శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ప్రధమ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 1)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ప్రధమ సర్గ
భరతుడు తన మేనమామతో కూడా తాత గారి ఇంటికి వెళ్లాడు. తనతో కూడా శత్రుఘ్నుని తీసుకొని వెళ్లాడు. భరత శత్రుఘ్నులు మేనమామ ఇంట్లో సుఖసంతోషాలతో ఉన్నప్పటికీ, అయోధ్యలో ఉన్న తల్లి తండ్రు లను మరిచిపోలేదు. ప్రతిరోజూ తమ తల్లి తండ్రులను మనసారా తల్చుకుంటూ ఉన్నారు.అదే ప్రకారంగా దశరథుడు కూడా తన కుమారులు భరత శత్రుఘ్నులు ఏం చేస్తున్నారో ఏమో అని ప్రతి రోజూ తల్చుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే దశరథునికి తన నలుగురు కుమారులను
సమానంగా ప్రేమించాడు, ఆదరించాడు. అందుకనీ భరత శత్రుఘ్నులు తన ఎదుట లేకపోయినా అనుదినమూ వారిని తల్చుకుంటూ ఉండేవాడు.
కాని తన నలుగురు కుమారులలోనూ పెద్ద కుమారుడు రాముడు అంటే దశరథునకు ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువగా ఉండేవి. కౌసల్యకు కూడా రాముడు అంటే పంచప్రాణాలు. రాముని విడిచి ఒక్కనిముషం కూడా ఉండేది కాదు. ఇంక రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు.
రాముడు మంచి రూపవంతుడు. శౌర్యవంతుడు. పైగా దశరథుని కుమారుడు. రాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండేవాడు. అందరితో మృదువుగా మాట్లాడేవాడు. తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే కాని వారితో పరుషంగా మాట్లాడేవాడు కాదు.
రాముడు అల్ప సంతోషి. ఎవరైనా తనకు చిన్న ఉపకారము చేసినా అమితంగా సంతోషించేవాడు. తనకు ఎవరు ఎన్ని అపకార ములు చేసినా వాటిని మనసులో పెట్టుకొనే వాడు కాదు. రాముడు అస్త్రవిద్య శస్త్ర విద్యలు సాధన చేసేవాడు. తీరిక సమయములలో వయోవృద్ధులు జ్ఞానవృద్ధుల వద్దకు పోయి మంచి విషయములు నేర్చుకొనే వాడు. అంతేగాని వినోద విలాసములతో సమయమును వృధాచేసేవాడు కాదు.
రాముడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవాడు. ముందు తనే అందరినీ పలుకరించి వారి యోగక్షేమములు అడిగి తెలుసుకొనేవాడు. తాను అమితమైన పరాక్రమ వంతుడైనను కొంచెం కూడా గర్వము లేకుండా అందరితో కలిసిపోయేవాడు.
రాముడికి ఉన్న మరొక మంచి లక్షణము రాముడు ఎన్నడూ అసత్యము పలికేవాడు కాదు. బ్రాహ్మణులను, పెద్దలను గౌరవించే వాడు. ప్రజలు తనను ఏ ప్రకారం గౌరవిస్తారో అదే ప్రకారము రాముడు కూడా పజలను గౌరవించేవాడు. రాముడికి కోపం అంటే ఏమిటో తెలియదు. అందరి మీద దయకలిగి ఉండేవాడు. దీనులను చూచి జాలిపడేవాడు. తోచిన సహాయము చేసేవాడు.
రాముడు ధర్మపరుడు. సకల ధర్మములను తెలిసినవాడు. కానీ ఏమీ తెలియనట్టు ఉండేవాడు. తనకు అన్నీ తెలుసు అని గర్వించేవాడు కాదు. రాముడు మచ్చలేని మానవుడు. ఇంద్రియము లను అదుపులో ఉంచుకొని ప్రవర్తించేవాడు. రాముడు క్షత్రియుడు. అందుకని తన స్వధర్మము అయిన క్షత్రియ ధర్మమును ఆచరించే వాడు. రాముడు తనకు కానీ, ఇతరులకు కానీ కీడు చేసే కార్యముల యందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. ధర్మవిరుద్ధంగా ఏ పనీ చేసేవాడు కాదు. ఎదుటి వారి ఆంతర్యమును గ్రహించి తగు విధంగా నేర్పుగా మాట్లాడేవాడు.
రాముడు తన ఆరోగ్యమును చక్కగ కాపాడుకొనేవాడు. ఎలాంటి దురలవాట్లకు లోనయ్యేవాడు కాదు. ఏ కాలములో ఎలా ఉండాలో, ఏ పని చెయ్యాలో తెలుసుకొని అలా ఉండేవాడు, ఆ పనులే చేసేవాడు. సాటివారలలో సాధువర్తనుడు అని పేరుతెచ్చుకున్నాడు. అంతేకాదు అయోధ్యపుర ప్రజలలో కూడా రాముడు సాధు వర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు.
