Posts

Showing posts from September, 2023

శ్రీమద్రామాయణం - బాలకాండ - పదిహేనవ సర్గ (Ramayanam - Balakanda - Part 15)

శ్రీమద్రామాయణము బాలకాండ పదిహేనవ సర్గ ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తరువాత దశరథునితో ఇలా అన్నాడు. “మహారాజా! తమకు పుత్ర సంతానము కలగడం కోసరం, మీకు పుత్ర సంతానమును కలిగించే ఒక ఇష్టిని (యాగమును) మీచేత చేయిస్తాను. ఈ యాగమును వేదములో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను.” అని పలికాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభం అయింది. వేద మంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. యా యజ్ఞములో హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు. “ ఓ బ్రహ్మదేవా! భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు. వాటిని మేము గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడు చేయు అకృత్యములను చూచీ చూడకుండా పోతున్నాము. తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. దిక్పాలకులను లెక్క చెయ్యడం లేదు. ఇంద్రునికూడా ధిక్కరిస్తున్నాడు. ఇంక భూ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - పదునాలుగవ సర్గ (Ramayanam - Balakanda - Part 14)

శ్రీమద్రామాయణము బాలకాండ పదునాలుగవ సర్గ ఒక సంవత్సరకాలం గడిచింది. అశ్వమేధయాగముకొరకు వదిలి పెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు. వేదవిదులయిన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్ణ్యము, ఉపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమలతను నలగగొట్టి రసము తీసారు. దీనితో యాగములో మాధ్యందిన సవము వేదోక్తముగా చేసారు. తరువాత ఋత్తిక్కులు దశరధునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేసారు. ఆ యాగములో ఏ చిన్న తప్పుకూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ యాగమునకు వచ్చిన బాహ్మణుల కందరకూ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణులు, రాజాధిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేసారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు. వచ్చిన ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - పదమూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 13)

శ్రీమద్రామాయణము బాలకాండ పదమూడవ సర్గ యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక సంవత్సరము పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు.  పురోహితులైన వశిష్టులకు బాహ్మణులకు నమస్కరించాడు. “మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి." అని వారిని ప్రార్థించాడు. “మహారాజా! మీరు కోరినట్లే జరుగుతుంది" అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తరువాత పురోహితుడైన వశిష్టుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తు శిల్పులను, శిల్పులను, కొయ్యపనిచేసే వారిని, మట్టిపని చేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, గాయకులను, చారిత్రకారులను, వీటన్నిటికీ లెక్కలు కట్టుటకు గణకులను, ఇంకా ఇతర రంగములలో నిష్ణాతులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు.  “దశరథమహారాజు గారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఏలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా...

శ్రీమద్రామాయణం - బాలకాండ - పన్నెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 12)

 శ్రీమద్రామాయణము బాలకాండ పన్నెండవ సర్గ వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్టుడైన ఋష్యశృంగుని వద్దకుపోయి తనకు పుత్రసంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్ధించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు. “ ఓ దశరథ మహారాజా! అటులనే కానిమ్ము. నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను. తరువాత పుత్ర సంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి, దానిని యజ్ఞాశ్వముగా విడువుము." అని అన్నాడు. ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు. “సుమంతా! మనము అశ్వమేధయాగము చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వసిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము," అని ఆదేశించాడు. సుమంతుడు దశరధుని ఆజ్ఞ ప్రకారము అందరినీ సమావేశపరిచాడు. దశరధుడు వారినందరినీ పూజించి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు. “బాహ్మణోత్తములారా! నేను అశ్వమేధయాగము చేయబోతున్నాను. ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - పదకొండవ సర్గ (Ramayanam - Balakanda - Part 11)

  శ్రీమద్రామాయణము బాలకాండ పదకొండవ సర్గ "ఓ దశరథమహారాజా! తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి. 'రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు, శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్రసంతానము కలుగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్లి ఋశ్యశృంగుని అయోధ్యకు పంపమని, తనకు పుత్రసంతానము కలిగేట్టు ఒకయాగం చేయించమని అర్థిస్తాడు. దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు, వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు.' అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను. కాబట్టి ఓ దశరథ మహారాజా! ఆ మహాఋషి మాటలు తప్పవు. నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము. యజ్ఞము చేయింపుము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది." అని సుమంతుడు చెప్పాడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్టుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అం...

