Posts

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 67)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై ఏడవ సర్గ పారిపోయి తిరిగివచ్చిన వానర వీరులు ప్రాణాలకు తెగించి యుద్ధంచేస్తున్నారు. వారు పెద్ద పెద్ద వృక్షములను, గండ శిలలను, పర్వత శిఖరములను తీసుకొని కుంభకర్ణుని మీదికి విసురుతున్నారు. కుంభకర్ణుడు తన గదను అటు ఇటు ఊపుతూ వానరులను చెదరగొడుతున్నాడు. ఆ చెదర గొట్టడంలో వందలు వేలు వానరులు దూరంగా విసిరివేయబడుతున్నారు. కుంభ కర్ణుడు వందల కొద్దీ వానరులను రెండు చేతులతో పట్టుకొని నోట్లో కుక్కుకొని తింటున్నాడు. అయినా వానరులు కుంభకర్ణుని మీదికి వృక్షములు, రాళ్లు విసురుతూ యుద్ధం చేస్తున్నారు. ఇంతలో ద్వివిదుడు ఒక పర్వత శిఖరమును పెకలించి చేతపట్టుకొని కుంభకర్ణుని వైపుకు పరుగెత్తాడు. ద్వివిదుడు ఆ పర్వతమును తీసుకొని పైకి ఎగిరి దానిని కుంభకర్ణుని మీదికి విసిరాడు. ఆ పర్వత శిఖరము కుంభకర్ణుని మీద పడకుండా రాక్షససేనల మీద పడింది. ఆ పర్వతము కిందపడి వందలకొద్దీ రాక్షసులు మరణించారు. అది చూచిన రాక్షస సైనికులు వానరుల మీద పడి బాణములతో వానరుల శిరస్సులను బంతుల మాదిరి ఎగురగొడుతున్నారు. వానరులు కూడా పెద్ద పెద్దవృక్షములను బండరాళ్లను తీసుకొని రాక్షసులను చంపుతున్నారు. హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 66)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై ఆరవ సర్గ కుంభకర్ణుని చూచి పారిపోతున్న వానరులలో వానర ప్రముఖులైన నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు మొదలగువారు ఉన్నారు. ఆ ప్రకారంగా పారిపోతున్న వానర ప్రముఖులను చూచి అంగదుడు ఇలా అన్నాడు.  “ఓ వానరవీరులారా! ఒక రాక్షసుని చూచి ఇలా పారిపోవడం ధర్మమా! మీరు ఎంతటి ఉన్నత కుటుంబంలో జన్మించారు. ఒక నీచ రాక్షసునికి భయపడు తున్నారా! అయినా పారిపోయి ఎక్కడికి పోతారు! ఎంత దూరం పోతారు! వెనక్కురండి. ఇతడు రాక్షసుడు కాడు. మనలను భయపెట్టడానికి రాక్షసులు సృష్టించిన పెద్ద విగ్రహము. రండి. మనమందరమూ కలిసి ఈ బొమ్మను తునాతునకలు చేద్దాము.” అని ఎలుగెత్తి అరిచాడు. అంగదుని మాటలకు వానరులకు ధైర్యము వచ్చింది. పారిపోయిన వాళ్లు తిరిగి వచ్చారు. చేతికి అందిన వృక్షములను, పర్వత శిఖరములను పట్టుకొని యుద్ధమునకు సిద్ధం అయ్యారు. ఆ కుంభకర్ణుని చుట్టూ చేరి వాడిని వృక్షములతో పర్వతశిఖరములతో కొట్టారు. ఆ వానరులు కొట్టే దెబ్బలు కుంభకర్ణునికి చీమకుట్టినట్టయినా లేదు. కుంభకర్ణుని మీదకు విసిరిన వృక్షములు, పర్వతశిఖరములు కుంభకర్ణుని శరీరమునకు తగిలి తునాతునకలై పోతున్నాయి. కుంభకర్ణుడు కోపించి వానరసేనలను తన ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 65)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై ఐదవ సర్గ మహోదరుని మాటలు విన్న కుంభకర్ణునికి మిక్కుటంగా కోపం వచ్చింది. మహోదరుని ఒక్కసారిగా విదిలించి కొట్టాడు. తన అన్న రావణుని చూచి ఇలా అన్నాడు. “రాక్షసేంద్రా! నీవు నిశ్చింతగా ఉండు. నేను యుద్ధభూమికి పోయి ఆ రామలక్ష్మణులను చంపి నీ భయాన్ని పోగొడతాను. నావంటి శూరులు నీరులేని మేఘముల వలె ఊరికే గర్జించరు. నేను నా పరాక్రమము