రాముడు ధర్మపరుడు. సకల ధర్మములను తెలిసినవాడు. కానీ ఏమీ తెలియనట్టు ఉండేవాడు. తనకు అన్నీ తెలుసు అని గర్వించేవాడు కాదు. రాముడు మచ్చలేని మానవుడు. ఇంద్రియము లను అదుపులో ఉంచుకొని ప్రవర్తించేవాడు. రాముడు క్షత్రియుడు. అందుకని తన స్వధర్మము అయిన క్షత్రియ ధర్మమును ఆచరించే వాడు. రాముడు తనకు కానీ, ఇతరులకు కానీ కీడు చేసే కార్యముల యందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. ధర్మవిరుద్ధంగా ఏ పనీ చేసేవాడు కాదు. ఎదుటి వారి ఆంతర్యమును గ్రహించి తగు విధంగా నేర్పుగా మాట్లాడేవాడు.
రాముడు తన ఆరోగ్యమును చక్కగ కాపాడుకొనేవాడు. ఎలాంటి దురలవాట్లకు లోనయ్యేవాడు కాదు. ఏ కాలములో ఎలా ఉండాలో, ఏ పని చెయ్యాలో తెలుసుకొని అలా ఉండేవాడు, ఆ పనులే చేసేవాడు. సాటివారలలో సాధువర్తనుడు అని పేరుతెచ్చుకున్నాడు. అంతేకాదు అయోధ్యపుర ప్రజలలో కూడా రాముడు సాధు వర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు.
అటువంటి రాముడు విద్యాభ్యాసము పూర్తి చేసు కున్నాడు. వేద వేదాంగములలో ప్రావీణ్యము సంపాదించాడు. ధనుర్విద్యలో తండ్రి దశరథుని మించిపోయాడు. తాను జన్మించిన ఇక్ష్వాకు వంశమునకు తన సద్గుణములతో వన్నె తెచ్చే వాడయ్యాడు. పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము వీటి గురించిన తత్త్వమును బాగా ఆకళింపు చేసుకొని తదనుగుణంగా నడుచుకొనేవాడు. క్షత్రియోచితములైన ఆచార వ్యవహారములను చక్కగా అనుసరించేవాడు.
రాముడు తనలోని ఆలోచనలను పైకి కనపడనీయడు. పైకి నవ్వుతూనే ఉండేవాడు. మనసులోని భావములను ముఖంలో కనపడనిచ్చేవాడు కాదు. అనవసరంగా కోపగించుకోడం, సంతోషంతో పొంగిపోవడం చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ సౌమ్యంగా ఒకే విధంగా ఉండేవాడు. ఏ విషయంలోనూ మొండిగా పట్టుబట్టడం మొండిగా వాదించడం చేసేవాడు కాదు. స్థిరమైన బుద్ధికలవాడు.
ఏ పరిస్థితులతో కూడా మనస్సును చలింపనీయడు రాముడు. రామునికి సోమరి తనము అంటే తెలియదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. ఎదుటి వారిలో ఉన్న తప్పులు పట్టేముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దు కొనేవాడు. ఎవరైనా తనకు చిన్న మేలు చేసినా దానిని గుర్తు పెట్టుకొని తగిన సమయ ములో ప్రత్యుపకారము చేసేవాడు.
రాముడు తనలోని ఆలోచనలను పైకి కనపడనీయడు. పైకి నవ్వుతూనే ఉండేవాడు. మనసులోని భావములను ముఖంలో కనపడనిచ్చేవాడు కాదు. అనవసరంగా కోపగించుకోడం, సంతోషంతో పొంగిపోవడం చేసేవాడు కాదు. ఎల్లప్పుడూ సౌమ్యంగా ఒకే విధంగా ఉండేవాడు. ఏ విషయంలోనూ మొండిగా పట్టుబట్టడం మొండిగా వాదించడం చేసేవాడు కాదు. స్థిరమైన బుద్ధికలవాడు.
ఏ పరిస్థితులతో కూడా మనస్సును చలింపనీయడు రాముడు. రామునికి సోమరి తనము అంటే తెలియదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు. ఎదుటి వారిలో ఉన్న తప్పులు పట్టేముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దు కొనేవాడు. ఎవరైనా తనకు చిన్న మేలు చేసినా దానిని గుర్తు పెట్టుకొని తగిన సమయ ములో ప్రత్యుపకారము చేసేవాడు.
రాముడు న్యాయశాస్త్రములో కూడా ప్రావీణ్యము సంపాదించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో అత్యంత నేర్పును ప్రదర్శించేవాడు. రాముడు రాజ్యపాలనలలో కూడా నిష్ణాతుడు. మంచి వారిని చేరదీసి ఆదరించేవాడు. దుర్మార్గులను దగ్గరకు చేరనిచ్చేవాడు కాదు. రాజ్యపాలన కు కావలసిన ధనమును నేర్పుగా ప్రజలనుండి రాబట్టేవాడు. ఆ ధనమును వ్యయం చేయడంలో కూడా సంయమనం పాటించేవాడు. అనవసరమైన ఖర్చులను నివారించేవాడు.
