అంతకంతకూ తగ్గిపోవడం గమనించాడు వజ్రదంష్ట్రుడు. అతనిలో క్రోధము తారస్థాయికి చేరింది. తన ధనుస్సును ఎక్కుపెట్టి వానర సేనల మీద శరవర్షము కురిపించాడు. వజ్రదంష్ట్రుని అండచూచుకొని రాక్షసులు కూడా విజృంభించారు. ఇది చూచిన వానరులు చేతికి అందిన పర్వతశిలలను పెకలించి రాక్షసులమీదికి విసిరి, వారిని నుగ్గునుగ్గుచేస్తున్నారు. రాక్షసులు వివిధ ఆయుధముల తోనూ వానరులు వృక్షములు, పర్వతశిలలతోనూ యుద్ధం చేస్తున్నారు. రాక్షసులు ప్రయోగించిన ఆయుధములను కాచుకుంటూ, పర్వతశిలలనూ, వృక్షములనూ రాక్షసుల మీదకు విసురుతున్నారు వానరులు. ఇరుపక్షములలో ఉన్న సైనికులకు తలలు తెగిపోయాయి. కాళ్లు చేతులు తెగిపోయాయి. వారి శరీరముల నుండి కారిన రక్తము ఏరులైపారుతూ ఉంది. ఆ శరీరములను తినడానికి కాకులు గద్దలు ఆకాశంలో తిరుగుతున్నాయి. ఆ దృశ్యములను చూచిన పిరికి వారికి గుండె ఆగిపోవడం ఖాయం. అంత ఘోరంగా ఉంది రణరంగము. కాని ఎక్కువగా రాక్షససైన్యమునకే నష్టం జరిగింది. ఇది చూచిన వజ్రదంష్ట్రుడు తానే స్వయంగా వానర సేనను ఎదుర్కొన్నాడు. ఒక్కొక్క బాణానికి ఐదుగురు, పదిమంది, వాన...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 53)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము యాభై మూడవ సర్గ రాక్షసరాజు రావణునికి ధూమ్రాక్షుని దారుణ మరణం గురించి తెలిసింది. నిర్ఘాంత పోయాడు. కోపం వచ్చింది. బుసలు కొట్టాడు. వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుని పిలిపించాడు. "నీవు మహావీరుడవు. ఎన్నో యుద్ధములలో పాల్గొన్నావు. నీవు కావలసినంత సైన్యమును తీసుకొని వెళ్లి, రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని చంపి తిరిగిరా." అని అన్నాడు రావణుడు. రావణుని ఆదేశము ప్రకారము కోట్లకొలది రాక్షస సైన్యముతో వజ్రదంష్ట్రుడు వానరుల మీదికి యుద్ధానికి బయలు దేరాడు. అతని సేనలో గజములు, అశ్వములు, గాడిదలు, ఒంటెలు, రథములు ఉన్నాయి. వాటిని ఎక్కిన రాక్షసులు మహా బలవంతులు పరాక్రమవంతులు. వజ్రదంష్ట్రుడు కూడా ఒక మహాధనుస్సును చేత ధరించి యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెంట అశేష రాక్షస సైన్యము బయలుదేరింది. వారందరూ దక్షిణ ద్వారము నుండి బయటకు వచ్చారు. అక్కడ అంగదుడు తన సేనతో ఉన్నాడు. రాక్షసులకు దుశ్శకునములు గోచరించాయి. ఈ దుశ్శకునములను చూచి వజ్రదంష్ట్రుడు కలవర పడ్డాడు. అయినా ధైర్యంతో ముందుకు నడిచాడు. దక్షిణ ద్వారము నుండి బయటకు వచ్చిన రాక్షస సైన్యమును వానరులు చుట్టు ముట్టారు. రాక్షసులకు వానరులకు ఘోరయుద్...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 52)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము యాభై రెండవ సర్గ ధూమ్రాక్షుడు యుద్ధానికి రావడం చూచి వానరులు సంతోషించారు. మరొక రాక్షసుడు బలి కాబోతున్నాడు అని ఆనంద పడ్డారు. వానరులు రాక్షసులు తలపడ్డారు. వానరులు పెద్ద పెద్ద బండరాళ్లను, మహావృక్షములను ఆయుధములుగా ధరించి యుద్ధం చేస్తుంటే, రాక్షసులు పట్టిసములు, శూలములు, ముద్గరలు ధరించారు. ఇరుపక్షముల వారు సమానంగా చస్తున్నారు. కాకపోతే రాక్షసుల చేతిలో బాణాలున్నాయి. వానరుల చేతిలో వృక్షములు బండరాళ్లు ఉన్నాయి. రాక్షసులు తమ వద్ద ఉన్న పట్టిసములు, బల్లెములతో వానరులను చీలుస్తున్నారు. కాని వానరులు ఏ మాత్రం భయపడక ముందుకు చొచ్చుకువస్తున్నారు. వానరులు విసిరే బండరాళ్ల కింద వృక్షముల కింద పడి ఎంతోమంది రాక్షసులు మరణిస్తున్నారు. వానరులు రాక్షసులను తమ పేర్లు చెప్పి మరీ చంపుతున్నారు. బండరాళ్ల కింద, వృక్షముల కింద పడ్డ రాక్షసులు రక్తం కక్కుకొని చస్తున్నారు. వేలకొలది రాక్షసులు మహా వృక్షముల కిందపడి నుగ్గు నుగ్గు అవుతున్నారు. రాక్షసులే కాదు, వానరులు విసిరిన బండరాళ్ల వృక్షముల కిందపడి హయములు, ఏనుగులు కూడా ఛిన్నాభిన్నం అవుతున్నాయి. వాటి మీద ఎక్కిన రాక్షస వీరులు కూడా వాటి కాళ్ల కింపడి నుగ్గు ను...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై ఒకటవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 51)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము యాభై ఒకటవ సర్గ వానరులు చేసే సింహానాదాలు, విజయ దుందుభుల మోతలు రాక్షసుల చెవిన బడ్డాయి. రావణుడి చెవులకు కూడా సోకాయి. వెంటనే రావణుడు మంత్రులను పిలిపించాడు. అత్యవసర సమావేశము నిర్వహించాడు. "విన్నారుగా ఆ వానరుల జయజయధ్వానాలు. వారికేదో గొప్ప సంతోషము కలిగే సంఘటన జరిగినట్టు ఉంది. సందేహము లేదు. ఆ వానరుల కేకలకు సముద్రము కూడా దద్దరిల్లుతూ ఉంది. మన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను సర్పబాణములతో శరబంధనము చేసినాడు కదా! దీనవదనములతో శోకించక ఈ వానరులు చేసే జయజయధ్వానాలు నాలో ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి."అని పలికిన రావణుడు పక్కనే నిలబడి ఉన్న రాక్షస వీరులను చూచి ఇలా అన్నాడు. "రామలక్ష్మణుల మృతికి శోకించవలసిన సమయములో వానరులు ఈ ప్రకారంగా సంతోషంగా కేరింతలు కొట్టడానికి గల కారణం తెలుసుకొని రండు." అని ఆదేశించాడు. వెంటనే ఆ రాక్షస వీరులు లంకా నగర ప్రాకారముల మీదికి ఎక్కారు. వానర సైన్యమును జాగ్రత్తగా పరిశీలించారు. శరబంధనంతో నిర్జీవులుగా ఉండవలసిన రాముడు లక్ష్మణుడు సలక్షణంగా ఉండటం చూచారు. రామలక్ష్మణులు ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రకాశిస్తున్నారు. రాక్షసుల గుండెల్లో గుబులు రేగిం...