యుద్ధభూమిలో చూపిస్తాను కానీ మాటలలో చూపించను. నా వంటి శూరుడు తనను తాను పొగుడుకోడు. తనకు శక్యము కాని పనులను కూడా చేసి చూపిస్తాడు. ఓ మహోదరా! నీ వంటి వారు పలికే మాటలు తమను తాము గొప్పవారము అనుకొనే రాజులు వింటారు కానీ రావణుడు కాదు. మీరు పిరికి పందలు. మీకు యుద్ధము అంటే భయము. కుయుక్తులు, కుతంత్రములతో పని కానిద్దామంటారు. రాజు దగ్గర ప్రగల్భాలు పలుకుతూ రాజు మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాజును అపకీర్తిపాలు చేస్తుంటారు. రావణుని హితం కోరేవారు, రావణునికి మంచి సలహాలు చెప్పేవారు ఈ లంకలో లేనట్టుంది. పాపము రావణుడు ఒంటరివాడయ్యాడు. ఇప్పటి దాకా మీరు చేసిన తప్పులను నేను సరిదిద్దుతాను. ఇప్పుడే యుద్ధమునకు బయలుదేరుతున్నాను." అని అన్నాడు కుంభకర్ణుడు. కుంభ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై నాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 64)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై నాలుగవ సర్గ కుంభకర్ణుడు రావణునితో పలికిన పలుకులు అన్నీ పక్కనే కూర్చుని ఉన్న మహెూదరుడు విన్నాడు. మహోదరుడు కుంభకర్ణునితో ఇలా అన్నాడు. “ఓ కుంభకర్ణా! నీవు ఉన్నత వంశంలో జన్మించావు. కాని ఉన్నతంగా ఆలోచించడం లేదు. గర్వంతో ఎప్పుడు ఏమి చెయ్యాలో తెలియకుండా మాట్లాడుతున్నావు. రావణుడు మహారాజు. ఆయనకు తెలియని నీతి లేదు. నీవు ఇప్పుడు రావణునికి నీతులు చెప్ప పనిలేదు. ఏదో బాల్యచాపల్యంతో మాట్లాడుతున్నావు. రావణుడు లంకాధిపతి. దేశ కాలములను బాగా ఎరిగిన వాడు. ఎప్పుడు ఎక్కడ ఏ పని చెయ్యాలో తెలిసినవాడు. తాను చేయబోయే పని గురించి మంచి చెడ్డలు బాగా తెలిసినవాడు. నీవు ధర్మము అర్థము కామము గురించి మాట్లాడావు. కానీ వాటి లక్షణముల గురించి, స్వరూప స్వభావముల గురించి నీకు తెలుసా! సుఖం కలిగినా దు:ఖము కలిగినా, దానికి ముందు చేసిన కర్మలే కారణము. కానీ ఒక్కోసారి చెడ్డపనులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ధర్మం కోసరం చేసే పనులూ, అధర్మం కోసం చేసే పనులూ రెండూ శ్రేయస్సును కలుగచేస్తాయి. ఒక్కోసారి ధర్మం కొరకు చేసే పనులు కీడును కలిగిస్తాయి. పురుషులు ఈ లోకానికి పరలోకానికి పనికి వచ్చే కర్మలను కోరికలతో చేస్తూ ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 63)

శ్రీమద్రామాయణము యుద్ధ కాండము అరవై మూడవ సర్గ ముల్లోకములను గడగడలాడించిన పరాక్రమవంతుడు అయిన రావణుడు తన ముందు అంత దీనంగా మాట్లాడటం చూచి కుంభకర్ణుడు బిగ్గరగా నవ్వాడు. రావణునితో ఇలా అన్నాడు. “అన్నా రావణా! నాకు చూడగా, నీవు నీ మంత్రులతో చర్చించినపుడు, వారు చెప్పిన మంచి మాటలను చెవిని పెట్టినట్టులేదు. అందుకే నీకు ఈ ఆపదకలిగింది. అవునా! ఇది ఎవరో చేసినది కాదు. నీవు చేసుకున్న దుష్కర్మ నీకు ఈ కష్టములను తెచ్చిపెట్టింది. నీవు దుష్కార్యమును చేసావు. అది చేయబోయే ముందు ఎవరితోనన్నా ఆలోచించావా! బాగోగులు విచారించావా! ఆ చేయబోయే పనికి ఫలితం ఎలా ఉంటుందో ఊహించావా! ఇవేమీ ఆలోచించకుండా చేయకూడని పనులు చేసి ఇప్పుడు చింతించి ఏమి ప్రయోజనము. నీకు బలము, దర్ఘము, పరాక్రమము ఉంది కదా అని చేయకూడని పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇంకా దారుణంగా కూడా ఉంటుంది. నీవు లంకాధీశుడవు. నీకు తగ్గపనులు చెయ్యాలి కానీ, నీవు చేయకూడని పనులు చేయడం ధర్మమా! ఒక పని చేసే ముందు దేశ, కాలములు అనుకూలంగా ఉన్నవా లేవా అని చూచుకోవాలి కదా! ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చేసెయ్యడమేనా! ఏ పని చేసే ముందు అయినా మంత్రులతో మంచి చెడ్డల...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 62)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై రెండవ సర్గ కుంభకర్ణుడు లంకా నగర రాజమార్గములో నడుస్తున్నాడు. రావణుని మందిరము చేరుకున్నాడు. కుంభకర్ణుని దూరం నుండి చూచాడు రావణుడు. సింహాసనము మీది నుండి లేచి కుంభకర్ణునికి ఎదురుపోయి ప్రేమతో కౌగలించుకున్నాడు. కుంభకర్ణుడు రావణునికి పాదాభివందనము చేసాడు. “అన్నా రావణా! నన్ను ఎందుకునిద్ర లేపారు? నేను ఏమి చెయ్యాలి?" అని సూటిగా అడిగాడు. అప్పుడు రావణుడు ఇలా అన్నాడు. "తమ్ముడా కుంభకర్ణా! నీవు చాలా కాలము కిందట నిద్రకు ఉపక్రమించావు. ఈ లోపల చాలా విషయాలు జరిగాయి. ఇటీవల నాకు రాముడు అనే నరుని వలన కలిగిన భయం గురించి నీకు తెలియదు. ఈ రాముడు అయోధ్య రాజైన దశరథుని కుమారుడు. ఇతని స్నేహితుడు సుగ్రీవుడు అనే వానరుడు. రాముడు, సుగ్రీవుని సాయంతో సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు. లంకానగరాన్ని ముట్టడించాడు. లంకను ఆక్రమించాడు. ఎక్కడ చూచినా వానరులే. ఈ వానరయోధులు మన రాక్షస వీరులను ప్రముఖులను ఎంతోమందిని చంపారు. వానరులకు కలిగిన నష్టం కంటే మనకు జరిగిన నష్టం అపారము. ఈ వానరులు ఎప్పుడూ యుద్ధం చేసినట్టు గానీ అందులో ఓడిపోయినట్టు గానీ కనపడదు. ఈ విధంగా నాకు నరులతో, వానరులతో భయం కలిగింది. ...

శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఒకటవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 61)

శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై ఒకటవ సర్గ రాముడు కూడా ఆకాశం అంత ఎత్తున ఉన్న కుంభకర్ణుని చూచాడు. ఆ అనూహ్యమైన ఆకారమును చూచి పారిపోతున్న వానరములను చూచాడు. ఆశ్చర్యపోయాడు. విభీషణుని చూచి ఇలా అన్నాడు. “విభీషణా! ఆకాశమంత ఎత్తున ఉన్న ఈ ఆకారము ఎవరు? ఇంత పెద్ద దేహము కలవాడు ఈ భూమి మీద వీడు ఒక్కడే ఉన్నట్టు ఉంది. వీడు ఎవరు? వీడి పేరేమి? వీడు అసురుడా, రాక్షసుడా, లేక వేరే జాతి ప్రాణియా. ఎందుకంటే నేను ఇంతవరకూ ఇటువంటి ప్రాణిని భూమి మీద చూడలేదు." అని అన్నాడు. అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు. “ఓ రామా! ఇతని పేరు కుంభకర్ణుడు. రావణుని సోదరుడు. ఇతడు విశ్రవసుని కుమారుడు. యుద్ధములో ఇంద్రుని, యముడిని ఓడించాడు. రాక్షస జాతిలో ఇంత దేహము కల రాక్షసుడు ఎవరూ లేరు. ఇతడు దేవతలను, గంధర్వులను, పన్నగులను, దానవులను, యక్షులను, విద్యాధరులను ఓడించాడు. ఇతడు శూలం ధరించి యుద్ధభూమిలో తిరుగుతుంటే సాక్షాత్తు యముడు తిరిగినట్టు ఉంటుంది. ఇతడు సహజ బలసంపన్నుడు. ఈ కుంభకర్ణుడు పుట్టీ పుట్ట గానే వేలకొలది ప్రాణులను భక్షించాడు. వీడికి ఆకలి ఎక్కువ. దొరికిన దానిని దొరికినట్టు తినేసేవాడు. వాడు అలా తినడం మొదలెడితే భూమి మీద కొంతకాలానికి ప్రాణి ...