శ్రీమద్రామాయణం - బాలకాండ - పదవ సర్గ (Ramayanam - Balakanda - Part 10)

శ్రీమద్రామాయణము బాలకాండ పదవ సర్గ దశరథుడు అడిగినప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు. “మహారాజా! రోమపాదుని మంత్రులు రోమపాదునితో ఇలా చెప్పారు. "మహారాజా! ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటినుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు. అతడికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని మనము కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావవిలాసములతో ఋష్యశృంగుని ఆకర్షించి మన నగరమునకు రప్పించెదము." అని అన్నారు.  దానికి రోమపాదుడు అంగీకరించాడు. వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను రావించి వారిగి తగిన విధంగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమము వద్దకు పంపారు. ఆ వేశ్యలు విభాండకుడు ఆశ్రమములో లేని సమయములో ఋష్యశృంగుని వద్దకు వెళ్లారు. ఋష్యశృంగునికి కనపడేటట్టు అటూ ఇటూ తిరగ సాగారు. ఋష్యశృంగునికి వారు వింతగా కనపడ్డారు. ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు. వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నారు. అతడు వారి వద్దకు వెళ్లాడు.  ఆ వేశ్యలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు. “ఓ బ్రాహ్మణోత్తమా! మీరు ఎవరు? ఇక్కడు ఏమి చేస్తున్నారు.” అని అడిగారు. “నేను విభాండకుని పుత్రుడను. నాపేరు ఋష్...

శ్రీమద్రామాయణం - బాలకాండ - తొమ్మిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 9)

శ్రీమద్రామాయణము బాలకాండ తొమ్మిదవ సర్గ ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు. "మహారాజా! ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను. తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను. అదేమిటంటే,  కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తన తండ్రి, తాను ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు. అతను లోక ప్రసిద్ధము లైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించిన వాడు. ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమములు కలవాడు. అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు. ఆ రాజు అధర్మ ప్రవర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు. వెంటనే తనరాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు. “ఓ బ్రాహ్మణులారా! మీకు అన్ని ధర్మములు తెలుసు. ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగి పోవడానికి మంచి ఉపాయము చెప్పండి." అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు. “ఓ మహారాజ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఎనిమిదవ సర్గ (Ramayanam - Balakanda - Part 8)

శ్రీమద్రామాయణము బాలకాండ ఎనిమిదవ సర్గ అటువంటి పుణ్యచరితుడైన దశరధమహారాజుకు చాలా కాలం వరకూ పుత్రసంతానము కలగలేదు. వంశాంకురము లేడని దశరధ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు. పుత్రులు కలగడానికి అశ్వమేధ యాగము చేయడానికి నిశ్యయించాడు. వెంటనే మంత్రులను పిలిపించాడు. వారితో సంప్రదించాడు. మంత్రి సుమంతుని తన గురువులను, పురోహితులను పిలిపించమని ఆదేశించాడు. దశరధుని ఆదేశము మేరకు పురోహితులైన వశిష్టవామదేవులను, సుయజ్ఞుడు, జాబాలి, కశ్యపుడు, ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకొని వచ్చాడు సుమంతుడు. దశరథుడు వారి నందరినీ సాదరంగా ఆహ్వానించి పూజించి ఉ చితాసనముల మీద కూర్చో పెట్టాడు. “మహాత్ములారా! మీకు తెలుసు కదా! నాకు పుత్రసంతానము లేరు. ఈ విషయము నన్ను నిరంతరమూ బాధించుచున్నది. పుత్రసంతానము కొరకు నేను అశ్వమేధ యాగము చేయదలచుకొన్నాను. ఆ యాగము ఎలా చేయవలెనో మీరు చెప్పండి." అని అడిగాడు. దశరధుని నిర్ణయమును వశిష్టవామదేవులు ప్రశంసించారు. "ఓ దశరథమహారాజా! మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజస మైనదే. మీకు తప్పక పుత్రసంతానము కలుగుతుంది. మీరు వెంటనే ఒక ఉత్తమాశ్వమును విడిచిపెట్టండి." అని పలికారు. ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు. ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 7)

 శ్రీమద్రామాయణము బాలకాండ ఏడవ సర్గ ఆవిధంగా అయోధ్యను పరిపాలిస్తున్న శ్రీ దశరథ మహారాజునకు సమర్ధులైన అమాత్యులు ఉండేవారు. దశరథుని మంత్రులు ఎంతో గుణవంతులు. మంచి లోకజ్ఞానము, నేర్పు కలవారు. ఎల్లప్పుడు రాజు క్షేమము కోరుతూ రాజుకు హితమైన పనులు చేసేవారు. నీతి మంతులు. అటువంటి మంత్రులు దశరథునికి ఎనిమిది మంది ఉండేవారు. వారి పేర్లు ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంతుడు. వీరుగాక వసిష్ఠుడు, వామదేవుడు అనే పురోహితులు ఉండేవారు. పైన చెప్పిన మంత్రులు కాక ఉపమంత్రులు కూడా ఉండే వారు. వారందరూ అన్ని విద్యలందూ నేర్పరులు, బుద్ధిమంతులు, ఇంద్రియములను నిగ్రహించినవారు, శ్రీమంతులు, గొప్పవారు, శాస్త్రపరిజ్ఞానము కలవారు, పరాక్రమ వంతులు, కీర్తిమంతులు, కార్యశూరులు, చెప్పిన పని చేసేవారు, మంచి తేజస్సు కలవారు, క్షమాగుణము కలవారు. ఎప్పుడూ చిరునవ్వుతో మృదువుగా మాట్లాడే గుణము కలవారు. కోపంలో గానీ, కామ ప్రకోపము వలన గానీ, ధనము కోసం గానీ, అబద్ధము చెప్పరు.  వారు గూఢ చారుల ద్వారా స్వదేశములో గానీ, పరదేశములో గానీ ఏమేమి జరుగుతూ ఉందో తగిన సమాచారము ఎప్పటికప్పుడు తెప్పించుకొనుచుండెడివారు. తన ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 6)

 శ్రీమద్రామాయణము. బాలకాండ ఆరవ సర్గ అయోధ్యానగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేసాడు, పండితులను పూజించాడు, అమితమైన పరాక్రమ వంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించే వాడు. దశరథుడు ఎన్నో యజ్ఞములను యాగములను చేసాడు, రాజర్షి. దశరథుని మంచితనము మూడులోకములలో చెప్పుకొనెడి వారు. దశరథుడు తన శత్రువులకు భయంకరుడు. తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకొనే నేర్పుకలవాడు. అధిక మైన సంపదలు కలవాడు. అన్నింటికంటే గొప్ప విషయం దశరథుడు తన ఇంద్రియములను జయించిన వాడు. జితేంద్రియుడు అని పేరుగాంచాడు. దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడు వాడు. అసత్యము అన్నది ఎరుగడు. పూర్వము మనువు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు. ఇంక అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు. నిత్యసంతోషులు. ఉన్నదానితో తృప్తిపడేవారు. ధర్మము తప్పని వారు.  వేదములను చదివినవారు. అత్యాశాపరులు కారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికెడి వారు. దశరధుని రాజ్యములో పేదవాడు గానీ, విద్యలేని వాడు కానీ మచ్చుకు కూడా కానరాడు. అలాగే కాముకులు, లోభులు, క్రూరులు, నాస్తికులు కూడా వెదికినా దొరకరు. అయోధ్యలోని స్త్రీలు ...

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఐదవ సర్గ (Ramayanam - Balakanda - Part 5)

 శ్రీమద్రామాయణము. బాలకాండ ఐదవ సర్గ రామాయణ కథా ప్రారంభము. పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరమును తవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశములోని వాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవారు. ప్రస్తుతము మనము చదువుతున్న రామాయణము కూడా ఆ ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర. సరయూ నదీ తీరంలో కోసల దేశము ఉండేది. ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్ఠులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. నటీనటులు ఉండేవారు. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి. ఆ నగరము చుట్టు శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి. ఆ ప్రాకారము వెలుపల లోతైన అగడ్త ఉండేది.  ఆ నగరములో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ, కప్పము కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరములో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము సమతల ప్రదేశములో నిర్మింపబడినది. ఆ నగరములో గృహములు...

శ్రీమద్రామాయణం - బాలకాండ - నాల్గవ సర్గ (Ramayanam - Balakanda - Part 4)

 శ్రీమద్రామాయణము. బాలకాండ నాల్గవ సర్గ వాల్మీకి మహర్షి రామాయణ మహా కావ్యమును 24,000 శ్లోకములలో, 500 సర్గలలో, ఆరు కాండలలో, రామ పట్టాభిషేకము, మరియు అశ్వమేధ యాగము వరకు రచించాడు. తరువాత ఘట్టములను ఉత్తర కాండలో రచించాడు. రామాయణ కధను చక్కగా పఠించగలవారు ఎవరా అని ఆలోచించాడు వాల్మీకి. ఆ ప్రకారంగా ఆలోచిస్తున్న వాల్మీకికి ముని వేషధారులైన ఇద్దరు గాయకులు తారసిల్లారు. వారిపేరు కుశలవులు. వాల్మీకి ఆశ్రమంలో ఉన్న వారు కుశలవులను చూచి ఎంతో సంతోషించారు. వాల్మీకి తాను రచించిన రామాయణమును ఆ కుశలవులకు ఉపదేశించాడు. వాల్మీకి రచించిన రామ కధను, రామాయణము అనీ, సీతా చరితము అనీ, పౌలస్త్య వధ అనీ పిలువ సాగారు. వాల్మీకి ఉపదేశించిన రామాయణమును కుశలవులు శ్రావ్యమైన కంఠంతో, శృతిలయలు తప్పకుండా మృదు మధురంగా గానముచేయసాగారు. ఇంకొక విశేషము ఏమంటే ఆ కుశలవులు రాముని పోలికలతో విరాజిల్లుతున్నారు. వారు ఇరువురూ గంధర్వ కుమారులవలె వెలిగిపోతున్నారు. వారు రామాయణమును అర్థవంతంగా, శృతిబద్ధంగా గానం చేస్తున్నారు. కుశలవులు రామాయణమును పూర్తిగా కంఠస్థము చేసారు. వాల్మీకి వారికి ఏ ప్రకారంగా ఉపదేశించారో అదే ప్రకారముగా, ఋషుల సమక్షము లోనూ, బ్రాహ్మణుల స...

శ్రీమద్రామాయణం - బాలకాండ - మూడవ సర్గ (Ramayanam - Balakanda - Part 3)

  శ్రీమద్రామాయణము బాలకాండ మూడవ  సర్గ తనకు నారద మహర్షి చెప్పిన రామ కథ సమగ్రమైనదా లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచిం చాడు. తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేసాడు. తూర్పు దిక్కుగా ముఖం పెట్టి ధర్భాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు. నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు. దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేసారో, ఏమేమి మనసులో అనుకున్నారో, ఆలోచించారో, రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేసారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ ఏ దారుల వెంట నడిచారో, ఎక్కడెక్కడ నివసించారో, రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో ఎక్కడెక్కడ నివసించారో, ఆ విషయములనన్నింటినీ ఆమూలాగ్రంగా, యధాతథంగా తన యోగదృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు. మహాతపస్వి అయిన వాల్మీకికి రామ చరిత్ర అంతా కరతలామలకము అంటే చేతిలో ఉసిరిక కాయ మాదిరి స్పష్టంగా కనపడింది. ఆ ప్రకారంగా మహా తపస్వి అయిన వాల్మీకి రామ చరిత్రను దర్శించిన తరువాత, తాను చూచినది చూచినట్టు, నాలుగు పురుషార్థములు అయిన ధర్మార్ధకామ మోక్షములలో, ధర్మము ఎక్కువ ప్...

శ్రీమద్రామాయణం - బాలకాండ - రెండవ సర్గ (Ramayanam - Balakanda - Part 2)

శ్రీమద్రామాయణము బాలకాండ రెండవ సర్గ నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్మీకి మహర్షి, మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు. తరువాత నారదుడు దేవలోకము వెళ్లిపోయాడు. తరువాత వాల్మీకి మహర్షి తమసానదీ తీరమునకు వెళ్లాడు. ఏ మాత్రం మలినము లేని ఒక రేవు వద్దకు వెళ్లాడు. తన శిష్యుని తనకు కావలసిన పాత్ర, నార బట్టలు తెమ్మన్నాడు వాల్మీకి. ఆ రేవులో స్నానం చేయడానికి సంకల్పించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకికి చెంబు, నార బట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకొని వాల్మీకి ఆ వనమంతా ఒక సారి కలయ చూచాడు. కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణముతో నిర్దయగా కొట్టి చంపాడు. ఆమగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూచి ఆడ పక్షి ఎంతో దుఃఖించింది. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న ఆడ పక్షిని చూచాడు వాల్మీకి. ఆయన మనస్సు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవానిని చూచి ఇలా అన్నాడు. "ఓయీ బోయవాడా! నీవు మన్మధావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒక చంపావు కాబట్టి నీవు కూడా ...

Who is the Perfect Man? The Question That Sparked the Ramayana

Image
Who is the Perfect Man? The Question That Sparked the Ramayana Decoder's Preface: The first chapter of the Ramayana is unique. Before the story begins, the epic itself is foretold. It starts with a simple but profound question from the sage Valmiki to the celestial traveler Narada: "Does a perfect man exist in our world?" Narada's response is not just an answer; it is the entire Ramayana in miniature, a blueprint of the hero whose story would define Dharma for millennia. Let's decode this foundational moment. The Full Video Analysis For a complete visual and audio deep dive, watch our full video on this topic below. The Sage's Search for an Ideal Hero The great sage Valmiki approached the divine Narada, who travels all the worlds, and posed a question born of deep curiosity. "ఓ నారద మహర్షీ! ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్ర మవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటి వారి ఎడల ఆదర భావము కలవాడు, చేసినమేలు మరువని వాడు, ఎల్లప్పుడూ...