రాముడు వేద వేదాంగములనే కాదు, ఇంకా ఇతరతా ఉన్న శాస్త్రములను కూడా బాగా అధ్యయనం చేసాడు. అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. తగు మాత్రంగా సుఖములను అనుభవించేవాడు. సుఖములను అనుభవించేటప్పుడు కూడా ఎంతో జాగరూకతతో ఉండేవాడు. రాముడు సంగీత నృత్యములలో కూడా ప్రవేశము ఉన్నవాడు.
పైన చెప్పిన లక్షణములను బట్టి, రాముడు సాత్వికుడు భోగలాలసుడు అనుకుంటే పొరపాటే. ఆయనకు యుద్ధరీతులు అన్ని కూడా బాగా తెలుసు. గుర్రములను ఏనుగులను లొంగదీసుకొని మచ్చిక చేసుకొనేవాడు. ధనుర్విద్యలో ప్రావీణ్యము సంపాదించాడు. శత్రువుల ఎడల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవాడు. యుద్ధములో దేవతలు, రాక్షసులు ఎదురైనా జంకేవాడు కాదు. ధైర్యంతో ఎదిరించి గెలిచే సామర్ధ్యము ఉన్నవాడు. అనిచెప్పి అందరి మీదా అనవసరంగా యుద్ధానికి కాలుదువ్వేవాడు కాదు.
రాముడు ఎవరిమీద కోపగించుకోడు. అవసరం అయినప్పుడు కోపం తెచ్చు కుంటాడు. అవసరం తీరగానే ఆ కోపాన్ని వదిలేస్తాడు. ఇన్ని సుగుణ ములు ఉన్నవాడు కాబట్టే రాముడు మూడులోకములలో కీర్తింప బడ్డాడు. రాముడు తన సుగుణములతో సూర్యుని వలె ప్రకాశించే వాడు.
ఇటువంటి సకలసద్గుణసంపన్నుడైన రాముడు తమకు రాజు కావాలని అయోధ్యా ప్రజలు కోరుకొనేవారు. ఇదే ఆలోచన దశరథునికి కూడా వచ్చింది. "తన జీవిత కాలంలో రాముడు రాజు అవుతాడా! రాముని రాజుగా నేను చూడగలనా!" అని అనుకున్నాడు. రాముడికి రాజు కాదగ్గ లక్షణములు ఉన్నాయా అని ఆలోచించాడు.
అయోధ్యావాసులందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రాముడు ఎల్లప్పుడూ ప్రజల యొక్క వృద్ధిని కోరుకొనే వాడు. అయోధ్యా ప్రజలకు దశరథుని కంటే కూడా రాముడు అంటేనే ఎక్కువ గౌరవము అభిమానము. రాముడు బల పరాక్రమములలో యమునితోనూ ఇంద్రునితోనూ సమానమైనవాడు. బుద్ధిలో బృహస్పతి వంటి వాడు. ధైర్యములో మేరుపర్వతము వంటి వాడు. ఒక రాజుకు ఉండవలసిన మంచి లక్షణములు అన్నీ రామునికి ఉన్నాయి.
ఆ ఆలోచన వచ్చిందే తడవుగా దశరథుడు తనమంత్రులను పిలిపించాడు. వారితో ఆలోచించాడు. "అమాత్యులారా! నేను పెద్దవాడిని అయ్యాను. వయసు మీద పడింది. ఇంక రాజ్యపాలన చేయలేను. అయోధ్యప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు. రాముడు రాజు అవడం అందరికీ సమ్మతమే. రాముడు రాజు అయితే నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను. దీనికి మీరంతా అనుమతిస్తారని ఆశిస్తున్నాను." అని అన్నాడు.
మంత్రులంతా దశరథుని మాటలకు సంతోషంగా తమ ఆమోదము తెలిపారు. వారి అనుమతితో రాముని యువరాజును చేయడానికి నిశ్చయించాడు దశరథుడు. తరువాత దశరథుడు సభను ఏర్పాటు చేసాడు. సామంత రాజులను, పురప్రముఖులను, అధికారులను, ఉద్యోగులను సభకు ఆహ్వానించాడు..
ಇನ್ನಿ చేసాడు కానీ కేకయ దేశంలో ఉన్న భరతునికి, శత్రుఘ్నునికి ఈ విషయం తెలియజేయలేదు. తరువాత వారే తెలుసుకుంటారులే అని నిర్లక్ష్యం చేసాడు.
(అలా కాకుండా భరతుని, శత్రుఘ్నుని పిలిపించి వారితో కూడా చెప్పి వారి సమ్మతి కూడా తీసుకొని ఉంటే రామాయణ మహాకావ్యము ఇంతటితో ఆగిపోయి ఉండేదేమో!)
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ప్రథమ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment